married woman suspicious death
-
వివాహిత అనుమానాస్పద మృతి
పోలాకి: మండలంలోని బొద్దాం గ్రా మానికి చెందిన వి వాహిత బొడ్డ రమ(27) శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. రమ మృ తిపై స్థానికులు, మృ తురాలి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వారి కథనం ప్రకా రం వివరాలు ఇలావున్నాయి. నందిగాం మండలం రౌతుపురం గ్రామానికి చెందిన రమను పోలాకి మండలం బొద్దాం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాను బొడ్డ వెంకటేశ్వర్లుకు ఇచ్చి 2010 ఆగస్టు 12వ తేదీన వివాహం చేశారు. అప్పటి నుంచి విధినిర్వహణలో భాగంగా భర్త వెంకటేశ్వర్లు వివిధ చోట్లకు బదిలీ అవుతున్న నేపథ్యంలో అత్తవారి ఇంటి వద్ద అత్త, మామలతో కలిసి రమ బొద్దాంలో ఉంటోంది. వీరికి కుమార్తె లక్ష్మి(6), కుమారుడు మోహిత్(2) సంతానం ఉన్నారు. మొదటి నుంచి అత్తమామలతో చిన్న చిన్న తగాదాలు పడుతూవచ్చిన రమ కన్నవారి సహా యంతో గతంలో పెద్దల వద్ద పంచాయితీ కూడా పెట్టినట్టు సమాచారం. అయితే అత్తవారింటి వద్దవున్న రమ శనివారం తెల్లవారుజా మున మృతి చెందింది. ఈ విషయం రమ తల్లిదండ్రులకు తెలిసింది. దీం తో రమ తం డ్రి, తమ్ముడు, ఇతర బంధువులు బొద్దాం గ్రామానికి చేరుకుని బోరున విలపించారు. ఈ విషయంపై వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీఐ పైడిపునాయుడు సమక్షంలో ప్రాథమిక విచారణ చేపట్టి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే రమ మామ బొడ్డ మురళి అలియాస్ పోలి నాయుడు, అత్త మణిమ్మలే చంపేశారని రమ తండ్రి, కుటుంబ సభ్యు లు ఆరోపించారు. రమ తండ్రి బడియ జనార్దనరావు ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్ఐ నారాయణస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ.... అయితే కోడలు మృతితో తమకు ఎటువంటి సంబంధంలేదని, గత వారం రోజులుగా రమ తీవ్రమైన జ్వరంతో బాధపడుతుందని అత్తమామలు చెబుతున్నారు. నరసన్నపేటలోని వైద్యుని వద్దకు గురువారం తీసుకువెళ్లి చికిత్స అందించామని మృతురాలి మామ మురళి పోలీసులకు తెలిపాడు. శనివారం తెల్లవారుజామున కోడలు పరిస్థితి చూసి స్థానిక వైద్యుడిని తీసుకువచ్చే ప్రయత్నం చేశానని అప్పటికే రమ మృతిచెందిందని చెప్పుకొ చ్చాడు. అయితే మురళి మాటలను అటు పోలీసులు గాని, ఇటు మృతురా లి బంధువులు గాని నమ్మటం లేదు. ఆఖరికి స్థానికులు సైతం ఏదో జరిగేవుంటుందనే కోణంలోనే మాట్లాడుతుండటం గమనించదగ్గ విషయం. -
అనుమానాస్పదరీతిలో వివాహిత మృతి
చిట్టినగర్(విజయవాడపశ్చిమం):అనుమానాస్పదరీతిలో వివాహిత మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని పంజా సెంటర్లో సోమవారం చోటుచే సుకుంది. భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీసుల కథనం ప్రకారం కలరా హాస్పటల్ సమీపంలోని అల్లినగర్కు చెందిన ఖమరున్ (27) పదేళ్ల కిందట బీహార్కు చెందిన నసీమ్ హైదర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ఇద్దరు సంతానం ఉన్నారు. బ్యాగులు కుట్టుకునే నసీమ్ హైదర్ కొంత కాలంగా భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. రెండు రోజుల కిందట ఖమరున్ తన తల్లి సలీమన్తో భర్త పెడుతున్న చిత్రహింసల గురించి చెప్పుకుని బాధపడింది. సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో తన భార్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందంటూ హైదర్ స్థానికులతో పేర్కొనడమే కాకుండా నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన ఖమరున్ తల్లి సలీమన్ ఉరికి వేలాడుతున్న బిడ్డను చూసి కన్నీటిపర్యంతం అయింది. ఖమరున్ వంటిపై గాయాలు ఉండటం, రెండు రోజుల కిందట తన కూతురు చెప్పుకున్న బాధను గుర్తు చేసుకుని అల్లుడే తన బిడ్డను చంపి ఉరి వేసి ఉంటాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అండగా వైఎస్సార్ సీపీ..... బాధితురాలి కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూడాలని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి షేక్.ఆసీఫ్ డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకురావడంతో వైఎస్సార్ సీపీ నేతలతో పాటు టీడీపీ నేతలు, స్థానిక పెద్దలు ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన విషయం గురించి ఆరా తీశారు. బీహార్ ప్రాంతం నుంచి విచ్చేసిన కొంత మంది స్థానికంగా ఉన్న మైనార్టీ కుటుంబాల వారి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని పెళ్లిళ్లు చేసుకోవడం, కొంత కాలం తర్వాత చిత్ర హింసలకు గురి చేయడం పరిపాటిగా మారిందని స్థానికులు పేర్కొన్నారు. తల్లి మరణంతో అనాథలైన చిన్నారులకు నష్ట పరిహారం వచ్చేలా చూడాలని పోలీసులను కోరారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూడాలని స్థానిక టీడీపీ నేతలకు సూచించారు. మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
చనిపోయినా ఎవరూ పట్టించుకోలేదు..
ఒంగోలు క్రైం: ఒంగోలు నగరంలోని కర్నూలురోడ్డులో ఉన్న శ్రీరామ్ కాలనీలో మంగళవారం రాత్రి ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన మధ్యాహ్న ప్రాంతంలో జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న గుడిపాటి కుమారి (45) మూడు నెలల క్రితం శ్రీరామ్ కాలనీలో అద్దె ఇంట్లో చేరింది. ఆమె మంగమూరురోడ్డులోని చికెన్ షాపులో పని చేస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న నవారు మంచం పూర్తిగా కాలిపోయి ఉంది. మంచం మీదనున్న దుప్పట్లు, దిండుతో పాటు టేబుల్ ఫ్యాన్ కూడా దగ్ధమయ్యాయి. అయితే ఆమె శరీరంపై, చేతి మీద మాత్రమే కాలిన గాయాలున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మినీ గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు రావడం గానీ, కాలిపోవడం గానీ జరగలేదు. ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై ప్రాణాలు పోయాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ఆమె నివాసం ఉండే ఇంటి పక్కన రెండు, మూడు పోర్షన్లుకు సంబంధించిన గదులు కూడా ఉన్నాయి. కానీ ఘటనపై అక్కడున్న వారెవరూ నోరు మెదపడం లేదు. కుమారి పని చేసే చికెన్ షాపు నిర్వాహకుడు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటికొచ్చాడు. మృతదేహాన్ని చూసి తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన బహిర్గతమైంది. అప్పటి వరకు సహచర నివాసితులు ఎందుకు పట్టించుకోలేదోన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు.. తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్సై ఎంపీ ప్రసాద్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. కుమారి భర్త నానారావు కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వివాహమైన తర్వాత వేటపాలెంలో ఉంటున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. -
నేను ఇక్కడ ఉండలేను..
‘అమ్మా..! నన్ను ఇక్కడ చిత్రహింసలకు గురి చేస్తున్నారు... పిల్లలు పుట్టలేదని నా భర్తకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు.. నేను ఇక్కడ ఉండలేను.. రేపు (ఆదివారం) సాయంత్రం ఊరికి వస్తాను..’ అని కుమార్తె తల్లికి ఫోన్ చేసింది.. కుమార్తె వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు కొన్ని గంటల్లోనే.. గుండె పగిలే వార్త వినాల్సి వచ్చింది.. కుమార్తె చనిపోయిందని ఫోన్ రావడంతో ఒక్కసారిగా తల్లి సొమ్మసిల్లి పడిపోయింది. ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని అమృతానగర్కు చెందిన కురువ సుహాసిని(23) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అయితే తల్లిదండ్రులు మాత్రం భర్త, అత్తామామలే చంపేసి, మృతదేహాన్ని కాల్చారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన రామకృష్ణ, శ్యామల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో సుహాసినికి ప్రొద్దుటూరులోని అమృతానగర్కు చెందిన మల్లికార్జునతో 3 ఏళ్ల క్రితం వివాహం చేశారు. కట్న కానుకల కింద రూ. 1 లక్ష నగదు, 10 తులాల బంగారం ఇచ్చారు. అతను కారు డ్రైవర్. మూడేళ్లైనా వారికి సంతానం కలగలేదు. వైద్యులతోపాటు పలు చోట్ల నాటు మందును కూడా ఇద్దరు తీసుకున్నారు. అయినా వారికి సంతానం కలగలేదు. కష్టాలు తల్లిదండ్రులకు చెప్పుకొని... పది రోజుల క్రితం సుహాసిని జేజి చనిపోవడంతో ఆమె కర్నూలుకు వెళ్లింది. ఆ సమయంలో తల్లిదండ్రులు అత్తింటి స్థితిగతుల గురించి అడగడంతో.. అసలే కష్టాల్లో ఉన్న కూతురు వారికి విషయం తెలిసింది. సంతానం కలగలేదని మా బావ (భర్త)కు మరో పెళ్లి చేయాలని అత్తా, మామలు ప్రయత్నం చేస్తున్నారని తల్లితో చెప్పింది. ‘కొన్ని రోజుల నుంచి బావ కూడా నాతో సరిగా మాట్లాడటం లేదు..’ అని కంట తడి పెట్టింది. అదే రోజు రాత్రి ఆమె అమృతానగర్కు వచ్చింది. అప్పటి వరకు తమ కూతురి కాపురం బాగుందని వారు భావించారు. అయితే కుమార్తె చెప్పి న మాటలు విని తల్లిదండ్రులు కలత చెందసాగారు. ఈ క్రమంలో సుహాసిని శనివారం తల్లికి ఫోన్ చేసింది. తన మనసు బాగా లేదని, ఒక సారి ఊరికి వస్తానని చెప్పింది. ‘ఎప్పుడు వస్తున్నావ్..’ అని తల్లి అడుగగా.. ఆదివారం సాయంత్రం అని తెలిపింది. తెల్లారితే కుమార్తె వస్తుందని తల్లిదండ్రులు ఎదురు చూడ సాగారు. అయితే కొన్ని గంటల్లోనే కుమార్తె చనిపోయిందని అల్లుడు మల్లికార్జున ఫోన్ చేశాడు. ఆత్మహత్య చేసుకోలేదు.. చంపేశారు కుమార్తె చనిపోయిందని ప్రొద్దుటూరు నుంచి ఫోన్ రావడంతో ఆమె తల్లిదండ్రులు శనివారం రాత్రి హుటాహుటిన వచ్చేశారు. కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించసాగారు. మృతదేహం పడి ఉన్న తీరును చూసి వారు అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతుర్ని చంపి, మృతదేహాన్ని కాల్చారని వారు ఆరోపించారు. సుహాసిని మా ఊరికి వస్తే వీళ్ల బండారం బయట పడుతుందనే భయంతో.. ఆమెను చంపేశారని అంటున్నారు. విషయం తెలియడంతో రూరల్ సీఐ ఓబులేసు, ఎస్ఐ చంద్రశేఖర్ ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు భర్త, అత్త, మామపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
కర్నూలు : మల్కాపురం–ఆర్ఎస్ రంగాపురం సెక్షన్ మధ్య రైలు పట్టాల పక్కన అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని మహిళ (40) మృతదేహాన్ని శనివారం డోన్ రైల్వే పోలీసులు గుర్తించారు. మృతురాలు ముస్లిం మహిళగా తెలుస్తోంది. మృతదేహం వద్ద ఆమె ఫొటో తప్ప ఇతర ఆధారాలు లభించలేదు. ఆత్మహత్యకు పాల్పడిందా.. ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే కానిస్టేబుల్ గంగాధర్ తెలిపారు. మృతురాలి ఆచూకీ గుర్తించిన వారు 99663 07080కు సమాచారం అందించాలని చెప్పారు. -
ఆస్ట్రేలియాలో కొడుకుతో సహా మహిళ మృతి
హైదరాబాద్ : ఆస్ట్రేలియలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమారుడితో సహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మెల్బోర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సుప్రజ (31) అనే మహిళ తన ఆరునెలల కుమారుడితో పాటు 30 అంతస్తుల బిల్డింగ్పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. మూడు రోజుల క్రితం (మంగళవారం) 20వ ఫ్లోర్ నుంచి సుప్రజ...కొడుకుతో సహా జారి పడింది. మెల్బోర్న్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డు టీచర్ గంగాధర్కు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీనివాస్కు హైదదాబాద్ శేరిలింగంపల్లికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి కూతురు సుప్రజతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. గత పదేళ్లుగా శ్రీనివాస్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం శ్రీనివాస్ కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. సుప్రజ గర్భిణిగా ఉండడంతో గతేడాది డిసెంబర్లో శ్రీనివాస్ తల్లిదండ్రులు గంగాధర్, ఇందిర మెల్బోర్న్ వెళ్లారు. సుప్రజకు ఆరు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులు మూడు రోజుల క్రితమే ఆర్మూర్కు తిరిగి వచ్చారు. శ్రీనివాస్, సుప్రజలు సైతం ఈ నెలలోనే ఇక్కడకు రావాల్సి ఉంది. ఈలోపే సుప్రజ చనిపోవడం విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా మృతురాలు సుప్రజ మేనమామ గంగాధర్ మాట్లాడుతూ ... ఘటన జరిగిన సమయంలో శ్రీనివాస్ ఆఫీస్కు వెళ్లాడని, భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారని, ఎలాంటి గొడవలు లేవన్నారు. తమ దగ్గర వీసా, పాస్పోర్టు లేకపోవడంతో అక్కడకు వెళ్లలేకపోతున్నామన్నారు. మరోవైపు శ్రీనివాస్ తండ్రి గంగాధర్ గత రాత్రే మెల్బోర్న్ బయల్దేరి వెళ్లారు. మరో రెండురోజుల్లో సుప్రజ మృతదేహాన్ని హైదరాబాద్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.