-
Stock Market Today: స్టాక్ మార్కెట్ లాభాల బాట
అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాలతో మొదలైంది. గురువారం ఉదయం మొదలైన స్టాక్ మార్కెట్లో లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 325 పాయింట్లు (0.56 శాతం) లాభంతో 58, 113 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 94 పాయింట్లు(0.55 శాతం) లాభంతో 17, 315 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్లు ఫోకస్లో ఉన్నాయి. ఐటీ, పీఎస్యూ బ్యాంక్ 1 శాతం పెరుగుదల కనిపిస్తోంది. బ్యాంక్, మెటల్, ఆయిల్ గ్యాస్, పవర్, రియల్టీ సెక్టార్స్లో కొనుగోలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ఫోసిస్ బిగ్గెస్ట్ గెయినర్గా, మారుతీ సుజుకీ బిగ్గెస్ట్ లాసర్గా నిలిచాయి. చదవండి: చరిత్రాత్మక కనిష్ట పతన దిశగా రూపాయి విలువ! కారణాలివే.. -
నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్
Stock Market Live Updates: అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ఆరంభం.. భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. ఈ కారణంతో.. నిన్న(సోమవారం) నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఇవాళ నష్టాలతోనే మొదలైంది. మంగళవారం ఉదయం 9.23గంటలకు 363 పాయింట్లు నష్టపోయి.. 57,919 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 101 పాయింట్ల నష్టంతో 17, 266 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ►సిప్లా బిగ్గెస్ట్ గెయినర్గా ఉండగా, బజాజ్ ఫైనాన్స్ బిగ్గెస్ట్ లాజర్గా ఉంది. నిఫ్టీ ఫార్మా బెస్ట్సెక్టార్గా, నిఫ్టీ ఐటీ వరస్ట్సెక్టార్ కేటగిరీలో కొనసాగుతున్నాయి. ►ఎర్లీ ట్రేడ్లో పవర్గ్రిడ్, ఐటీసీ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, హిందూలివర్, టైటాలన్లు లాభపడ్డాయి. మారుతి, యాక్సిస్, భారతీఎయిర్టెల్, నెస్లే ఇండియా నష్టపోయాయి. చదవండి: టెన్షన్.. టెన్షన్.. భారీ నష్టాల్లో సెన్సెక్స్ -
తొలుత 37,000- చివర్లో 36,694కు
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ఓమాదిరి లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 99 పాయింట్లు బలపడి 36,694 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 35 పాయింట్లు పుంజుకుని 10,803 వద్ద నిలిచింది. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 425 పాయింట్లు జంప్చేసింది. 37,000 పాయింట్ల కీలకమార్క్ను అధిగమించింది. మిడ్సెషన్కల్లా కొనుగోళ్ల స్థానే అమ్మకాలు పెరగడంతో లాభాలు పోగొట్టుకుని నష్టాలలోకి ప్రవేశించింది. 36,534 దిగువకు చేరింది. చివర్లో తిరిగి కోలుకుంది. ఈ బాటలో నిఫ్టీ 10,894 వద్ద గరిష్టాన్ని తాకి, తదుపరి 10,756 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ ఓకే ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలు 1.5-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే బ్యాంకింగ్, రియల్టీ 1.5 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టెక్ మహీంద్రా, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆర్ఐఎల్, విప్రో, ఎయిర్టెల్, జీ, బ్రిటానియా, వేదాంతా 5.5-2 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో పవర్గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ, గెయిల్, కొటక్ మహీంద్రా, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ 2.2-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎఫ్అండ్వో ఇలా డెరివేటివ్ కౌంటర్లలో బాష్, భారత్ ఫోర్జ్, రామ్కో సిమెంట్, బీహెచ్ఈఎల్, కాల్గేట్ పామోలివ్ 4.3-3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. డీఎల్ఎఫ్, గ్లెన్మార్క్, సెయిల్, ఈక్విటాస్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్సీసీ, బీవోబీ, యూబీఎల్ 3.3-2.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా 0.15 శాతం వెనకడుగు వేసింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1567 నష్టపోగా.. 1127 లాభపడ్డాయి. అమ్మకాల జోరు నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1031 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 431 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 213 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 803 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
మార్కెట్ల హైజంప్- 3 నెలల గరిష్టం
లాక్డవున్ల ఎత్తివేతతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల రికవరీపై ఆశలు ఇన్వెస్టర్లకు జోష్నిస్తున్నాయి. దీంతో కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు బలపడుతున్నాయి. వెరసి వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. సెన్సెక్స్ 519 పాయింట్లు జంప్చేసి 35,430 వద్ద నిలవగా.. 160 పాయింట్లు జమ చేసుకున్న నిఫ్టీ 10,471 వద్ద స్థిరపడింది. ఇది మూడు నెలల గరిష్టంకాగా.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సమయం గడిచేకొద్దీ మార్కెట్లు బలపడుతూ వచ్చాయి. ఫలితంగా ఇంట్రాడే గరిష్టాలకు చేరువలోనే ముగిశాయి. తొలుత 34,844 దిగువన కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివర్లో 35,482ను అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ 10,485- 10,302 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ పుంజుకోగా.. రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ, మీడియా, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా 3-1.5 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్, ఎన్టీపీసీ, హిందాల్కో, యూపీఎల్, పవర్గ్రిడ్, శ్రీ సిమెంట్, యాక్సిస్, ఇన్ఫ్రాటెల్ 9.3-3.3 శాతం మధ్య జంప్చేశాయి. బ్లూచిప్స్లో కేవలం ఆర్ఐఎల్ 1.4 శాతం, ఎయిర్టెల్ 0.6 శాతం మాత్రమే నీరసించాయి. బంధన్ జోరు డెరివేటివ్ కౌంటర్లలో బంధన్ బ్యాంక్ 15 శాతం దూసుకెళ్లగా.. జస్ట్ డయల్, నౌకరీ, డీఎల్ఎఫ్, పిరమల్ 7-5 శాతం మధ్య పురోగమించాయి. కాగా.. గ్లెన్మార్క్, ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం, సెంచురీ టెక్స్, మెక్డోవెల్, ఆర్ఈసీ, పీఎఫ్సీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, పేజ్ 7-1 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.7 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1964 లాభపడగా.. 761 మాత్రమే డీలాపడ్డాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 424 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,288 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 1,237 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 881 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఈ చిన్న షేర్లు మార్కెట్లకంటే స్పీడ్
ఉన్నట్టుండి మెరుగుపడిన సెంటిమెంటు ప్రభావంతో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. సెన్సెక్స్ 340 పాయింట్లు(1 శాతం) పెరిగి 35,251కు చేరగా.. నిఫ్టీ 109 పాయింట్లు(1 శాతం) ఎగసి 10,421 వద్ద ట్రేడవుతోంది. అయితే కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో మార్కెట్లకు మించిన వేగంతో ఈ షేర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం భారీగా జంప్చేయడం గమనార్హం. జాబితాలో మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్, లైఫ్, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్, ఇండో నేషనల్, నితిన్ స్పిన్నర్స్, ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్ చోటు చేసుకున్నాయి. వివరాలు చూద్దాం.. మహీంద్రా హాలిడేస్ రిసార్ట్స్ ఆతిధ్య రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్చేసి రూ. 179 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 18 శాతం దూసుకెళ్లి రూ. 199ను అధిగమించింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3750 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7400 షేర్లు చేతులు మారాయి. నిప్పన్ లైఫ్ ఇండియా ఏఎంసీ ప్రయివేట్ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 313 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 322 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 93500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.57 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇండో నేషనల్ నిప్పో బ్రాండ్ బ్యాటరీల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై రూ. 633 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 450 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4000 షేర్లు చేతులు మారాయి. నితిన్ స్పిన్నర్స్ కాటన్ యార్న్ తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై రూ. 53 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 11,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.54 లక్షల షేర్లు చేతులు మారాయి. ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్ నావల్టీ ఫ్యాబ్రిక్స్ తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 16 శాతం జంప్చేసి రూ. 73 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 75 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1300 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 14,000 షేర్లు చేతులు మారాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేంద్ర బలగాల అండ..
ఆడపడుచులకు అండగా ఉంటాం..
కాంగ్రెస్లోకి మధిర మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు
ఖమ్మం బస్టాండ్లో వడదెబ్బతో సొమ్మసిల్లిన మహిళ
తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement