-
హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్!
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే గాయపడింది. కొన్నాళ్ల ముందు తెలుగులో వరస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ.. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏం చేయట్లేదు. పలు మూవీస్లో ఛాన్సులు వచ్చారని అన్నారు గానీ వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు తాను గాయపడినట్లు ఓ ఫొటోతో చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్.. స్టార్ హీరోకు షాక్) మోకాలికి దెబ్బలు హీరోయిన్లు అంటే గ్లామర్ చూపించడంతో పాటు మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ లాంటివి కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇప్పుడు పూజా హెగ్డే కూడా అలానే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ మోకాలికి దెబ్బలు తగిలించుకుంది. అందుకు సంబంధించిన ఫొటోని తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. కలిసిరాని లక్ అరవింద సమేత, అల వైకుంఠపురములో లాంటి హిట్ సినిమాలతో మంచి ఊపు మీద కనిపించిన పూజాహెగ్డేకు గతేడాది వరస దెబ్బలు తగిలాయి. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ (హిందీ).. ఇలా చేసినవి చేసినట్లు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ఇవే అనుకుంటే 'గుంటూరు కారం' నుంచి ఈమెని తప్పించారు. 'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి పోయింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పూజాహెగ్డే తెలుగు ఇండస్ట్రీకి దాదాపు దూరమైనట్లే. (ఇదీ చదవండి: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మంగ్లీ? స్పందించిన సింగర్!) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
టీమిండియా స్టార్ ఓపెనర్కు షాక్.. ఏకంగా 3-4 నెలల పాటు..
Huge Blow For Prithvi Shaw: టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా అభిమానులకు చేదు వార్త! ఈ ముంబై బ్యాటర్ ఏకంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. కాగా ఐసీసీ అండర్-19 వరల్డ్కప్ గెలిచిన కెప్టెన్ పృథ్వీ షా.. 2018లో వెస్టిండీస్తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్లోనే అద్భుత సెంచరీ(134)తో అదరగొట్టిన షా.. రెండేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ కుదిరేలా లేదని.. అక్కడికెళ్లాడు అయితే, దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ.. రెండేళ్ల నుంచి పృథ్వీ షాకు జట్టులో చోటే కరువైంది. ఒకవేళ టీమిండియాకు సెలక్ట్ అయినా.. తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్లో క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్న షా.. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే కప్-2023లో అద్భుతాలు చేశాడు. సెంచరీల మోత.. వెక్కిరించిన దురదృష్టం ఆఖరిగా ఆడిన రెండు మ్యాచ్లలో డబుల్ సెంచరీ(244)తో పాటు అజేయ శతకం(125- నాటౌట్)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో గాయం రూపంలో షాను దురదృష్టం వెంటాడింది. జాతీయ క్రికెట్ అకాడమీలో దీంతో భారత్కు తిరిగి వచ్చిన పృథ్వీ షా.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. అయితే, మోకాలి గాయం తీవ్రతరమైనందున అతడు కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఉబ్బిపోయిన మోకాలు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘పృథ్వీ షా గాయపడిన తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. ఆ తర్వాత అతడు ఎన్సీఏకు వచ్చాడు. మోకాలు పూర్తిగా ఉబ్బిపోయింది. డాక్టర్ దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో షాకు చికిత్స అవసరమని భావించాం. గరిష్టంగా ఇంకో నాలుగు నెలల పాటు అతడు క్రికెట్ ఆడే పరిస్థితి లేదు’’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాతే 23 ఏళ్ల పృథ్వీ షా మోకాలికి సర్జరీ చేయాలా లేదా అన్న అంశంపై నిర్నయం తీసుకుంటామని తెలిపారు. దేశవాళీ క్రికెట్కు దూరం దీంతో.. వచ్చే నెలలో మొదలుకానున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, నవంబరులో ఆరంభం కానున్న విజయ్ హజారే వన్డే టోర్నీ, జనవరిలో మొదలయ్యే రంజీ ట్రోఫీకి పృథ్వీ షా దూరం కానున్నాడు. వాళ్ల నుంచి షాకు గట్టిపోటీ కాగా ఇప్పటికే టీమిండియా ఓపెనర్గా పృథ్వీ షా ఒకప్పటి డిప్యూటీ శుబ్మన్ గిల్ స్థిరపడిపోగా.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్ రూపంలో ఈ ముంబై బ్యాటర్కు గట్టిపోటీ ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్లో అదరగొట్టి.. దేశవాళీ క్రికెట్లో నిరూపించుకుని.. కమ్బ్యాక్ ఇవ్వాలని భావించిన పృథ్వీ షాను విధి ఇలా వెక్కిరించింది. చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి.. -
బంతిని తన్నబోయి ప్రత్యర్థి కాలు విరగొట్టాడు
ఫుట్బాల్ మ్యాచ్లో ఆటగాళ్లకు దెబ్బలు తగలడం సహజం. కోపంతో గొడవలు జరిగిన సమయంలో ఆటగాళ్లు కొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తూ తనకు తెలియకుండా జరిగిన పొరపాటు వల్ల ప్రత్యర్థి ఆటగాడికి ఎంత నష్టం జరిగిందనేది ఈ వార్త తెలియజేస్తుంది. విషయంలోకి వెళితే.. కోపా లిబెర్టడోర్స్ టోర్నీ(Copa Libertadores)లో భాగంగా బ్రెజిల్ ఫ్లుమినెన్స్,అర్జెంటినోస్ జూనియర్స్ తలపడ్డాయి. మ్యాచ్లో ఇరుజట్లు చెరొక గోల్ కొట్టడంతో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. కాగా ఆట 56వ నిమిషంలో బ్రెజిల్ ఫ్లుమినెన్స్ ఆటగాడు మార్సెలో బంతిని తన్నబోయి అనుకోకుండా ప్రత్యర్థి డిఫెండర్ లుసియానో సాంచెజ్ ఎడమ కాలు గట్టిగా తొక్కాడు. మార్సెలో బంతిని తన్నబోయే సమయంలోనే లుసియానో అతని వైపు దూసుకురావడం.. కాలు అడ్డుపెట్టడం జరిగిపోయాయి. దీంతో లుసియానో ఒక్కసారిగా కుప్పకూలిపోయి నొప్పితో విలవిలలాడాడు. ఊహించని సంఘటనతో మార్సెలో షాక్ తిన్నాడు. వెంటనే వైద్య సిబ్బంది మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. లూసియానోను పరీక్షించిన వైద్యులు కాలు విరిగిపోయినట్టు గుర్తించారు. అతను కోలుకునేందుకు 8 నెలల నుంచి 12 నెలలు పట్టనుందని సమాచారం. బాధ భరించలేక ఏడుస్తునే మైదానం వీడిన లూసియానోను చూసి మార్సెలో కంటతడి పెట్టుకున్నాడు. ''నేను ఈరోజు మైదానంలో నేను చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నా. సహచర ఫుట్బాలర్ను కావాలని గాయపరచలేదు. లుసియానో సాంచెజ్.. నువ్వు తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా'' అని మార్సెలో ట్విటర్లో పేర్కొన్నాడు. మార్సెలో పోస్ట్పై అర్జెంటీనా క్లబ్ స్పందిస్తూ.. ''మనం ప్రత్యర్థులం.. శత్రువులం కాదు'' అని కామెంట్ చేసింది. Dios mio https://t.co/LO8ezSX3Oe pic.twitter.com/V9a24dYGBu — Usuarios siendo domados (@sindicatodedom4) August 1, 2023 చదవండి: 100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్ స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్లకు షాక్; డబ్ల్యూటీసీ పాయింట్స్లో భారీ కోత -
ప్లేఆఫ్ ముంగిట ధోని ఫిట్నెస్పై హస్సీ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే రెండో జట్టుగా ప్లేఆఫ్కు అర్హత సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్పై 77 పరుగుల విజయంతో 17 పాయింట్లు ఖాతాలో వేసుకున్న సీఎస్కే గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-1 ఆడనుంది. కేకేఆర్తో మ్యాచ్ను లక్నో సూపర్ జెయింట్స్ విజయం దిశగా పయనిస్తున్నప్పటికి అనుకున్న ఓవర్లలో పూర్తి చేయకపోవడంతో రన్రేట్ సీఎస్కే కంటే తక్కువ ఉంది. దీంతో సీఎస్కే రెండో స్థానంలో నిలచి సొంత ప్రేక్షకుల మధ్య క్వాలిఫయర్-1 ఆడనుంది. ఇదిలా ఉంటే ధోని ఫిట్నెస్పై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి ధోని మోకాలి సమస్యతో బాధపడుతున్నాడని.. అందుకే పరుగులు తీసేందుకు ఇష్టపడడం లేదని తెలిపాడు. సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో మైక్ హస్సీ కామెంటేటర్తో మాట్లాడాడు. ధోని మోకాలి సమస్య వంద శాతం సమసిపోలేదు. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అందుకే ఎక్కువగా పరుగు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. బ్యాటింగ్కు కూడా ఆఖరి 2-3 ఓవర్లలో రావడానికి కారణం కూడా అదే. నొప్పిని భరిస్తూనే తన పనిని పూర్తి చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇంత బాధపెట్టుకొని కూడా అతను తన టార్గెట్ను మిస్ అవకుండా బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకొని సక్సెస్ అవుతున్నాడు అని చెప్పాడు. కాగా ధోని విషయంలో హస్సీ చేసిన వ్యాఖ్యలు నిజమే. ధోని కూడా మ్యాచ్ల్లో చాలాసార్లు తన మోకాలికి బ్యాండేజీ లేదా ఐస్క్యాప్ పెట్టుకోవడం కనిపించింది. అంతేకాదు ధోనికి ఈ సీజన్ చివరిదని రూమర్లు కూడా వచ్చాయి. కానీ రూమర్లను స్వయంగా కొట్టిపారేసిన ధోని 2024 ఐపీఎల్ కూడా ఆడొచ్చని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. ఇక హస్సీ వ్యాఖ్యలు సీఎస్కే అభిమానులను ఆందోళనలో పడేసింది. ఒకవేళ ప్లేఆఫ్ సమయానికి ధోనికి మోకాలి సమస్య ఎక్కువై మ్యాచ్కు దూరమైతే సీఎస్కే పరిస్థితి ఏంటని తెగ బాధపడుతున్నారు. ''దయచేసి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని.. ప్లేఆఫ్స్కు చేరుకున్న సమయంలో ధోని ఫిట్నెస్పై ఆందోళన కలిగించేలా మాట్లాడడం సరికాదని'' అభిమానులు పేర్కొన్నారు. చదవండి: జడేజాపై సీరియస్ అయిన ధోని! -
#venkateshIyer: నొప్పిని భరిస్తూనే..
ఐపీఎల్ 16వ సీజన్లో రెడో శతకం నమోదైంది. కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఈ ఫీట్ను సాధించాడు. 49 బంతుల్లో 9 సిక్సర్లు, ఐదు ఫోర్ల సాయంతో సెంచరీ మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. అయితే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో కాలికి దెబ్బ తగిలింది. కామెరాన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 4 ఓవర్లో గుడ్లెంగ్త్తో వచ్చిన డెలివరీని స్కూప్ ఆడే ప్రయత్నంలో బంతి మోకాలికి గట్టిగా తగిలింది. దీంతో వెంకటేశ్ అయ్యర్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఈ నేపథ్యంలో ఫిజియో వచ్చి పరిశీలించి చికిత్స చేశాడు. అయితే అదే సమయంలో ముంబై ఆటగాడు తిలక్ వర్మ వెంకటేశ్ అయ్యర్ కాలికి మర్దన చేసి క్రీడాస్పూర్తిని చాటుకోవడం విశేషం. ఇక నొప్పి బాధిస్తున్నా వెంకటేశ్ అయ్యర్ తన దూకుడును ఏమాత్రం ఆపలేదు. చూస్తుండగానే ఫిఫ్టీ మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్.. 90 పరుగులకు చేరుకోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. అయితే 90 నుంచి వంద మార్క్ అందుకోవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సింగిల్స్ తీస్తూ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో అతను నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించింది. అయితే గాయం పెద్దగా లేకపోవడం ఊరట అని చెప్పొచ్చు. బంతి కాలికి బలంగా తగలడంతో నొప్పి కాస్త ఎక్కువే ఉందని.. ఎలాగూ ఇంపాక్ట్ కింద డగౌట్ కూర్చుంటా కాబట్టి నొప్పి తగ్గే అవకాశం ఉంది. అని తొలి ఇన్నింగ్స్ అనంతరం చెప్పుకొచ్చాడు. చదవండి: Nitish Rana Vs Hrithik Shokeen: గెలికి మరీ తిట్టించుకోవడం అంటే ఇదే!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement