kanakadas function hall
-
కురుబ వధూవరుల వేదికకు విశేష స్పందన
అనంతపురం రూరల్ : జిల్లా కురుబ సంఘం ఆధ్వర్యంలో శనివారం గుత్తిరోడ్డులోని కనకదాస కళ్యాణమంటపంలో నిర్వహించిన కురుబ వధూవరుల పరిచయ వేదికకు విశేష స్పందన లభించింది. అనంతపురం, కర్నూల్, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వధూవరుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరశురాం మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవనంలో వివాహ శుభకార్యాలకు వధూవరుల పరిచయ వేదికలు దోహదపడతాయన్నారు. కురుబ సంఘం నాయకులు పిడుగు క్రిష్ణమూర్తి, కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పుల్లన్నగౌడు, లక్ష్మిసంజప్ప, నారాయణ, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు. -
మాతృభాషపై మమకారం పెంచుకోండి
అనంతపురం కల్చరల్ : ఎన్నిభాషల్లో ప్రావీణ్యం సంపాదించినా, మాతృభాషను మాత్రం మరవకూడదని జనప్రియ కవి ఏలూరు ఎంగన్న, డా.గొల్లాపిన్ని శేషాచలం యువతకు సూచించారు. శుక్రవారం కనకదాస కల్యాణ మండపంలో మాస్టర్ మైండ్స్ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమం జరిగింది. డా.సీతారామశాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సాహితీవేత్తలు డా. గొల్లాపిన్ని శేషాచలం, ఏలూరు ఎంగన్నతో పాటు ఆచార్య బసవయ్య తదితరులు ఆత్మీయ అతిథులుగా విచ్చేసి మార్గదర్శనం చేశారు. మాతృభాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ సందర్భంగా అతిథులు ఆలపించిన తెలుగు పద్యాలు అందరిని అలరించాయి. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. చివరగా అతిథులను విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు.