jubliee hills
-
జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో సంచలన విషయాలు
-
HYD: హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం.. ఐటీ ఉద్యోగి రుత్విక్..
సాక్షి, హైదరాబాద్: నగరంలో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి ముఖ్య కారకుడైన ఐటీ ఉద్యోగి రుత్విక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులోనే కారు అతి వేగంతో నడిపి ప్రమాదానికి కారణమైనట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన హిట్ అండ్ రన్ కేసులో తారక్రామ్ మృతికి కారణమైన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు యువకులు, ఒక యువతి ఉన్నారు. కాగా, ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి ఐటీ ఉద్యోగి రుత్విక్ రెడ్డి కారణమని పోలీసులు నిర్ధారించారు. అయితే, రుత్విక్ రెడ్డి ఇటీవలే సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందాడు. ఈ క్రమంలో తాను పనిచేస్తున్న ఆఫీసును ఫ్రెండ్ చూపిస్తానంటూ వారిని తీసుకుని మాదాపూర్కు వెళ్లాడు. అనంతరం, ఫ్రెండ్స్తో కలిసి బార్లో ఫుల్గా మద్యం సేవించారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు బార్లోనే ఫుల్గా మద్యం తాగి బిర్యానీ తిన్నారు. అనంతరం, ఆఫీసును చూసి తిరిగి వస్తున్నా క్రమంలో మద్యం మత్తులో కారును అతి వేగంతో డ్రైవ్ చేశాడు. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడి సమీపంలో బైక్పై వెళ్తున్న తారక్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తారక్ మృతిచెందాడు. -
అజారుద్దీన్కు టికెట్.. విష్ణువర్థన్ రెడ్డి రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీ నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. సమయం చూసి వేరే పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్లో టికెట్ ఆశించినా అది దక్కకపోవడంతో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో విష్ణువర్ధన్ రెడ్డి సీరియస్ అవుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ జూబ్లీహిల్స్ టికెట్ను మాజీ క్రికెటర్, సీనియర్ నేత అజారుద్దీన్కు కేటాయించింది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి శనివారం పార్టీ అనుచరులతో సమావేశం కానున్నారు. హైకమాండ్ తీరుపై విష్ణువర్ధన్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విష్ణువర్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదో అర్థం కావడం లేదు. ఒకే కుటుంబంలో రెండు టిక్కెట్లు చాలా మందికి ఇచ్చారు. మాకెందుకు ఆ నిబంధన అడ్డు వచ్చింది? నేను జూబ్లీహిల్స్లో గెలుస్తానని అన్ని రిపోర్టులు చెప్తున్నాయి. కావాలనే నాకు టిక్కెట్ ఇవ్వలేదు. టికెట్ ఇస్తామని ఢిల్లీ పెద్దలు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. కానీ, అనూహ్యంగా జాబితాలో నా పేరు లేకపోవడంతో నేనే షాక్ అయ్యాను. పార్టీకి ఎవరు ముఖ్యమో అది ముందు గమనించాలి. కార్యకర్తల సమావేశం తర్వాత నా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాను. నన్ను పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెడుతున్నారు. నేనే వేరే పార్టీలో చేరితే మంచి స్థానం ఇస్తామని ఇప్పటికే పలు ఆఫర్లు వచ్చాయి’’ అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనుచరులతో భేటీ తర్వాతే పార్టీ మార్పు లేదా తదితర అంశాలపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇది కూడా చదవండి: రేవంత్కు కొత్త టెన్షన్.. 19 స్థానాల్లో ఎవరు? -
అశ్రునయనాల మధ్య ముగిసిన కృష్ణ అంత్యక్రియలు
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు అశ్రునయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. మహాప్రస్థానంలో కృష్ణకు ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. గౌరవ వందనం అనంతరం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక ఆయన అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. చివరి సారిగా తమ అభిమాన నటుడిని చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. బుధవారం పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి కృష్ణ అంతిమయాత్ర జరిగింది. కాగా ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్ ఆస్ప్రతిలో చేరిన కృష్ణ చికిత్స పొందుతూ మంగళవారం(నవంబర్ 15న) తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణాన్ని ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఫోర్జరీ కేసులో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు అరెస్ట్
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్లోని ఖరీదైన అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లను ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు యత్నించిన టీ–టీడీపీ జనరల్ సెక్రటరీ గాజుల విజయ జ్ఞానేశ్వర్నాయుడు అలియాస్ జీవీజీ నాయుడును జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 70లోని జర్నలిస్టు కాలనీ–ప్రశాసన్నగర్ సమీపంలో ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రోనక్ కొటేచాకు జ్యోతి సిగ్నేచర్ అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. రోనక్ కొటేచా ఎక్కువగా ముంబైలో ఉండటాన్ని గమనించిన జీవీజీ నాయుడు ఇళ్ల కబ్జాకు స్కెచ్ వేశాడు. 2013లో ఈ రెండు ఫ్లాట్లను తాను కొంటున్నట్లుగా ఫోర్జరీ పత్రాలు తయారు చేసి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ జరిగినట్లుగా సృష్టించాడు. వీటితో పాటు కొన్ని ఫోర్జరీ సంతకాలతో కూడిన క్యాష్ రిసిప్ట్లను కూడా తయారు చేశారు. 2020లో సిటీ సివిల్ కోర్టులో స్పెషల్ పర్ఫార్మాన్స్ ఫర్ రిజిస్ట్రేషన్ పిటిషన్ను దాఖలు చేస్తూ తాను మొత్తం డబ్బులు చెల్లించినా రోనక్ కొటేచా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న రోనక్ కొటేచా జూలైలో హైదరాబాద్కు వచ్చి ఫోర్జరీ పత్రాలతో తన ఫ్లాట్ను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న జీవీజీ నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టులో జీవీజీ నాయుడు సమర్పించిన పత్రాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా వాటిల్లో రోనక్ కొటేచా సంతకాలన్నీ ఫోర్జరీ అంటూ ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇచ్చింది. దీంతో పోలీసులు జీవీజీ నాయుడుతో పాటు బల్విందర్ సింగ్, మరికొంత మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు తనను అరెస్ట్ చేయకుండా నాయుడు ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలని విఫలయత్నం చేయగా కోర్టు మూడు వారాల పాటు అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలచ్చింది. కోర్టు గడువు గత నెల 20న ముగియడంతో అప్పటి నుంచి పోలీసులు నాయుడును అరెస్ట్ చేసేందుకు యత్నించారు. నిందితుడు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతుండగా ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉండగా పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
జూబ్లీహిల్స్ లోని ఒక ప్రముఖ మీడియా హౌస్ లో ఈడీ సోదాలు
-
హీరో బాలకృష్ణ ఇంటివైపు దూసుకెళ్లిన కారు..
Road Accident At Balakrishna Home In Jubilee Hills: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద ఉన్న ఆయన నివాసం వైపునకు వేగంగా కారు దూసుకెళ్లింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. తర్వాత బాలకృష్ణ ఇంటివైపునకు వెళ్లిన కారు ఆయన ఇంటిగేట్ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటన మంగళవారం (మే 17) సాయంత్రం చోటుచేసుకుంది. అయితే అంబులెన్స్కు దారి ఇచ్చే క్రమంలో యువతి కారును డివైడర్పైకి ఎక్కించింది. దీంతో బాలకృష్ణ ఇంటిగేటు వైపునకు కారు దూసుకెళ్లింది. బాలకృష్ణ ఇంటి ముందు రోడ్డు ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా జనాలు భారీగా గుమిగూడారు. దీంతో అక్కడ కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి వాహనాలను పంపించివేశారు. చదవండి: రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్కు బాలకృష్ణ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
HYD: స్పా ముసుగులో వ్యభిచారం.. తొమ్మిది మంది యువతులను..
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. జూబీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో స్పా ముసుగులో వ్యభిచారం నడిపిస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి జూబ్లీహిల్స్ పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ రైడ్స్లో నిర్వాహకులతో సహా 9 మంది యువతులను, ఇద్దరు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: డిజిటల్ రేప్ కింద వృద్ధుడి అరెస్ట్ -
నేనెవర్ని మోసం చేయలేదు.. విచారణకు సహకరిస్తా: నామా
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్లో మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నామా జూన్ 25న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''40 ఏళ్ల కిందట మధుకాన్ సంస్థను ప్రారంభించాను.. రాత్రింబవళ్ళు కష్టపడి సంస్థను కాపాడుకున్న. చైనా బార్డర్ లో కనీసం వెళ్లలేని ప్రాంతాల్లో కూడా ఈ సంస్థ వెళ్లి రోడ్లు వేస్తోంది.. ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు. ఈ సంస్థను మా ఇద్దరు సోదరులు చూసుకుంటున్నారు. ఎన్హెచ్ఏఐ అనుమతులు ఇచ్చిన కంపెనీకి ఇవ్వాల్సిన 80 శాతం సైట్ ఇవ్వాలి కానీ 21 శాతం మాత్రమే ఇచ్చింది. కంపెనీల్లో నేను ఎండీగా లేను. నాకు న్యాయవ్యవస్థ పై నమ్మకం ఉంది. 25 న ఈడీ పిలిచింది కచ్చితంగా వెళ్తాను.. నేను అన్నింటికీ సహకరిస్తాను. నేనెప్పుడూ నీతి నిజాయితీగా ఉంటూ, రాబోయే రోజుల్లో అదే విదంగా ప్రజలకు సేవ చేయాలని నడుస్తున్న. నన్ను ఆదరించి సీఎం కేసీఆర్ ఎంపీని చేశారు. నా బలం సీఎం కేసీఆర్, ఖమ్మం ప్రజలు. ''అంటూ పేర్కొన్నారు. ఇక కేసు విషయంలోకి వెళితే.. 2011లో జార్ఖండ్లో రాంచీ– రార్గావ్– జంషెడ్పూర్ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవే–33 పనులను మధుకాన్ కంపెనీ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేజిక్కించుకుంది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాంచీ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. మధుకాన్ సంస్థ ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్ను చూపించి.. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు పొందింది. తర్వాత మధుకాన్ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. నిజాలేమిటో తేల్చాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) న్యూఢిల్లీని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఈ అంశంలో సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది.మధుకాన్ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. చదవండి: టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ షాక్.. -
డిప్యూటీ కలెక్టర్గా సంతోషి
సాక్షి, హైదరాబాద్ : భారత్– చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్బాబు భార్య సంతోషిని రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్గా నియమించింది. ఆమెకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బుధవారం ప్రగతిభవన్లో నియామక ఉత్తర్వులను అందించారు. సంతోషికి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదురుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సబర్వాల్ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు జగదీష్రెడ్డి, ప్రశాంతరెడ్డి, నిరంజన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపికా యుగంధర్రావు, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ తదితరులు పాల్గొన్నారు. కల్నల్ సంతోష్బాబు కుటుంబానికి స్థలం అప్పగింత షేక్పేట మండల పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్నంబర్ 14లో కేబీఆర్ పార్కు ఎదురుగా ఉన్న 711 గజాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి బుధవారం కల్నల్ సంతోష్బాబు కుటుంబానికి అప్పగించారు. ఆర్డీఓ, తహసీల్దార్లతో సమక్షంలో స్థల పంచనామా నిర్వహించి స్థలాన్ని స్వాధీనం చేశారు. కల్నల్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం షేక్పేట మండలంలో మూడు స్థలాలను కుటుంబసభ్యులకు చూపించారు. వీటిలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో స్థలం కావాలని వారు కోరగా, ఈ స్థలాన్ని కేటాయించారు. కేసీఆర్ తమకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని కల్నల్ సతీమణి సంతోషి కృతజ్ఞతలు తెలిపారు. -
జీహెచ్ఎంసీ: వెంటాడుతున్న కోవిడ్ భూతం!
పెరుగుతున్న కోవిడ్–19 పాజిటివ్ కేసులతో జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలను కరోనా భూతం వెంటాడుతోంది. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో 869 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 29, మేడ్చల్ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా పాజిటివ్ కేసులు ఆగడం లేవు. తాజాగా పరిపాలన విభాగంలోని మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇదే విభాగంలో గత వారం కూడా ఓ ఉద్యోగికి కరోనా సోకిన తెలిసిందే. ఉప్పల్ ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో.. ఉప్పల్ : ఉప్పల్ ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో మంగళవారం ఒక్క రోజే 42 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. హబ్సిగూడలో డివిజన్లోని కామాక్షిపురంలో 5, హబ్సిగూడలో ఒకటి, వెంకట్రెడ్డినగర్లో 3, శ్రీరాంనగర్ కాలనీలో 3, రామంతాపూర్ డివిజన్లోని అరవింద్నగర్ కాలనీలో 4, విద్యానగర్లో ఒకటి, ఉప్పల్ డివిజన్లో భరత్నగర్లో 3, గాంధీనగర్లో 2, కురుమానగర్లో 2, విజయపురి కాలనీలో 2, బీరప్పగడ్డలో 2, నాచారంలో 3, నాగోల్లో 5, మల్లాపూర్లో 6 కేసులు నమోదయ్యాయి. రామంతాపూర్ నేతాజీనగర్ చెందిన ఓ వృద్ధుడు (65) మృతిచెందాడు. (ఎన్నారై భర్తలు వేధిస్తే సమాచారమివ్వండి) కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో... దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోద య్యాయి. సూరారం కాలనీ వెంకట్రామ్నగర్కు చెందిన వ్యక్తి(39), బాచుపల్లికి చెందిన యువకుడు(28), చింతల్ మారుతీనగర్కు చెందిన వ్యక్తి (55), గణేష్నగర్కు చెందిన మహిళ(33), గాజులరామారానికి చెందిన వ్యక్తి (30), నిజాంపేట్ రాజీవ్ గృహకల్పకు చెందిన వ్యక్తి (33), జీడిమెట్ల గ్రామానికి చెందిన వ్యక్తి (35), మీనా క్షి ఎస్టేట్స్కు చెందిన వ్యక్తి(58), అపురూపా కాలనికి చెందిన వ్యక్తి (48), జీడిమెట్ల శ్రీనివాస్నగర్కు చెందిన వ్యక్తి (45), జగద్గిరిగుట్టకు చెందిన మహిళ (35), చింతల్ సాయినగర్కు చెందిన మహిళ (52), వాణినగర్కు చెందిన వ్యక్తి (42), ప్రగతినగర్కు చెందిన వ్యక్తి (32), యువకుడు (28), యువతి (26), మరో యువకుడు (29), వ్యక్తి(39), హెచ్ఏఎల్ కాలనీకి చెందిన యువకుడు (26), వృద్ధురాలు (69), మరో యువకుడు (21), కొంపల్లి జయభేరి పార్కుకు చెందిన మహిళ (40), కొంపల్లి బొబ్బిలి అంపైర్కు చెందిన యువకుడు (20), కుత్బుల్లాపూర్కు చెందిన వ్యక్తి (42), నిజాంపేట్ వెంకటనగర్కు చెందిన వృద్ధురాలు (68), బాచుపల్లికి చెందిన మహిళ (30)కు కరోనా సోకడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కీసర పీహెచ్సీ పరిధిలో... కీసర : కీసర పీహెచ్సీ పరిధిలో కొత్తగా మరో 3 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని భవానీనగర్ కాలనీకి చెందిన మహిళకు, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు శ్రీలక్ష్మీనగర్కాలనీలో ఓ మహిళాకు, మండల కేంద్రమైన కీసరలో ఓ ఆర్ఎంపీ వైద్యుడికి కరోనా నిర్ధారణ అయ్యిందని కీసర మండల వైద్యాధికారులు తెలిపారు. వారిని ఆస్పత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులను హోం క్వారైంటైన్లో ఉంచామన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో... మారేడుపల్లి : కంటోన్మెంట్ నాలుగు, ఐదు వార్డులలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. కార్ఖానా అమరావతి కాలనీకి చెందిన తండ్రి, కొడుకులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. పికెట్ లక్ష్మీనగర్లో ఒక కానిస్టేబుల్ కరోనా బారిన పడ్డారు. ముగ్గురినీ హోమ్ క్వారంటైమ్లో ఉంచినట్లు మెడికల్ ఆఫీసర్ మీనా తెలిపారు. కరోనా పాజిటివ్ నివాసాల వద్ద కంటోన్మెంట్ సానిటేషన్ విభాగం అధికారులు బ్లీచింగ్ పౌడర్తోపాటు సోడియం హైడ్రోఫ్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. కాప్రాలో... కాప్రా : సర్కిల్ పరిధిలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 90కి చేరింది. నాచారం డివిజన్ బాబానగర్, చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలో ఒక్కో కేసు, కాప్రా డివిజన్ గౌడపురి కాలనీలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 33 మంది డిశ్చార్జ్ కాగా, 54 యాక్టివ్ కేసులున్నాయి. ఘట్కేసర్ పట్టణంలో... ఘట్కేసర్ : ఘట్కేసర్ పట్టణంలోని సాయినగర్కు చెందిన మహిళ(30), ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన మరో మహిళ(58)కు కరోనా సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. స్థానిక కౌన్సిలర్ కొమ్మిడి అనురాధ వైద్యసిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్లే దారులను మూసివేయించారు. కాలనీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించి రెడ్ జోన్ బోర్డులను ఏర్పాటు చేశారు. సాయినగర్లో వృద్ధుడి మృతి నిజాంపేట్ : కరోనా లక్షణాలతో సాయినగర్లో ఓ వ్యక్తి మృతి సోమవారం రాత్రి మృతి చెందాడు. సాయినగర్లో ఉండే షేక్ చాన్బాషా(60) బోరబండలో టైలర్గా జీవనం సాగిస్తున్నాడు. పది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఊపిరి తీసుకోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే కుటుంబ సభ్యులు ఆయనను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఆయన మృతి చెందాడు. దీంతో చాన్బాషా అంత్యక్రియలను పీపీఈ కిట్లు ధరించి చేసేలా కార్పొరేటర్ కాసాని శిరీష చర్యలు తీసుకున్నారు. తుకారాంగేట్లో... అడ్డగుట్ట : అడ్డగుట్ట డివిజన్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తుకారాంగేట్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఓ వ్యక్తి(43), ఓ మహిళ(31) కరోనా బారిన పడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కిషన్బాగ్ కొండారెడ్డిగూడలో... బహదూర్పురా : కిషన్బాగ్ డివిజన్లోని కొండారెడ్డిగూడలో ఓ వ్యక్తి(45)కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయనను హోమ్ క్వారంటైన్ చేశామని కిషన్బాగ్ నోడల్ అధికారి బాలకృష్ణ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో... వెంగళరావునగర్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని జీహెచ్ఎంసీ సర్కిల్–19 ఉప కమిషనర్ ఎ.రమేష్ తెలిపారు. యూసుఫ్గూడ డివిజన్లో నలుగురికి, ఎర్రగడ్డ, రహమత్నగర్ డివిజన్ల పరిధిల్లో ఇద్దరు చొప్పున, బోరబండ డివిజన్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు. ఎల్బీనగర్ పరిధిలో... ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ çమూడు సర్కిళ్ల పరిధిలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ను మోగిస్తుది. వారం రోజులుగా వైరస్ వ్యాప్తి ఉధృతం కావడంతో 107 మంది మంచానికే పరిమితయ్యారు. మరికొందరు గాంధీ, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. కేవలం మంగళవారం ఒక్కరోజే చంపాపేట, çహయత్నగర్, వనస్థలిపురం, బీఎన్రెడ్డి, లింగోజిగూడ, చైతన్యపురి, మన్సురాబాద్, నాగోల్లలో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా పాజిటివ్ వచ్చిన కాలనీలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అనుమానితులను హోం క్వారంటైన్లలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. -
కాంగ్రెస్ నేత పొన్నాలకు తప్పిన ప్రమాదం
-
పొన్నాల కారును ఢీకొట్టిన షూటింగ్ వాహనం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 1/45 చౌరస్తాలో సోమవారం సాయంత్రం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే కారులో నుంచి పొన్నాలతో పాటు ఆయన మనవడు దిగి షాప్లోకి వెళ్లిన సమయంలోనే ఈ ఉదంతం చోటు చేసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. పొన్నాల తన మనవడితో కలిసి కారులో జూబ్లీహిల్స్ రోడ్నెంబర్–1 వైపు షాప్కు వచ్చాడు. కారు పక్కన ఆపి లోపలికి వెళ్లాడు. అదే సమయంలో సినిమా షూటింగ్ వాహనం రివర్స్ తీసుకునే క్రమంలో చూసుకోకుండా పొన్నాల కారు ముందు భాగాన్ని ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
జూబ్లీహిల్స్లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్
-
పోలీసుల ముందే బీరు తాగుతూ హల్చల్..
సాక్షి, హైదరాబాద్ : పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. మద్యం తాగుతు కారు నడిపి పట్టుబడ్డ అతగాడు.. తన చేతిలోని బీరు సీసాను మాత్రం పడయకుండా అలాగే పట్టుకుని పోలీసుల ముందే తాగుతూ హల్చల్ చేశాడు. అర్థరాత్రి జూబ్లీహిల్స్ నీరుస్ దగ్గర నిర్వహించిన తనిఖీల్లో బంజారాహిల్స్ పోలీసులకు ఇతగాడు చిక్కాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కారు సీజ్ చేశారు. మరోవైపు తప్పతాగి వాహనాలు నడిపిన 48మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే పట్టుబడ్డవారి నుంచి 20 కార్లు, 28 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ వారికి సోమవారం బేగంపేటలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాలపై తామెంత అవగాహన కల్పించినా మందుబాబుల్లో మార్పు రావట్లేదని అన్నారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్.. ట్రాఫిక్ ఎస్సై అత్యుత్సాహం!
-
జూబ్లీహిల్స్లో కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. అతివేగం వల్లే కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. విద్యార్థుల అందరూ గీతం ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన వారిగా తెలిసింది. మృతి చెందిన విద్యార్థిని జతిన్ వర్మగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జూబ్లీహిల్స్లో కారు బీభత్సం.
-
జూబ్లీహిల్స్లో కూలిన గోడ..భారీగా ఆస్తి నష్టం
-
జూబ్లీహిల్స్లో కూలిన గోడ..భారీగా ఆస్తి నష్టం
హైదరాబాద్: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో 100 అడుగుల ఎత్తులో ఉన్న గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించనప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఎత్తైన కొండపై గల ఓ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహారీ గోడ్ కూలి.. కింద రోడ్డుపై నిలిపిఉన్న వాహనాలపై కుప్పకూలింది. ఆ సమయంలో రోడ్డుపై జనసంచారం లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దాదాపు 10 కార్ల వరకు శిథిలాల కింది నలిగిపోయాయని, విద్యుత్ లైన్లు తెగిపడటంతో సరఫరాను నిలిపివేశామని, సహాయక చర్యలు కొనసాగుతాయని జీహెచ్ ఎంసీ అధికారులు చెప్పారు.