-
ఐటీ పాలసీతో కంపెనీల ఏర్పాటు సులభతరం
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ పాలసీతో కంపెనీల స్థాపన మరింత సులభతరం కానుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16, 17 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ ఏర్పాట్లు తదితర అంశాలపై పల్సస్ గ్రూప్ లిమిటెడ్ సీఈవో గేదెల శ్రీనుబాబు నేతృత్వంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. వచ్చే ఏడాది కాలంలో విశాఖకి పలు ఐటీ దిగ్గజ కంపెనీలు రానున్నాయని చెప్పారు. విశాఖను బీచ్ ఐటీ డెస్టినీగా అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపె నీలకు తెలియజేసే ఉద్దేశంతోనే జనవరి నుంచి ఏప్రిల్ వరకు పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులతో పాటు గ్లోబల్ టెక్ సదస్సును విశాఖలో నిర్వహిస్తున్నామని వివరించారు. జనవరి 6,7,8 తేదీల్లో విశాఖలో హెల్త్ సమ్మిట్ జరగబోతుందని, అదే నెల 20, 21 తేదీల్లో ఇన్ఫినిటీ ఐటీ సదస్సు జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జీ 20 సదస్సు, మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు విశాఖలోనే నిర్వహిస్తున్నామని తెలి పారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు, గ్లోబల్ టెక్ సమ్మిట్ ద్వారా పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు, భారీ పరిశ్రమలు విశాఖకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఒకటి, రెండు నెలల్లో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, అమెజాన్ త్వరలోనే విశాఖలో అడుగుపెట్టబోతుందని, హెచ్సీఎల్ విశాఖ, తిరుపతి, కాకినాడ, గుంటూరులో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిందని గుర్తుచేశారు. ఐటీ రంగానికి చెందిన యాంకర్ యూనిట్లు విశాఖకు వస్తే, ఐటీ హబ్గా పేరొందిన పలు నగరాల సరసన విశాఖ కూడా నిలుస్తుందన్నారు. విశాఖలో వాతావరణం కూడా ఐటీ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందన్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో కూడా ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర పది రంగాలకు చెందిన పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి విశాఖలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు తెలియజేస్తామన్నారు. త్వరలో ఎంఎస్ఎంఈలతోపాటు ఐటీ ఇన్సెంటివ్లను కూడా విడుదల చేస్తామని చెప్పారు. గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ గ్లోబల్ టెక్ సమ్మిట్కు 1,000 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశముందన్నారు. ఈ సమ్మిట్కు సంబంధించి ఇప్పటికే భువనేశ్వర్, ఢిల్లీ, హైదరాబాద్లో రోడ్ షోలు నిర్వహించామని చెప్పారు. జీ 20 దేశాలలో కూడా ఈ సదస్సు ప్రాధాన్యత వివరించి ఐటీ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలను సదస్సుకు ఆహ్వానించనున్నామని తెలిపారు. జీవీఎల్కు విభజన హామీల మీద చర్చించే ధైర్యం ఉందా.. రాష్ట్ర విభజన హామీల అమలుపై చర్చించే ధైర్యం బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుకు ఉందా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. కేంద్రం ఇ వ్వాల్సిన ప్రాజెక్ట్లు, స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై చర్చించేందుకు తాను సిద్ధమని దా నికి జీవీఎల్ సిద్ధమా అని సవాల్ విసిరారు. జీవీ ఎల్ను నాయకుడిగా బీజేపీ వాళ్లే గుర్తించడం లేదన్నారు. 2024 నాటికి జీవీఎల్ ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదని మంత్రి వ్యాఖ్యానించారు. -
నిర్మలా సీతామారామన్ ఆగ్రహం, హమ్మయ్యా..సమస్య తీరింది
న్యూఢిల్లీ: కొత్త ఆదాయపు శాఖ (ఐటీ) పోర్టల్పై ప్రారంభంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు తొలగిపోయినట్లేనని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన పేర్కొంది. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం గత ఎనిమిది నెలల డేటాను పరిశీలిస్తే.. 2021–22 అసెస్మెంట్ ఇయర్కు (2020–21 ఆర్థిక సంవత్సరం) సంబంధించి గత ఎనిమిది నెలల్లో (ఫిబ్రవరి 6వ తేదీ నాటికి) పోర్టల్పై దాదాపు 6.17 కోట్ల ఐటీ రిటర్నులు (ఐటీఆర్), 19 లక్షల పన్ను ఆడిట్ రిపోర్టులు (టీఏఆర్)లు దాఖలయ్యాయి. ♦ దాఖలైన 6.17 కోట్ల ఐటీ రిటర్నుల్లో 48 శాతం అంటే దాదాపు 2.97 కోట్లు ఐటీఆర్–1కు సంబంధించినవి. 9 శాతం ఐటీఆర్–2కు (56 లక్షలు) ఉద్ధేశించినవి. 13 శాతం అంటే 81.6 లక్షలు ఐటీఆర్–3కి సంబంధించినవి. 27 శాతం ఐటీఆర్–4 (1.65 కోట్లు)కు సంబంధించినవి. 10.9 లక్షలు ఐటీఆర్–5, 4.84 లక్షలు ఐటీఆర్–6కు, 1.32 లక్షలు ఐటీఆర్–7కు సంబంధించినవి. ఇక ప్రధాన ఆడిట్ రిపోర్ట్ దాఖలు సంఖ్య 19 లక్షలుకాగా, ఇతర ఆడిట్ రిపోర్టులు 1.61 లక్షలకుపైగా ఉన్నాయి. ♦ చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, ఎటువంటి ఆలస్యం లేకుండా ఐటీఆర్, టీఏఆర్లు ఫైల్ చేయాలని పన్ను చెల్లింపుదారులను, చార్టర్డ్ అకౌంటెంట్లకు సూచిస్తూ, ఆదాయపు పన్ను శాఖ ఈ–మెయిల్స్, ఎస్ఎంఎస్, ట్వీటర్ ద్వారా రిమైండర్లను జారీ చేస్తోంది. ♦కార్పొరేట్లు 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2021–22 అసెస్మెంట్ ఇయర్) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువును మార్చి 15వ తేదీ వరకూ పొడిగిస్తూ, సీబీడీటీ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆడిట్ నివేదిక, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి గడువును కూడా ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. కార్పొరేట్లకు ఐటీ రిటర్న్ ఫైలింగ్కు గడువు పొడిగింపు ఇది మూడవసారి. కోవిడ్ సమస్యలకుతోడు, ఎలక్ట్రానిక్ విధానంలో రిటర్న్ దాఖలులో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో పన్ను చెల్లింపు, తత్సంబంధ ఇతర వర్గాలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంచుతూ సీబీడీటీ ఈ నిర్ణయం తెలిపింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ గడువు 2021 డిసెంబర్తో పూర్తయిన సంగతి తెలిసిందే. కొత్త పోర్టల్ కథ ఇదీ... కొత్త ఐటీ పోర్టల్ అభివృద్ధికి 2019లో ఇన్ఫోసిస్కు కేంద్రం రూ.4,242 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. 2019 జనవరి నుంచి 2021 జూన్ మధ్య రూ.164.5 కోట్లు చెల్లించింది. 2021 జూన్ 7న కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ ప్రారంభమైంది. ఇన్ఫోసిస్ అభివృద్ధి చెందిన పోర్టల్ తొలినాళ్లలో తీవ్ర అవాంతరాలు నెలకొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దాఖలు చైసిన రిటర్నులను సరిదిద్దుకోలేకపోవడం (రెక్టిఫికేషన్), రిఫండ్ ఏ దశలో ఉందో తెలుకోలేకపోవడం, 2013–14 అసెస్మెంట్ సంవత్సరానికి ముందు నాటి రిటర్నులను చూసే అవకాశం లేకపోవడం వంటివి వీటిల్లో కొన్ని. తమకు ఎదురవుతున్న సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో వీటిని పరిష్కరించాలని ప్రభుత్వం తొలుత ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులను కోరింది. అయినా అవి పరిష్కారం కాలేదు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ 2021 ఆగస్ట్ 23న ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరీఖ్కు సమన్లు ఇచ్చింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారులతో ఇన్ఫోసిస్ సీఈవో ఆధ్వర్యంలోని బృందం సమావేశమైంది. అందులో సమస్యల పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. సెప్టెంబర్ 15 నాటికి అన్నింటినీ పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యల కారణంగా ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును పలు దఫాలు పొడిగిస్తూ వచ్చింది. సెప్టెంబర్ 15 నాటికి పూర్తిగా సమస్యలు తొలగిపోనప్పటికీ, క్రమంగా వీటిని ఇన్ఫోసిస్ సరిదిద్దింది. ఫామ్స్.... ఎవరికి ఏమిటి? ఐటీఆర్ ఫామ్ 1 (సహజ్), ఐటీఆర్ ఫామ్ 4 (సుగమ్)లు భారీ సంఖ్యలో ఉండే చిన్న మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ఉద్దేశించినవి. రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తి, అలాగే జీతం, ఒక ఇంటి ఆస్తి, ఇతర వనరుల (వడ్డీ, మొదలైనవి) నుండి ఆదాయాన్ని పొందే వ్యక్తి సహజ్ను దాఖలు చేయవచ్చు. వ్యాపారం, వృత్తి ద్వారా మొత్తం రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు, హెచ్యూఎఫ్ (హిందూ అవిభక్త కుటుంబాలు), సంస్థలు ఐటీఆర్–4దాఖలు చేయవచ్చు. వ్యాపారం, వృత్తి నుండి లాభాలుగా పొందే వ్యక్తులు ఐటీఆర్–3ని దాఖలు చేస్తారు. ఎల్ఎల్పీ (లిమిటెడ్ లయబుల్ పార్ట్నర్షిప్), వ్యాపారాలు, ట్రస్టులు ఐటీఆర్ 5,6,7 ఫామ్స్ను దాఖలు చేస్తారు. వ్యాపారం, వృత్తి నుండి ఆదాయం కాకుండా ఇతర ఆదాయాన్ని పొందేవారు ఐటీఆర్ ఫామ్ 2ను దాఖలు చేయవచ్చు. జీతం, పెన్షన్ నుండి వచ్చే ఆదాయం. ఇంటి ఆస్తి నుండి వచ్చే ఆదాయం (ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తి నుండి వచ్చే ఆదాయం) పొందేవారు ఈ కోవలోకి వస్తారు. -
2nd ICT Policy: ఐదు అంశాలు.. పన్నెండు రంగాలు
ఐదేళ్ల క్రితం 2016లో ప్రారంభించిన తొలి ఇన్ఫర్మేషన్, కమ్యూనిటీ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీ లక్ష్యాలకు కొనసాగింపుగా.. రాష్ట్ర ప్రభుత్వం రెండో ఐసీటీ పాలసీని గురువారం ప్రకటించింది. 2021 నుంచి 2026 వరకు అమల్లో ఉండే ఈ పాలసీలో 12 రంగాలు, ఐదు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపింది. – సాక్షి, హైదరాబాద్ 5 అంశాలివీ.. ►పౌరులను డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, డిజిటల్ సేవలు, ఆవిష్కరణలు, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఐసీటీ రంగాన్ని అభివృద్ధి చేయడం, కోవిడ్ సంక్షోభ పరిస్థితి ఆధారంగా ఐటీ పరిష్కారాలు కనుగొని అభివృద్ధి బాటలో సాగడం లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించినట్టు వెల్లడించింది. 12 రంగాలివీ.. ►ఐటీ ఉత్పత్తులు, ఐటీ ఆధారిత ఇతర ఉత్ప త్తులు, ఎలక్ట్రానిక్స్, కొత్త ఆవిష్కరణలు, నైపుణ్య శిక్షణ, కాగిత రహిత పాలన, డిజి టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ అక్షరాస్యత, ఎమర్జింగ్ టెక్నాలజీ, క్లౌడ్ పాలసీ, టెక్నా లజీ వినియోగాన్ని పెంచేలా ఐటీ శాఖను బలోపేతం చేయడం, పట్టణ ప్రాంతాలకు అవసరమైన టెక్నాలజీ రూపకల్పన. రెండో ఐసీటీ పాలసీ విశేషాలు.. ►ఐటీ రంగం ద్వారా 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాల కల్పన, రూ.3 లక్షల కోట్ల వార్షిక ఎగుమతుల లక్ష్యం. ►ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మొబైల్స్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, స్టోరేజీ ఎనర్జీ వ్యవస్థలు, ఐటీ హార్డ్వేర్, టెలికాం ఉపకరణాలు, సెమీకండక్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, మెడికల్ డివైజెస్, ఆటోమోటివ్, రక్షణ రంగ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ప్రోత్సాహం. ►8వేలకు పైగా స్టార్టప్ల ద్వారా రూ.10 వేలకోట్ల మేర పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యం. రూ.1,300 కోట్లతో స్టార్టప్ ఫండ్, రూ.100 కోట్లతో క్షేత్రస్థాయి ఆవిష్కరణల నిధి ఏర్పాటు. ►స్థానికులకు ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ. కనీసం 80శాతం మందికి నైపుణ్య శిక్షణ. ఏటా 50వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు. ►పౌరసేవలను వంద శాతం ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తేవడం. వెయ్యికి పైగా ప్రభుత్వ సేవలను మొబైల్ ఫోన్ల ద్వారా అందజేయడం. ►రాష్ట్రవ్యాప్తంగా 5జీ సేవలు, టీఫైబర్ ద్వారా 2026 నాటికి ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వంద శాతం ఇంటర్నెట్ సౌకర్యం. ►ఐదు ప్రాంతీయ కేంద్రాల ద్వారా జిల్లాల్లో ఆవిష్కరణల వాతావరణం కల్పించడం. ►ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కనీసం 5శాతం ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతులు సాధించడం. -
ఏటా మూడు లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు.. 10 లక్షల ఉద్యోగాలు
సాధారణ స్మార్ట్ఫోన్ యాప్ల వినియోగం మొదలుకుని, అత్యాధునిక సాంకేతికత దాకా రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ జీవితాన్ని అందిస్తాం. ప్రజల రోజువారీ జీవితానికి తోడ్పడేలా మెరుగైన పౌర సేవలను కాగిత రహిత విధానంలో అందిస్తాం. ప్రతి ఇంట్లో ఒకరిని, స్వయం సహాయక సంఘాల మహిళలను డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, మారుమూల ప్రాంతాల ప్రజానీకానికి డిజిటల్ సేవలు అందించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ‘డిజిటల్ తెలంగాణ సెంటర్లు’ఏర్పాటు చేస్తాం. – మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో రూ.3లక్షల కోట్ల వార్షిక ఎగుమతులు సాధించాలని.. పది లక్షల మందికి ఉద్యోగాల కల్పి ంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావు ప్రకటించారు. డిజి టల్ ప్రపంచానికి పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అన్ని సామాజిక నేపథ్యాల ప్రజలు సాధికారత సాధించేలా రెండో ‘ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)’పాలసీకి రూపకల్పన చేశామని తెలిపారు. 2021 నుంచి 2026 వరకు అమలు చేసే ఈ రెండో ఐసీటీ పాలసీని గురువారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉత్పాదకత, ఇంజనీరింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని ప్రకటించారు. స్టార్టప్లు, పెట్టుబడిదారులకు తెలంగాణను మొదటి గమ్యస్థానంగా మార్చుతామని.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్లను స్థాపించడం ద్వారా ఐటీ రంగంలో కొత్తగా 50వేల ఉద్యోగాలు సృష్టిస్తామని తెలిపారు. చదవండి: గృహ రుణ గ్రహీతలకు ఎస్బీఐ బొనాంజా కొత్త ఐటీ పాలసీ లక్ష్యాలెన్నో.. డ్రైవింగ్ టెస్ట్ వంటి సేవలు మినహా దాదాపు ప్రభుత్వ సేవలన్నింటినీ.. వెబ్, మొబైల్ యాప్ల ద్వారా అందుబాటులోకి తెస్తామని, కాగితరహిత పాలన అందిస్తామని కేటీఆర్ చెప్పారు. ‘‘కొత్త టెక్నాలజీల యుగంలో ఐటీ పట్టభద్రులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా కృత్రిమ మేథస్సు (ఏఐ) సాంకేతికతపై ప్రాథమిక శిక్షణ ఇస్తాం. రూ.13 వందల కోట్లతో స్టార్టప్ ఫండ్తోపాటు ప్రభుత్వ పెట్టుబడుల కమిటీ ఏర్పాటు చేసి 8వేల స్టార్టప్లకు చేయూతనిస్తాం. దేశంలోనే తెలంగాణను స్టార్టప్లకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం. ఎలక్ట్రానిక్ వాహనాలు, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, వైద్య ఉపకరణాలు, ఆటోమొబైల్ రం గాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తాం. ఎలక్టానిక్స్ రంగం ద్వారా రూ.75వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ కారిడార్’ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీల వినియోగాన్ని ప్రోత్సహిస్తాం. డేటా స్టాక్, డేటా ఎనాలసిస్ వింగ్ ఏర్పాటు చేస్తాం. స్థానికంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరి ష్కారాల ద్వారా రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) అం డగా నిలుస్తాం. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ భాగస్వామ్యంతో ‘స్మార్ట్ సిటీస్ వింగ్’ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 40 ‘స్మార్ట్ రీజియన్లు’సృష్టిస్తాం..’’అని ప్రకటించారు. చదవండి: ఏకతాటిపైకి టెల్కోలు ప్రతికూల పరిస్థితుల్లోనూ వృద్ధి కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణ ఐటీ రంగం అద్వితీయంగా పురోగమించిందని నాస్కామ్ చైర్పర్సన్ రేఖా మీనన్ అభినందించారు. రెండో ఐటీ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో మీనన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పాలసీలతో పురో గామి విధానాలు అవలంభిస్తోందని ప్రశంసిం చారు. ఇక తెలంగాణ ఐటీ రంగంతో అమెరికాకు గాఢమైన బంధముందని హైదరాబాద్లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రైఫ్మన్ అన్నారు. హైదరాబాద్లో 48 అమెరికా ఐటీ సం స్థల కార్యకలాపాల ద్వారా 1.10 లక్షల మంది ఉద్యోగాలు పొందారని చెప్పారు. కార్యక్రమంలో సైయంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, రాజన్న(టీసీఎస్), ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి లంక, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్లు పాల్గొన్నారు. దేశంలోనే వేగంగా పురోగమిస్తున్నాం కోవిడ్తో జాతీయ వృద్ధిరేటు 1.26 శాతానికి పడిపోయినా.. రాష్ట్రం 2020–21లో రూ.9.78 లక్షల జీఎస్డీపీ, 8%వృద్ధిరేటు సాధించిందని, తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉందని కేటీఆర్ అన్నారు. రూ.1.45 లక్షల కోట్ల ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతులు సాధించామని, 2016 నాటి తొలి ఐసీటీ పాలసీ లక్ష్యాలను అం దుకున్నామని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రముఖ పెట్టుబడిదారులను ఆకర్షించామని, 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు సాధించామని తెలిపారు. ఇం దులో కేవలం ఎలక్ట్రానిక్స్ రంగంలోనే 1.5 లక్షల ఉద్యోగాలు సృష్టించడంతోపాటు దేశంలోని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో 7% వాటా సాధించామన్నారు. టీహబ్, వీహబ్, టీఎస్ఐసీ, రీచ్, టాస్క్, టీవర్క్స్ వంటివాటితో ఆవిష్కరణల వాతావరణాన్ని సృష్టించామని, 15 వందలకుపైగా స్టార్టప్లకు రూ.1,800 కోట్ల మేర నిధులు అందా యని తెలిపారు. టాస్క్ద్వారా 3 లక్షల మందికి నైపుణ్య శిక్షణ, ఆన్లైన్లో 500 రకాల ప్రభుత్వ సేవలు, టీ యాప్ ఫోలియో ద్వారా 250 ప్రభు త్వ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఓపెన్డేటా, బ్లాక్ చెయిన్, డేటా అనలిటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ అడాప్షన్ వంటి పాలసీలు, 3వేలకు పైగా పబ్లిక్ వైఫై పాయింట్లు, ఐదు లక్షల మందికి డిజిటల్ అక్షరాస్యత వంటి లక్ష్యాలను ఐదేళ్లలో సాధించామన్నారు. -
తెలంగాణ నూతన ఐటి పాలసీ 2.0 ఆవిష్కరణ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement