India u19 vs Srilanka U19
-
భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు
శ్రీలంక పర్యటనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అండర్-19 జట్టును ప్రకటించింది. యశ్వర్దన్ సింగ్ చౌహాన్ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది. కాగా ఈ పర్యటనలో భాగంగా భారత అండర్-19 జట్టు ఆతిథ్య లంకతో వన్డే, ఫోర్-డే మ్యాచ్లు ఆడనుంది.ఇక ఈ జట్టులో టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid)కు కూడా చోటు దక్కింది. వన్డే జట్టులోని ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడిగా పదహారేళ్ల అన్వయ్కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.కొత్త జట్టుబీసీసీఐ జూనియర్ క్రికెట్ కమిటీ పంథా మార్చింది. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఒక్క ఆటగాడిని కూడా తాజా టూర్కు ఎంపిక చేయలేదు. ఈ పర్యటనతో యశ్వర్దన్ సారథ్యంలో కొత్త జట్టును తీర్చిదిద్దే దిశగా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ జట్టులో ఆల్రౌండర్లకే సెలక్టర్లు పెద్దపీట వేశారు.మరోసారి అన్వయ్కు చోటుగతేడాది నవంబరులో చివరగా అన్వయ్ ద్రవిడ్ భారత అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో ఆడిన భారత్- ‘బి’ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.బెంగళూరు వేదికగా ఈ సిరీస్లో ఏకైక మ్యాచ్ ఆడిన అన్వయ్.. అఫ్గన్ బౌలర్ నజీఫుల్లా అమిరి బౌలింగ్లో తొలి బంతికే అవుటై వెనుదిరిగాడు. అయితే, దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు సెలక్టర్లు తాజాగా మరోసారి అవకాశం ఇచ్చారు.శ్రీలంక పర్యటనకు భారత మెన్స్ అండర్-19 వన్డే జట్టుసాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్ కెప్టెన్), యశ్వర్ధన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), వినీత్ వీకే, అర్జున్ రాజ్పుత్, కుషాగ్రా ఓజా, రజత్ బఘెల్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), అన్మోల్జీత్ సింగ్, వూట్కూరి యశ్వీర్ గౌడ్, రోహిత్ అనిల్ యాదవ్, శవిన్ వి, కావ్యా పరేశ్ పటేల్, మోహిత్ ఉల్వా. ఇషాన్ సూద్.శ్రీలంక పర్యటనకు భారత మెన్స్ అండర్-19 మల్టీ-డే జట్టుసాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్ కెప్టెన్), యశ్వర్దన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), పటేల్ కుష్, మనల్ చౌహాన్, కుషాగ్రా ఓజా, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), ఆర్యన్ సందేశ్ సక్పాల్ (వికెట్ కీపర్), హేమ్చుదేశన్ జె, బికె కిషోర్, రోహిత్ అనిల్ యాదవ్, కావ్య పరేష్ సింగ్ పటేల్, ప్రియాన్షు సింగ్, ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట.భారత్ అండర్-19 వర్సెస్ శ్రీలంక అండర్-19 షెడ్యూల్ (మూడు వన్డేలు, రెండు యూత్ టెస్టులు)👉హంబన్టోటా వేదికగా మూడు వన్డేలు👉జూలై 4, జూలై 6, జూలై 9 తేదీల్లో వన్డేల నిర్వహణ👉గాలే వేదికగా జూలై 13-16 మధ్య మొదటి యూత్ టెస్టు👉కొలంబో వేదికగా జూలై 20-23 మధ్య రెండో యూత్ టెస్టు.చదవండి: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు -
భారత జట్టు ప్రకటన.. 16 ఏళ్ల యువ సంచలనానికి ఛాన్స్
స్వదేశంలో శ్రీలంక అండర్-19తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత అండర్-19 మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. గతేడాది కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ను గెలిచిన జట్టులో సభ్యురాలి ఉన్న భవిక అహిరేను కెప్టెన్గా సెలక్టర్లు ఎంపిక చేశారు. వన్డే, టీ20 సిరీస్ రెండింటిలోనూ భారత జట్టును ఆమె ముందుండి నడిపించనుంది. అదేవిధంగా భవికకు డిప్యూటీగా మహక్ నర్వాసే వ్యహరించనుంది. ఇక శ్రీలంకతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో యువ సంచలనం దీయా యాదవ్కు చోటు దక్కింది. కానీ ఆమెను టీ20లకు మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో 16 ఏళ్ల దీయాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆమెకు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు భారత జెర్సీలో సత్తాచాటేందుకు దియా సిద్దమైంది. కాగా ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక అండర్-19 టీమ్ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. చెన్నై, పుదుచ్చేరి వేదికలుగా మ్యాచ్లు జరగనున్నాయి.టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్టీ20 సిరీస్ (చెన్నై): జూన్ 22, జూన్ 24, జూన్ 27 (మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రారంభం)వన్డే సిరీస్ (పుదుచ్చేరి): జూన్ 30, జూలై 3 (ఉదయం 9:00 గంటలకు), జూలై 6 (మధ్యాహ్నం 2:00 గంటలకు)భారత అండర్-19 టీ20 జట్టు:భవిక అహిరే (కెప్టెన్/వికెట్ కీపర్), ఇరా జాదవ్, తనిష్క శర్మ, ఈశ్వరి అవసరే, అవ్ని చౌదరి, మహతో నిధి, పూర్వ సివాచ్, కుమారి పాలక్, మహక్ నర్వాసే (వైస్ కెప్టెన్), కాశ్వి కందికుప్ప, మణియార్ మైత్రి, గౌరీ గోయల్, జాన్వి వికార్, అనాది తగ్డే, కె. దీక్ష (వికెట్ కీపర్).భారత అండర్-19 వన్డే జట్టు:భవిక అహిరే (కెప్టెన్/వికెట్ కీపర్), ఇరా జాదవ్, దీయా యాదవ్, ఈశ్వరి అవసరే, వి.ప్రతీక్ష, మహతో నిధి, పూర్వ సివాచ్, కుమారి పాలక్, మహక్ నర్వాసే (వైస్ కెప్టెన్), కాశ్వి కందికుప్ప, విధి పర్మార్, గౌరీ గోయల్, జాన్వి వికార్, అనాది తగ్డే, కె. దీక్ష (వికెట్ కీపర్).


