Hyderabad Press Club
-
నా పెళ్లి.. అయిపోయిందోచ్!
సాక్షి, హైదరాబాద్: రాహుల్ గాంధీ పెళ్లి అయిపోయిందట..! అమ్మాయి ఎవరు అని మాత్రం అడగకండి.. ఆయన పెళ్లి జరిగింది అమ్మాయితో కాదు.. కాంగ్రెస్ పార్టీతో!! ఈ విషయాన్ని మంగళవారం హరిత ప్లాజాలో ‘హైదరాబాద్ ప్రెస్క్లబ్’ నిర్వహించిన ఎడిటర్స్ మీట్లో రాహులే స్వయంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ హడావుడి, హంగామా లేకుండా అతి సాధారణంగా టేబుల్ టేబుల్ తిరుగుతూ, కూర్చుంటూ, లేస్తూ, నడుస్తూ రాహుల్ ప్రసంగించారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలు, రాజకీయాలతోపాటు వ్యక్తిగత అంశాలను పంచుకున్నారు. జర్నలిస్టులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇదే సందర్భంలో మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు.. బ్రహ్మచారిగానే ఉండిపోతారా అని ఓ పాత్రికేయుడు అడగ్గానే రాహుల్ బిగ్గరగా నవ్వేస్తూ.. ‘కాంగ్రెస్ పార్టీ నే పెళ్లి చేసుకున్నా..’అంటూ బదులిచ్చారు. తొలుత మహిళా జర్నలిస్టులు కూర్చున్న టేబుల్ నుంచి తన చిట్చాట్ను ప్రారంభించారు. ‘అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మీకు నానమ్మ ఇందిర, అమ్మ సోనియా, సోదరి ప్రియాంకాల్లో ఎవరు స్ఫూర్తి..’ అని ఒకరు ప్రశ్నించగా.. ‘ముగ్గురూ స్ఫూర్తే.. వాళ్లే బలం..’అని చెప్పారు. మహిళా జర్నలిస్టులున్న ఈ టేబుల్కు మరో రెండు నిమిషాల సమయాన్ని అధికంగా కేటాయిస్తానని చెప్పి.. వారితో అదనంగా మరో ప్రశ్న వేయించుకుని సమాధానం చెప్పారు. సెల్లో రికార్డింగ్పై చిరు కోపం సుమారు గంటా పది నిమిషాల పాటు జరిగిన ఈ మీట్లో ఓ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు తీరుపై రాహుల్ నొచ్చుకున్నారు. ‘ఈ మీట్ కేవలం ఆఫ్ ది రికార్డ్ కోసం ఉద్దేశించిందే.. నేను ఎంత ఫేర్గా ఉన్నానో.. మీరు అలాగే ఉండాలి’ అంటూ తన మాటల్ని సెల్ఫోన్లో రికార్డు చేసిన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుపై చిరుకోపాన్ని ప్రదర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనపై విమర్శలు చేస్తున్న మీరు.. మీ కుటుంబ పాలనపై ఏమంటారు అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘మేం 30 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నాం. నా తండ్రి ప్రధాని అయ్యాక మా కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎవరూ ప్రధాని పదవి తీసుకోలేదు’ అని బదులిచ్చారు. ఈ భేటీలో ఆయన సాధారణ వ్యక్తిలా కలిసిపోయి పూర్తి వివరాలు, విశేషాలతో కూడిన సమాధానలివ్వటంతో సమావేశం అనంతరం ఆయన్ను పలువురు ఎడిటర్లు, జర్నలిస్టులు చప్పట్లతో అభినందించారు. సమావేశం చివరలో ‘సాక్షి’ దినపత్రిక కార్టూనిస్ట్ శంకర్ రాహుల్పై గీసిన క్యారికేచర్ను ప్రెస్క్లబ్ ప్రతినిధులు అందజేయగా.. ‘దీన్ని నా సోదరికి గిఫ్ట్గా ఇస్తా’ అంటూ తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మీట్కు ఎస్పీజీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయటంతో ముఖ్య కాంగ్రెస్ నాయకులు సైతం ఇబ్బంది పడ్డారు. చివరకు ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు చొరవతో సీఎల్పీ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క లోపలికి రాగలిగారు. సుమారు 80 మందికిపైగా మీడియా ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. జర్నలిస్ట్తో చాలెంజ్ దేశంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో తప్పక ఓటమి పాలవుతుందని రాహుల్ అనడంతో.. ఓ టీవీ చానల్ ఎడిటర్ మధ్యలో కల్పించుకుని వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? 100 లేదా 200 అని అడిగారు. స్పందించిన రాహుల్ ‘మేం గెలువబోతున్నాం.. మీకు సందేహం అవసరం లేదు’ అన్నారు. సీట్ల సంఖ్య చెప్పండి అంటూ చానల్ ఎడిటర్ మళ్లీ అడగడంతో.. రాహుల్ ఆయన సీటు వద్దకు వచ్చి.. ‘బెట్ ఏమిటో చెప్పండి’ అని అడిగారు. ‘నూరు శాతం విజయం నాదే. మేం గెలిస్తే ఏం కావాలో బెట్ చేయండి’ అనగా.. ప్రధాని హోదాలో ఫస్ట్ ఇంటర్వ్యూ తనకే ఇవ్వాలని చానల్ ఎడిటర్ బదులిచ్చారు. ఈ బెట్కు రాహుల్ ఓకే చెప్పేయటంతో హాలంతా నవ్వుల్లో మునిగిపోయింది. రాఫెల్ విమానాల కొనుగోళ్లపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. మోదీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో భారీ కుంభకోణానికి పాల్పడిందని, దీనిపై తాను పార్లమెంటులో ప్రశ్నిస్తే తన కళ్లలో సూటిగా చూసి సమాధానం చెప్పలేక ప్రధాని దిక్కులు చూస్తూ దాటేసిపోయారన్నారు. -
ప్రెస్క్లబ్ అధ్యక్షుడిగా విజయకుమార్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ (సోమాజిగూడ) ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ సిటీ బ్యూరో చీఫ్ శ్రీగిరి విజయకుమార్రెడ్డి ఘన విజయం సాధిం చారు. ఆదివారం ప్రెస్క్లబ్లో జరిగిన ఎన్నికల్లో 393 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అధ్యక్ష పదవికి మొత్తం 1,094 ఓట్లు పోల్ కాగా విజయకుమార్ రెడ్డికి 643 ఓట్లు, వై.బాలరామ్కు 254, షరీఫ్కు 160 ఓట్లు లభించాయి. ప్రధాన కార్యదర్శిగా డి. రాజమౌళిచారి 69 ఓట్ల తేడాతో పీవీ శ్రీనివాస్ రావుపై విజయం సాధించారు. రాజమౌళిచారికి 349 ఓట్లు, శ్రీనివాస్కు 280 ఓట్లు, రమేశ్ వైట్లకు 259 ఓట్లు లభించాయి. కోశాధికారిగా సురజ్ వి భరద్వాజ్ 29 ఓట్ల తేడాతో దుగ్గు రఘుపై విజయం సాధించారు. సురజ్కు 324 ఓట్లు లభించగా, దుగ్గు రఘుకు 295 ఓట్లు, రాజేశ్కు 236 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా వేణుగోపాల్ నాయుడు 138 ఓట్ల తేడాతో మారం శ్రీనివాస్పై విజయం సాధించారు. వేణుగోపాల్కు 383 ఓట్లు లభించగా శ్రీనివాస్కు 245 ఓట్లు లభించాయి. మహిళా కోటాలో ఉపాధ్యక్షురాలిగా రెహనా బేగం 154 ఓట్ల తేడాతో ఎ.సరితపై విజయం సాధించారు. రెహనాకు 395 ఓట్లు, సరితకు 241 ఓట్లు, గాయత్రికి 201, యశోదకు 114 ఓట్లు లభించాయి. సహాయ కార్యదర్శులుగా చిలుకూరి హరిప్రసాద్, కంబాలపల్లి కృష్ణ విజయం సాధించారు. కార్యవర్గ సభ్యులుగా సీహెచ్ గణేశ్(సాక్షి), కట్టా కవిత, ఉమాదేవి, అనిల్ కుమార్, అమిత్ భట్టు, యశోద, కస్తూరి శ్రీనివాస్, వసంత కుమార్, నంద్యాల భూపాల్ రెడ్డి, రజనీకాంత్ ఎన్నికయ్యారు. ప్రెస్క్లబ్లో మొత్తం 1,313 ఓట్లకు 1,100 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెహనా బేగం, డి. రాజమౌళిచారి, వేణుగోపాల్ నాయుడు -
టీఆర్పీ కోసం మీడియా పాకులాట
హైదరాబాద్: ప్రస్తుతం మీడియా రంగంలో రాజకీయ నేతల జోక్యం ఎక్కువగా ఉంటోందని, గతంతో పోలిస్తే మీడియాలో విలువలు తగ్గిపోతున్నాయని ఇండియా టుడే కన్సల్టింగ్ గ్రూప్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. టీఆర్పీ రేటింగ్ కోసం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోం దన్నారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ 53వ వ్యవస్థాపక దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలను సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మీడియా ఇన్ బ్రేకింగ్ న్యూస్ ఎరా’అనే అంశంపై రాజ్దీప్ సర్దేశాయ్ ఉపన్యసించారు. ప్రస్తుతం మీడియా యాజమాన్యాలు కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎడిటోరియల్ కథనాలకు ఎంతో విలువ ఉండేదని, కానీ నేడు అవి రాజకీయ నేతల ప్యాకేజీలుగా మారి పోయాయన్నారు. జర్నలిజాన్ని పెయిడ్ న్యూస్ ఒక కేన్సర్ వ్యాధిలా పట్టిపీడిస్తోందన్నారు. మరుగున పడిపోతున్న ప్రజా సమస్యలు ప్రజల సమస్యలపై వార్తలు ప్రసారం చేయడం, ప్రచురించడం తగ్గిపోయిందని రాజ్దీప్ వాపోయారు. దేశవ్యాప్తంగా 400 చానళ్లు ఉండగా అందులో ఎక్కువ శాతం రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. నేడు ప్రధానులు, ముఖ్యమంత్రులు సైతం కనీసం మీడియాకి ఇంటర్వూలు కూడా ఇవ్వడం లేదని.. ప్రెస్మీట్లు పెట్టడానికి సైతం ఆసక్తి చూపడం లేదని అన్నారు. గతంలో ఎన్టీఆర్ లాంటి మహానేతలు ప్రతినిత్యం మీడియాతో కలసిమెలసి ఉండేవారని గుర్తుచేశారు. సంచలనాల కోసమే చానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్నారు. ఇంటర్నెట్, మొబైల్, వాట్సప్ జర్నలిజం పెరిగిపోవడంతో తప్పుడు వార్తలు ప్రసారమవుతున్నాయన్నారు. ఇటీవలి కాలంలో జాతీయ మీడియా కులా లు, మతాలు, ప్రాంతీయ భేదాలతో ప్రజల్ని విడదీసే విధంగా కథనాలు ప్రసారం చేయడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్.. రాజ్దీప్ సర్దేశాయ్ను ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. జర్నలిజంలో 45 సంవత్సరాలు పూర్తిచేసిన రామచంద్రమూర్తిని, ఐజేయూ అధ్యక్షుడిగా ఎన్నికైన అమర్ను, అల్లం నారాయణను రాజ్దీప్ సత్కరించారు. -
‘ఆ మాటకు కట్టుబడి ఉన్నా.. వాళ్లను వదలం’
హైదరాబాద్: తప్పు చేసిన ఉద్యోగులు తప్పించుకోలేరన్న మాటకు కట్టుబడి ఉన్నానని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. కొందరు ఉద్యోగులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీకి ఓటేసిన ప్రజలను వేధిస్తున్న అధికారులను ప్రశ్నించకూడదా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఉద్యోగులను సమర్థించాలా అని ప్రశ్నించారు. తహశీల్దార్ వనజాక్షిపై దాడి జరిగినప్పుడు ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఏమయ్యారని నిలదీశారు. విజయవాడలో ఆర్టీఏ అధికారిపై అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే దౌర్జన్యం చేసినప్పుడు ఉద్యోగ సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని అడిగారు. నేను ఇబ్బంది పెట్టినట్టు నా నియోజకవర్గంలో ఒక్క ఉద్యోగినైనా ఒప్పించగలరా అని సవాల్ విసిరారు. 90 శాతం మంది ఉద్యోగులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని, వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న అధికారులను మాత్రం వదిలిపెట్టబోమని అన్నారు. -
ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టుల ర్యాలీ
హైదరాబాద్: సోమాజీగూడలోని ప్రెస్క్లబ్ వద్ద జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మీడియాపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం జర్నలిస్టులు ప్రెస్క్లబ్ వద్ద ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎన్డీటీవీపాటు మరో ప్రాంతీయ ఛానల్కు సంబంధించిన ప్రసారాలపై రెండు రోజుల పాటు కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెల్సిందే. -
ప్రెస్క్లబ్ అధ్యక్షునిగా రాజమౌళి
- ప్రధాన కార్యదర్శిగా విజయ్కుమార్రెడ్డి ఎన్నిక సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షునిగా బి.రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శిగా ఎస్.విజయ్కుమార్రెడ్డి(సాక్షి) ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఎన్నికలు సోమాజిగూడ లో రసవత్తరంగా సాగాయి. తదనంతరం ఓట్లను లెక్కించారు. రాజమౌళిచారి తన సమీప ప్రత్యర్థి వాసిరెడ్డి శ్రీనివాస్పై 33 ఓట్ల తేడాతో గెలుపొందారు. చారికి 230 ఓట్లు పోలవ్వగా.. శ్రీనివాస్కు 197 ఓట్లు దక్కాయి. జనరల్ సెక్రెటరీ పదవికి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలవగా ఎస్.విజయ్కుమార్రెడ్డి ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి పీవీ శ్రీనివాస్(టీన్యూస్)పై 85 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. విజయ్కుమార్రెడ్డికి 330, శ్రీనివాస్కు 245 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 992 ఓటర్లకుగానూ 697 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఇ.జనార్దన్ రెడ్డి, గాయత్రి, కోశాధికారిగా ఎన్.శ్రీనివాస్రెడ్డి, జాయింట్ సెక్రెటరీలుగా దుగ్గు రఘు, రమేశ్ వైట్ల ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్లుగా.. సరస్వతి రమ, యశోద ఏకగ్రీవం కాగా, కె.కృష్ణ, అనిల్కుమార్, హరిప్రసాద్, ఈ.నరేందర్, గంగాధర్, వసంత్కుమార్, రాజేశ్, శ్రీనివాస్ కస్తూరీ తదితరులు పాలకమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. -
బెంచ్మార్క్లా తయారు చేసేందుకు కృషి
హైదరాబాద్: రాష్ట్రంలో చాలా రంగాల్లో కొత్తగా ముందుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని, హైదరాబాద్ ప్రెస్క్లబ్ను కూడా దేశంలో ఒక బెంచ్మార్క్లా తయారు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. 29న నిర్వహించనున్న హైదరాబాద్ ప్రెస్క్లబ్ 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సోమవారం నిర్వహిం చిన ఎడిటర్స్ మీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలం ఉందని దీన్ని కేవ లం రిక్రియేషన్ క్లబ్లా కాకుండా జర్నలిస్టులకు ఉపయోగపడేలా రూపొందించాలని కేటీఆర్ పేర్కొన్నారు. జర్నలిస్టులందరికీ ఉపయోగపడే కార్యక్రమాలపై నిర్ధిష్ట ప్రణాళిక రూపొందించాలన్నారు. నెలలో ఒకసారైనా యువ జర్నలిస్టులకు సీనియర్లతో ముఖాముఖి ఏర్పాటుచేసి అనుభవాలు పంచుకోవాలని సూచించారు. గోల్డెన్ జూబ్లీ వేడుకలను యూనియన్లకు అతీతంగా అందరూ కలసి నిర్వహించుకోవాలని ప్రభుత్వ సలహాదారు రమణాచారి అన్నారు. క్లబ్లో పిల్లలు ఆడుకోవడానికి వసతులు, లైబ్ర రీ, మెడికల్ సెంటర్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జర్నలిస్టుల సమస్యలు ఒక్కొక్కటిగా తీరుస్తామని ఐఅండ్పీఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. ప్రెస్క్లబ్ను యూనియన్లకు, ప్రాంతాలకు సంబంధం లేకుండా అందరికీ ఉపయోగపడేలా చేయాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. జర్నలిస్టులు ఉరుకులు పరుగులు పెట్టకుండా సెక్రటేరియట్లో ఏ విభాగంలో సమావేశాలు జరిగినా ఐఅండ్పీఆర్ నుంచి ప్రెస్క్లబ్కు వీడియోలు, ప్రెస్కాపీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ కమిషనర్ విజయ్బాబు సూచించారు. కార్యక్రమంలో దినపత్రికల ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు ఐ.వెంకట్రావ్, కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణ, నగేష్, శ్రీనివాస్, వేణుగోపాల్, శైలేష్రెడ్డి, క్రాంతితో పాటు ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రవి కాంత్రెడ్డి, సెక్రటరీ రాజమౌళిచారి, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బాబూ..ప్రజల మధ్య చిచ్చుపట్టొద్దు
-
బాబూ.. ప్రజలమధ్య చిచ్చు పెట్టొద్దు
బాబుపై గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో చిక్కుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఆ ఊబి నుంచి బయటపడేందుకు రెండు రాష్ట్రాల ప్రజలమధ్య చిచ్చుపెట్టే కుట్రలకు పాల్పడటం దారుణమని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(గ్రాట్) దుయ్యబట్టింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత వ్యవహారాలను ప్రజలతో ముడిపెట్టి పబ్బం గడుపుకోవాలని చూడటం సమంజసం కాదంది. ఆదివారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడిన పలువురు గ్రాట్ నేతలు నేరుగా పేరు ప్రస్తావించకుండా చంద్రబాబు తీరును తప్పుపట్టారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి, గ్రాట్ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వాధినేతలు, ప్రజాప్రతినిధులపై నేరారోపణలొస్తే అవి పూర్తిగా వారి వ్యక్తిగతమైనవేగానీ ప్రజలకు, ప్రభుత్వానికి సంబంధించినవి కానేరవు. అలాంటి నేరారోపణలొస్తే వారిని ఎన్నుకున్న ప్రజలకు ఆపాదించడం, రెచ్చగొట్టడం క్షమార్హం కాద’’ని స్పష్టం చేశారు. ‘‘ఏడాదిగా గుర్తుకురా ని సెక్షన్-8 ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది? ఏ సంఘటన జరిగిందని ఇప్పు డు దానిగురించి మాట్లాడుతున్నారు? మీరు తప్పుడు పనులు చేసి ఊబిలో చిక్కుకుని తప్పించుకునేందుకు మమ్మల్ని(తెలుగు ప్రజలను) అందులోకి లాగుతున్నా రు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం. ఈ విషయంలో ఇక్కడ(తెలంగాణలో) వేలుపెట్టే అధికారం ఆంధ్ర ప్రభుత్వానికి లేదు’’ అని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఐజీ హనుమంతరెడ్డి అన్నారు. ‘‘బాబు తనకున్న మచ్చల్ని ప్రజ లపై రుద్దేయత్నం చేస్తున్నారు. అక్కడి(ఆంధ్ర) ప్రభుత్వం నేరగాళ్లను రక్షించే ప్రయత్నం చేయడం సిగ్గుచేట’’ని సీనియర్ న్యాయవాది జగన్మోహన్రెడ్డి ఆక్షేపించారు. రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలనుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన వారికి అండగా ఉండేందుకు గ్రాట్ ఏర్పాటు చేసినట్టు దాని జ నరల్ సెక్రటరీ రాధాకృష్ణ చెప్పారు. -
బాలల కోసం రోబోటిక్స్ శిబిరం
బాలల దినోత్సవం సందర్భంగా సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్క్లబ్లో బాలల కోసం రోబోటిక్స్ శిబిరం ఏర్పాటవుతోంది. ఎడ్యురోబో సౌజన్యంతో హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగుతుంది. బ్లాక్స్, హెడ్ రోబో, పప్బీ రోబో సహా హ్యూమనాయిడ్ రోబోలపై ఆరు నుంచి పదిహేనేళ్ల లోపు వయసు గల పిల్లలకు ఈ శిక్షణ శిబిరం ఉంటుంది. -
'ఏ రాష్ట్ర విభజన అయినా బాధాకరమే'
-
ఏ రాష్ట్ర విభజన అయినా బాధాకరమే: దిగ్విజయ్
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత రెండు ప్రాంతాలకు లబ్ది చేకూర్చేందుకు తమ పార్టీ కృషి చేసిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. విభజన నిర్ణయం సులువైంది కాదన్నారు. ఏ రాష్ట్ర విభజన అయినా బాధాకరమన్నారు. అయితే ఎవరికీ బాధ కలగకుండా ఆంధ్రప్రదేశ్ విభజన చేశామని చెప్పారు. మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అన్ని పార్టీలు చెప్పాకే తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలిచ్చామని తెలిపారు. సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించామన్నారు. దీంతో సీమాంధ్ర పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్మిర్మాణం, సీమాంధ్ర అభివృద్ధి జరగాలన్నారు. విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతానని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. కాంగ్రెస్ ను వదిలి కిరణ్ కొత్త పార్టీ పెట్టడం బాధ కలిగించిందని చెప్పారు. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారని దిగ్విజయ్ వెల్లడించారు. టీఆర్ఎస్ నుంచి స్పష్టమైన ప్రతిపాదనలు వస్తే పొత్తులపై ఆలోచిస్తామన్నారు.