-
హైబ్రిడ్ ఫండ్స్కు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు గత నెలలో భారీ డిమాండ్ నెలకొంది. దీంతో 2024 జనవరిలో పెట్టుబడులు 37 శాతం జంప్ చేశాయి. రూ. 20,634 కోట్లను తాకాయి. డెట్ ఫండ్స్పై పన్ను చట్టాలలో మార్పులరీత్యా ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశంగా నిలుస్తుండటంతో ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24) తొలి 10 నెలల్లో(ఏప్రిల్–జనవరి) హైబ్రిడ్ ఫండ్స్లో మొత్తం పెట్టుబడులు రూ. 1.21 లక్షల కోట్లకు చేరాయి. అయితే గతేడాది(2022–23) హైబ్రిడ్ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు వెనక్కి మళ్లిన సంగతి తెలిసిందే. హైబ్రిడ్ ఫండ్స్ అంటే హైబ్రిడ్ ఫండ్స్కు చెందిన మ్యూచువల్ ఫండ్ పథకాలు సాధారణంగా ఈక్విటీ, రుణ సెక్యూరిటీలు రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. కొన్ని సందర్భాలలో బంగారం తదితర ఆస్తులలోనూ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తుంటాయి. కాగా.. 2023 ఏప్రిల్ నుంచి హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడిదారులను తమవైపు తిప్పుకున్నాయి. ఇందుకు ప్రధానంగా ఏప్రిల్ నుంచి డెట్ ఫండ్స్ పన్ను చట్టాలలో నెలకొన్న సవరణలు ప్రభావం చూపుతున్నాయి. అంతక్రితం మార్చితో ముగిసిన ఏడాదిలో రూ. 12,372 కోట్ల పెట్టుబడులు తరలిపోవడం గమనార్హం! మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) తాజా గణాంకాల ప్రకారం జనవరిలో హైబ్రిడ్ పథకాలు రూ. 20,637 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు డిసెంబర్లో లభించిన రూ. 15,009 కోట్లతో పోలిస్తే భారీగా ఎగశాయి. ప్రధానంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్కు అత్యధిక పెట్టుబడులు ప్రవహించాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్కు రూ. 10,608 కోట్లు లభించగా.. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్కు రూ. 7,080 కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. గత ఆరు నెలల్లోనూ ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో ఆర్బిట్రేజ్ ఫండ్స్కు 50–70 శాతాన్ని కేటాయించారు. ఇందుకు పన్ను మార్గదర్శకాలలో మార్పులు కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆర్బిట్రేజ్ ఫండ్స్ స్ప్రెడ్ సుమారు 8 శాతానికి చేరడం పెట్టుబడి అవకాశాలకు దారి చూపుతున్నట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ వెల్లడించారు. ఫోలియోలు ప్లస్ జనవరిలో హైబ్రిడ్ ఫోలియోలు 3.36 లక్షలు కొత్త గా జత కలిశాయి. దీంతో మొత్తం హైబ్రిడ్ ఫోలియోల సంఖ్య 1.31 కోట్లకు చేరింది. వెరసి మొత్తం 16.95 కోట్ల ఫోలియోలలో వీటి వాటా 7.7 శాతా న్ని తాకింది. తక్కువ రిస్క్ భరించే ఇన్వెస్టర్లకు హై బ్రిడ్ ఫండ్స్ ఉపయుక్తంగా ఉంటాయి. ఈక్విటీ మా ర్కెట్లలో పెట్టుబడులు ఆటుపోట్లకు లోనయ్యే సంగతి తెలిసిందే. అయితే ఫిక్స్డ్ ఆదాయంలో లభించే స్థిరత్వాన్ని ఇవి కల్పిస్తుండటంతో పెట్టుబడు లను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ ఆదా యం మార్గాలలో ఇన్వెస్ట్ చేయదలచినవారు హైబ్రి డ్ ఫండ్స్వైపు చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
తక్కువ రిస్క్.. స్థిరమైన రాబడికి బెస్ట్ ఆప్షన్..
ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు సర్వ సాధారణం. ఆటుపోట్లతో చలిస్తూ ఉంటాయి. కానీ, దీర్ఘకాలానికి నికర ప్రతిఫలం సానుకూలంగానే ఉంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఈ ఆటుపోట్లను తట్టుకునే సామర్థ్యం అందరు ఇన్వెస్టర్లలోనూ ఉండాలని లేదు. కొందరు రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారికి ఈక్విటీ, డెట్తో కూడిన హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ కూడా ఒకటి. రిస్క్ తక్కువ ఉండాలని కోరుకునే వారు ఈ పథకాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. గడిన ఏడాది కాలంలో ఈ పథకం 9 శాతం రాబడులను అందింంది. మూడేళ్ల కాలంలో రాబడి ఏటా 13.56 శాతంగా ఉంది. ఐదేళ్ల కాలంలో చూసుకుంటే 13 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 14 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. పెట్టుబడుల విధానం ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడులను ఈక్విటీ, డెట్ మధ్య వర్గీకరిస్తాయి. ఈక్విటీ, డెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రెండు మార్కెట్లలోని ప్రయోజనాలను ఇన్వెస్టర్లు సొంతం చేసుకున్నట్టు అవుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్న సమయంలో డెట్ పెట్టుబడులు పోర్ట్ఫోలియోకి స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈక్విటీలు అధిక రాబడులకు, డెట్ పెట్టుబడులు రక్షణకు సాయపడతాయి. పైగా అచ్చం డెట్ పథకాల్లో చేసే దీర్ఘకాల పెట్టుబడులకు ద్రవ్యోల్బణం పరంగా ఉన్న పన్ను ప్రయోజనాన్ని ఇటీవల ఎత్తివేశారు. దీంతో హైబ్రిడ్ ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఈక్విటీకి ఉండే పన్ను మినహాయింపు ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఈ పథకం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 75 శాతం వరకు ఈక్విటీలకు, 25 శాతం వరకు డెట్కు కేటాయిస్తుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపుల్లో మార్పులు చేస్తుంటుంది. ఈక్విటీల్లోనూ 50 శాతం పెట్టుబడులను లార్జ్క్యాప్కే కేటాయిస్తుంది. లార్జ్క్యాప్ కంపెనీల్లో అస్థిరతలు కొంత తక్కువగా ఉంటాయి. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో ర.59,302 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వీటిల్లో ఈక్విటీలకు 76.76 శాతం కేటాయింంది. డెట్ పెట్టుబడులు 20.32 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో 0.91 శాతం ఇన్వెస్ట్ చేయగా, 2 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈక్విటీలకు 75 శాతం మిం పెట్టుబడులు ఉండడాన్ని గమనించొచ్చు. డెట్ కంటే ఈక్విటీలు ఆకర్షణీయంగా మారినప్పుడు, ర్యాలీకి అవకాశం ఉన్నప్పుడు అధికంగా కేటాయింపులు చేయడం ద్వారా రాబడులు పెంచుకునే విధంగా ఫండ్ మేనేజ్మెంట్ బృందం పనిచేస్తుంటుంది. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లోన 85 శాతం మేర ప్రస్తుతం లార్జ్క్యాప్ కంపెనీలోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 14.56 శాతం మేర ఇన్వెస్ట్ చేయగా, స్మాల్క్యాప్ కంపెనీలకు కేటాయింపులు 0.68 శాతంగానే ఉన్నాయి. డెట్లో రక్షణ ఎక్కువగా ఉండే ఎస్వోవీ, ఏఏఏ రేటెడ్ సాధనాల్లోనే అధిక పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో 35 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 24 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. సేవల రంగ కంపెనీలకు 7.45 శాతం, హెల్త్కేర్ కంపెనీలకు 6.23 శాతం, ఆటోమొబైల్ కంపెనీలకు 6.12 శాతం, కమ్యూనికేషన్ కంపెనీలకు 5 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. -
మెరుగైన రాబడులకు హైబ్రీడ్ వ్యూహం..
ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాలు వారెన్ బఫెట్ కావచ్చు.. హోవార్డ్ మార్క్స్ కావచ్చు.. చౌకగా లభిస్తున్న విలువైన అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులు అందుకునేందుకు అధిక అవకాశాలు ఉంటాయని చెబుతారు. ఈ విషయంలో హైబ్రీడ్ ఫండ్స్కి మెరుగైన రికార్డు ఉంది. చౌకగా లభిస్తున్న విలువైన అసెట్స్ను గుర్తించి, ఇన్వెస్ట్ చేయడంలో ఇవి బాగా రాణిస్తున్నాయి. రిసు్కలకు తగ్గట్లుగా హైబ్రీడ్ వ్యూహాలు మంచి రాబడులు అందించగలుగుతున్నాయి. హైబ్రీడ్ ఫండ్స్లో ప్రధానంగా అయిదు రకాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్ధ్యాలను బట్టి వీటిని పరిశీలించవచ్చు. అవేంటంటే.. ► కన్జర్వేటివ్ హైబ్రీడ్: ఈ ఫండ్స్ 10–25 శాతం ఈక్విటీల్లోను, మిగతా 75–90 శాతం మొత్తాన్ని డెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్కు సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్నవారు, డెట్కు ప్రాధాన్యం ఇస్తూనే కాస్త అధిక రాబడుల కోసం ఈక్విటీల్లోనూ కొంత ఇన్వెస్ట్ చేయదల్చుకున్నవారికి ఇవి అనువైనవిగా ఉంటాయి. ► అగ్రెసివ్ హైబ్రీడ్: ఈ కేటగిరీ స్కీముల కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో, మిగతా 20–35 శాతాన్ని డెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అధిక రిస్కు సామర్ధ్యాలు ఉన్న ఇన్వెస్టర్లకు ఇవి అనువైనవి. ► బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్: ఈ ఫండ్స్లో అసెట్స్కు కేటాయింపులు డైనమిక్గా మారుతుంటాయి. కాబట్టి మార్కెట్ పరిస్థితులను బట్టి పోర్ట్ఫోలియోలోని 0–100 శాతం మొత్తాన్ని పూర్తిగా ఈక్విటీల్లోనైనా లేదా డెట్లోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక మోస్తరు రిస్కు సామరŠాధ్యలు ఉన్నవారికి ఇవి అనువైనవి. ► మలీ్ట–అసెట్ అలొకేషన్: ఈ కేటగిరీ ఫండ్లు ఈక్విటీ, డెట్, బంగారం/వెండి, రీట్స్, ఇని్వట్స్ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ అసెట్స్ అన్నీ పరస్పరం సంబంధం లేకుండా వివిధ రకాలైనవి కావడం వల్ల తగు విధమైన డైవర్సిఫికేషన్ వీలవుతుంది. రాబడులూ మెరుగ్గా ఉండగలవు. ఉదాహరణకు గతేడాది బెంచ్మార్క్ రాబడులు 5.8 శాతం స్థాయిలో ఉండగా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మలీ్ట–అసెట్ ఫండ్ గతేడాది 16.8 శాతం రాబడులు ఇచి్చంది. ► ఈక్విటీ సేవింగ్స్: ఈ ఫండ్స్ ఈక్విటీ, తత్సంబంధ సాధనాల్లో 65 శాతం వరకు, డెట్లో 10 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ విభాగంలో చాలా మటుకు ఫండ్స్ డెరివేటివ్స్ను ఉపయోగిస్తాయి. తద్వారా రిస్కును తగ్గించడంపై దృష్టి పెడతాయి. ఇన్వెస్టర్లకు డెట్కన్నా మెరుగ్గా, ఈక్విటీ కన్నా కాస్త తక్కువగా రాబడులను అందించేందుకు ఈ తరహా ఫండ్స్ ప్రయతి్నస్తాయి. రిస్కు సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్న వారు వీటిని పరిశీలించవచ్చు. మలీ్ట–అసెట్ విధానం పాటిస్తాయి కాబట్టి ఓపికగా ఉండే ఇన్వెస్టర్లకు రిసు్కలకు తగినట్లుగా మెరుగైన రాబడులను అందించేందుకు హైబ్రీడ్ ఫండ్స్ ప్రయతి్నస్తాయి. -
రిస్క్ తక్కువ.. రాబడి ఎక్కువ!
ఎక్కువ రిస్క్ వద్దు.. పెట్టుబడిపై రాబడి మెరుగ్గా ఉండాలి? ఈ రెండూ కోరుకునే వారికి హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలం. ఇవి ఈక్విటీ, డెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటితో పోలిస్తే నూరు శాతం తీసుకెళ్లి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ రిస్క్ తగ్గించుకునేందుకు కొంత మొత్తాన్ని డెట్కు కేటాయించే హైబ్రిడ్ పథకాలు అందరికీ అనుకూలమే. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్.. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగం కిందకే వస్తుంది. ఈ పథకం ఈ విభాగంలో మెరుగైన రాబడులను ఇస్తోంది. మధ్య కాలం నుంచి (5 ఏళ్లు) దీర్ఘకాలానికి ఈ పథకంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ రివ్యూ రాబడులు ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 12% రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో చూసుకుంటే వార్షిక రాబడి రేటు 15.56 శాతంగా ఉంటే, ఐదేళ్లలో 12.28 శాతం, ఏడేళ్లలో 13 శాతం, 10 ఏళ్ల కాలంలో 16 శాతం చొప్పున రాబడులను అందించింది. కొంత భాగాన్ని డెట్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది కనుక ఈ పథకం చూపిస్తున్న పనితీరు మెరుగ్గా ఉందని చెప్పుకోవాలి. ఏ కాలంలో చూసినా రాబడి 12 శాతం తగ్గలేదు. పైగా ఈ పథకం 1999లో ఆరంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే పెట్టుబడులపై ఏటా 14 శాతం కంటే ఎక్కువ రాబడి ఇచ్చింది. మెరుగైన పనితీరుకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. కానీ, బ్యాలన్స్డ్ టోటల్ రిటర్న్ ఇండెక్స్, అగ్రెస్సివ్ హైబ్రిడ్స్ ఫండ్స్ విభాగాలు గడిచిన ఏడాది కాలంలో సగటున నష్టాల్లో ఉండడం గమనించాలి. వీటితో పోలిస్తే ఐసీఐసీఐ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ పనితీరు అందనంత ఎత్తులో ఉంది. మిగిలిన కాలాల్లోనూ ఈ పథకమే 2–5 శాతం మేర అధికంగా ప్రతిఫలాన్నిచ్చింది. కనుక రాబడుల పరంగా స్థిరమైన, నమ్మకమైన పనితీరు ఈ పథకానికి ఉంది. పోర్ట్ఫోలియో ఈ పథకం ఈక్విటీల్లో 65 శాతం, డెట్లో 35 శాతం చొప్పున పెట్టుబడులు పెడుతుంటుంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.19,096 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 71.3 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. 28.5 శాతం డెట్ విభాగానికి కేటాయించింది. ఈ కంపెనీ పోర్ట్ఫోలియోలో 57 స్టాక్స్ ఉన్నాయి. టాప్–10 స్టాక్స్లోనే 52 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. డెట్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉండే ఏఏ రేటెడ్ సాధనాల్లో సుమారు 7 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. మిగతా పెట్టుబడులన్నీ అధిక రక్షణ కలిగిన ఎస్వోవీ, ఏఏఏ రేటెడ్ సాధనాల్లోనే పెట్టింది. ఈక్విటీల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగానికి చెందిన కంపెనీలకు మొత్తం పెట్టుబడుల్లో 17.55 శాతం కేటాయించింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీల్లో 13.70 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 9.39 శాతం, నిర్మాణ రంగ కంపెనీల్లో 7.73 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 5.63 శాతం, మైనింగ్ కంపెనీల్లో 5 శాతానికి పైగా పెట్టుబడులు కలిగి ఉంది. -
Mirae Asset Hybrid Equity Fund: రిస్క్కు మించి రాబడులు
ఒమిక్రాన్ వేరియంట్ పై నెలకొన్న అనిశ్చితి, సులభ ద్రవ్య లభ్యత విధానాలకు సెంట్రల్ బ్యాంకులు స్వస్తి చెబుతుండడం ఇవన్నీ 2022లో మార్కెట్ల గమనాన్ని నిర్ధేశించనున్నాయి. అనిశ్చితి సమయాల్లోనూ, తాము చేసే పెట్టుబడులకు రిస్క్ మరీ ఎక్కువగా ఉండకూడదని భావించే వారికి హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఇవి ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ల వ్యాల్యూషన్ల ఆధారంగా రెండు విభాగాల మధ్య కేటాయింపులను మారుస్తుంటాయి. కనుక పోర్ట్ఫోలియో గురించి ఇన్వెస్టర్ ఎక్కువగా ఆందోళన పెట్టుకోవాల్సిన పని ఉండదు. పెట్టుబడుల విధానం.. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీల్లో 65 శాతం నుంచి 80 శాతం మధ్య (మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. దీర్ఘకాలం పాటు (ఐదేళ్లకు పైగా) ఇన్వెస్ట్ చేసే వారికి రిస్క్ ఉన్నా కానీ ఇవి మంచి రాబడులను ఇస్తాయి. 20–35 శాతం పెట్టుబడులను డెట్ సాధనాలకు కేటాయిస్తాయి. ఈ విభాగంలో మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ మంచి పనితీరు చూపిస్తోంది. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్. అచ్చమైన ఈక్విటీ ఫండ్ మాదిరే స్వల్పకాలానికి హైబ్రిడ్ ఫండ్స్లోనూ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇవి కూడా ఎక్కువ భాగాన్ని ఈక్విటీలకే కేటాయిస్తుంటాయి. మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం ఈక్విటీలకు 70–75 శాతం మధ్య పెట్టుబడులను కేటాయిస్తుంటుంది. వృద్ధికి మెరుగైన అవకాశాలు ఉండి, హేతుబ్ధమైన వ్యాల్యూషన్ల వద్ద లభించే స్టాక్స్ను ఎంపిక చేసుకుంటుంది. ఇందుకోసం బోటమ్ అప్ విధానాన్ని అనుసరిస్తుంది. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.6,229 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీలకు 74.9 శాతం పెట్టుబడులను కేటాయించింది. డెట్లో 18 శాతం ఇన్వెస్ట్ చేసి, మిగిలిన ఆస్తులను నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్ఫోలియోలో మొత్తం 62 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్క్యాప్లో 50 శాతం, మిడ్క్యాప్ స్టాక్స్లో 11 శాతం, స్మాల్క్యాప్ స్టాక్స్లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 25 శాతం పెట్టుబడులను కేటాయించింది. ఆ తర్వాత పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, ఎనర్జీ, హెల్త్కేర్, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రాబడులు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగం గడిచిన మూడేళ్లలో సగటున 7.9 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. కానీ ఇదే విభాగంలోని మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ 16 శాతానికి పైనే సగటు వార్షిక రాబడిని (ట్రెయిలింగ్) ఇచ్చింది. ఐదేళ్లలో హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ విభాగం సగటు వార్షిక రాబడి 13.7 శాతం దగ్గర ఉంటే, ఈ పథకంలో రాబడులు 15 శాతానికి పైనే ఉన్నాయి. ఏ కాలంలో చూసినా కానీ ఈ పథకం పనితీరు పరంగా ముందుండడాన్ని గమనించొచ్చు. మార్కెట్ల దిద్దుబాటు సమయంలో నష్టాలను కూడా పరిమితంగా ఉండే విధానాలను అనుసరిస్తుంది. డెట్ విభాగంలో అధిక క్రెడిట్ రేటింగ్ ఉన్న సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, ఏఏఏ రేటింగ్ కలిగిన కార్పొరేట్ బాండ్లను ఎంచుకుంటుంది. డెట్లో రిస్క్ తీసుకోదు. చదవండి: Fund Review: స్థిరత్వంతో కూడిన రాబడులు.. మిరే అస్సెట్ లార్జ్క్యాప్ ఫండ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు చర్యలు చేపట్టాలి
పోస్టల్ బ్యాలెట్కు నేడూ అవకాశం
అభివృద్ధే వైఎస్సార్సీపీ అజెండా
No Headline
రైతుబజార్ను మరింత అభివృద్ధి చేస్తా
ఉదయగిరి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్
టీడీపీ అభ్యర్థి నారాయణను నమ్మొద్దు
బాబుకు ఓట్లేస్తే జన్మభూమి కమిటీలదే పెత్తనం
టీడీపీకి ఓట్లేస్తే సంక్షేమ పథకాలు రద్దే..
ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement