-
సిలిండర్ ఈకేవైసీ @ రూ.150
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గృహజ్యోతి’ పథకంలో రూ.500కే గ్యాస్ సిలిండర్ ప్రారంభానికి ముందే అక్రమార్కులకు కాసులపంట కురిపిస్తోంది. ఈకేవైసీ పేరుతో అందినకాడికి దోచుకుంటున్న విషయం మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై మహిళలు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక శివనగర్ ప్రాంతంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీకి రూ.150 చెల్లించాలని ఏజెన్సీ నిర్వాహకులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినవారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. మరోవైపు ఈకేవైసీతో పాటుగా కచ్చితంగా పైపు తీసుకోవాలనే నిబంధన ఉందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల అధికారిని వివరణ కోరగా.. ఈకేవైసీకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. -
సామాన్యులకు షాక్, భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారునికి మరో షాక్. ఇళ్లలో వినియోగించే 14.2కేజీల సిలిండర్పై రూ.50 ధరని పెంచుతూ చమురు కంపెనీలు ప్రకటించాయి.దీంతో రూ.1055 నుంచి రూ.1105కు చేరిన సిలిండర్ ధరకు చేరింది. ఇక పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, 5కేజీల డొమెస్టిక్ గ్యాస్ ధరను చమురు కంపెనీలు రూ.188కి పెంచాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం రూ.8.50కి తగ్గించాయి. సామాన్యులకు ధరాఘాతం ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉండగా..మరోవైపు పెరిగిపోతున్న ఎల్పీజీ గ్యాస్ ధరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బుధవారం చమురు కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ ధరను రూ.50కి పెంచాయి. దీంతో జులై 2021 నుంచి ఇవాళ్టితో మొత్తం 8సార్లు గ్యాస్ ధరల్ని పెంచినట్లైంది. ఇదిలా ఉండగా, జూలైలో కమర్షియల్ సిలిండర్ల ధరల్ని రెండోసారి తగ్గించింది. అంతకుముందు జూలై 1న 19 కిలోల ఎల్పిజి సిలిండర్ను రూ.198 తగ్గించారు. సెక్యూరిటీ డిపాజిట్ను పెంచేసింది ఈ జూన్ నెలలో కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ గ్యాస్ వినియోగం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జులై 16 నుంచి గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అంటే గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ను 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్పై సెక్యూరిటీ డిపాజిట్ రూ.1450 ఉండగా.. దాని పెంపుతో కొత్తసింగిల్ సిలిండర్ ఇండేన్ కనెక్షన్ కోరుకునే వారు రూ.2,500కు పైనే చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక రూ. 800గా ఉన్న 5 కేజీల సిలిండర్ డిపాజిట్ మొత్తం రూ. 1150కు చేరింది. దీంతోపాటు రెగ్యులేటర్కు గతంలోని 150 రూపాయలతో పోలిస్తే ఇపుడు రూ. 250 చెల్లించాలి. కాగా, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తుతోపాటు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. -
వినియోగదారులతో గ్యాస్ ఏజెన్సీల చెలగాటం
సాక్షి,సిటీబ్యూరో : నగరంలోని ముషీరాబాద్ నివాసం ఉండే శ్రీనివాస్కు సికింద్రాబాద్లోని ఒక గ్యాస్ ఏజెన్సీలో ఎల్పీజీ కనెక్షన్ ఉంది. గత పదేళ్లుగా రీఫిల్ బుక్ చేయగానే సంబంధిత గ్యాస్ ఏజెన్సీ ద్వారా డోర్ డెలివరీ జరుగుతూ వస్తోంది. గత ఏడాది క్రితం శ్రీనివాస్ కుటుంబం ముషీరాబాద్ నుంచి సికింద్రాబాద్కు నివాసం మారింది. అడ్రస్ మార్పు చేసుకునేందుకు వీలు పడక ఎప్పటి మాదిరిగా రీఫిల్ బుక్ చేసుకొని పాత అడ్రస్కు డెలివరీ జరిగిన సిలిండర్ను తీసుకుంటూ వస్తున్నారు. ఈ ప్రక్రియ కొంత ఇబ్బంది కరంగా ఉండటంతో కొత్త అడ్రస్కు గ్యాస్ కనెక్షన్ మార్చుకోవాలని భావించారు. సికింద్రాబాద్లోని గ్యాస్ ఏజెన్సీకి అడ్రస్ మార్పు కోసం సంప్రదించారు. అక్కడ కంప్యూటర్లో పరిశీలించి మీ కనెక్షన్ ఇక్కడ లేదని... ముషీరాబాద్ లోని ఏజెన్సీకి మార్పు చేశామని చెప్పారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఇతర ఏజెన్సీకి ఏలా మార్చుతారని నిలదీస్తే.. తమకు సంబంధం లేదని ఆయిల్ కంపెనీ అడ్రస్ ఆధారంగా కనెక్షన్ బదిలీ చేసిందని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న నివాసానికి సికింద్రాబాద్ ఏజెన్సీ దగ్గర ని పేర్కొనగా, ముషీరాబాద్ ఏజెన్సీకి వెళ్లి అడ్రస్ బదిలీ చేసుకోవాలన్నారు. గత్యంతరం లేక గ్యాస్ కనెక్షన్ కాగితాలు, చిరునామా గుర్తింపు తదితరాలు తీసుకొని వెళ్లి ముషీరాబాద్ ఏజెన్సీ నుంచి తిరిగి సికింద్రాబాద్ ఏజెన్సీకి అడ్రస్ మార్పు కోవడంతో కనెక్షన్ (వినియోగదారుడి) నెంబర్ కాస్త మారింది. ఇదీ ఒక శ్రీనివాస్ ఎదుర్కొన సమస్య కాదు... నగరంలో వేలాది మంది వంట గ్యాస్ వినియోగదారుల సమస్య. వినియోగదారులతో చెలగాటం గృహోపయోగ వంట గ్యాస్ వినియోగదారులతో ఆయిల్ కంపెనీలు చెలగాటమాడుతున్నాయి. వినియోగదారులకు కనీసం సమాచారం లేకుండానే ఏజెన్సీలను మార్చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నా ఫలితం లేకుండా పోతుంది. తిరిగి కనెక్షన్లను బదిలీ కోసం నానా తిప్పలు పడాల్సిన వస్తోంది. అడ్రస్ మార్పు కాస్త ఏళ్ల తరబడి ఉన్న గ్యాస్ కనెక్షన్ నంబర్ పై ప్రభావం చూపుతోంది. వాస్తవంగా నగరంలో సొంత నివాసాల కంటే అద్దె గృహాల్లో ఉంటున్న గ్యాస్ వినియోగదారుల సంఖ్య అధికంగా ఉంటుంది. అద్దె పెంపు తదితర కారణాలతో రెండేళ్లు... మూడేళ్లకు ఒక సారి నివాసాలను మార్చుతుంటారు. ప్రతి సారి గ్యాస్ కనెక్షన్ల అడ్రస్ మార్పిడి చేయకుండా పాత అడ్రస్ లేదా డెలివరీ బాయ్స్తో పరిచయాలతో రీఫిల్ తీసుకుంటుండం సర్వసాధారణంగా మారింది. ఆయితే ఆయిల్ కంపెనీలు మాత్రం అడ్రస్ ఆధారంగా గ్యాస్ కనెక్షన్లను సమీప ఏజెన్సీలకు బదిలీ చేస్తుండటం వినియోగదారులకు శాపంగా తయారైంది. 40 వేల కనెక్షన్లు దాటితే.... నగరంలోని గ్యాస్ ఏజెన్సీలకు 40 వేల కనెక్షన్ల వరకు పరిమితి ఉంది. ఆ సంఖ్య దాటితే ఆయిల్ కంపెనీలు మాస్ క్యాంపియన్లో అడ్రస్ ఆధారంగా కొన్ని కనెక్షన్లను సంబంధిత ఏరియాలకు బదిలీచేసి చేస్తుంటాయి. ఒక ఏజెన్సీకి కేవలం 24 వేల రీఫిల్ సామర్థ్యం వరకు పరిమితం మాత్రమే ఉండటంతో 40 వేల కనెక్షన్లు దాటకుండా ఎప్పటి కప్పుడు సంబంధిత ఆయిల్ కంపెనీ పర్యవేక్షిస్తోంది. ఒక ఏజెన్సీపై అదనపు భారం లేకపోవడంతోపాటు సేవలందించేందుకు మరింత వెసులుబాటు కోసం వినియోగదారులకు దగ్గర లోకి కనెక్షన్ బదిలీ చేస్తోంది. ఆయిల్ కంపెనీల నిబంధన ప్రకారం ఒక ఏజెన్సీ నుంచి మరొక ఏజెన్సీకి కనెక్షన్ బదిలీ జరిగినప్పుడు సదరు వినియోగదారులకు సెల్ఫోన్ ద్వారా సమచారం అందించాల్సి ఉంటుంది. గ్యాస్ బుకింగ్ సమయంలో సైతం ఏజెన్సీ మారిందన్న సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. కానీ, ఇదేమి లేకుండానే ఆయిల్ కంపెనీలు ఇష్టానుసారం ఏజెన్సీలను మార్చి వినియోగదారులకు తిప్పలకు గురిచేస్తోంది. కనెక్షన్లు ఇలా.. మహా నగర పరిధిలో మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన 125 డిస్ట్రిబ్యూటర్లకు పైగా ఉన్నారు. వారి పరిధిలో సుమారు 28.21లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి రోజు డిమాండ్ను బట్టి ఆయిల్ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు రీఫిల్ స్టాక్ సరఫరా అవుతుంది. డిస్ట్రిబ్యూటర్లు అన్లైన్ బుకింగ్ను బట్టి వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తుంటారు. ప్రధానంగా ఐఓసీ కి సంబందించిన 11.94 లక్షలు, బీపీసీఎల్కు సంబంధించిన 4.96 లక్షలు,హెచ్పీసిఎల్కు సంబధించిన 11.31 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. పరిమితికి మించి ఉంటే కనెక్షన్ల బదిలీ గ్యాస్ ఏజెన్సీలకు కనెక్షన్లు, రీఫిల్పై పరిమితి ఉంటుంది. పరిమితికి మించితే ఆయిల్ కంపెనీలు వినియోగదారుడి ఆడ్రస్ ఆధారంగా సమీపంలోని గ్యాస్ ఏజెన్సీలకు కనెక్షన్లను బదిలీ చేస్తారు. బదిలీ జరిగిన సమయంలో వినియోగదారుల సెల్ఫోన్లకు తప్పని సరిగా సమాచారం వస్తుంది. కేవలం ఏజెన్సీలపై అదనపు భారం లేకుండా వినియోగదారులకు మరింత వెసులు బాటు కల్పించేందుకు ఎల్పీజీ కనెక్షన్ల బదిలీ ప్రక్రియ. – అశోక్ కుమార్, అధ్యక్షుడు, గ్రేటర్ హైదరాబాద్ ఎల్పీజీ గ్యాస్ డీలర్ల సంఘం. -
‘ఆన్లైన్’ పేరుతో మోసం
విజయనగరం, నెల్లిమర్ల రూరల్: నేను నెల్లిమర్ల గ్యాస్ ఏజెన్సీ నుంచి వచ్చాను.. మీ ఇంటికి ఇప్పటివరకు గ్యాస్ నేరుగా తెచ్చి డెలివరీ చేసేవారు.. వచ్చే నెల నుంచి ఆ విధానం మారుతుంది. మీ పేరిట గ్యాస్ ఆన్లైన్ చేసుకోవాలి. దీనికి ఒక్కో వినియోగదారుడు రూ.50 చెల్లించాలి. చివరి తేదీ కూడా అయిపోతోంది.. ఆన్లైన్ చేయకపోతే మీ ఇంటికి గ్యాస్ మరి రాదు.. అంటూ గ్యాస్ వినియోగదారులకు మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేశాడు కొత్తపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు.. గ్యాస్ ఆన్లైన్ నమోదు పేరిట మండలంలో వల్లూరు గ్రామంలో గురువారం సాయంత్రం కాసేపు హల్చల్ చేశాడు. ఈ మాయగాడి మాటలు విన్న పలువురు రూ.50 చొప్పున చెల్లించారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు గ్యాస్ ఏజెన్సీ ఫోన్ నంబర్ ఇవ్వమని కోరగా చెప్పలేక తడబడ్డాడు. అనంతరం గ్యాస్ ఆఫీస్కు ఫోన్ చేసి వివరాలు కోరగా తాము ఎవ్వరినీ పంపించలేదని స్పష్టం చేయడంతో గ్రామస్తులు నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడు గతంలో నెల్లిమర్ల గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో కొన్నాళ్ల కిందట తీసేశారు. ఈ అనుభవంతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు భోగట్టా. గతంలో గుర్ల, చీపురపల్లి మండలాల్లో కూడా ఇదే తరహా మోసానికి పాల్పడినట్లు తెలుస్తుంది. నెల్లిమర్ల ఎస్సై నారాయణరావును వివరణ కోరగా వల్లూరు గ్రామంలో గ్యాస్ ఏజెన్సీ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు మాకు సమాచారం అందిందని మోసానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని విచారిస్తామని తెలిపారు. మోసగాళ్లను నమ్మవద్దు.... గ్యాస్ ఏజెన్సీ పేరిట తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దు. డెలివరీ బాయ్ వచ్చి గ్యాస్ ఇచ్చి డబ్బులు వసూలు చేసాడు. వాళ్లు ఎక్కువ డబ్బులు అడిగినా మాకు ఫిర్యాదు చేయండి. – గోవింద్, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహుకుడు -
జనాన్ని కొట్టి.. గ్యాస్ ఏజెన్సీలకు కట్టబెట్టి
విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల కంటే వ్యాపారుల పైనే మక్కువ పెరిగింది. ప్రజలపై భారం పడుతున్నా పట్టించుకోకుండా గ్యాస్ ఏజెన్సీల డీలర్లకు ఊరట కలిగించే విధంగా రవాణా చార్జీలు పెంచడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఒకేసారి వంతుకు వంతు పెంచడం గమనార్హం. దీంతో గ్యాస్ వినియోగదారులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల క్రియాశీలక పాత్ర.. వంట గ్యాస్ సిలెండర్లను చమురు సంస్థలు వినియోగదారులకు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో గ్యాస్ ఏజెన్సీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. అవి చమురు సంస్థలు నుంచి తెచ్చి వినియోగదారులకు ఇస్తున్నాయి. మొన్నటివరకు ఉన్న నిబంధనలు ఏజెన్సీలు తమ గోదాం నుంచి ఐదు కిలోమీటర్లు లోపల సరఫరా చేసేందుకు ఎలాంటి రుసుము వసూలు చేయరాదు. ఆరు కిలోమీటర్ల నుంచి 15 కిలో మీటర్ల మధ్య వినియోగదారుడు నుంచి రూ.10 వసూలు చేయొచ్చు. 15 కిలోమీటర్లు దాటి ఎంత దూరం ఉన్నా రూ.15 వసూలు చేయాలి. రవాణా చార్జీలు నిర్ణయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ఒకేసారి డబుల్.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుండి గ్యాస్ సిలెండర్ల రవాణా చార్జీలను పెంచేసింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ కమిషనర్ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణ యం ప్రకారం ఐదు కిలోమీటర్ల లోపల సరఫరా చేసేందుకు ఎలాంటి రుసుం వసూలు చేయరా దు. ఆరు కిలోమీటర్ల నుంచి 15 కిలో మీటర్లు మధ్య వినియోగదారుడు నుంచి ఇంతకుముందు వసూలు చేసిన రూ.10కి బదులు రూ.20 వసూలు చేయాలి. 15 కిలోమీటర్లు దాటి ఎంత దూరమైనా రూ.15 బదులు రూ.30 వసూలు చేయాలి. అంటే రెండు ఫేజుల్లో వసూలు చేసే రవాణా చార్జీ లను రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసిందన్నమాట. వినియోగదారులపై భారం.. గ్యాస్ ఏజెన్సీలకు 6,15 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరంతా నెలకు దాదాపు 3.20 లక్షలు గ్యాస్ బండలు వినియోగిస్తున్నారు. ఇందులో ఐదు కిలోమీటర్ల దూరం లోపల రవాణా చేసే సిలెండర్లు 80 వేలు వరకు ఉంటాయని అంచనా. 6 నుంచి 15 కిలోమీటర్ల మధ్య దూరం రవాణా చేసే సిలెండర్లు సుమారు 1.60 లక్షలు వరకు ఉంటాయి. 15 కిలోమీటర్ల దూరం దాటి రవాణా అవుతున్న సిలెండర్ల 80 వేల వరకు ఉంటాయని ఒక లెక్క. ఈ విధంగా చూస్తే 1.60 లక్షల వినియోగదారులపై నెలకు పెద్ద మొత్తంలో రూ.32 లక్షలు భారం పడినట్లే. మరో 80 వేల మంది వినియోగదారులపై నెలకు రూ.24 లక్షలు భారం పడుతుంది. వెరసి జిల్లాలో మొత్తం వినియోగదారులపై రూ.56 లక్షలు భారం పడినట్లువుతుంది. అయితే ఇందులో రూ.28 లక్షలు గతంలో భరిస్తున్నది కావడంతో కొత్తగా భారం పడినది మాత్రం రూ.28 లక్షలు. ఈ మొత్తం గ్యాస్ ఏజెన్సీలకు అదనంగా లాభం తెచ్చి పెడుతుంది. ప్రభుత్వం అకస్మాత్తుగా గ్యాస్ ఏజెన్సీలకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్ చార్జీలు పెరగడంతో ఏజెన్సీలు రవాణా చార్జీలు పెంచాలని కోరి ఉండొచ్చు. అయితే గతం కంటే చమురు ధరలు డబుల్ కాలేదు. అలాంటప్పుడు రవాణా చార్జీలు పెంచడం ఏంటని వినియోగదారులు మండిపడుతున్నారు. వినియోగదారులకు నష్టం.. గ్యాస్ రవాణా చార్జీలు పెంచడం దారుణం. ఒకేసారి రెండింతలు చేయడం మరీ దారుణం. ఇప్పటికే గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రవాణా చార్జీలు కొంతైనా తగ్గిస్తే వినియోగదారులకు మేలు జరుగుతుంది. కానీ పెంచి గ్యాస్ ఏజెన్సీలు పక్షాన ప్రభుత్వం నిలవడం బాధ కలిగిస్తుంది.– ఎస్.జగదీశ్వరి, సిరిపురం, గంట్యా
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement