breaking news
ETPL
-
ఫ్రాంచైజీ యజమానిగా క్లాసెన్
సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆటకు వీడ్కోలు పలకకుండానే బిజినెస్మ్యాన్గా మారాడు. తన దేశానికే చెందిన స్టార్ క్రికెటర్లు ఫాఫ్ డుప్లెసిస్, జాంటీ రోడ్స్తో కలిసి ఓ క్రికెట్ ఫ్రాంచైజీకి ఓనరయ్యాడు. ఈ సౌతాఫ్రికా త్రయం యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో రోటర్డామ్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు.ఈ లీగ్ తొలి ఎడిషన్ (ETPL 2026) ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది. ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డుల మద్దతుతో ప్రారంభమవుతున్న ఈ లీగ్లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఆమ్స్టర్డామ్, బెల్ఫాస్ట్, ఎడిన్బర్గ్, డబ్లిన్, రోటర్డామ్, గ్లాస్గో నగరాలకు ప్రాతినిధ్యం వహించే జట్లు ఈ లీగ్లో పోటీపడనున్నాయి.యజమాని.. కెప్టెన్ కూడా..!రోటర్డామ్ జట్టుకు డుప్లెసిస్ కేవలం సహ యజమాని మాత్రమే కాదు, జట్టు కెప్టెన్గా కూడా వ్యవహరించనున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో యాజమాన్యం, నాయకత్వం రెండూ ఒకేసారి చేపట్టడం అరుదైన విషయం. అనేక టీ20 లీగ్లలో కెప్టెన్గా తనదైన ముద్ర వేసిన డుప్లెసిస్, ఇప్పుడు అదే అనుభవాన్ని తన సొంత జట్టుకు ఉపయోగించనున్నాడు. అయితే సహ యజమానిగా, కెప్టెన్గా ఉండటానికి రూల్స్ ఒప్పుకుంటాయో లేదో చూడాలి.భీకర ఫామ్లో క్లాసెన్ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో క్లాసెన్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 59.14 సగటున, 157.41 స్ట్రయిక్రేట్తో 4 అర్ద సెంచరీల సాయంతో 414 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్పై మెరుపు అర్ద శతకం చేసి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు.జాంటీ రోడ్స్ విషయానికొస్తే.. ఈ దిగ్గజం ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా ఉన్నాడు. అలాగే పలు టీ20 లీగ్ల్లో కోచింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. -
ఫ్రాంఛైజీ యజమానిగా గ్లెన్ మాక్స్వెల్
టీ20 క్రికెట్లో పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్న దేశవాళీ లీగ్లలో మరో కొత్త టోర్నీ చేరింది. ‘యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్’ (ఈటీపీఎల్) పేరుతో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీ నిర్వహణ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ‘రూల్స్ గ్లోబల్’ అనే సంస్థతో కలిసి ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఈ లీగ్ను నిర్వహిస్తుంది.అభిషేక్ బచ్చన్ సైతంప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్తో పాటు పలువురు ఇతర వ్యాపారవేత్తలు ‘రూల్స్ గ్లోబల్’లో భాగస్వాములుగా ఉన్నారు. లీగ్కు సంబంధించి ఇప్పటికే మూడు జట్ల కొనుగోలు పూర్తయింది. దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా ఆమ్స్టర్డామ్ ఫ్రాంచైజీకి యజమాని కాగా... మూడు ఒలింపిక్ పతకాలు, రెండుసార్లు ప్రపంచకప్లు గెలిచిన జట్లలో సభ్యుడైన ఆ్రస్టేలియా హాకీ దిగ్గజం జేమీ డ్వేయర్ కూడా స్టీవ్వాతో పాటు సహ యజమానిగా ఈ జట్టుతో చేతులు కలపడం విశేషం.యజమానిగా గ్లెన్ మ్యాక్స్వెల్ఇక ఎడిన్బర్గ్ టీమ్ను న్యూజిలాండ్ మాజీ క్రికెటర్లు నాథన్ మెకల్లమ్, కైల్ మిల్స్ కలిసి సొంతం చేసుకున్నారు. బెల్ఫాస్ట్ టీమ్కు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో లీగ్ జరుగుతుంది. ఇటీవలి కాలంలో యూరోప్లో కూడా క్రికెట్ బాగా ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో ఈటీపీఎల్ విజయవంతం అవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డు


