-
కన్పించని ముద్ర
అనంతపురం సెంట్రల్ : రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా జేవీ రాముడు శనివారం పదవీ విరమణ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రెండేళ్లకు పైగా పనిచేశారు. ఈయన స్వస్థలం జిల్లాలోని తాడిమర్రి మండలం నార్సింపల్లి కావడం గమనార్హం. డీజీపీగా రాముడు పనిచేసిన కాలంలో జిల్లాపై ఆయన ముద్ర ఏమాత్రమూ కనిపించలేదు. స్వగ్రామమైన నార్సింపల్లిని మాత్రం దత్తతకు తీసుకొని కొంతమేర అభివృద్ధి చేశారు. ఈ విషయాన్ని మినహాయిస్తే.. ‘అనంత’పై ఆయన తనదైన ముద్ర వేయలేకపోయారు. శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. డీజీపీగా జేవీ రాముడు జిల్లా పర్యటనలో ఉన్న సందర్భాల్లోనూ ప్రతిపక్ష పార్టీ నాయకులు, సానుభూతిపరులపై దాడులు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోకి పిలిపించుకొని కిష్టిపాడు సింగిల్విండో ప్రెసిడెంట్ విజయభాస్కర్రెడ్డి, వైఎస్సార్సీపీ నేత, రాప్తాడు మండల కన్వీనర్ ప్రసన్నాయపల్లి ప్రసాద్రెడ్డిని హతమార్చారు. ఈ రెండు ఘటనలు డీజీపీ జిల్లా పర్యటనకు వస్తున్న సమయంలో అటూ ఇటుగా జరగడం గమనార్హం. వీరితో పాటు జిల్లాలో దాదాపు తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరులను హతమార్చారు. అధికారపార్టీ దౌర్జాన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దాడుల్లో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా అధికార పార్టీ నేతలు వదల్లేదు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడి జరిగితే ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాదులు జిల్లాలో మకాం వేసిన ఘటన కూడా ఆయన హయాంలోనే చోటు చేసుకుంది. ఉగ్రవాదులు అనంతపురం ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలోని ఓ లాడ్జీలో వారం రోజుల పాటు మకాంవేసి.. మారణాయుధాలు కొనుగోలు చేయడానికి వ్యూహం రచించారు. ఈ విషయం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో బయటపడే వరకూ జిల్లా పోలీసులు కనుగొనలేకపోయారు. -
కొత్త పోలీస్ బాస్గా సాంబశివరావు బాధ్యతలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కొత్త పోలీస్ బాస్గా సాంబశివరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా ఇవాళ పదవీ విరమణ చేసిన రాముడు... సాంబశివరావుకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న సాంబశివరావును ప్రభుత్వం ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు సాంబశివరావుకు అభినందనలు తెలిపారు. పోలీసుల్ని వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని డీజీపీ తెలిపారు. టెక్నాలజీ సాయంతో ప్రజలకు సేవ చేసేలా పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తానన్నారు. గోదావరి పుష్కరాల్లో లోపాల్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణా పుష్కరాలను సమర్ధవంతంగా నిర్వహిస్తామని డీజీపీ సాంబశివరావు హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారుడు సంతృప్తికరంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూస్తామని సాంబశివరావు తెలిపారు. -
ఏపీ ఇంఛార్జ్ డీజీపీగా నండూరి సాంబశివరావు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జ్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా నండూరి సాంబశివరావు నియమతులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్సార్టీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రస్తుత డీజీపీ జేవీ రాముడు ఈనెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సాంబశివరావును ఇంఛార్జ్ డీజీపీగా ప్రభుత్వం నియమించింది. నండూరి సాంబశివరావు 1984 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. -
డీజీపీ పర్యటన షెడ్యూల్ ఇదీ..
ఒంగోలు క్రైం: రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకట రాముడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. హెలికాప్టర్లో ఉదయం 9.15 గంటలకు గుడ్లూరు మండలం చేవూరులోని రామదూత ఆశ్రమంలోని హెలిపాడ్లో ల్యాండ్ అవుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా రామాయపట్నం చేరుకుంటారు. అక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ను పరిశీలిస్తారు. సిబ్బందితో మాట్లాడతారు. అక్కడ నుంచి చేవూరు ఆశ్రమంలోని హెలిపాyŠ కు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో 10.30కు బయలుదేరి 10.35 గంటలకు ఒంగోలుకు చేరుకుంటారు. ఒంగోలు నుంచి రోడ్డు మార్గం ద్వారా కొత్తపట్నం 11.15కు చేరుకుంటారు. అక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ను ప్రారంభిస్తారు. తీరాన్ని పరిశీలిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి 11.40కు జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. -
పోలీసు విభజన సా..గుతోంది
- ఏపీ పోలీస్ అకాడమీ ఇంకా తెలంగాణలోనే ఉంది - వార్షిక క్రైం నివేదిక వివరాలు వెల్లడించిన డీజీపీ జె.వి.రాముడు సాక్షి, విజయవాడ: రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా శాఖలపరంగా రెండు రాష్ట్రాల మధ్య పూర్తి స్థాయిలో విభజన జరగలేదని రాష్ట్ర డీజీపీ జె.వి. రాముడు అన్నారు. 40ఏళ్లపాటు శ్రమించి అభివృద్ధి చేసిన పోలీస్ అకాడమి, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ తదితరాలన్నీ ఇప్పటికీ హైదరాబాద్లోనే ఉన్నాయని.. వాటిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వార్షిక క్రైం నివేదికను వెల్లడిస్తూ శాఖాపరంగా భవిష్యత్ సవాళ్లు.. వివిధ కేసుల్లో సాధించిన పురోగతి.. ఇతరత్రా అంశాలపై ఆయన మాట్లాడారు. శాఖాపరంగా రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, పంచాయితీలు పరిష్కారం కాగానే శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ పోలీస్ కేంద్రాలు అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీఎస్పీ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఇతర టెక్నికల్ వింగ్లలో సంఖ్యాపరంగా సిబ్బంది విభజన జరగాల్సి ఉందన్నారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ను తాత్కాలికంగా అనంతపురంలో ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఏడాది నిర్వహించే కృష్ణా పుష్కరాలకు 33 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు డీజీపీ రాముడు చెప్పారు. తుని విధ్వంసం ఘటనలో కచ్చితంగా అరెస్టులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. దర్యాప్తు ఇంకా జరుగుతోందని, ఇప్పటికే కొంత మందిని అరెస్టు చేశారని వివరించారు. సోమవారం ఆరుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, ఇప్పటి వరకు 26 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement