ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావుతో ఏపీ డీజీపీ రాముడు మంగళవారం సమావేశమయ్యారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావుతో ఏపీ డీజీపీ రాముడు మంగళవారం సమావేశమయ్యారు. ఈ నెల 30న అసెంబ్లీ భద్రతపై పోలీసు ఉన్నతాధికారులతో ఏపీ స్పీకర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదేరోజు ఉదయం 8.30 గంటలకు ఏపీ బీఏసీ భేటీ కానుంది.
ఈ నెల 31 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి, అసెంబ్లీ సమస్యల ఏజెండాపై బీఏసీలో చర్చించనున్నారు.