-
కేజ్రీవాల్దే పైచేయి
ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి ఉండాల్సిన అధికారాలపై ఎనిమిదేళ్లుగా సాగిస్తున్న పోరులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు విజయం సాధించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో అక్కడి గవర్నర్ వ్యవహారశైలిని తప్పుబడుతూ తీర్పునిచ్చిన గురువారం రోజే ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కీ(ఎల్జీ), అక్కడి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వానికీ మధ్య సాగుతున్న వివాదంపై కూడా నిర్ణయాత్మక తీర్పు వెలువడింది. ఈ రెండు తీర్పులూ రెండు వేర్వేరు రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చినా... ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రాధాన్యతనూ, ఎన్నికైన ప్రభుత్వాల విషయంలో వ్యవహరించాల్సిన తీరుతెన్నులనూ ఆ తీర్పులు నిర్దేశించాయి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికెదురైన సమస్య ప్రత్యేక మైనది. అధికారుల బదిలీకి కూడా ప్రభుత్వానికి అధికారం లేదన్నట్టు అక్కడి ఎల్జీ వీకే సక్సేనా ప్రవర్తించారు. ఆ వివాదం పైనే ప్రస్తుత తీర్పు వెలువడింది. పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతలు, భూసంబంధ అంశాల్లో మినహా ఇతర అధికారాల విషయంలో ఎల్జీకి అజమాయిషీ ఉండదనీ, ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్ సలహాలకు ఆయన లోబడి ఉండాల్సిందేననీ ఈ ఏకగ్రీవ తీర్పు స్పష్టం చేసింది. ఆ వెంటనే కేజ్రీవాల్ సర్వీసు వ్యవహారాల కార్యదర్శిని బదిలీ చేశారు. రాగల రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని ఆయన సంకేతాలిచ్చారు. వాస్తవానికి 2018లో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పు ఇలాంటి సమస్యలకు ముగింపు పలికిందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత ఆప్ ప్రభుత్వం కొంతమంది అధికారులకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వుల అమలు సాధ్యపడదని సర్వీసు వ్యవహారాల కార్యదర్శి చెప్పటంతో సమస్య మొదటికొచ్చింది. దానిపై ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేయటం, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులిద్దరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేయటంతో రాజ్యాంగ ధర్మాసనం ముందుకు ఈ కేసు వెళ్లింది. ఈలోగా 2021లో కేంద్రం 1991నాటి ఢిల్లీ ప్రభుత్వ రాజధాని ప్రాంత చట్టానికి సవరణలు తీసుకురావటం ద్వారా పాలనాపరమైన నిర్ణయాలపై ఎల్జీ ఆధిపత్యాన్ని ప్రతిష్టించింది. 2018 నాటి సుప్రీం తీర్పును వమ్ము చేయటమే ఈ సవరణ ఆంతర్యమని ఎవరికైనా అర్థమవుతుంది. అయితే ఢిల్లీ కూడా ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల వంటి దేనన్న కేంద్రం వాదనతో 2018 లోనూ, ఇప్పుడూ కూడా సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. 1991లో 69వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేరిన 239 ఏఏ అధికరణ ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలకు భిన్నంగా ఢిల్లీ సర్కారుకు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చిందని గుర్తుచేసింది. 2018 తీర్పులో ప్రస్తావించిన కేంద్ర పరిధిలోని మూడు అంశాల్లో సర్వీసు వ్యవహారాల గురించి ప్రత్యేకించి చెప్పకపోయినా అది కూడా అంతర్లీనంగా ఉన్నట్టేనని కేంద్రం వాదిస్తూ వస్తోంది. అయితే 239 ఏఏ అధికరణంలోని క్లాజు (3)(ఏ) ఢిల్లీ సర్కారుకు విస్తృతాధికారాలిస్తోందని తాజా తీర్పు స్పష్టం చేసింది. దేశ రాజధాని కావటం వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఉండే అధికారాలు పరిమితమైనవే. పూర్తి ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాల అధికారాలే కుంచించుకుపోతున్న వర్తమానంలో, పరిమితుల చట్రంలో ఉండే ఆప్ ప్రభుత్వం తనదైన విధానాలను అమలు చేయటం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. ఢిల్లీ ప్రభుత్వానికి తగిన అధికారాలివ్వటంలో పార్టీలతో సంబంధం లేకుండా కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు అలసత్వాన్నే ప్రదర్శిస్తూ వచ్చాయి. 1993లో ఢిల్లీలో అసెంబ్లీని పునరుద్ధరించిన నాటి నుంచీ ఈ డిమాండు వినిపిస్తూనే ఉంది. చిత్రమేమంటే కేంద్రంలో ఇతర ప్రభుత్వాలున్నప్పటి మాట అటుంచి వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ఏలుబడిలోగానీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ఏలుబడిలోగానీ ఢిల్లీలో తమ పార్టీ సర్కార్లే నడుస్తున్నా ఏ నాయకత్వమూ ఢిల్లీ సర్కారుకు తగిన అధికారాలివ్వటానికి ముందుకు రాలేదు. ఢిల్లీలో బీజేపీ నేతలు మదన్లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్లు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్కు చెందిన షీలా దీక్షిత్ దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నా తమను నామమాత్రావశిష్టం చేయటమేమిటన్నదే వీరందరి ప్రశ్న. ప్రజల ద్వారా ఎన్ని కైన ఢిల్లీ దేశ రాజధాని ప్రాంత(ఎన్సీటీడీ) ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా చేయాలని,అందుకోసం దానికి తగిన అధికారాలను కట్టబెట్టాలని దేశ కార్యనిర్వాహక వ్యవస్థ భావించలే దంటే... ఆ విషయంలో అయిదేళ్ల వ్యవధిలో రెండుసార్లు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోక తప్ప లేదంటే పరిస్థితెలా ఉందో అర్థమవుతుంది. తాజా తీర్పు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానిదే పైచేయి తప్ప ఎల్జీది కాదని తేల్చింది. మూడు అంశాలు మినహా ఇతర విషయాల్లో ఢిల్లీ సర్కారుకు వేరే రాష్ట్రాలతో సమానంగా అధికారాలుంటాయని ఈ తీర్పు స్పష్టం చేసింది గనుక రెండు పక్షాలూ అనవసర వివాదాలకు స్వస్తి పలకాలి. కేజ్రీ వాల్ స్థానంలో ఒక రాజకీయ నేత సీఎంగా ఉంటే ఇంత పట్టుదలగా పోరాడే వారు కాదేమో! ఆ సంగతలావుంచి ఆప్ సర్కారు చిన్నచూపు చూస్తున్నదని అక్కడ పనిచేసే ఐఏఎస్లు ఆరోపిస్తుంటారు. ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు తమపై దౌర్జన్యం చేశారంటూ 2018లో సమ్మెకు కూడా దిగారు. రోజువారీ వ్యవహారాల్లో పట్టువిడుపులుండాలనీ, అధికారులతో సామరస్యంగా పోవాలనీ కేజ్రీవాల్ గుర్తించటం అవసరం. రాజకీయ నాయకత్వానికీ, పాలనా వ్యవస్థకూ మధ్య సామరస్యత ఉన్నప్పుడే ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించటం సాధ్యపడుతుందని ఆయన గ్రహించాలి. ఇకపై ఎల్జీ కూడా తన పరిధులకు లోబడి వ్యవహరించటం అవసరమని తెలుసుకోవాలి. -
నా భార్య సైతం ఇన్ని ‘లవ్ లెటర్స్’ రాయలేదు: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ వివిధ అంశాలపై లేఖలు రాయటాన్ని సూచిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడిచిన ఆరు నెలల్లో గవర్నర్ రాసినన్ని లవ్ లెటర్లు.. తన భార్య కూడా రాయలేదంటూ ట్వీట్ చేశారు. తనను తిట్టటం, లేఖలు రాయటానికి కాస్త విరామం ఇచ్చి కాస్త సేదతీరండీ అంటూ సూచించారు. ‘ప్రతి రోజు ఎల్జీ సాబ్ తిట్టినన్ని తిట్లు నా భార్య కూడా తిట్టలేదు. గడిచిన ఆరు నెలల్లో ఎల్జీ సాబ్ రాసినన్ని లవ్ లెటర్లు నా భార్య సైతం రాయలేదు. ఎల్జీ సాబ్ కొద్దిగా చల్లబడండి. అలాగే.. కొద్దిగా సేదతీరమని మీ సూపర్ బాస్కి సైతం చెప్పండి.’ అని హిందీలో ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ఢిల్లీలోని బీజేపీ పాలిత మున్సిపల్ బాడీల్లో రూ.6000 కోట్ల స్కాం జరిగిందని, దానిపై దృష్టి పెట్టండంటూ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాసిన మరుసటి రోజునే కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. సిసోడియా లేఖకు ఎల్జీ సక్సేనా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కానీ, బీజేపీ ఆ ఆరోపణలను ఖండించింది. LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं। पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे। LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें। — Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022 ఇదీ చదవండి: వందేభారత్ ట్రైన్కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గేదెలను ఢీకొట్టడంతో..! -
పండుగ వేళ ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం, ఫైర్ క్రాకర్స్ బ్యాన్
న్యూఢిల్లీ: కాలుష్య భూతానికి చెక్ పెట్టేలా ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2023 వరకు పటాకులను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం (సెప్టెంబర్ 7) సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. ఢిల్లీలో కాలుష్య భూతంనుంచి ప్రజలను రక్షించడానికి, గత సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నామని మంత్రి వెల్లడించారు. తద్వారా కాలుష్య భూతంనుంచి ప్రజల ప్రాణాలను కాపాడవచ్చంటూ రాయ్ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. జనవరి 1, 2023 వరకు పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుందని రాయ్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ఏడాది దేశ రాజధానిలో ఆన్లైన్లో పటాకుల అమ్మకం లేదా డెలివరీపై కూడా నిషేధం ఉంటుందని తెలిపారు. నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, రెవెన్యూ శాఖలతో కలిసి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. పండుగ సీజన్లో ముఖ్యంగా దీపావళి సందర్బంగా క్రాకర్స్కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీలోని కాలుష్యం రికార్డు స్థాయికి చేరడంతో దీని నివారణకు అనేక చర్యల్ని చేపడుతోంది. दिल्ली में लोगों को प्रदूषण के खतरे से बचाने के लिए पिछले साल की तरह ही इस बार भी सभी तरह के पटाखों के उत्पादन, भंडारण, बिक्री और उपयोग पर पूरी तरह प्रतिबंध लगाया जा रहा है, तांकि लोगों की जिंदगी बचाई जा सके। — Gopal Rai (@AapKaGopalRai) September 7, 2022 అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం గత ఏడాది ‘పతాఖే నహీ దియే జలావో’ అంటూ విస్తృత ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్బంగా పటాకుల అమ్మకాలను, పేల్చడాన్ని పూర్తిగా నిషేధించింది. అలాగే నివాస, వాణిజ్య ప్రాంతాల్లో పటాకులు పేల్చి పట్టుబడిన వారికి రూ.1,000 జరిమానా విధించగా, సైలెంట్ జోన్లలో అదే పని చేస్తూ పట్టుబడిన వారికి 3 వేల జరిమానా విధించారు. వివాహాలు, మతపరమైన పండుగలు లేదా ర్యాలీలు, బహిరంగ సభల్లో ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నివాస, వాణిజ్యం ఆవాసాల్లో అయితే పదివేలు, కీలక జోన్లలో రూ. 20 వేలు చెల్లించేలా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
కేంద్రం–ఢిల్లీ రగడపై సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ: దేశ రాజధానికి సంబంధించిన పలు శాఖలపై శాసన, పాలనాపరమైన పెత్తనం విషయమై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ఇందుకోసం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సోమవారం లేవనెత్తారు. ఈ అంశంపై 2019 ఫిబ్రవరి 14న ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పు వెలువరించారు. విచారణకు స్వీకరిస్తాం మనీ లాండరింగ్ చట్టంపై తీర్పును పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిల్ విచారణ స్వీకరణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దాన్ని విచారణ కేసుల జాబితాలో చేరుస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం తెలిపింది. -
ఎలక్ట్రిక్ సైకిల్ కొంటున్నారా? భారీ రాయితీలు ప్రకటించిన ఢిల్లీ సర్కారు
వాతావరణ కాలుష్యం తగ్గించే ప్రయత్నంలో ప్రతీ అవకాశం వినియోగించుకోవాలని ఢిల్లీ సర్కారు డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా మరోసారి ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. వ్యక్తిగత, రవాణా, కార్గోలలో ఏ తరహా ద్విచక్ర వాహనమైనా సరే, ఈవీ అయితే చాలు ప్రోత్సాహం అందిస్తామని తెలిపింది. ఢిల్లీలోని ఆప్ సర్కారు ప్రకటించిన రాయితీల ప్రకారం.. ఢిల్లీలో రిజిస్ట్రర్ అయ్యే మొదటి పది వేల ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాలకు ఈ ఇన్సెంటీవ్ వర్తిస్తుంది. ఇందులో ఒక్కో వాహనంపై గరిష్టంగా రూ.5,500ల వరకు ప్రోత్సాహంగా అందివ్వనుంది. కార్గో, పర్సనల్, వ్యక్తిగత అన్ని కేటగిరీల వాహనాలకు ఇందులో చేర్చారు. దీనికి అదనంగా మొదటి వెయ్యి వ్యక్తిగత వాహనాలకు అదనంగా మరో రూ.2000లు ప్రోత్సాహక నగదు అందివ్వాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: అవును నిజం.. త్వరలో ఎలక్ట్రిక్ ‘అంబాసిడర్’ కారు!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మేమంతా సీఎం వైఎస్ జగన్ వెంటే
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
సుండుపల్లెలో టీడీపీకి షాక్
సింహ వాహనంపై దేవదేవుడు
టీడీపీ ప్రచారంలో రాష్ట్రీయ సమాజ్ దళ్(ఆర్) అభ్యర్థి
రైతన్నలకు విత్తన రాయితీ
ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు
794 ఫిర్యాదులకు పరిష్కారం
పథకాలు కొనసాగాలంటే జగనన్న రావాలి
●కమలాపురంలో గణనీయమైన మార్పు..
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement