-
వేసవిలో ఈ పంటతో.. శ్రమ తక్కువ! ఆదాయం ఎక్కువ!
వేసవికాలంలో దోస పంట సాగుతో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు గడించవచ్చు. పంట సాగుకు రసాయన ఎరువులు వినియోగం ఉండదు. సాగు ఖర్చులు కూడా తక్కువే. తక్కువ శ్రమతో ఈ పంటను సాగు చేయవచ్చు. కరీంనగర్, నిర్మల్ మండలంలోని కనకాపూర్ గ్రామం దోసకాయలకు కేరాఫ్గా నిలుస్తోంది. గ్రామానికి చెందిన 20 నుంచి 30 మంది రైతులు ఇతర గ్రామాల రైతులకు భిన్నంగా వేసవికాలంలో చల్లదనాన్ని ఇచ్చే దోసకాయలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మిగిలిన పంటల కంటే తక్కువ సమయంలో సాగయ్యే దోస కేవలం 45 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. రైతులు తాము పండించిన దోసకాలను స్వయంగా జాతీయ రహదారిపై కిలోకు రూ.60 నుంచి రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం ఇతర పంటల కంటే తక్కువ పెట్టుబడితో దోస పంటను సాగు చేస్తున్నామని కనకాపూర్ రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు వస్తుందని రైతులు తెలిపారు. మధ్య దళారీలు లేకపోవడంతో రైతులు పండించిన దోస కాయలను నేరుగా తమ గ్రామంలోని బస్టాండ్లో అమ్ముతున్నారు. ఎకరాకు ఖర్చులు పోనూ రూ.80 వేల నుంచి లక్ష వరకు లాభాలు వస్తున్నాయని రైతులు తెలిపారు. – రాజు, యువ రైతు, కనకాపూర్ సేంద్రియ ఎరువులతో సాగు దోస పంట సాగుకు ఇక్కడి రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉంటున్నారు. అధికంగా సేంద్రియ ఎరువులను పంట సాగుకు వినియోగిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గడంతో ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. మంచి ఆదాయం.. ఎకరా విస్తీర్ణంలో దోస పంట సాగు చేశా. సాగు ఖర్చులు పోనూ రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వచ్చింది. ఇతర పంటలతో పోలిస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే పంట. – రఘు, యువ రైతు, కనకాపూర్ ఇవి చదవండి: Puthettu Travel Vlog: 12 చక్రాల బండి సాగిపోతోంది -
పచ్చళ్లు పెట్టే వనితల ఊరు ఉసులుమర్రు
గోదావరి జిల్లా వాసులంటే తిండితో చంపేస్తారురా బాబు అంటుంటారు. గోదావరి తీరాన వంటకాలకు ప్రసిద్ధి చెందిన పల్లెలు చాలానే ఉంటాయి. కండ్రిగ పాలకోవా, నగరం గరాజీలు, ఆత్రేయపురం పూతరేకులు, అంబాజీపేట ΄పొట్టిక్కలు... ఉసులుమర్రు పచ్చళ్లు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వశిష్ట గోదావరి గట్టుకు ఆనుకుని తణుకుకు అరగంట ప్రయాణ దూరంలో ఉండే ఆ గ్రామం ఎప్పుడూ సముద్రంలో ఉప్పునూ చెట్టు మీద కాయను కలిపి పచ్చళ్లు పెట్టడంలో నిమగ్నమై ఉంటుంది. వ్యక్తిగతంగా కావచ్చు, యజమాని కింద కావచ్చు ఆ గ్రామంలోని స్త్రీలలో ముప్పై, నలభై శాతం పచ్చళ్లు పెట్టడంలో ఉపా ధి ΄పొందుతూ ఉంటారు. వీరితో పా టు ఇరవై శాతం మగవారు ఈ పనిలో ఉంటారు. ఇక్కడి స్త్రీల చేతికి రుచి ఎక్కువ. అందుకే ఉసులుమర్రు పచ్చళ్లకు గిరాకీ ఎక్కువ. 40 సంవత్సరాల క్రితం నుంచి ఉసులుమర్రి జనాభా 2500 మాత్రమే. వీరిలో ఐదు వందల మంది స్త్రీలకు పైగా, మూడు వందల మంది పురుషులకు పైగా అందరూ కలిసి దాదాపు 1000 మంది వరకు సీజన్లో పచ్చళ్లు పెట్టడంలో బిజీగా ఉంటారని అంచనా. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్షణం తీరిక లేకుండా రేయింబవళ్లు అనేక రకాల పచ్చళ్లు పెడుతుంటారు. ఊరు ఊరంతా ఏ కంపెనీ కోసం, ఏ యజమాని కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపా ధిని కల్పించుకున్నారు. 40 సంవత్సరాల క్రితం పిళ్లా పెదకాపు కుటుంబం వారు మొదటిసారిగా పచ్చళ్లను తయారు చేయడం మొదలుపెట్టారు. మంచి లాభాలు, మిగులు ఉండడంతో వారిని చూసి వారి బంధువులు మొదలుపెట్టారు. అలా ఒకరిని చూసి మరొకరు అదే పనిని నేర్చుకుని స్వంతంగా తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. 200 కుటుంబాలకు పైగానే ఈ చిరు వ్యాపా రాన్ని చేస్తున్నారు. ఇప్పుడు తయారీలో మూడోతరం నిమగ్నమైంది. ఇవీ ప్రత్యేకం టమాటా, ఉసిరి, అల్లం, మాగాయి, ఆవకాయ, గోంగూర, కాలీఫ్లవర్, పండుమిరప, నిమ్మ తదితర పచ్చళ్ళకు ఉసులుమర్రు ప్రత్యేకం. పచ్చళ్ల తయారీలో మహిళలకు కనీసం 300 రోజు కూలీ దక్కుతోంది. అన్ని రకాల పచ్చళ్ళు పెట్టాలంటే రూ.5 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఖర్చులు పొ గా మిగిలే లాభంతో తమకెంతో సంతోషంగా ఉంటుందంటున్నారు. ఈ ఒక్క పల్లెలో అన్ని రకాల పచ్చళ్లూ కలిసి ఏడాదికి 500 టన్నులు పచ్చళ్లు పడుతుంటారని అంచనా. టన్ను పచ్చడి రూ.2.50 లక్షలు వంతున విక్రయిస్తుంటారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే రూ.10 నుంచి రూ.12 కోట్లు. మహిళలు ఇళ్లవద్ద పచ్చళ్లు పెడితే పురుషులు మాత్రం ఏడెనిమిది నెలలపా టు ఊళ్లు తిరుగుతూ చివరిడబ్బా అమ్మేశాక మాత్రమే ఇంటికి తిరిగొస్తారు. కుటుంబాన్ని వదిలి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, వరంగల్, నల్గొండ, బోధన్, హైదరాబాద్, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, ఖమ్మం, మిరియాలగూడ, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఏడాది ΄పొడవునా నిల్వ ఉసులుమర్రు ఆవకాయ అంటే ఏడాది ΄పొ డవునా నిల్వకు తిరుగుండదంటారు. ముదురు మామిడికాయలను ముక్కలుగా కోసి ఆరబెట్టి ఆవపిండి, మెంతులు, ఎర్రపచ్చడి కారం, వేరుశెనగ లేదా నువ్వుల నూనె కలిపి మూడు రోజుల తరువాత జాడీలో పెడతారు. ఉప్పు, కారం, ఆవపిండి కలిపిన ముక్కలను డ్రమ్ములో వేసుకుని ఎక్కడ అవసరమైతే అక్కడే వారి కళ్లెదుటే అన్నీ కలిపి ఇవ్వడంతో నమ్మకం రెట్టింపు అయ్యిందంటారు. వేసవిలో పండుమిరప, ఉసిరి, ఆవకాయ, గోంగూర, కాకరకాయ పెడతారు. వానాకాలం బ్రేక్ ఇచ్చి మళ్లీ ఆగస్టు నుంచి అల్లం, వెల్లుల్లి, టొమాటో, కాలీఫ్లవర్, కొత్తిమీరలాంటివి పెడతారు. మిక్స్డ్ వెజిటబుల్ అడిగితే పెట్టి ఇస్తారు. నిమ్మకు నిల్వ తక్కువ కాబట్టి తక్కువగా పెడతారు. చికెన్, రొయ్యలతో నాన్వెజ్ పచ్చళ్లు కూడా చేసి ఇస్తారు. సరుకును బట్టి లాభం. ఉదాహరణకు డ్రమ్ (200 కిలోలు) పండు మిరప పచ్చడి పట్టడానికి 20 వేలు అవుతుంటే మార్కెట్లో కిలో రూ.250కు అమ్ముతుంటారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు సాక్షి, కాకినాడ ,ఫొటోలు: పంతం వెంకటేశ్వర్లు, పెరవలి అందరూ ఆవకాయ పెట్టుకోరు. బయటి నుంచి తెచ్చుకునేవారు. ఎప్పుడూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఆ ఊరి స్త్రీలు ఆవకాయ పెడతారు. మే నుంచి జూన్ వరకూ ఉమ్మడి తూ.గో.జిల్లాలోని ఉసులుమర్రు స్త్రీలు ఆవకాయతో పా టు రకరకాల పచ్చళ్లు పెడుతుంటారు. వాటిని తీసుకుని మగవారు జిల్లాలకు బయలుదేరి నెలల తరబడి అమ్ముతారు. రోజూ ఏదో ఒక పచ్చడి తయారు చేసే ఆ ఊరి స్త్రీలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతినిధులు. -
వేసవికాలం మండే ఎండలు.. ఆ పంటతో అదిరిపోయే లాభాలు!
జైనథ్(ఆదిలాబాద్): నీటి వసతి ఉన్న చేన్లలో సైతం సాధారణంగా రెండు పంటలు తీయడానికి రైతులు నానా అవస్థలు పడుతుంటారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక, పెట్టిన పెట్టుబడి చేతికి అందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు. కా నీ జైనథ్ మండలం పార్డి గ్రామానికి చెందిన అస్తక్ సుభాష్ పాలీహౌస్తో కేవలం ఒక ఎకరంలోనే సంవత్సరానికి మూడు పంటలు తీస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం వేసవికాలంలో ఎండలు దంచి కొడుతున్న తరుణంలో కూడా పాలీహౌజ్లో కీరదోస సాగుతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. సంప్రదాయ పంటలతో విసిగి.. చాలా మంది రైతులు ఏళ్లతరబడి సంప్రదాయ పంటలైన పత్తి, సోయా, ఇతర పప్పుధాన్యాల సాగును అంటిపెట్టుకుని యేటా నష్టాలు చవిచూస్తుంటారు. అయితే కొంత మంది రైతులు మాత్రం పత్తి, సోయా వంటి పంటలకు భిన్నంగా హార్టికల్చర్ వైపు దృష్టి సారిస్తున్నారు. నాలుగైదు ఏళ్లుగా పత్తి పంటను గులాబీరంగు పురుగు ఆశించడంతో దిగుబడి భారీ గా పడిపోతోంది. సోయాలో కూడా గతంలో మాది రి ఆశించిన దిగుబడి రాకపోవడంతో విసిగిపోయిన రైతులు పండ్లు, కూరగాయల సాగుపై దృష్టి సారిస్తున్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే కూరగాయలు, పండ్ల సాగుకు అధికంగా శ్రమించాల్సి రావడంతో చాలా తక్కువ మంది మాత్రమే నిలదొక్కుకుంటున్నారు. పార్డి గ్రామానికి చెందిన అస్తక్ సుభాష్ కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయ పంటల జోలికి పోకుండా పాలీహౌస్లో మార్కెట్లో డిమాండ్ ఉన్న కీరదోస, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ వంటి పంటలను సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. మిగిలిన భూమిలో కూడా కాకర, బీరకాయ, టమాట, జొన్న, నువ్వులు వంటి పంటలు సాగు చేస్తున్నాడు. 250 క్వింటాళ్ల దిగుబడి సాధారణంగా కీరదోసకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే కీరదోస హాట్కేక్లా అమ్ముడుపోతుంది. ఇది గ్రహించిన రైతు సుభాష్ తన పాలీహౌజ్లో వేసవి ప్రారంభంలో ఫిబ్రవరి మాసంలో ఎకరం విస్తీర్ణంలో కీరదోస సాగు చేశాడు. రూ.82వేలతో గుజరాత్ నుంచి నాణ్యమైన విత్తనాలు తెప్పించాడు. ఎరువులు, కూలీ ఖర్చు కలిపి మరో రూ.70వేల వరకు అయ్యింది. మొత్తం రూ.1.50 లక్షల్లో కీర సాగు పూర్తి అయ్యింది. మార్చి చివరి నుంచి పంట దిగుబడి రావడం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 200 క్వింటాళ్ల దోస మార్కెట్కు తరలించాడు. మరో 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాడు. క్వింటాల్కు రూ.2వేల చొప్పున ఇప్పటి వరకు రూ.4 లక్షల ఆదాయం వచ్చిందని, మరో రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతు పేర్కొంటున్నాడు. ఈ ఏడాది సకాలంలో పంట వేయడం, మార్కెట్లో మంచి ధర లభించడంతో మంచి లాభాలు వచ్చాయంటున్నాడు. -
నాలుగు నెలల్లో దిగుబడి, తక్కువ ఖర్చు.. మార్కెట్లో ఫుల్ డిమాండ్
సాక్షి,రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని విసంపేట గ్రామంలో పలువురు రైతులు కీర దోసకాయ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో వరి సాగు చేయొద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వం పేర్కొనడంతో ప్రత్నామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడితో నాలుగు నెలల్లో గరిష్టంగా దిగుబడి పొందే అవకాశం ఉండటంతో పలువురు రైతులు కీర దోస సాగుపై మొగ్గు చూపారు. విసంపేటలో సుమారు 20 ఎకరాల్లో కీర దోస సాగు చేస్తున్నట్లు ఉద్యానవన అధికారులు పేర్కొంటున్నారు. ఖర్చు తక్కువ.. దిగుబడి అధికం కీర దోస సాగు ప్రారంభించిన తర్వాత నాలుగు నెలల కాలంలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి వస్తుంది. భూమిలో బలం కోసం నెలకోసారి యూరియా చల్లితే సరిపోతుంది. నెల తర్వాత దిగుబడి ప్రారంభమై ప్రతిరోజూ సుమారు క్వింటాల్ కీర దోస పడుతుంది. భూమిపై పూర్తిగా పరుచుకొని సాగవుతుండటంతో కలుపు సమస్య ఉండదు. నీటి వినియోగం కూడా తక్కువ. దిగుబడి ప్రారంభమయ్యాక ప్రతిరోజూ కాయలు తెంపాలి. మరుసటి రోజు తెంపితే ముదిరిపోయే అవకాశం ఉంటుంది. అధిక పోషక విలువలు.. ∙కీర దోసకాయల్లో అధిక పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ∙నీటి శాతం, అంటీ యాక్సిడెంట్లు ఎక్కువ.హైడ్రేషన్ను ప్రోత్సహిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ జీవప్రక్రియ మెరుగ్గా ఉంటుంది. ∙వేసవిలో వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు, గొంతు తడిగా ఉంటూ శరీరం చల్లాగా ఉండేందుకు ఉపయోపడుతుంది. ∙300 గ్రాముల పొట్టు తీసిన దోసకాయలో కేలరీలు 45 గ్రాములు, కార్పొహైడ్రేట్స్ 11 గ్రాములు, ప్రోటీన్ 2 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు, విటమిన్ సీ 14%, ప్రతీరోజు తీసుకోవడం వల్ల 62% కాల్షియం, మెగ్నీషియం 10%, పొటాషియం 13%, మాంగనీస్ 12% లభ్యమవుతాయి. ∙శరీరంలోని అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ∙బరువు, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గడంలో సహాయపడుతుంది. ∙మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎముక ల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఆదాయం బాగుంది నాకున్న అర ఎకరంలో ఫిబ్రవరి 10వ తేదీన దోస సాగు ప్రారంభించా. నెల రోజులకు దిగుబడి ప్రారంభమైంది. ప్రతిరోజూ సుమారు 50 కిలోల దిగుబడి వస్తోంది. ఖర్చు తక్కువ, మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉండటంతో తెంపిన క్షణంలోనే విక్రయిస్తున్న. 50 కిలోలకు రూ.800వరకు ధర పలుకుతోంది. ఆదాయం బాగుంది. – బర్పటి సంతోశ్, కీర దోస సాగు రైతు, విసంపేట రైతులను ప్రోత్సహిస్తున్నాం నిత్యం మార్కెట్లో విరివిగా డిమాండ్ ఉన్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, కాయలను ఉత్పత్తి చేసే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. విసంపేటలో రైతులు కీరదోసతో లాభాలు గడించడంతో మరికొంత మంది రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి మళ్లిస్తారు. – శ్రీకాంత్, ఉద్యానవనశాఖ అధికారి ప్రయోజనకరం వేసవిలో కీర దోస ఎంత ఎక్కువ తింటే అంత ప్రయోజనం. నీటి శాతం ఎక్కువ ఉండటంతో డీహైడ్రేషన్కు అవకాశం ఉండదు. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ అధికంగా ఉండటంతో సైడ్ ఎఫెక్టŠస్ ఉండవు. శరీరంలో నీటిశాతం పెరగడంతో వేడిని గ్రహించదు. దాని విలువ తెలియడంతో ప్రతీ ఫంక్షన్, హోటల్లలో ముందుగా కీరదోస ముక్కలు అందిస్తున్నారు. – డాక్టర్ కటుకం అమర్నాథ్, ఎండీ(ఆయుర్వేదం) -
కీర దోసకాయలు తినేవారు ఈ విషయాలు తెలుసుకున్నారంటే!
Health Benefits Of Cucumber: మానసిక ఒత్తిడి, ఊబకాయం, మలబద్ధకం వంటి వాటికి కొన్ని ఆహార పదార్థాలు దివ్యఔషధంలా పనిచేస్తాయి. అలాంటి వాటిల్లో కీర దోసకాయ ఒకటి. కీరదోసల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల పలు జబ్బులు సులభంగా నయమవుతాయి. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్నాక్స్లా తింటుంటారు. కీర దోస ఉపయోగాలను తెలుసుకుందాం. కీర దోస ఆరోగ్య ప్రయోజనాలు ►కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ►ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ►అంతేకాదు డయాబెటిస్ను నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది. ►శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల షుగర్ ఉన్న వారు కీరా తినాలని సూచిస్తున్నారు. ►కీరదోసకాయలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి విటమిన్లు ఉంటాయి. దీనిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోయి.. మూత్ర సమస్యలు తగ్గుతాయి. ►కీరదోసలో కాన్సర్ను నిరోధించే గుణాలు ఉన్నాయి. ►దీనిలో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెజర్ను తగ్గించి.. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా సహకరిస్తాయి. ►కీర దోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం డీహైడ్రేషన్ అవకుండా కాపాడుతుంది. ►దీనిలో ఉండే విటమిన్ ‘బి’తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా దోహదపడుతుంది. ►కీర దోసను జ్యూస్గా చేసుకుని తాగడం వల్ల కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి. ►ముఖ్యంగా వేసవిలో కీరదోసను తీసుకోవడం వల్ల దప్పిక కాకుండా ఉంటుంది. ►కీరదోసను చక్రాలుగా తరిగి కళ్లపై ఉంచుకోవడం వల్ల కళ్ల మంటలు, ఎరుపులు తగ్గి, కళ్లు కాంతివంతంగా ఉంటాయి. చదవండి: Lemon Juice: నిమ్మరసంలో పంచదార కలుపుకొని తాగుతున్నారా? అయితే
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement