-
బ్యాట్ గుర్తు ఇమ్రాన్ పార్టీదే
పెషావర్: పాకిస్థాన్లో కీలకమైన జాతీయ ఎన్నికల ముందు మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ)కి భారీ ఊరట దొరికింది. పార్టీ ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్ను దానికే తిరిగి కేటాయిస్తూ పెషావర్ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. పీటీఐకి బ్యాట్ చిహ్నాన్ని రద్దు చేస్తూ దేశ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. అది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. -
కొడుకు ముందే క్రికెట్ బ్యాట్తో ప్రిన్సిపల్పై భార్య దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
గృహహింస.. ఈ పేరు వినగానే వేధింపులకు గురవుతున్న మహిళలే గుర్తుకు వస్తారు. భర్తలు, అత్త మామలు, ఆడపడచుల చిత్ర హింసలకు ఎంతోమంది వివాహితలు బలవుతున్నారు. కానీ భార్య చేతిలో గృహహింసకు గురవుతున్న భర్తల గురించి ఎప్పుడైనా విన్నారా.. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్లో చోటుచేసుకుంది. అజిత్సింగ్ యాదవ్ అనే వ్యక్తి హర్యానాకు చెందిన సుమన్ను ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట అల్వార్ జిల్లాలో నివాసముంటున్నారు. కాగా అజిత్ సింగ్ ఓ విద్యాసంస్థలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నాడు. మొదట్లో వీరి సంసార జీవితం ప్రశాంతంగానే కొనసాగినప్పటికీ కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భార్య సుమన్ తరుచూ అజిత్సింగ్పై చేయి చేసుకోవడం ప్రారంభించింది. అనేకసార్లు భర్తను ఇష్టంవచ్చినట్లు కొట్టేది. దీంతో భార్య చేతిలో గాయాలపాలైన అజిత్ సింగ్ ప్రస్తుతం వైద్యుల వద్ద చికిత్స కూడా పొందుతున్నాడు. అయితే భార్య హింసతో విసిగిపోయిన భర్త కోర్టును ఆశ్రయించాడు. తన భార్య మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని, ఆమె నుంచి రక్షణ కావాలంటూ కోర్టును కోరాడు. చేతికి ఏది దొరికితే అది క్రికెట్ బ్యాట్, పాన్, కర్రలతో దాడి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కోర్టుకు సమర్పించాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో భార్య భర్తను క్రికెట్ బ్యాట్తో కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. అలాగే తల్లి దెబ్బలకు బెదిరిపోయిన కొడుకు ఇంట్లో అటు ఇటు తిరుగుతుండటం కూడా చూడవచ్చు. ఈ కేసును విచారించిన కోర్టు సదరు బాధితుడికి భద్రత కల్పించాలని ఆదేశించింది. చదవండి: అలా రాసిస్తేనే పెళ్లిళ్లకు వస్తానని చెప్పా: సీఎం అయితే గౌరవప్రదమైన టీచర్ వృత్తిలో ఉన్నందున భార్య వేధింపులపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని బాధితుడు అజిత్ సింగ్ తెలిపాడు. కానీ ఇప్పుడామే హద్దులు దాటి ప్రవర్తిస్తుండటంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపాడు. తన బావ భార్యను హింసకు ప్రేరేపించాడని ఆరోపించాడు. అంతేగాక భార్యపై తనెప్పుడూ చేయి ఎత్తలేదని పేర్కొన్నాడు. తనొక ఉపాధ్యాయుడని..ఉపాధ్యాయుడు ఒక మహిళపై చేయి ఎత్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం ఇష్టం లేదని అన్నాడు. In a strange case of domestic violence, a school principal in #Alwar district of #Rajasthan has move the court seeking protection from the physical and mental harassment of his wife. According to the man, his wife has been beating him black and blue leaving him weak mentally. pic.twitter.com/J1UOmRhyHw — IANS (@ians_india) May 25, 2022 -
ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ బ్యాట్ ఆవిష్కరణ..
World Biggest Cricket Bat Unveiled In Hyderabad: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ బ్యాట్ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై శనివారం ఆవిష్కరించబడింది. పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందించబడిన ఈ బ్యాట్ పొడవు 56.1 అడుగులు కాగా, బరువు 9 టన్నులుగా ఉంది. పాప్లర్ ఉడ్తో తయారు చేసిన ఈ బ్యాట్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియాకు విషెస్ చెబుతూ.. ప్రజల సందర్శనార్ధం ఈ బ్యాట్ను ట్యాంక్ బండ్పై ఉంచారు. ఈ బ్యాట్ ఆవిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్, తెలంగాణ పురుపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్ ప్రోమో.. రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే -
కష్టాల్లో అష్రఫ్, ఆదుకున్న సచిన్
ముంబై: దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పెద్ద మనసు చాటుకున్నారు. బ్యాట్ల తయారీ దుకాణం నిర్వహించే అష్రఫ్ చౌదరీ అనే పెద్దాయనను ఆర్థికంగా ఆదుకున్నారు. గతంలో పాడైన సచిన్ బ్యాట్లను అష్రప్ బాగు చేసేవాడు. అష్రఫ్ స్నేహితుడు ప్రశాంత్ జఠ్మలాని తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా లాక్డౌన్తో వ్యాపారం సాగకపోవడంతో అష్రఫ్ చాచాను తీవ్ర ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దాంతోపాటు ఆరోగ్యం కూడా దెబ్బతింది. 12 రోజుల క్రితం ముంబైలోని సాల్వా ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయం తెలుకున్న సచిన్ ఆస్పత్రికి వచ్చి అష్రఫ్ను పరామర్శించాడు. ఆస్పత్రి ఖర్చులు భరించడంతోపాటు, ఆర్థిక సాయం కూడా చేశాడు. విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, క్రిస్గేల్, కీరన్ పొలార్డ్ బ్యాట్లను కూడా అష్రఫ్ బాగు చేసేవాడు. క్రికెట్ అంటే అతనికి ప్రాణం. ఎంతో మంది యువ క్రికెటర్ల పాడైన బ్యాట్లను ఉచితంగా సరిచేసి ఇచ్చేవాడు. వాంఖడే స్టేడియంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్లు, ఐపీఎల్ మ్యాచ్లు క్రమం తప్పకుండా వీక్షించేవాడు’అని ఓ జాతీయ మీడియాతో మంగళవారం పేర్కొన్నాడు. (చదవండి: ‘టిక్టాకర్లతో పాటు మమ్మల్నీ పట్టించుకోండి’) -
క్రికెట్ బ్యాట్ తో భర్త మర్మాంగాలపై కొట్టి..
చిత్తూరు,పలమనేరు: మండలంలోని మొరం పంచాయతీ నక్కపల్లిలో బుధవారం భార్య, ఆమె తల్లి కలిసి క్రికెట్ బ్యాట్, రోకలితో కొట్టి భర్తను హత్య చేశారు. పట్టణ సీఐ శ్రీధర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన గోపీనాథ్ రెడ్డి (36) కి అదే గ్రామానికి చెందిన అత్త కూతురు సునీత(32)తో కలిసి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. గోపీనాథ్ రెడ్డి కొన్నాళ్ల క్రితం బెంగకూరు వెళ్లి అక్కడే సొంతంగా క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. లాక్డౌన్ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం కుటుంబంతోపాటు స్వగ్రామానికి వచ్చి అత్తాగారింట్లో ఉంటున్నారు. డ్యూలు కట్టకపోవడంతో కారును ఫైనాన్స్ కంపెనీవారు ఇటీవల తీసుకెళ్లారు. దీంతో ట్రాక్టర్ కొనుగోలు చేసి ఉపాధి పొందాలని గోపీనాథ్రెడ్డి భావించాడు. అందుకు నగలు ఇవ్వా లని భార్యను అడిగాడు. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి గోపీనాథ్రెడ్డి నగల విషయంపై భార్య, అత్తతో గొడవపడ్డాడు. ఆగ్రహం చెందిన భార్య క్రికెట్ బ్యాట్, అత్త రోకలితో మద్యం మత్తులో ఉన్న అతన్ని చితకబాదారు. ఈ క్రమంలో అతని మర్మాంగాలకు తీవ్రగాయాలయ్యాయి. పురుషాంగం కొంత తెగింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. హత్య చేసింది తామేనంటూ భార్య, అత్త పోలీసులకు తెలిపారు. మృతునికి తొమ్మిదేళ్ల కుమారుడున్నాడు. సీఐ శ్రీధర్ కేసును విచారిస్తున్నారు. అందరితో కలిసిమెలసి ఉండే గోపీనాథ్రెడ్డి హత్య గ్రామంలో కలకలం రేపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement