-
క్వింటా పత్తి రూ. 7,711
ఆదోని అర్బన్: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి ధర రూ.7,711గా నమోదైంది. గత వారంలో రూ.7,500 ధర ఉండగా.. ఈ వారం రోజురోజుకు రూ.50, రూ.100 చొప్పున పెరుగుతూ రూ.7,711కు చేరుకుంది. శుక్రవారం మార్కెట్కు 2,626 క్వింటాళ్ల పత్తి రాగా గరిష్ట ధర రూ.7,711, మధ్య ధర రూ.7,389, కనిష్ట ధర రూ.5,169 పలికింది. అలాగే, వేరుశనగ 1,437 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.7,969, కనిష్ట ధర రూ.3,849.. ఆముదాలకు గరిష్ట ధర రూ.5,475, కనిష్ట ధర రూ.4,500, పూల విత్తనాలకు గరిష్ట ధర రూ.4,212, కనిష్ట ధర రూ.3,926 లభించింది. -
రోడ్డెక్కిన పత్తిరైతులు
ఆసిఫాబాద్ అర్బన్: పత్తికి గిట్టుబాటుధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కుమురంభీం జిల్లా రైతులు రోడ్డెక్కారు. జిల్లా రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్లోని అంబేడ్కర్ చౌక్ వద్ద హైదరాబాద్–నాగ్పూర్ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. విత్తనాలు, ఎరువులు, కూలిరేట్లు పెరగడంతో పెట్టుబడి రెట్టింపు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీసీఐ ఆధ్వర్యంలో క్వింటాల్కు రూ.15 వేలు చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు వచ్చి రైతులకు మద్దతు పలికారు. అనంతరం కలెక్టర్కు రైతులు వినతిపత్రం అందజేశారు. సీసీఐ అధికారులు, మిల్లుల యజమానులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేవిధంగా ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ హామీ ఇచ్చారు. -
పత్తి @ రూ.9,150..
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవ సాయ పత్తి మార్కెట్లో తెల్ల బంగారం మెరిసింది. పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అంతర్జా తీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరుగుతుండటంతో సోమవారం రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి రూ.9,150 పలికింది. మార్కెట్కు 115 వాహనాల్లో 997 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకురాగా.. గరిష్ట ధర రూ.9,150, మోడల్ ధర రూ.9,000, కనిష్ట ధర రూ.8,000 పలికింది. గన్నీ సంచుల్లో 60 మంది రైతులు 107 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకురాగా క్వింటాల్కు గరిష్ట ధర రూ.8,800, మోడల్ ధర రూ.8,500, కనిష్ట ధర రూ.6,000తో ఖరీదు చేశారు. -
పత్తి ధర అదుర్స్
గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తి ధర దూకుడు ఆగడం లేదు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఈ–నామ్ కొనుగోళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా క్వింటా రూ.9,040 పలకగా.. తాజాగా అదే వేగం కొనసాగుతోంది. శనివారం జరిగిన కొనుగోళ్లలోనూ క్వింటా గరిష్టంగా రూ.9,055 పలికింది. 13 మంది రైతులు 31.32 క్వింటాళ్ల పత్తిని విక్రయించగా ఈ ధర పలికింది. కనిష్టంగా రూ.8,771 పలికిందని మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. సీజన్ ఆరంభం నుంచి ఈ–నామ్ ద్వారా ఇప్పటివరకు 77 మంది రైతులు 170.72 క్వింటాళ్ల పత్తిని విక్రయించారని ఆయన పేర్కొన్నారు. -
తెల్ల బంగారం భళా
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తి ఈ సీజన్లో రాష్ట్రంలోనే రికార్డు స్థాయి ధర పలికింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఈ – నామ్ కొనుగోళ్లలో క్వింటాల్కు గరిష్టంగా రూ.9,040 పలికింది. ఏడుగురు రైతులు 13.29 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు. ఇందులో మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన రైతు కనకయ్యకు చెందిన రెండు క్వింటాళ్ల పత్తిని లక్ష్మీ ట్రేడర్స్ క్వింటాకు అత్యధికంగా రూ.9,040 ధరను కోట్ చేసి కొనుగోలు చేసింది. అత్యల్పంగా రూ.8,750 పలికింది. ఈ విషయాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, కార్యదర్శి జాన్వెస్లీలు ధ్రువీకరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement