-
వినోదం కోసం..ఫైబర్కు సై!
న్యూఢిల్లీ: దేశీయంగా టీవీ వీక్షకులు వినోదం కోసం క్రమంగా డీటీహెచ్ (డైరెక్ట్ టు హోమ్) సర్వీసుల నుంచి ఫైబర్ కనెక్షన్ల వైపు మళ్లుతున్నారు. బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ వేగవంతంగా ఉండటం, అనేకానేక ఓటీటీ యాప్లు అందుబాటులోకి రావడం, నెట్వర్క్ స్థిరంగా ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. దీంతో లక్షల మంది కస్టమర్లు డీటీహెచ్ను వదిలేసి ఫైబర్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత త్రైమాసికంలో డీటీహెచ్ కస్టమర్ల సంఖ్య ఏకంగా 13.20 లక్షలు తగ్గడం ఇందుకు నిదర్శనం. ఫైబర్ కనెక్షన్లకు ఆదరణ పెరుగుతుండటమనేది వినోదం విషయంలో ప్రజల అలవాట్లు మారుతుండటాన్ని సూచిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాతావరణంలో మార్పులు, సాంకేతిక లోపాల కారణంగా పదే పదే అంతరాయాలు వస్తుంటాయని డీటీహెచ్ సర్విసులపై విమర్శలు ఉన్నాయి. అదే ఫైబర్ కనెక్షన్లయితే పటిష్టమైన, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా ఉంటాయని ధీమా ఉంటోంది. గ్యారంటీగా నిరంతరాయ సర్వీసుతో పాటు పనితీరు కూడా అత్యుత్తమంగా ఉండటంతో ఇవి మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి. యువత దన్ను.. జియో సినిమా, జియోటీవీ వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్లు, ప్లాట్ఫామ్లు ప్రజల ధోరణులు మారడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫైబర్ కనెక్షన్ల ద్వారా అందుబాటులో ఉండే ఈ ప్లాట్ఫామ్లు.. భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా లైవ్ స్పోర్ట్స్, లేటెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్లు, టీవీ షోలు లాంటి బోలెడంత కంటెంట్ను హై డెఫినిషన్ నాణ్యతతో అందిస్తున్నాయి. ఇంటర్నెట్ ద్వారా నిరంతరాయంగా వినోద సర్విసులు అందుబాటులో ఉండటమనేది ఆకర్షణీయంగా ఉండటంతో యువత ఎక్కువగా ఫైబర్ కనెక్షన్ల వైపు మొగ్గు చూపుతోంది. గణాంకాల ప్రకారం ఇప్పటికే 2.23 కోట్ల మంది యూజర్లు ఫైబర్వైపు మారారు. సాంప్రదాయ డీటీహెచ్ సేవలతో పోలిస్తే ఇంటర్నెట్ ఆధారిత ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్లకు పెరుగుతున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని విశ్లేషకులు తెలిపారు. అదే సమయంలో డీటీహెచ్ సర్విసులకు డిమాండ్ తగ్గుతుండటాన్ని కూడా సూచిస్తోందని పేర్కొన్నారు. -
ఈ సమస్యలు మీకూ ఉన్నాయా? షాకింగ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశం వేగవంతమైన 5 జీ నెట్వర్క్ సేవలకు పరుగులు తీస్తున్నక్రమంలో నెట్వర్క్ సమస్యలపై షాకింగ్ సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది. వినియోగదారులకు కాల్డ్రాప్, కాల్ కనెక్ట్ కాకపోవడం అనేది ఎంత చికాకు కలిగిస్తుందో అందరికి అనుభవమే. తాజాగా దేశంలో 339 జిల్లాల పరిధిలోని సర్వేలో పాల్గొన్న 56 శాతం మంది యూజర్లు తమ నెట్వర్క్ బాధలను వెల్లడించారు. తీవ్రమైన కాల్ డ్రాప్, కాల్ కనెక్షన్ సమస్యలను ఎదుర్కొంటున్నా మన్నారు. అంతేకాదు 82 శాతం మంది ప్రజలు ఈ నెట్వర్క్ సమస్యలను అధిగమించడానికి డేటా లేదా వైఫై కాల్స్ చేస్తున్నారు. ఆన్లైన్ ప్లాట్ఫారమ్ లోకల్ సర్కిల్స్ సోమవారం ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది. సర్వే ప్రకారం గత 3 నెలల్లో వారి మొబైల్ ఫోన్ కాల్లలో ఎంత శాతం చెడ్డ కనెక్షన్ లేదా కాల్ డ్రాప్ సమస్యలను కలిగి ఉన్నాయనే ప్రశ్నకు సమాధానంగా, 37 శాతం మంది 20-50 శాతం సమస్యను ఎదుర్కొన్నారు. కాల్ కనెక్షన్ డ్రాప్పై ఇచ్చిన ప్రశ్నకు 8,364 ప్రత్యుత్తరాలు వచ్చాయి. మొత్తంగా 91 శాతం మంది తాము సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పగా, 56 శాతం మంది తమ విషయంలో సమస్య మరింత తీవ్రంగా ఉందని చెప్పారు. కాల్ నాణ్యతపై దృష్టి సారించిన సర్వే 31వేల మందిపై లోకల్ సర్కిల్స్ సర్వే చేసింది. ఇందులో టైర్ 1 నగరాల్లోని 42 శాతం మంది, టైర్ 2 నుండి 31 శాతం , టైర్ 3, 4 గ్రామీణ జిల్లాల నుండి 27 శాతం ఉన్నట్టు నివేదిక పేర్కొంది. 78 శాతం పౌరులు తప్పు కనెక్షన్ ఉన్నప్పటికీ 30 సెకన్లలోపు ఆటోమేటిక్ కాల్ డ్రాప్ సమస్య రాలేదని సర్వే తేల్చింది. డేటా లేదా వైఫై కనెక్షన్ ఉన్న 82 శాతం మంది పౌరులు తరచుగా డేటా లేదా వైఫై కాల్స్ చేస్తున్నారు. ఎందుకంటే వారు సాధారణ మొబైల్ నెట్వర్క్ను పొందడం లేదా కనెక్ట్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది -
మందు బాబులూ.. ఆ ప్రకటనను నమ్మకండి
వైరల్: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయాక.. ఏది నిజమో, ఏది అబద్ధమో ధృవీకరించుకోలేని పరిస్థితి నెలకొంది. ఆఖరికి ఫ్యాక్ట్ చెక్ల పేరుతో చేస్తున్న ప్రయత్నాలు సైతం వర్కవుట్ కావడం లేదు. దీంతో చాలావరకు విషయాలు నిజనిర్ధారణల మధ్య నలిగిపోతున్నాయి. అయితే.. ఫార్మర్డ్ రాయుళ్ల దెబ్బకు కొత్తా.. పాతా.. ఉత్త పుకార్లు వైరల్ అవుతూనే వస్తున్నాయి. తాజాగా.. మందు బాబుల కోసం మోదీ సర్కార్ తీపి కబురు అంటూ ఓ ప్రకటన విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంటింటికి కరెంట్.. నల్లా కనెక్షన్లాగా.. మందు కనెక్షన్ల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నది ఆ వైరల్ వార్త సారాంశం. ఇంటింటికే మద్యం పాలసీలో భాగంగా.. లిక్కర్ పైప్లైన్లను ప్రభుత్వం తీసుకురాబోతోందన్నది ఆ వైరల్ మెసేజ్. ఈ మేరకు హిందీలో ఓ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది. ‘గౌరవనీయులైన ప్రధానిగారు మందు బాబుల కోసం లిక్కర్ పైప్లైన్ పథకం తీసుకురాబోతున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోండి. పీఎంవో పేరిట 11 వేల డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లై చేయండి’ అంటూ ఆ ఫేక్ నోటిఫికేషన్ వైరల్ అవుతోంది. అప్లై చేసుకున్న వాళ్ల ఇళ్లను అధికారులు సందర్శించి.. కనెక్షన్ను మంజూరు చేస్తారట. పవర్ మీటర్లకు వాటిని కనెక్ట్ చేసి.. వాడకం ఆధారంగా బిల్లులు వేస్తారట. ఇంత ఫేక్ ప్రకటనపై ఫ్యాక్ట్ చెక్ సైట్ పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఊరుకుంటుందా?.. అందుకే వెల్కమ్ చిత్రంలోని నానా పటేకర్ ‘కంట్రోల్’ మీమ్తో గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు అతిగా ఆశలు పెంచుకోవద్దంటూ మందు బాబులకు చిల్ గాయ్స్ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఉంచింది. Chill guys, Don’t get your hopes too high‼️#PIBFactCheck pic.twitter.com/34zeYEKByq — PIB Fact Check (@PIBFactCheck) July 18, 2022 ఇదీ చదవండి: ఇకపై వ్యాక్సిన్ తీసుకుంటే క్యాష్ రివార్డు! -
డిస్క్ంకు ఉరితాళ్లు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీధుల్లో లాగుతున్న వివిధ రకాల కేబుల్ వైర్లు (ఇంటర్నెట్, డిష్)విద్యుత్ స్తంభాలకు పెద్ద గుదిబండలా మారాయి. కోర్సిటీతోపాటు శివారు మున్సిపాలిటీల్లోనూ విద్యుత్ స్తంభాలు వివిధ రకాల కేబుల్ వైర్లతో సాలెగూళ్లను తలపిస్తున్నాయి. ఒక విద్యుత్ స్తంభానికి మరో విద్యుత్ స్తంభానికి మధ్య మైనస్ (ఎర్త్), ప్లస్ (పవర్ సప్లయ్)తో పాటు త్రీ ఫేజ్ (ఎల్టీ) వైర్లు మాత్రమే ఉండాల్సిఉండగా 40 నుంచి 50 కేబుల్ వైర్లు వేలాడుతున్నాయి. ఈదురు గాలితో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడుతున్నాయి. సాధారణంగా రెండు మూడు వైర్లు మాత్రమే ఉంటే చెట్ల బరువుకు తీగలు తెగి, నష్టం కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అంతకు మించి కేబుళ్లు వేలాడుతున్నాయి. భారీ చెట్లు, కొమ్మలు విరిగి ఈ లైన్లపై పడ్డప్పుడు ఆ బరువుకు అటు ఇటుగా ఉన్న విద్యుత్ స్తంభాలు ఒరుగుతున్నాయి. ఫలితంగా సంస్థకు భారీగా ఆరి్థక నష్టం వాటిల్లడంతో పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అంతేకాదు పునరుద్ధరణకు 12 నుంచి 24 గంటల సమయం పడుతోంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 8 నుంచి 13 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జోన్ల పరిధిలో 2,153 ఫీడర్లు ట్రిప్పవగా, 361 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరో 31 డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడానికి ఈ కేబుళ్లే ప్రధాన కారణమని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. జంక్షన్ బాక్సులు..గుట్టుగా కనెక్షన్లు విపత్తులను తట్టుకుని నిలబడాల్సిన విద్యుత్ స్తంభాలు కేబుళ్ల కారణంగా అడ్డంగా విరిగిపడుతున్నాయి. స్తంభాలు ఎవరైనా ఎక్కాలన్నా..వీధి చివరిలోని డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను తాత్కాలికంగా బంద్ చేయాలన్నా డిస్కం అనుమతి తప్పని సరి. కానీ ఇంటర్నెట్, కేబుల్ సిబ్బంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఆయా స్తంభాలకు ఏర్పాటు చేసిన జంక్షన్ బాక్సులకు పోల్స్పై నుంచి గుట్టుగా సర్వీసు వైర్ను లాగి కరెంట్ను వాడుతున్నారు. యధేచ్ఛగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాయి. గ్రేటర్లో ఈ తరహా కనెక్షన్లు 60 వేల వరకు ఉన్నట్లు అంచనా. విద్యుత్ చౌర్యం వల్ల సంస్థకు వస్తున్న ఈ నష్టాలను క్షేత్రస్థాయి సిబ్బంది లైన్లాస్ జాబితాలో వేసి చేతులు దులుపుకుంటుండటం గమనార్హం. ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు విద్యుత్ స్తంభాల తయారీలో నాణ్యత లోపం స్పష్టంగా కన్పిస్తుంది. సిమెంట్, ఇసుక, ఐరన్ కూడా సరిగా వాడటం లేదు. పాతిన కొద్ది రోజులకే సగానికి విరిగిపోతున్నాయి. భూమిలో మీటరు లోతు వరకు పాతాల్సి ఉండగా, చాలా చోట్ల ఒకటి రెండు ఫీట్లకు మించి తవ్వడం లేదు. పట్టు కోసం చుట్టూ సిమెంట్ వాడక పోవడంతో ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడి నేలకూలుతున్నాయి. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు పోల్పైకి ఎక్కే సమయంలో పట్టు దొరక్క కారి్మకులు కింద పడుతున్నారు. ఇటీవల కందుకూరు, మహేశ్వరంలో ఇద్దరు కారి్మకులు చనిపోవడానికి కూడా ఇదే కారణం. స్తంభాల చుట్టూ కేబుళ్లు భారీగా అల్లుకపోయి ఉండటంతో ఏ వైరు దేనికి సంబంధించిందో అర్థం కావడం లేదు. కార్మికులు పోల్పైకెక్కే సమయంలో ఎల్సీ తీసుకున్నప్పటికీ..కొంత మంది ఇళ్లలో జనరేటర్లు, ఇన్వర్టర్లు పని చేస్తుండటం వల్ల ఆయా వైర్ల నుంచి పోల్పైకి కరెంట్ రివర్స్ సప్లయ్ జరిగి కార్మికులు విద్యుత్షాక్కు గురవుతున్నారు. (చదవండి: 19 డిపోలు లాభాలబాట) -
తగ్గిన టెలికం యూజర్ల సంఖ్య
న్యూఢిల్లీ: టెలికం యూజర్ల సంఖ్య ఈ ఏడాది మే నెలలో 116.3 కోట్లకు తగ్గింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే 0.49 శాతం క్షీణించింది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలైన ఏప్రిల్లో టెలికం యూజర్ల సంఖ్య 85.3 లక్షల మేర క్షీణించి 116.94 కోట్లకు తగ్గింది. ఏప్రిల్తో పోలిస్తే మేలో యూజర్ల సంఖ్య తగ్గుదల 57.6 లక్షలకు పరిమితమైంది. మొబైల్ టెలిఫోనీ విభాగంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు చెరి 47 లక్షల యూజర్లను కోల్పోయాయి. ఎయిర్టెల్ వైర్లెస్ కస్టమర్ల సంఖ్య 31.7 కోట్లు, వొడాఫో¯Œ ఐడియా యూజర్ల సంఖ్య 30.9 కోట్లకు క్షీణించింది. జియో, బీఎస్ఎన్ఎల్ జోరు..: జియో 36 లక్షల కొత్త కనెక్షన్లు జారీ చేసింది. మొత్తం మీద 39.2 కోట్ల యూజర్లతో అగ్రస్థానంలో ఉంది. అటు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య సైతం 2 లక్షలు పెరిగి 11.9 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో క్షీణత..: పట్టణాల్లో మొబైల్ యూజర్ల సంఖ్య 92.3 లక్షల మేర తగ్గగా, గ్రామీణ ప్రాంతాల్లో 36.2 లక్షలు పెరిగింది. మే నెలాఖరు నాటికి మొత్తం మొబైల్ సబ్స్క్రయిబర్స్ సంఖ్య 114.39 కోట్లుగా, ల్యాండ్లైన్ యూజర్ల సంఖ్య 1.97 కోట్లుగా ఉంది. బీఎస్ఎన్ఎల్ ఫిక్స్డ్ లైన్ కస్టమర్ల సంఖ్య తగ్గుదల మేలోనూ కొనసాగింది. మొత్తం 1.34 లక్షలు క్షీణించింది. అటు జియో మాత్రం 90,000 కొత్త కస్టమర్లను సంపాదించుకుంది. పెరిగిన బ్రాడ్బ్యాండ్... మొత్తం టెలికం యూజర్ల సంఖ్య తగ్గినప్పటికీ బ్రాడ్బ్యాండ్ కస్టమర్లు మాత్రం పెరిగారు. వీరి సంఖ్య ఏప్రిల్లో 67.3 కోట్లుగా ఉండగా 1.13 శాతం పెరిగి 68.3 కోట్లకు చేరింది. వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు అత్యధికంగా 66.37 కోట్లుగా ఉండగా, వైర్లైన్ కనెక్షన్లు 1.93 కోట్లుగా ఉన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement