-
బాబుపై స్కిల్ కేసును కొట్టేయలేం
జస్టిస్ అనిరుద్ధ బోస్ ఏం చెప్పారంటే... ► స్కిల్ కేసుకు సెక్షన్ 17(ఏ) వర్తిస్తుంది.. చంద్రబాబుపై కేసు నమోదుకు ముందు గవర్నర్ అనుమతి తప్పని సరి.. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవచ్చు ► అనంతరం చంద్రబాబు విషయంలో ముందుకెళ్లొచ్చు జస్టిస్ బేలా త్రివేదీ ఏం చెప్పారంటే... ► 2018కి ముందు నేరాలకు సెక్షన్ 17(ఏ) వర్తించదు ► సెక్షన్ 17(ఏ) అమల్లో లేని కాలానికి దానిని వర్తింపజేయలేం ► చట్ట సవరణ చేసిన శాసనవ్యవస్థ ఉద్దేశం కూడా ఇదే ► 2018కి పూర్వ నేరాలకు వర్తింప చేస్తే చాలా వివాదాలు తలెత్తుతాయి ► గత నేరాలకు వర్తింప చేస్తే ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ► అంతేకాక చట్ట సవరణ తీసుకొచ్చిన ఉద్దేశమూ నెరవేరకుండా పోతుంది ► భిన్నమైన భాష్యం ప్రాథమిక దశలో దర్యాప్తునకు విఘాతం కలిగించడమే ► సెక్షన్ 17 (ఏ) తెచ్చింది అవినీతిపరులను కాపాడేందుకు కాదు ► వేధింపుల నుంచి నిజాయతీపరులైన వారిని కాపాడేందుకే ► అధికార విధుల్లో భాగం కాని నిర్ణయాలకు సెక్షన్ 17(ఏ) కింద రక్షణ సాధ్యం కాదు ► చంద్రబాబు రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు సరిగ్గానే వ్యవహరించింది ► తన పరిధి మేరకే నిర్ణయం తీసుకుంది ► 17(ఏ) కింద అనుమతి లేదని రిమాండ్ ఉత్తర్వులు కొట్టేయలేం ► హైకోర్టు తీర్పులో కూడా ఎలాంటి చట్ట విరుద్ధత లేదు ► ఏసీబీ కోర్టు, హైకోర్టు తీర్పుల్లో ఏ రకంగానూ జోక్యం అవసరం లేదు సాక్షి, అమరావతి: యువతలో ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరుస్తామంటూ వందల కోట్లు కొట్టేసిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరిట షెల్ కంపెనీల ద్వారా వందల కోట్ల రూపాయల్ని కాజేసినందుకు చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బాబుకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్దించింది. అంతేకాకుండా ఈ కేసులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు, ప్రభుత్వ కక్షసాధింపులు లేనేలేవని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. సీమెన్స్ సంస్థకు తెలియకుండానే ఆ కంపెనీ మాజీ అధికారులను తెరపైకి తెచ్చి ... బోగస్ ఒప్పందాలతో... ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు నేరుగా వందల కోట్లను తన ఖాతాల్లోకి మళ్లించుకున్న వ్యవహారంలో ఆయనపై ఆధారాలతో సహా ఏపీ సీఐడీ విభాగం కేసు నమోదు చేయటం తెలిసిందే. కేసులో బాబును అరెస్టు చేసి, ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు పరచటంతో... కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి... ఆరోగ్యం బాగాలేదని, ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటానని చెప్పి షరతులతో బెయిలు తీసుకుని బయటకు వచ్చారు. ఈ కేసులో అరెస్టయిన తరవాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి పెద్దపెద్ద న్యాయవాదులను ప్రత్యేక విమానాల్లో తెప్పించారు. మొదటి నుంచీ తనకు ఈ కేసుతో సంబంధం లేదనిగానీ, తాను అక్రమాలకు పాల్పడలేదని గానీ, డబ్బుల్ని షెల్ కంపెనీల్లోకి మళ్లించలేదని గానీ, సీమెన్స్ సంస్థ పేరిట బోగస్ ఒప్పందం చేసుకోలేదని గానీ వాదించకుండా... తాను మాజీ ముఖ్యమంత్రిని కాబట్టి, తనను అరెస్టు చేయాలంటే అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నరు అనుమతి తీసుకోవాలని, అలా తీసుకోకుండా సీఐడీ తనను అరెస్టు చేసింది కాబట్టి ఈ అరెస్టు చెల్లదని... కాబట్టి మొత్తం కేసును కొట్టేయాలని (క్వాష్ చెయ్యాలని) చంద్రబాబు వాదిస్తున్నారు. కింది కోర్టు నుంచి అత్యున్నత సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు తరఫు లాయర్లు ఇదే వాదన వినిపిస్తూ వచ్చారు. కేసును కొట్టేయడానికి కింది కోర్టు, రాష్ట్ర హైకోర్టు నిరాకరించటంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ మధ్యలోనే అనారోగ్య కారణాలు చూపించి బాబు బెయిలుపై విడుదలయ్యారు. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం... మంగళవారం తీర్పు వెలువరించింది. కేసును క్వాష్ చెయ్యాలన్న చంద్రబాబు అభ్యర్థనను తిరస్కరించింది. సీఐడీ పెట్టిన ఎఫ్ఐఆర్ను, ప్రత్యేక న్యాయస్థానం విధించిన రిమాండ్ను... అన్నింటినీ సుప్రీంకోర్టు బెంచ్ సమర్థించింది. అయితే గవర్నరు అనుమతి తీసుకున్నాకే చంద్రబాబును అరెస్టు చేయాలన్న సెక్షన్ 17ఏ విషయంలో ధర్మాసనంలోని ఇరువురు న్యాయమూర్తులూ భిన్నమైన తీర్పును వెలువరించారు. చంద్రబాబు నాయుడికి సెక్షన్ 17ఏ వర్తిస్తుందని, ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం గవర్నరు నుంచి అనుమతి తీసుకోవచ్చని జస్టిస్ అనిరుద్ధ బోస్ పేర్కొనగా... సెక్షన్ 17ఏ రాకముందే ఈ నేరం జరిగింది కాబట్టి చంద్రబాబుకు ఆ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేదీ స్పష్టంచేశారు. నిజాయితీపరులైన అధికారులను వేధింపుల నుంచి కాపాడాలన్న ఉద్దేశంతోనే సెక్షన్ 17ఏను తెచ్చారని, అవినీతి పరులను కాపాడేందుకు కాదని ఆయన స్పష్టంచేశారు. చంద్రబాబు రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు సరిగ్గానే వ్యవహరించిందని, తన పరిధి మేరకే నిర్ణయం తీసుకుందని విస్పష్టంగా చెప్పారు. మరి ఇప్పుడేం జరుగుతుంది? స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణమనేది రాజకీయ దురుద్దేశాలతో పెట్టినదని, తనను కక్షసాధింపుతోనే అరెస్టు చేశారని చంద్రబాబు చెబుతున్నారు. సుప్రీంకోర్టు మాత్రం ఈ వాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇది అవినీతికి సంబంధించిన స్పష్టమైన కేసు అని, దీన్లో రాజకీయ దురుద్దేశాలు గానీ, కక్ష సాధింపుగానీ లేవని తేలి్చచెప్పింది. సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చెయ్యడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో... ఎఫ్ఐఆర్లో ఐపీసీ 409 (ప్రజల నమ్మకాన్ని నేరపూరితంగా వంచించటం), సెక్షన్ 120బి (దురుద్దేశపూర్వక కుట్ర) వంటివి సెక్షన్ 17ఏతో సంబంధం లేనివి కనుక యథాతథంగా కొనసాగుతాయి. ఐపీసీ 409 కింద నేరం గనక రుజువైతే యావజ్జీవ శిక్ష పడుతుంది. కాకపోతే సెక్షన్ 17ఏ వర్తిస్తుందా? లేదా? అన్న విషయంలో మాత్రం బెంచ్లోని ఇద్దరు న్యాయమూర్తులూ భిన్నమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు కాబట్టి... ఈ అంశాన్ని ఇద్దరికన్నా ఎక్కువ మంది న్యాయమూర్తులుండే విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిందిగా కోరుతూ... కేసు ఫైళ్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని కోర్టు రిజిస్ట్రీని బెంచ్ ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం మేరకు బెంచ్ ఏర్పాటు ఉంటుంది. తీర్పుల కాపీలు అప్లోడ్ చేయకపోవడంతో అందులోని పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. జస్టిస్ బోస్ ఏం చెప్పారంటే... చంద్రబాబుపై కేసు నమోదు చేసే ముందు సెక్షన్ 17(ఏ) ప్రకారం ముందస్తు అనుమతి (గవర్నర్ నుంచి) తీసుకోవడం తప్పనిసరి అని జస్టిస్ బోస్ తన తీర్పులో పేర్కొన్నారు. అలా ముందస్తు అనుమతి తీసుకోకుండా చేపట్టే విచారణ లేదా దర్యాప్తు చట్ట విరుద్ధమవుతుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అందువల్ల అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1)(సీ), 13(1)(డీ), 13(2) ప్రకారం చంద్రబాబు విషయంలో ముందుకు వెళ్లడానికి వీల్లేదన్నారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గవర్నరు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవచ్చని, తదనంతరం అవినీతి నిరోధక చట్టం కింద (పీసీ యాక్ట్) చంద్రబాబు విషయంలో ముందుకెళ్లవచ్చునని తెలిపారు. అలాగే తనపై సీఐడీ నమోదు చేసిన కేసును, తనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలన్న చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చుతున్నట్లు జస్టిస్ బోస్ తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) కింద ముందస్తు అనుమతి తీసుకోనంత మాత్రాన రిమాండ్ ఉత్తర్వులు చెల్లుబాటు కాకుండా పోవని ఆయన తేల్చి చెప్పారు. జస్టిస్ బేలా త్రివేది... 17 (ఏ) ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ బోస్ తన తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది విబేధించారు. సెక్షన్ 17(ఏ) అమల్లోకి రాకమునుపే ఈ నేరం జరిగిందని... అది అమల్లో లేని కాలానికి దానిని వర్తింప చేయలేమని జస్టిస్ త్రివేది తీర్పునిచ్చారు. అవినీతి నిరోధక చట్టానికి 2018లో సవరణలు చేసి సెక్షన్ 17(ఏ)ను చేర్చిన నేపథ్యంలో... 2018కి ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17(ఏ) వర్తించదని, 2018, ఆ తరవాత జరిగిన నేరాలకే ఈ సెక్షన్ వర్తిస్తుందని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. చట్ట సవరణ చేసిన శాసనవ్యవస్థ ఉద్దేశం కూడా ఇదేనన్నారు. ‘‘17(ఏ)ను పూర్వ నేరాలకు వర్తింప చేయడానికి ఎంత మాత్రం వీల్లేదు. 17(ఏ) రావడానికి ముందున్న కాలానికి దీన్ని వర్తింప చేస్తే కొత్తగా అనేక వివాదాలకు తేరలేపినట్లవుతుంది. 2018కి ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17(ఏ)ను వర్తింప చేస్తే చట్ట సవరణ చేసిన ఉద్దేశం నెరవేరకుండా పోతుంది’’ అని ఆమె తేల్చి చెప్పారు. ప్రాథమిక దశలోనే దర్యాప్తునకు విఘాతం కలిగించినట్లవుతుంది... శాసనవ్యవస్థ సెక్షన్ 17(ఏ)ను తీసుకొచ్చి న ఉద్దేశానికి మరో రకమైన భాష్యం చెప్పినా కూడా అది అసమంజసమే అవుతుందని జస్టిస్ బేలా త్రివేదీ తెలిపారు. అంతేకాక ప్రాథమిక దశలోనే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలిగించినట్లు అవుతుందన్నారు. ‘‘2018కి ముందు కేసులకు కూడా సెక్షన్ 17(ఏ) వర్తిస్తుŠందన్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనతో ఏకీభవిస్తే, పెండింగ్లో ఉన్న అన్ని కేసుల్లోని విచారణలు, దర్యాప్తులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీని వల్ల చాలా కేసులు నిరర్థకంగా మారతాయి. అవినీతిని రూపుమాపేందుకు తీసుకొచ్చిన చట్టం తాలుకు ముఖ్య ఉద్దేశం నెరవేరకుండా పోతుంది. అసలు అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలపై వేధింపులకు గురికాకుండా నిజాయతీపరులైన అమాయక అధికారులను కాపాడటానికే సెక్షన్ 17ఏను తీసుకువచ్చారు. అంతేతప్ప అవినీతిపరులైన పబ్లిక్ సర్వెంట్లకు రక్షణ కల్పించడానికి కాదు’’ అని జస్టిస్ బేలా తన తీర్పులో విస్పష్టంగా చెప్పారు. విధుల్లో భాగం కాని నిర్ణయాలకు రక్షణ ఇవ్వకూడదు.. అవినీతి నిరోధక చట్టం సెక్షన్లతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదైనప్పుడు, కేసు నమోదుకు ముందు సెక్షన్ 17(ఏ) కింద అనుమతి తీసుకోలేదన్న కారణంతో ఎఫ్ఐఆర్ను కొట్టేయడం సాధ్యం కాదన్నారు. అధికార విధుల్లో భాగం కాని నిర్ణయాలకు సెక్షన్ 17(ఏ) కింద రక్షణ ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఏసీబీ కోర్టు తనకున్న పరిధి మేరకే రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. చంద్రబాబును రిమాండ్కు పంపడం ద్వారా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎలాంటి తప్పు చేయలేదని జస్టిస్ బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో సైతం ఎలాంటి దోషం గానీ, చట్ట విరుద్ధత గానీ లేదన్నారు. హైకోర్టు తీర్పులో ఏ రకంగానూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆమె తన తీర్పులో స్పష్టం చేశారు. మూడు నెలల తరువాత తీర్పు... ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. ప్రధానంగా సెక్షన్ 17(ఏ)పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ, సిద్దార్థ లూత్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, ఎస్.నిరంజన్ రెడ్డి, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదించారు. వాదనల అనంతరం అక్టోబర్ 17న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపు 3 నెలల తరువాత మంగళవారం తీర్పును వెలువరించింది. ఇరువురు న్యాయమూర్తులు కూడా సెక్షన్ 7(ఏ) విషయంలో భిన్న తీర్పులు వెలువరించారు. ఇక ఇప్పుడేమని అరుస్తారు..? కేసు కొట్టివేతకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం తనపై అన్యాయంగా కేసు పెట్టిందని, రాజకీయంగా వేధించేందుకు జైల్లో పెట్టారంటూ చంద్రబాబు, ఆయన వందిమాగధులు చేస్తూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది. తన తండ్రి విషయంలో ఏసీబీ కోర్టు అన్యాయంగా వ్యవహరించిందంటూ నారా లోకేష్ ఎల్లో మీడియా ఇంటర్వ్యూల్లో చేసిన ఆరోపణలు బూటకమని రుజువైంది. బాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు జడ్జిని, రిమాండ్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డిని సోషల్ మీడియాలో దారుణంగా దూషించిన టీడీపీకి సుప్రీం తీర్పు చెంపదెబ్బ కన్నా ఎక్కువే. సెక్షన్ 17(ఏ)ను తేల్చనున్న సీనియర్ న్యాయమూర్తి... ఇరువురు న్యాయమూర్తులు భిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఏర్పాటవుతుంది. ఈ విషయంలో సీజే జస్టిస్ చంద్రచూడ్ పాలనాపరమైన నిర్ణయం తీసుకుంటారు. జస్టిస్ బోస్ కన్నా సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలో విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేస్తారు. జస్టిస్ బోస్ ఇప్పుడు సీనియారిటీలో 5వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆయనకన్నా సీనియర్లు అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ లేదా రెండవ స్థానంలో ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, లేదా మూడవ స్థానంలో ఉన్న జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ లేదా నాల్గవ స్థానంలో ఉన్న సూర్య కాంత్.. ఈ నలుగురిలో ఒకరి నేతృత్వంలో విస్తృత ధర్మాసనం ఏర్పాటవుతుంది. ఈ విస్తత ధర్మాసనంలో కొత్తగా వచ్చే సీనియర్ న్యాయమూర్తితో పాటు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది కూడా ఉంటారు. ఈ ముగ్గురు కలిసి తిరిగి మొదటి నుంచి చంద్రబాబు కేసును విచారిస్తారు. జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ఇప్పటికే ఓ నిర్ణయాన్ని వెలువరించిన నేపథ్యంలో విస్తృత ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి నిర్ణయం కీలకమవుతుంది. అలాగే జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేది కేవలం సెక్షన్ 17(ఏ) విషయంలోనే భిన్నమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో విస్తత ధర్మాసనం సైతం ఇదే అంశంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. విస్తృత ధర్మాసనంలో ఉండే సీనియర్ న్యాయమూర్తి ఇప్పటికే నిర్ణయం వెలువవరించిన ఇరువురు న్యాయమూర్తుల్లో ఒకరి నిర్ణయాన్ని సమర్దించవచ్చు. ఎవరి తీర్పును సమర్దిస్తారో అప్పుడు 2 :1గా మెజారిటీతో ఆ తీర్పు ఖరారు అవుతుంది. ఒకవేళ జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల నిర్ణయాలతో ఏకీభవించకుండా ఆ సీనియర్ న్యాయమూర్తి మరో భిన్నమైన నిర్ణయాన్ని వెలువరిస్తే, అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును పంపాల్సి ఉంటుంది. మొట్టమొదటిసారి.... విచారణ ముంగిట చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో చంద్రబాబు ఈ కేసులో తొలిసారిగా కోర్టు విచారణను ఎదుర్కోనున్నారు. స్కిల్ కేసులో సీఐడీ తన దర్యాప్తును పూర్తి చేసి చార్జిïÙట్ దాఖలు చేసిన తరువాత ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణను (ట్రయల్) మొదలు పెడుతుంది. విచారణ జరిగే ప్రతీ సందర్భంలోనూ చంద్రబాబు కోర్టు ఎదుటకు హాజరు కావడం తప్పనిసరి. ఈ విధంగా చంద్రబాబు ఓ కేసులో కింది కోర్టులో విచారణను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. చంద్రబాబుపై కర్షక పరిషత్ కేసు మొదలుకుని ఇప్పటి వరకు ఎన్నో కేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసుల్లో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. చాలా కేసులను నేరం లోతుల్లోకి వెళ్లనివ్వకుండా సాంకేతిక కారణాలతో కొట్టేయించుకున్నారు. ఏ కోర్టు కూడా ఏ ఒక్క కేసులోనూ పూర్తిస్థాయి విచారణ (ట్రయల్) జరిపి చంద్రబాబు నేరం చేయలేదని క్లీన్చిట్ ఇచ్చిన సందర్భాలు లేవు. టెక్నికల్ అంశాలను లేవనెత్తుతూ అన్ని కేసుల్లోనూ తనకు మాత్రమే సాధ్యమైన ‘మేనేజ్మెంట్ స్కిల్స్’తో చంద్రబాబు ఇప్పటి వరకు బయటపడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన కేసును సైతం హైదరాబాద్ ఏసీబీ కోర్టు సాంకేతిక కారణాలతోనే కొట్టేసింది. ఈ కేసును కొట్టేసిన న్యాయాధికారి అటు తరువాత జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో హైకోర్టు జడ్జి అయ్యారు. ఇప్పుడు స్కిల్ కుంభకోణంలో అలా బయటపడేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. విస్మయకరంగా అరెస్టయిన 3 రోజులకే కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈసారి పాచికలు పారలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆయనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించాయి. దీంతో ఆయన ఏసీబీ కోర్టు విచారణను ఎదుర్కోక తప్పడం లేదు. బాబు కుంభకోణం నేపథ్యం ఇదీ.. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో షెల్ కంపెనీల ద్వారా ఖజానాకు చెందిన రూ.వందల కోట్లను కొల్లగొట్టారని పేర్కొంటూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఇచ్చి న ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కేసులో చంద్రబాబును నిందితునిగా చేర్చింది. గతేడాది సెపె్టంబర్ 9న ఆయనను అరెస్ట్ చేసి 10న విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అనంతరం సీఐడీ చంద్రబాబును తమ కస్టడీలోకి తీసుకుని విచారించింది. దీంతో ఈ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు తనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కూడా కొట్టేయాలంటూ చంద్రబాబు సెప్టెంబర్ 12న హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అరెస్టయిన 3 రోజులకే ఆయన ఈ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం విశేషం. ఈ పిటిషన్లో తన తరఫున వాదనలు వినిపించేందుకు చంద్రబాబు దేశంలోనే అత్యధిక ఫీజులు వసూలు చేసే ప్రముఖ న్యాయవాదులను రంగంలోకి దించారు. ఈ క్వాష్ పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం, చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు జíస్టిస్ శ్రీనివాసరెడ్డి నిరాకరించారు. ఏసీబీ కోర్టు రిమాండ్ ఉత్తర్వుల్లో సైతం జోక్యానికి నిరాకరించారు. అంతేకాక సెక్షన్ 17(ఏ) కూడా వర్తించదని సెపె్టంబర్ 22న వెలువరించిన తీర్పులో జస్టిస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. -
అడ్డంగా దొరికిన ‘రింగ్’ మాస్టర్
సాక్షి, అమరావతి: కట్టని రాజధాని.. నిర్మించని ఇన్నర్ రింగ్ రోడ్.. కావేవీ భూ దోపిడీకి అనర్హం అన్నట్టుగా టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా చంద్రబాబు చెలరేగిపోయారు. రాజధాని అమరావతి ముసుగులో యథేచ్ఛగా భూ దందా సాగించారు. కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం తనకే సాధ్యమని నిరూపించారు. గత ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి పాల్పడ్డ అవినీతి విస్మయ పరుస్తోంది. అందుకోసం లింగమనేని రమేశ్తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కు కూడా వాటా ఇవ్వడం కొసమెరుపు. ఈ కుంభకోణాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పూర్తి ఆధారాలతో సహా వెలికి తీసి కేసు నమోదు చేసింది. అలైన్మెంట్ బాబుది.. ముద్ర కన్సల్టెన్సీది అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్మెంట్ రూపొందించారు. ఆ ప్రకారం అమరావతిలోని చంద్రబాబు, లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి. దాంతో తమ భూముల విలువ పెరగదని గ్రహించిన చంద్రబాబు, నారాయణ.. సీఆర్డీయే అధికారులపై మండిపడ్డారు. వారిద్దరి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. అలైన్మెంట్ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి.. తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ను అమరావతి మాస్టర్ ప్లాన్లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్లో పొందు పరిచిన అలైన్మెంట్కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అంటే అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ‘హెరిటేజ్ ఫుడ్స్’కు భూములు ► ఐఆర్ఆర్ అలైన్మెంట్ను మెలికలు తిప్పడం ద్వారా లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్కు భూములు పొందారు. ఈ ప్రక్రియలో అప్పటి హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకుని ఉన్న కంతేరు గ్రామంలో హెరిటేజ్ ఫుడ్స్కు 10.4 ఎకరాలు పొందారు. ► 2014 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. అంతే కాకుండా లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. కానీ అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకునే లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. ► క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి మసి పూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్ చెప్పారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు. ► తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారని ప్రశ్నించేసరికి జవాబే లేదు. దాంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ ప్రో కో కింద ఇచ్చారన్నది స్పష్టమైంది. రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లు ఎత్తుగడల వల్ల చంద్రబాబు, లింగమనేని రమేశ్ కుటుంబాలకు చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తర్వాత మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే. ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. పవన్ కల్యాణ్కూ 2.40 ఎకరాల ప్యాకేజీ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతి పాపంలో పడికెడు వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్మెంట్కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్కు ఇవ్వడం గమనార్హం. కృష్ణా నదికి ఇవతలా అవినీతి మెలికలే ► సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించాలి. అక్కడి నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగుతుంది. అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. ► దీంతో ఈ అలైన్మెంట్పై నారాయణ సీఆర్డీఏ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం – కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఖరారు చేశారు. ఐఆర్ఆర్ కేసులో నిందితులు ఏ–1: చంద్రబాబు ఏ–2: నారాయణ ఏ–3: లింగమనేని రమేశ్ ఏ–4: లింగమనేని వెంకట సూర్య రాజవేఖర్ ఏ–5: కేపీవీ అంజని కుమార్ (రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్) ఏ–6: హెరిటేజ్ ఫుడ్స్ ఏ–7: ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ ఏ–14: లోకేశ్ బాబు, నారాయణ ఆస్తుల అటాచ్మెంట్ క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్లో పొందిన 75,888 చదరపు గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. -
3 కేసుల్లో నేడు సీఐడీ ఎదుట బాబు హాజరు
సాక్షి, అమరావతి: మూడు కేసుల్లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం ఆ కేసుల దర్యాప్తు అధికారుల వద్దకు వచ్చి పూచీకత్తులు సమర్పించనున్నారు. బాబు హాయాంలో జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), ఇసుక, మద్యం అక్రమాలపై కేసులు నమోదు చేయగా.. ఈ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పూచీకత్తులను దర్యాప్తు అధికారులకు ఆయన సమర్పించాల్సి ఉంది. ఉ. 11 గంటల తర్వాత మద్యం కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయానికి, ఇసుక కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయానికి మధ్యాహ్నం 3.30 గంటలకు, ఐఆర్ఆర్ కేసులో సాయంత్రం 4.20 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి వెళ్లి పూచీకత్తులు సమర్పించనున్నారు. -
పని నుంచి బడికి..
రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులుగా మగ్గుతున్న అనేక మంది పిల్లలను సీఐడీ అధికారులు గుర్తించి వారిని మళ్లీ బడిలో చేర్పిస్తున్నారు. ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ కార్యక్రమం బాల కార్మికుల జీవితాల్లో మళ్లీ విద్యా వెలుగులు తీసుకువస్తోంది. సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన చెందిన నాని.. ఏడో తరగతి తర్వాత చదువు మానేశాడు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఓ బైక్ మెకానిక్ షాపులో పనికి చేరాడు. రెండేళ్ల పాటు ఆ షాపులోనే సహాయకుడిగా పనిచేశాడు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలకు ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ పేరిట అవగాహన కార్యక్రమాలను చేపడుతున్న సీఐడీ అధికారులు.. నానిని చూశారు. అతని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చదువు ఆవశ్యకతను వివరించారు. పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. చదువుకుంటే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వారికి అవగాహన కల్పించారు. నానిని అదే బడిలో 8వ తరగతిలో చేర్చించారు. ప్రస్తుతం నాని తోటి పిల్లలతో కలిసి చక్కగా చదువుకుంటున్నాడు. ఇక తాను పనికి వెళ్లనని, బాగా చదువుకుని ఉద్యోగం చేస్తానని ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు. బాల కార్మికుల నుంచి మళ్లీ విద్యార్థులుగా.. సామాజికబాధ్యత కింద బాల కార్మిక వ్యవస్థ నిర్మూల కోసం సీఐడీ చేపట్టిన ‘ఆపరేషన్ స్వేచ్ఛ’ సాధించిన విజయమిది. ఇలా ఒక్క నాని మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులుగా మగ్గుతున్న అనేక మంది పిల్లలను సీఐడీ అధికారులు గుర్తించి వారిని మళ్లీ బడిలో చేర్పిస్తున్నారు. బాల కార్మికులుగా కష్టాల కడలిలో ఈదుతున్న వారిని సీఐడీ అధికారులు గుర్తించి సురక్షితంగా చదువుల తల్లి ఒడిలోకి చేర్చారు. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం బాల కార్మికుల జీవితాల్లో మళ్లీ విద్యా వెలుగులు తీసుకొస్తోంది. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమాన్ని సీఐడీ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం 26 జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సీఐడీ అధికారులతో పాటు మహిళా–శిశు సంక్షేమ శాఖ, బాలల సంక్షేమ కమిటీలు, వివిధ సామాజిక సేవా సంస్థల ప్రతినిధులతో జిల్లా స్థాయిల్లో కమిటీలను నియమించింది. ఈ ఏడాది మొత్తం నాలుగు దశల్లో 66 రోజుల పాటు ఆపరేషన్ స్వేచ్ఛ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి బాల కార్మికులను గుర్తించింది. ప్రధానంగా బాల కార్మికులను ఎక్కువుగా పనిలో పెట్టుకునే ఇటుక బట్టీల తయారీ, హోటళ్లు, వివిధ పారిశ్రామిక యూనిట్లు, కిరాణా దుకాణాలు, మెకానిక్ షెడ్లు, ఇతర చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా మొత్తం 1,506 మంది బాల కార్మికులను గుర్తించింది. వారిలో బాలురు 1,299 మంది ఉండగా.. బాలికలు 207 మంది ఉన్నారు. మొత్తం బాల కార్మికుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 609 మందిని వారి సొంత రాష్ట్రాలకు పంపించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. మన రాష్ట్రానికి చెందిన 897 మంది బాల కార్మికుల తల్లిదండ్రులతో చర్చించి వారికి అవగాహన కల్పించి.. ఆ పిల్లలను మళ్లీ బడుల్లో చేర్పించింది. బాల కార్మికులుగా మారడానికి కారణాలు తల్లిదండ్రులు లేకపోవడం:36 మంది పరీక్షల్లో ఫెయిల్ కావడం29 మంది పేదరికం: 984 మంది ఇతర కారణాలు:457 మంది మళ్లీ బడిలో చేరిన బాల కార్మికులు సామాజికవర్గాలవారీగా.. ఎస్సీ259 మంది ఎస్టీ131 మంది బీసీ719 మంది మైనార్టీ190 మంది ఓసీ 207 మంది మళ్లీ బడిలో చేర్పించే నాటికి బాల కార్మికులుగా పనిచేస్తున్నవారు.. ఇటుక బట్టీల్లో 138 మంది హోటళ్లలో 117 మంది పారిశ్రామిక యూనిట్లలో 143 మంది ఇతర చోట్ల 1108 మంది బాల కార్మికులుగా చేరేనాటికి వారి చదువులు ఇలా.. నిరక్ష్యరాస్యులు264 మంది అయిదో తరగతిలోపు 270 మంది అయిదు నుంచి పదో తరగతి 792 మంది చెప్పలేనివారు 180 మంది సామాజిక, ఆర్థిక దృక్కోణంలో విశ్లేషణ.. బాల కార్మికులను గుర్తించి కేవలం మళ్లీ బడుల్లో చేర్చడమే కాదు.. ఈ సమస్య మూలాలను గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా సీఐడీ కార్యాచరణ చేపట్టింది. అందుకోసం బాల కార్మికుల సామాజిక, ఆర్థిక అంశాలపైనా విస్తృతంగా అధ్యయనం చేస్తోంది. తద్వారా బాల కార్మిక వ్యవస్థను సమూలంగా పెకలించి వేసి బడి ఈడు పిల్లలు అందరూ కచ్చితంగా బడుల్లోనే ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించిన బాలల వివరాలిలా ఉన్నాయి.. సమన్వయంతో సత్ఫలితాలు బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడానికి అన్ని విద్య, మహిళా–శిశు సంక్షేమ, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపట్టాం. ఇతర రాష్ట్రాలకు చెందినవారిని ఆయా రాష్ట్రాలకు సురక్షితంగా చేరుస్తున్నాం. మన రాష్ట్రానికి చెందిన బాల కార్మికుల అవగాహనను పరీక్షించి తదనుగుణంగా తగిన తరగతిలో చేర్పిస్తున్నాం. మళ్లీ వారు పనిలోకి వెళ్లకుండా.. శ్రద్ధగా చదువుకునే వ్యవస్థను కల్పిస్తున్నాం. – కేజీవీ సరిత, ఎస్పీ, మహిళా భద్రత విభాగం, సీఐడీ సామాజిక బాధ్యతకు పెద్దపీట వేస్తున్న సీఐడీ సీఐడీ విభాగం అంటే కేవలం కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ మాత్రమే కాదు. సీఐడీకి అంతకుమించి విస్తృత పరిధి ఉంది. అందులో ప్రధానమైనది సామాజిక బాధ్యత. అందుకే బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. సీఐడీలో ప్రత్యేకంగా సామాజిక విభాగం కింద ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతాం. – సంజయ్, సీఐడీ అదనపు డీజీ -
10న సీఐడీ ముందుకు నారా లోకేశ్..
సాక్షి, అమరావతి: రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో ఈనెల 10వ తేదీన సీఐడీ అధికారుల ఎదుట విచారణకు స్వయంగా హాజరు కావాలని మాజీ మంత్రి నారా లోకేశ్ను హైకోర్టు ఆదేశించింది. సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ కింద నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరు కావాలని లోకేశ్కు స్పష్టం చేసింది. ఇదే కేసులో బెయిల్ కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రిజర్వు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ తనకు జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని, లేదంటే ఇంటివద్దే తనను విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ జరిపే అవకాశం ఉంది. కనిపించేంత దూరంలో న్యాయవాది ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో నారా లోకేశ్ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించవచ్చని, మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఇవ్వాలని హైకోర్టు సూచించింది. విచారణ సమయంలో లోకేశ్ కనిపించేంత దూరం వరకు మాత్రమే న్యాయవాదిని అనుమతించాలని నిర్దేశించింది. విచారణకు వచ్చేటప్పుడు నిర్దిష్ట డాక్యుమెంట్లు తీసుకురావాలని లోకేష్ను ఒత్తిడి చేయబోమని సీఐడీ చెప్పిన విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, దీన్ని అడ్డం పెట్టుకుని సాగించిన భూ దోపిడీ కేసులో నారా లోకేష్ను 14 నిందితుడిగా సీఐడీ చేర్చింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 4న తమ ముందు హాజరు కావాలంటూ ఇటీవల సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. విచారణకు వచ్చే సమయంలో హెరిటేజ్ భూముల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను తేవాలని పేర్కొంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేష్ మంగళవారం అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్ తరఫున టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ హెరిటేజ్లో లోకేష్ ఓ వాటాదారు మాత్రమేనన్నారు. హెరిటేజ్కు సంబంధించిన కీలక విషయాలు ఆయనకు తెలిసే అవకాశం లేదన్నారు. ఆ డాక్యుమెంట్లను ఇవ్వలేదన్న కారణంతో లోకేష్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీఐడీ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.దుష్యంత్రెడ్డి, స్పెషల్ పీపీ శివ కల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ నిర్దిష్టంగా ఫలానా డాక్యుమెంట్లు తేవాలని ఒత్తిడి చేయబోమన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇతర నిందితులతో కలిపి లోకేశ్ను కూడా విచారించాల్సి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 10న సీఐడీ ముందు హాజరు కావాలని లోకేశ్ను ఆదేశిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రింగ్ రోడ్డు కేసులో బాబు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు, తదనుగుణంగా సాగిన భూ దోపిడీపై సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన వివరాలన్నీ ఆయా ఫైళ్లలో భద్రంగా ఉన్నాయన్నారు. అందువల్ల సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ప్రశ్నే తలెత్తదన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణమే జరగనప్పుడు అవకతవకలకు ఆస్కారం ఎక్కడ ఉందన్నారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ చంద్రబాబు మరో కేసులో అరెస్టై జుడీషయల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఈ కేసులో కూడా ఆయన అరెస్టయినట్లు (డీమ్డ్) భావించాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాదుల వాదన సరికాదన్నారు. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసే ముందు సరెంట్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ పని చేయకుండా డీమ్డ్ అరెస్ట్ పేరుతో నేరుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యాజ్యానికి అసలు విచారణార్హతే లేదన్నారు. చంద్రబాబు పిటిషన్ను కొట్టి వేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 41 ఏ నోటీసును రద్దు చేయండి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ తనకు జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో నిందితుడైన మాజీ మంత్రి పొంగూరు నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ తన వాంగ్మూలాలను నమోదు చేయడం తప్పనిసరి అని దర్యాప్తు అధికారి భావిస్తే తన ఇంటి వద్దనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్ధించారు. విచారణ సమయంలో న్యాయవాదిని సైతం అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, పలు మేజర్ సర్జరీలు కూడా జరిగాయని పిటిషన్లో నారాయణ పేర్కొన్నారు. డాక్టర్లు తనను ఇంటి వద్దే ఉండాలని సలహా ఇచ్చారన్నారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపే అవకాశం ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement