సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో తర్జనభర్జన కొనసా గుతోంది. దర్యాప్తు చేపట్టి ఏడు నెలలు కావస్తున్నా అసలు నిందితులు దొరకనేలేదు. ఇప్పటివరకు సీఐడీ అధికారులు 81 మంది బ్రోకర్లను అరెస్ట్ చేశారు. వారిలో చాలా మంది బెయిల్ కూడా పొందారు. ఇక ప్రశ్నపత్రం ప్రింటింగ్ వ్యవహారం, ప్రింటింగ్ ప్రెస్నుంచి ఎవరు లీక్ చేశారు, అక్కడి నుంచి కీలక బ్రోకర్లకు చేరవేసింది ఎవరన్న వివరాలు పూర్తిస్థాయిలో తెలియలేదు. అంతేగాకుండా ఈ మొత్తం వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న కమిలేష్కుమార్ సింగ్ ఇటీవలే సీఐడీ కస్టడీలో గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో దర్యాప్తు అధికారులు ఆందోళనలో పడ్డారు.
తెగిన లింకు?
ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకువచ్చింది కమిలేష్కుమార్ సింగ్ అని సీఐడీ దర్యాప్తు అధికారులు అను మానించారు. కానీ ఈ అంశంపై విచా రిస్తున్న సమయంలోనే కమిలేష్ గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో కేసులో ఎలా ముందుకు వెళ్లాలో అర్థంకావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కమిలేష్తో పాటు మరొకరు కీలక పాత్ర పోషించారని.. అతడి ద్వారా ప్రశ్నపత్రం ప్రింటింగ్ ప్రెస్ నుంచి బయ టకు వచ్చిందని సీఐడీ అధికారుల విచా రణలో వెల్లడైనట్టు తెలిసింది. ఈ నేపథ్యం లో ఆ నిందితుడు ఎవరు, ఎలా గుర్తించాలి, మిగతా బ్రోకర్లు ఎవరనే దానిపై దృష్టి పెట్టారు. ఇక ఢిల్లీ శివారులో ఉన్న సదరు ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందిని సీఐడీ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు ప్రశ్నించారు. అయితే కమిలేష్ ఎవరో తమకు తెలియదని, అతడిని ఎప్పుడూ చూడలేదని వారు చెప్పడంతో ఎటూ తేలని పరిస్థితి నెలకొంది.
కేసులో అంతే సంగతులా?
ఈ కుంభకోణంలో గత ఏడు నెలల్లో ప్రధాన బ్రోకర్లు, బ్రోకర్లుగా మారిన తల్లిదండ్రులు, సాధారణ బ్రోకర్లు కలిపి 81 మందిని అరెస్టు చేసిన సీఐడీ... కీలక నిందితులను పట్టుకోవడంలో విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిలేష్ మృతితో ఈ కేసులో అసలు నిందితులు దొరకడం కష్టమేనని, దానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో... ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు అంశాలపై చార్జిషీట్లు దాఖలు చేయాలని సీఐడీ అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. కీలక నిందితుల అరెస్టు తర్వాత అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఎంసెట్ స్కాం దర్యాప్తు ఎటువైపు?
Published Fri, Jan 27 2017 3:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
Advertisement