breaking news
bunker
-
వచ్చేస్తోంది మన బాహుబలి
న్యూఢిల్లీ: ఇరాన్లోని ఫోర్డో భూగర్భ యురేనియం శుద్ధి కర్మాగారాలపై అమెరికా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులను పడేసి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో తమ అమ్ముల పొదిలోనూ అలాంటి బాహుబలి బాంబులు ఆత్యావశ్యకమని భారత సైన్యం భావించింది. అనుకున్నదే తడవుగా ఆ దిశగా రంగం సిద్ధంచేసిందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ భారత రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది. అత్యంత శక్తివంతమైన అగ్ని–5 ఖండాంతర క్షిపణికి బంకర్ బస్టర్ బాంబును మోసే సామర్థ్యాన్ని ఆపాదిస్తూ మిస్సైల్ను మరింత ఆధునీకరిస్తున్నట్లు డీఆర్డీఓ ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్లోని కిరానా హిల్స్లోని భూగర్భ అణుకేంద్రంపై భారత వాయుసేన బాంబులు పడేసిందన్న వార్తల నడుమ అధునాతన బంకర్ బస్టర్ బాంబు తయారీకి ఏర్పాట్లు జరుగుతుండటం విశేషం. ఏకంగా 100 మీటర్లు నేలలోకి చొచ్చుకుపోయేలా..అగ్ని–5 ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్కు అత్యంత బరువైన వార్హెడ్ను మోసుకెళ్లేలా మార్పులు చేయబోతున్నట్లు డీఆర్డీవో తెలిపింది. తొలుత రెండు వేరియంట్లలో ఈ కొత్త మిస్సైల్ను తయారుచేస్తారు. ఆకాశం నుంచి లక్ష్యంమీదకు జారవిడిచాక అది నేలలో ఏకంగా 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు. అవసరమైతే శత్రు భూగర్భ అణుకేంద్రాలను భూస్థాపితం చేయాల్సిందేనని ఇరాన్–అమెరికా ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని భారత్ తలపోస్తోంది. అందులో భాగంగానే బంకర్ బస్టర్ బాంబులతో సంప్రదాయక క్షిపణులను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. సాధారణంగా అగ్ని–5 క్షిపణి గరిష్టంగా 5,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధిస్తుంది. దూరం కంటే కూడా అత్యంత బరువును మోయగలిగేలా కొత్తవేరియంట్లను సిద్ధంచేస్తున్నారు. తొలి దశలో గరిష్టంగా 7,500 కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబును దీనిని అమర్చుతారు. పేలిపోవడానికి ముందు నేలలోకి గరిష్ట లోతులోకి చొచ్చుకుని పోయేలా కొత్తతరహా మెకానిజంతో దీనిని సిద్ధంచేస్తున్నారు. తక్కువ ఖర్చులో పని పూర్తయ్యేలా..అమెరికా ప్రయోగించిన భారీ బాంబులను క్షిపణు లు మోసుకెళ్లలేవు. వాటిని మోసేందుకు, లక్ష్యంపై జారవిడిచేందుకు ప్రత్యేకంగా స్టెల్త్ రకంగా నార్త్రోప్ బీ–2 స్పిరిట్ బాంబర్లను అమెరికా సమకూర్చుకుంది. ఒక్కో స్పిరిట్ బాంబర్ విమానం ఖరీదు వేల కోట్ల రూపాయలు. ఇదంతా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. దీనిని ప్రత్యామ్నాయంగా క్షిపణికి అమర్చి దాని ద్వారా బంకర్ బస్టర్ బాంబును రణక్షేత్రంలో పడేయాలని భారత్ భావిస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే తన అమ్ములపొదిలో ఉన్న అగ్ని–5ను ఈ కార్యం కోసం డీఆర్డీఓ ఎంచుకుంది. ఒకటి భూతలంపై.. మరోటి భూగర్భంలో..రెండు వేరియంట్లలో ఒకటి భూతలం మీది లక్ష్యాలను చేధిస్తుంది. ఇది నేలలోకి చొచ్చుకుపోదు. కేవలం భవన నిర్మాణాల వంటి కట్టడాలనే నామరూపాల్లేకుండా పేల్చేస్తుంది. మరో రకం నేలలోకి చొచ్చుకెళ్లాన తర్వాతే పేలుతుంది. రెండు వేరియంట్లు గరిష్టంగా 8,000 కేజీల బాంబును మోసుకెళ్లేలా సిద్ధంచేయాలని భావిస్తున్నారు. ఈ బాంబు అందుబాటులోకి వస్తే ఇంతటి వేలకేజీల బరువైన బంకర్బస్టర్ బాంబులున్న దేశాల సరసన భారత్ నిలుస్తుంది. శత్రువుల కమాండ్–కంట్రోల్ సెంటర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఈ బాంబులను ప్రయోగించనున్నారు. ఎప్పటికప్పుడు శత్రుత్వాన్ని పెంచుకుంటూ పక్కలో బళ్లెంలా తయారైన పాకిస్తాన్, చైనాలను నిలువరించాలన్నా, వాటి సైనిక సామర్థ్యాన్ని దెబ్బకొ ట్టాలన్నా భారత్కు ఇలాంటి భారీ బాంబుల అవసరం ఎంతైనా ఉందని డీఆర్డీఓ పేర్కొంది.హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా...ఎంత వేగంగా కిందకు పడితే అంతటి పెను వినాశనం సాధ్యమవుతుంది. అందుకే అత్యధిక హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా ఈ రెండు వేరియంట్లను తయారుచేస్తున్నారు. భూతల లక్ష్యాలను చేధించే వేరియంట్ మ్యాక్8 వేగంతో, భూగర్భ లక్ష్యాలను ఛిద్రంచేసే వేరియంట్ మ్యాక్20 వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు.బంకర్ బస్టర్ ఉపయోగాలేంటి?సైనిక బంకర్లు, క్షిపణి స్థావరాలు, భూగర్భ ఆయుధాగారాలు, భూగర్భ యురేనియం శుద్ధి కార్మాగారాలను భూస్థాపితం చేయాలంటే బంకర్ బస్టర్ బాంబుతోనే సాధ్యం. జీపీఎస్ ట్రాకింగ్, అతి వేగం, భారీ బరువు దీని ప్రత్యేకతలు. నేలపై పడగానే పేలకుండా నిర్దేశిత లక్ష్యం చేరుకునేదాకా నేలకు రంధ్రంచేసుకుంటూ లోపలికి వెళ్తుంది. ఈ క్రమంలో బాంబు పాడైపోకుండా బయటివైపు పటిష్టమైన ఉక్కు కవచం దీనిని రక్షణంగా ఉంటుంది. యుద్ధక్షేత్రంలో పోరాడే సైనికులు, యుద్ధట్యాంక్లు, డ్రోన్లకు దిశానిర్దేశం చేసే సైన్యాధికారులు భూగర్భంలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షితంగా ఉంటారు. ఈ కంట్రోల్ సెంటర్ను నాశనంచేస్తే రణక్షేత్రంలోని బలగాలకు సరైన దిశానిర్దేశం కరువవుతుంది. దీంతో ఆ శత్రుబలగాలను నిలువరించడం భారత బలగాలకు తేలిక అవుతుంది. శత్రువులు ప్రయోగించే కొన్ని రకాల బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు పాక్షిక భూగర్భ లాంఛర్ నుంచే దూసుకొస్తాయి. వీటిని భూస్థాపితం చేయాల న్నా బంకర్బస్టర్లు అవసరమే. -
చిక్కడు.. దొరకడు!
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. దాడులు, ప్రతిదాడులకు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలోకి అమెరికా సైతం అడుగుపెట్టడం అగి్నకి ఆజ్యం పోసినట్లయ్యింది. ఇజ్రాయెల్తోపాటు అమెరికాపై కత్తులు నూరుతున్న అసలు కథానాయకుడు, ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇప్పుడు ఎక్కడున్నారు? అనేది టాప్ సీక్రెట్గా మారింది. దశాబ్దాలుగా ఇరాన్ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ‘‘ఖమేనీ ఆధునిక హిట్లర్. అతడు బతికి ఉండడానికి వీల్లేదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ సైతం అన్నారు. చావుకు భయపడే మనిషి కాదు ఇరాన్లో ఈ నెల 12న ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచి్చతంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) అత్యున్నత స్థాయి అధికారులకు సైతం ఖమేనీ ఆచూకీ గురించి తెలియదని అంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం ఉప్పందకుండా ఇరాన్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు. అమెరికా దాడుల తర్వాత బంకర్లోకి.. సాధారణ పరిస్థితుల్లో ఖమేనీ సెంట్రల్ టెహ్రాన్లోని ఓ కాంపౌండ్లో ఉంటారు. అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తారు. మిలటరీ కమాండర్లు, అధికారులతో ప్రతివారం సమావేశమవుతారు. ప్రజలతో మాట్లాడాలన్నా ఇక్కడే. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరు. ఇజ్రాయెల్ దాడులు మొదలైన వెంటనే ఖమేనీ బంకర్లోకి వెళ్లలేదని సమాచారం. బయటే ఉంటూ ప్రతిదాడికి వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న అమెరికా సైన్యం యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన తర్వాతే ఆయన బంకర్లోకి చేరుకున్నారు. మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఖమేనీ మరింత అప్రమత్తమయ్యారు. తన విశ్వాసపాత్రులైన అనుచరులు, సహాయకులతోనూ కమ్యూనికేషన్ తగ్గించుకున్నారు. ఫోన్లు ఉపయోగించడం ఆపేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంటున్నారు. శత్రువులకు తన ఆచూకీ చిక్కకుండా ఉండడానికే ఈ జాగ్రత్త. శత్రువుల చేతికి చిక్కితే మరణాన్ని చేతులారా ఆహ్వానించినట్లేనని ఖమేనీని బాగా తెలుసు. ఆయనను ఖతం చేయడానికి ఇజ్రాయెల్ ఇప్పటిదాకా చేయని ప్రయత్నమే లేదు. ఇజ్రాయెల్ ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా ఎంతోమందిని హత్య చేసింది. కొద్ది రోజుల క్రితమే పేజర్ బాంబులతో హెజ్»ొల్లా నాయకులను మట్టుబెట్టింది. ఖమేనీని మాత్రం కనీసం టచ్ చేయలేకపోయిందంటే ఆయన ఎంత సురక్షితంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘‘ఏదో ఒకరోజు ఇజ్రాయెల్ నన్ను చంపేయడం ఖాయం. దేశం కోసం వీరమరణం పొందడం నాకు సంతోషమే’’ అని కొన్నేళ్ల క్రితం ఖమేనీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాహుబలి బాంబు
ఎప్పుడెప్పుడా అని ఇజ్రాయెల్ ఎంతో ఆశగా ఎదురుచూసినా బంకర్ బస్టర్ బాంబులను అమెరికా మోసుకొచ్చింది. అనుకున్న లక్ష్యాలపై అమాంతం పడేసింది. పర్వతప్రాంతాన్ని పిండిముద్దలా బద్దలుకొట్టింది. అత్యంత పటిష్టమైన కఠినశిలలను సైతం తునాతునకలు చేసే వేల కేజీల బరువైన భారీ బాంబులతో ఇరాన్ అణుకేంద్రాలపై భీకర దాడులుచేసిన అమెరికా బీ–2ఏ స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమానాల గురించి, అవి ప్రయోగించిన భారీ బంకర్ బస్టర్ బాంబుల గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. భూతలం మీది లక్ష్యాలను తునాతునకలుచేసే బాంబులను ప్రయోగించడం సర్వసాధారణం. కానీ ఇలా భూగర్భంలోని లక్ష్యాలను సైతం అలవోకగా చేధించి ఛిన్నాభిన్నంచేయగల శక్తివంతమైన పేలుడు ఆయుధాన్ని అమెరికా ఇటీవలికాలంలో ఎప్పుడూ ప్రయోగించలేదు. మిత్రదేశానికి సాయంగా ఇరాన్ యుద్ధంలో అడుగుపెట్టిన తొలిరోజే భారీబాంబులతో యుద్ధాన్ని అమెరికా కొత్త మలుపు తిప్పింది. బాంబు బరువు 13,600 కిలోలుఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ యురేనియం శుద్ధికర్మాగారాలపై ప్రయోగించిన జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) గైడెడ్ బాంబు బరువు ఏకంగా 13,600 కిలోలు. ఒక్కో బాంబు ఖరీదు రూ.170 కోట్లు. భూమిలోపల మరింత లోతుల్లో నిర్మించిన బంకర్లు, సొరంగాలను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా అమెరికా వైమానికదళం కోసం ఈ బాంబులను రూపొందించారు. ఒక గది పరిమాణంలో పిండిముద్దపై ఎంతపెద్ద రాయి పడేస్తే అంతలోతుకు అది వెళ్తుందికదా. అలాగే ఎంత భారీ బరువైన బాంబును పడేస్తే తొలుత అది అంతలోతుకు వెళ్తుంది. తర్వాత అది పేలుతుంది. అత్యంత లోతుల్లోకి చేరేందుకు అనువుగా ఈ బాంబును అత్యంత ఎత్తులోంచి జారవిడుస్తారు. అడ్డంగా పడిపోకుండా నిటారుగా, బాణంలాగా భూమికి గుచ్చుకునేలా బాంబు కొనకు జీపీఎస్ ట్రాకర్ అమర్చుతారు. మెరుపువేగంతో దూసుకొచ్చి..ఈ బాంబు పొడవు 20 అడుగులు. మొత్తం బాంబు బరువులో 80 శాతం బాడీ బరువే ఉంటుంది. మొత్తం వార్హెడ్లో కేవలం 20 శాతం మాత్రమే పేలుడుపదార్థం ఉంటుంది. తొలుత ఎక్కువ లోతుల్లోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఇలా దీనిని డిజైన్చేశారు. నేలను తాకినప్పుడు బయటిపొర ధ్వంసంకాకుండా ఉండేందుకు అత్యంత పటిష్టమైన ఫెర్రో–కోబాల్ట్ లోహమిశ్రమ కవచాన్ని అమర్చుతారు. చాలా లోతుకు వెళ్లాలంటే మరింత వేగంగా కిందకు పడాలి. అందుకోసం ఇది సూపర్సోనిక్ వేగంతో కిందకు దూసుకొస్తుంది. బరువు, వేగం, దిశ ఇలా అన్ని కలిసి దీనిని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చేశాయి. . ఆగకుండా 61 మీటర్లు చొచ్చుకెళ్లి..అత్యంత కఠినమైన శిలాప్రాంతంపై పడినా ఇది ఖచ్చితంగా 61 మీటర్ల లోతు అంటే 200 అడుగుల లోతు వరకు వెళ్లగలదు. అక్కడ ఇది పేలి ఆ ప్రాంతం మొత్తాన్ని నామరూపాల్లేకుండా తునాతు నకలు చేస్తుంది. అయితే ఆ లోతులో అణుకేంద్రంలేకుంటే ఎలా అనే సందేహం రావొచ్చు. మొదటి బాంబు పేలిన చోటే అత్యంత ఖచ్చితంగా మరో బాంబును పడేస్తారు. అది పేలి మరింత లోతు వరకు భూమిని పెకలించివేసి పెను విస్ఫోటనం సృష్టిస్తుంది. అలా అవసరమైనన్ని బాంబులను ఒకేచోట ఒకదాని వెంట మరోటి పడేసి లక్ష్యాన్ని ఎలాగైనా బద్దలుకొడతారు. కొత్తింటి కోసం బోరు వేసినప్పుడు ఉక్కు కేసింగ్లు ఎలాగైతే ఒకదాని వెంట మరోటి జతచేస్తూ రంధ్రం లోతును పెంచుకుంటూ పోతారో యుద్దంవేళ ఈ బాంబులతో అలా భూగర్భ నిర్మాణాలను నాశనంచేసే దాకా ఒకేచోట బాంబులను ప్రయోగిస్తారు. ఆదివారం అమెరికా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) బాంబు ఇదే పనిచేసింది. బాంబుకు తగ్గ విమానంఇంతటి బరువైన బాంబులను అలవోకగా మోస్తూ అత్యంత ఎత్తుల్లో ప్రయాణించగల సామర్థ్యమున్న బాంబర్విమానానికి మాత్రమే ఇంతటి సత్తా ఉంటుంది. అమెరికా అమ్ము ల పొది లోని బీ–2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమా నం మాత్ర మే ఈ పనిచేయగలదు. అందుకే ట్రంప్సేన వీటిని కదనరంగంలో మొహరించి ఇరాన్ అణుక్షేత్రాలపై మెరుపుదాడులు చేయించింది. బాంబులను అమర్చకముందు ఈ స్టెల్త్ విమానం బరువు ఏకంగా 71,000 కేజీలు. ఇది ఒకేసారి రెండు ఎంఓపీ బాంబులను మోసుకెళ్లగలదు. ఒక్కో విమానం ఖరీదు ఏకంగా రూ.18,000 కోట్లు. ఈ విమానాన్ని నార్త్రోప్ గ్రూమ్మన్ అనే ఆయుధ తయారీసంస్థ తయారుచేసి అమెరికా ఆర్మీకి విక్రయించింది. ఈ విమానం ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. మార్గమధ్యంలో ఇంధనాన్ని గాల్లోనే నింపుకుంటే మరో 7,500 కి.మీ.లు ప్రయాణించి బాంబులేస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?
న్యూఢిల్లీ: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకరయుద్ధం కొనసాగుతోంది. ఇంతలో ఇరాన్ నుంచి ఒక సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ.. ఒకవేళ తాను హత్యకు గురైతే తన స్థానంలో ‘ఈ ముగ్గురు’ సీనియర్ మతాధికారులలో ఒకరిని చీఫ్గా ప్రకటించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.ఇప్పటికే రహస్య బంకర్లో తలదాచుకున్న ఖమేనీ, తనను కనుక్కోవడం మరింత కష్టతరం చేయడానికి తన చుట్టూ ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను మూసివేయాలని అధికారులను ఆదేశించాడని ఆ వార్తాపత్రిక నివేదించింది. అయతుల్లా ఖమేనీ కుమారుడు మోజ్తాబా.. ఇతను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కు సన్నిహితుడైన మతాధికారి. ఈయన సుప్రీం చీఫ్ రేసులో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అతను ఖమేనీ పేర్కొన్న అభ్యర్థుల జాబితాలో లేడని, ఆయన పేర్కొన్న పేర్లలో మరో ముగ్గురు ఉన్నారని అధికారులు తెలిపారు.శుక్రవారం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్.. ఇరాన్ సుప్రీం లీడర్ను ఇకపై ఉనికిలో ఉంచే ప్రసక్తే లేదు అని పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి టెల్ అవీవ్ సమీపంలోని పట్టణంలోని ఒక ఆసుపత్రిని ఢీకొట్టిన అనంతరం కాట్జ్ ఈ వ్యాఖ్య చేశారు. ‘ఇరానియన్ నియంత రహస్య బంకర్లో కూర్చుని ఇజ్రాయెల్లోని ఆసుపత్రులు, నివాస భవనాలపై క్షిపణులను ప్రయోగిస్తున్నాడు. ఇది తీవ్రమైన యుద్ధ నేరం. వీటికి ఖమేనీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని కాట్జ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇరానియన్ సుప్రీంను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్)ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.ఇజ్రాయెల్కు ఎదురవుతున్న ముప్పును తప్పించేందుకు, ఖమేనీ పాలనను అంతం చేసేందుకు ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులను పెంచాలని ఆదేశించామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి పేర్కొన్నారు. మీడియా నివేదికల ప్రకారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరానియన్ అణు ప్రదేశాలపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కు మద్దతు పలకాలని భావిస్తున్న తరుణంలో యుద్ధ పరిణామాలు మరోమలుపు తిరిగాయి. ఇది కూడా చదవండి: ‘యుద్ధం’ ఆపితే నోబెల్ రాదు: ట్రంప్ అదే ‘మధ్యవర్తిత్వ’ వాదనలు -
రక్షణ ఆవిష్కరణల కేంద్రం ఐఐటీహెచ్
సాక్షి, హైదరాబాద్: ‘ఆపరేషన్ సిందూర్’నేపథ్యంలో దేశ సైనిక, రక్షణ రంగం ప్రదర్శించిన సాంకేతిక పాటవంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) కేంద్రంగా జరుగుతున్న రక్షణ రంగ పరిశోధనలు ఆసక్తికరంగా మారాయి. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీహెచ్లో ఇప్పటికే రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేసింది. ఐఐటీహెచ్లో జరుగుతున్న పరిశోధనలు ఏఐ, అడిటివ్ మాన్యుఫాక్చరింగ్, బయో మెడికల్ రిసెర్చ్ వంటి రంగాల్లో భారత సైనిక బలగాలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సాగుతున్నాయి. రక్షణ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు స్టార్టప్లను కూడా ఐఐటీహెచ్ ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మీ, నౌకదళాలు కూడా ఐఐటీహెచ్లో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. 2030 నాటికి విదేశాల నుంచి దిగుమతి అవుతున్న రక్షణరంగ ఉత్పత్తులను సగానికి తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడం లక్ష్యంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు పనిచేస్తాయి. స్వదేశీ ఆవిష్కరణలు డీఆర్డీఓ సహకారంతో ఐఐటీహెచ్లో 2023 ఏప్రిల్ 16న ‘డీఆర్డీఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’(డీఐఏ– సీఓఈ) ప్రారంభమైంది. రక్షణరంగ ఉత్పత్తుల్లో స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఇది పనిచేస్తోంది. హైపర్సోనిక్ వాహనాలకు అవసరమైన అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే మెటీరియల్స్ అభివృద్ధి చేయడంతోపాటు లార్జ్ ఏరియా అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ (అధునాతన 3డీ ప్రింటింగ్) వంటి అధునాతన సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది.రాకెట్ భాగాల తయారీకి దేశంలో అతిపెద్ద మెటల్ 3డీ ప్రింటర్ను ఉపయోగిస్తోంది. దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రాజెక్టులపై ఈ సీఓఈ దృష్టి సారిస్తోంది. మిస్సైల్ డిజైన్, ఆపరేషన్స్ కోసం కృత్రిమ మేధస్సు వినియోగం వంటి వాటిలో పరిశోధనలు సాగుతున్నాయి. సైనిక వైద్య సవాళ్లకు పరిష్కారం సైనికులు ఎదుర్కొంటున్న వైద్య సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంపైనా ఐఐటీహెచ్లో పరిశోధనలు జరుగుతున్నాయి. వైద్య పరిష్కారాలు, నవీన వైద్య పరికరాల అభివృద్ధి, శిక్షణ కోసం ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సరీ్వసెస్తో గత ఏడాది ఐఐటీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీహెచ్లోని బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగాల నైపుణ్యాన్ని ఉపయోగించి సైనికుల ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. మరోవైపు నౌకా రంగంలో రక్షణ సాంకేతికతను మెరుగుపరిచేందుకు ఆవిష్కరణల కోసం నావికాదళంతో ఐఐటీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏబీసీడీ (ఆర్మీ, బోర్డర్, సైబర్, డ్రోన్స్) ప్రోగ్రామ్ ద్వారా స్టార్టప్లను రక్షణ సాంకేతిక ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తూ నిధులు సమకూర్చేందుకు సహాయపడుతోంది. 3డీ ముద్రిత సైనిక బంకర్లు సైన్యం సహకారంతో ఐఐటీహెచ్కు చెందిన డీప్ టెక్ స్టార్టప్ ‘సింప్లిఫోర్జ్ క్రియేషన్స్’లద్దాఖ్లోని లేహ్ ప్రాంతంలో ‘ప్రాజెక్టు ప్రబల్’పేరిట సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో ఆన్సైట్ 3డీ ప్రింటెడ్ బంకర్ను నిర్మించింది. కేవలం 14 గంటల వ్యవధిలోనే రోబోటిక్ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో దీన్ని నిర్మించింది. ఎక్కువ ఎత్తులో, తక్కువ ఆక్సిజన్, తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా లభించే పదార్థాలతో రూపొందించిన కస్టమ్ కాంక్రీట్ మిశ్రమాన్ని బంకర్ నిర్మాణంలో ఉపయోగించారు. హిమాలయ పర్వత సానువుల్లో కఠినమైన వాతావరణ పరిస్థితులు, శత్రుదాడుల నుంచి సైనికులను రక్షించడంలో ఈ బంకర్లు తోడ్పడతాయి. రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతను ప్రోత్సహిస్తే సాధించే ఫలితాలకు ఈ బంకర్ ఒక మైలురాయి వంటిదని ఐఐటీహెచ్ వర్గాలు చెప్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో ఆవిష్కరణలు –బీఎస్ మూర్తి, డైరెక్టర్, ఐఐటీహెచ్ ఐఐటీ హైదరాబాద్లో రక్షణ రంగానికి సంబంధించి అనేక సాంకేతిక పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక మీటరు నుంచి రెండున్నర మీటర్ల మీటర్ల ఎత్తుకలిగిన వస్తు సామగ్రిని ముద్రించే అధునాతన 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఇక్కడ అభివృద్ధి చేశాం. 200 కిలోల పేలోడ్ లేదా ఇద్దరు వ్యక్తులను మోసుకెళ్లే డ్రోన్లను అభివృద్ధి చేశాం. సాంకేతికతల సంగమం, ఐఐటీహెచ్లోని వివిధ విభాగాల నడుమ భాగస్వామ్యాల ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని ఆవిష్కరణలు ఇక్కడ నుంచి వస్తాయి. -
ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్ సైనిక బంకర్
బెంగళూరు: భారత రక్షణ మౌలిక వసతుల, నిర్మాణ రంగంలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుడుతూ ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ముద్రిత సైనిక బంకర్ను లేహ్లో నిర్మించారు. సముద్రమట్టానికి 11,000 అడుగుల ఎత్తులో అసాధారణ పరిస్థితులను తట్టుకునేలా పటిష్టవంతంగా మిలటరీ బంకర్ను పోతపోయడం విశేషం. అప్పటికప్పుడు తయారుచేసిన ప్రత్యేక కాంక్రీట్ మిక్సర్ను ముందే డిజైన్ చేసిన విధంగా 3డీ విధానంలో నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఇండియన్ ఆర్మీ తరఫున అరుణ్ కృష్ణన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)హైదరాబాద్తోపాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బహుళ సాంకేతికతలు, ఉత్పత్తుల అంకుర సంస్థ సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ సంయుక్తంగా ‘ప్రబల్’ ప్రాజెక్ట్లో భాగంగా ఈ బంకర్ను నిర్మించారు. సముద్రమట్టానికి అత్యంత ఎత్తు, అత్యల్ప ఆక్సిజన్(హ్యాలో) పరిస్థితుల్లో ప్రపంచంలో నిర్మించిన తొలి బంకర్ ఇదేనని ప్రబల్ ప్రాజెక్ట్కు సారథ్యం వహించిన ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రహ్మణ్యం చెప్పారు. ‘‘అత్యంత మారుమూల ప్రదేశానికి ఈ ప్రింటర్ను తీసుకురావడం కూడా పెద్ద సవాల్గా మారింది. ఇంత ఎత్తులో దాదాపు కేవలం 40–50 శాతం ఆక్సీజన్ అందుబాటులోనే మేం, మా ప్రింటర్ పనిచేయాల్సి వచ్చింది. శత్రుసైన్యం బుల్లెట్లను తట్టుకునేలా అధునాతన డిజైన్లో పటిష్టంగా, పరిసరాల్లో కలిసిపోయే రంగులో బంకర్ను నిర్మించాం’’ అని ఆయన వెల్లడించారు. గతంలో తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోని బురుగుపల్లి గ్రామంలో ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెండ్ హిందూ ఆలయాన్ని సైతం ఇదే సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ నిర్మించింది. -
హెజ్బొల్లా రహస్య బంకర్లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అటు హమాస్, హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రయెల్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతుంది. ఇటీవల హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ను చంపిన ఇజ్రాయెల్.. ఈసారి హెజ్బొల్లా ఆర్థిక ఆస్తులను టార్గెట్ చేసింది. ఈ క్రమంలో హెజ్బొల్లా రహస్య బంకర్ను లక్ష్యంగా చేసుకొని చేసిన దాడిలో.. భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు గుర్తించింది. . ఓ ఆస్పత్రి కింద ఉన్న రహస్య సొరంగంలో మిలిటెంట్ గ్రూప్నకు సంబంధించి భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) వీడియో విడుదల చేసింది.“Tonight, I am going to declassify intelligence on a site that we did not strike—where Hezbollah has millions of dollars in gold and cash—in Hassan Nasrallah’s bunker. Where is the bunker located? Directly under Al-Sahel Hospital in the heart of Beirut.”Listen to IDF Spox.… pic.twitter.com/SjMZQpKqoJ— Israel Defense Forces (@IDF) October 21, 2024ఈ మేరకు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మాట్లాడుతూ.. హెజ్బొల్లా ఆర్థిక వనరులపై వరుసగా దాడులకు పాల్పడుతున్నాం. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో ఓ బంకర్ను ధ్వంసం చేశాం. ఆ రహస్య బంకర్లో భారీగా బంగారం, వేల డాలర్ల నగదును గుర్తించాం. ఇజ్రాయెల్పై దాడులకు ఈ నగదునే వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ మిలిటెంట్ గ్రూప్నకు బీరుట్ నడిబొడ్డున మరో రహస్య బంకర్ ఉంది. అల్ – సాహెల్ ఆస్పత్రి కింద ఉన్న ఆ రహస్య బంకర్లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలు ఉన్నట్లు తెలిసింది. ఆ బంకర్పై ఇంకా తాము దాడులకు పాల్పడలేదని, ఆ బంకర్లో 500 బిలియన్ డాలర్ల నగదు(రూ. 4,200 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా వేస్తున్నామని హగారీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంకర్ ఉన్న ప్రాంతం మ్యాప్ను కూడా చూపించారు. అయితే బంకర్ ఉన్న ప్రాంతంలోని ఆస్పత్రిపై దాడులకు పాల్పడమని, తమ యుద్ధం కేవలం హెజ్బొల్లాతో మాత్రమే అని హగారీ స్పష్టం చేశారు. లెబనీస్ పౌరులకు ఎలాంటి హానీ కలిగించమని పేర్కొన్నారు. మొత్తానికి ఈ పరిణామాల నేపథ్యంలో ఆస్పత్రిని అధికారులు ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. -
హమాస్ చీఫ్ బంకర్ చూస్తే షాక్ అవాల్సిందే.. భారీగా డబ్బు..
హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో మృతి చెందారు. తాజాగా ఆయనకు సంబంధించిన రహస్య బంకర్ వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గాజాలోని ఖాన్ యూనిస్ ఉన్న ఈ బంకర్లో వంటగది సామాగ్రి, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ పంపిణీ చేసిన సహాయక సమాగ్రి, మిలియన్ డాలర్ల భారీ నగదు, పెర్ఫ్యూమ్, వ్యక్తిగత షవర్ ఉన్నాయి. ఈ వీడియో ఫిబ్రవరి నెలకు సంబంధించినదిగా తెలుస్తోంది.ఇక.. అక్టోబరు 7న ఇజ్రాయెల్పై దాడికి సిన్వార్ సూత్రధారి. ఆయన రఫాకు పారిపోయే ముందు ఈ బంకర్లోనే కొన్నిరోజులు గడిపినట్లు తెలుసోంది. ఇస్మైల్ హనియే హత్య అనంతరం ఇజ్రాయెల్ సైన్యం సిన్వార్ను అంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అక్టోబర్ 16న జరిపని దాడుల్లో సిన్వార్ మృతి చెందారు.Hamas' eliminated leader Yahya Sinwar was hiding in this underground tunnel months ago:Surrounded by UNRWA bags of humanitarian aid, weapons and millions of dollars in cash.He hid like a coward underground, using the civilians of Gaza as human shields. pic.twitter.com/0ylVjTCv7H— Israel ישראל (@Israel) October 20, 2024 ‘‘హమాస్ నుంచి తొలగించబడిన నేత యాహ్యా సిన్వార్ కొన్ని నెలల క్రితం ఈ భూగర్భ సొరంగంలో దాక్కున్నారు. మానవతా సహాయం, ఆయుధాలు, మిలియన్ల డాలర్ల నగదుతో ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) బ్యాగులు ఉన్నాయి. ఆయన గాజా పౌరులను కవచాలుగా ఉపయోగించుకొని, పిరికివాడిలా భూగర్భంలో దాక్కున్నారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఎక్స్లో వీడియోను విడుదల చేసింది.Hamas leader Yahya Sinwar’s wife reportedly spotted with $32,000 Birkin bag as she went into hiding https://t.co/Dwqf0h7nTQ pic.twitter.com/JHZ5eMrYiZ— New York Post (@nypost) October 20, 2024 ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ 7 దాడికి ఒక రోజు ముందు యాహ్యా సిన్వార్ బంకర్ గుండా వెళుతున్నట్లు చూపించే వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఫుటేజీలో.. హమాస్ నాయకుడు సిన్వార్ తన కుటుంబంతో కలిసి బ్యాగులు, సామాగ్రిని చేతిలో పట్టుకుని నడుస్తున్నట్లు దృష్యాలు కనిపించాయి. సిన్వార్ భార్య సొరంగంలోకి పారిపోతున్నప్పుడు 32వేల అమెరికన్ డాలర్ల(సుమారు రూ. 27 లక్షలు) విలువైన ఖరీదైన హ్యాండ్బ్యాగ్ని తీసుకువెళ్లిన దృష్యం కనిపించింది.చదవండి: అక్టోబర్లో దాడులకు ముందు సిన్వర్ ఇలా.. -
ఇరాన్ దాడులు.. బంకర్లోకి ఇజ్రాయెల్ ప్రధాని పరిగెత్తారా?
ఇరాన్ మిసైల్స్తో ఇజ్రాయెల్పై భీకర దాడి చేసింది. సుమారు 400లకుపైగా బాలిస్టిక్ మిసైల్స్ను మంగళవారం ఇజ్రాయెల్పై ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు.. తాము వెంటనే అప్రమత్తమై ఇరాన్ మిసైల్స్ను తిప్పికొట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇక.. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.అయితే.. మంగళవారం ఇరాన్ ఇజ్రాయెల్పై మిసైల్స్ దాడులు చేసిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బంకర్లో తలదాచుకోవడానికి పరిగెత్తినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియో ముఖ్యంగా ఇరాన్ అనుకూల సోషల్మీడియా ఖాతాల్లో వైరల్గా మారటం గమనార్హం.La carrera de Netanyahu hacia el búnker tras el lanzamiento de misiles iraníes. Lástima que no le cayera uno en toda la cabeza y lo pulverizara, a él y a toda su estirpe de hdp. pic.twitter.com/DGkRywBNbj— Jaime 🏳️🌈 (@Elpieizquierdo) October 2, 2024 ఇరాన్ మంగళవారం చేసిన దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పరుగులు పెట్టారని సదరు వీడియోకు కామెంట్లు చేస్తున్నారు ఇరాన్ అనుకూల నెటిజన్లు. అయితే ఆ వీడియో.. ప్రస్తుత వీడియో కాదని.. 2021 నాటికి సంబంధించిన వీడియో అని నిపుణులు తేల్చారు. నెస్సెట్ సెషన్ (చట్టసభకు) హాజరయ్యే క్రమంలో ప్రధాని నెతన్యాహు అలా పరుగులు తీశారని.. అప్పడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా అవుతోందని వివరణ ఇచ్చారు.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. చిన్నపిల్లల కొట్లాటలా ఉంది: ట్రంప్ -
బంకర్లు అంటే ఏమిటి? యుద్ధ ప్రాంతాల్లో ఎందుకు అవసరం?
తరచూ బాంబు దాడులు జరిగే దేశాలలో భూగర్భ బంకర్లను నిర్మించడం తప్పనిసరి. ఇటువంటి దేశాలలో ఇజ్రాయెల్ ఒకటి. ప్రస్తుతం ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలూ క్షిపణులను పరస్పరం ప్రయోగించుకుంటున్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వారి ఇళ్లలోని బంకర్లలోనికి వెళ్లి తలదాచుకుంటున్నారు. యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బంకర్లలో తల దాచుకున్నవారు మాత్రం తమ ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నారు. బంకర్ ఎలా నిర్మిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. బంకర్ అంటే భూగర్భంలో నిర్మితమైన ఇల్లు. దీనిని భద్రతా ప్రయోజనాల కోసం నిర్మిస్తారు. ఈ బంకర్లు ఆర్మీ సైనికులు, అధికారులు, శివారు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో అవసరం అవుతుంటాయి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో బంకర్లను సైనిక అధికారులు, సైనికులు తమ భద్రత కోసం ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతల నివాసాలలో బంకర్లు ఉన్నాయి. బంకర్ అనేది సామాజిక, రసాయన, బాంబు, వైమానిక దాడుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ బంకర్లు సాధారణంగా ఉక్కు, కాంక్రీటు, కలపతో నిర్మిస్తారు. జాతీయ భద్రత కోసం పలు దేశాలు అణ్వాయుధాల నిల్వకు బంకర్లను నిర్మించాయి. ఈ బంకర్లు వేర్వేరు డిజైన్లను కలిగి ఉంటాయి. ఇది కూడా చదవండి: సౌదీ స్మార్ట్ సిటీ ‘నియోమ్’ ప్రపంచాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది? -
పాక్ ఆ బంకర్లలో ఏమి దాస్తోంది? అమెరికా రిపోర్టులో హడలెత్తించే వివరాలు?
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలింది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోలు ధర లీటరు రూ.300కి చేరింది. ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ మాత్రం అణ్వాయుధాలపై మోజు పెంచుకుంటూపోతోంది. అణ్వాయుధాల తయారీలో పూర్తి స్వింగ్లో ఉంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఏఎస్) తాజా నివేదిక ప్రకారం పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం దాదాపు 170 అణ్వాయుధాలు ఉన్నాయి. అమెరికా ఏం కనుగొంది? పాకిస్తాన్ అణ్వాయుధాలను గుర్తించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ఓపెన్ సోర్స్ మెటీరియల్స్ను అంటే ఇప్పటికే పబ్లిక్గా ఉన్న మెటీరియల్స్ను ఉపయోగించారు. ఉదాహరణకు.. వర్గీకరించిన పత్రాలు, రక్షణ బడ్జెట్ కేటాయింపు, సైనిక కవాతు, సైనిక అధికారుల ప్రకటనలు. ఇదేకాకుండా పాక్ మిలటరీ గార్రిసన్, ఎయిర్ ఫోర్స్ బేస్కు సంబంధించిన తాజా ఉపగ్రహ చిత్రాలను కూడా విశ్లేషించారు. వివిధ సైనిక దళాలు, వైమానిక దళ స్థావరాలకు సంబంధించిన తాజా ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన తరువాత పాకిస్తాన్ అణ్వాయుధాల కోసం కొత్త లాంచర్ సౌకర్యాలను నిర్మించినట్లు అమెరికా కనుగొంది. 5 నుంచి 10 అణ్వాయుధాలు.. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ నివేదికలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ ఒకవైపు అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటూనే మరోవైపు కొత్త ఆయుధాల కోసం ముడిసరుకును కూడా వేగంగా సేకరిస్తోంది. పాకిస్తాన్ ప్రతి సంవత్సరం 14-27 ఆయుధాలకు సరిపడా ముడిసరుకును సేకరిస్తోంది. కనీసంగా 5 నుండి 10 న్యూక్లియర్ వార్హెడ్లను ఉత్పత్తి చేస్తోందని నివేదిక అంచనా వేసింది. అణ్వాయుధాలను ఎక్కడ దాస్తోంది? నివేదికలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ తన అణ్వాయుధాలను నిల్వ చేసేందుకు కనీసం 5 సైనిక, వైమానిక స్థావరాలను వినియోగిస్తోంది. ఇందులో అక్రో, గుజ్రాన్వాలా, ఖుజ్దార్, పనో అకిల్ మరియు సర్గోధా గారిసన్ ఉన్నాయి. కాగా పాకిస్తాన్ 4 కొత్త ప్లూటోనియం ఉత్పత్తి రియాక్టర్ల కోసం కూడా పని చేస్తోంది. అలాగే యురేనియం రియాక్టర్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటోంది. ఇందుకోసం కొత్త మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఇది పాక్ అణు సామర్థ్యాన్ని మరింతగా పెంచుతోంది. 2025 నాటికి పాకిస్తాన్ అణ్వాయుధాల సంఖ్య 200కి చేరుకుంటుందని అంచనా. పెరిగిపోతున్న పాక్ రహస్య కార్యకలాపాలు ఈ నివేదికలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బంకర్ ప్రస్తావన కూడా ఉంది. పాకిస్తాన్ తన అణ్వాయుధాలకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. అయితే ఇస్లామాబాద్కు సమీపంలోని వా కంటోన్మెంట్ పరిధిలోగల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇందులో కీలక పాత్ర ఉందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా శాస్త్రవేత్తలు ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరుగుతున్న కార్యకలాపాలను చాలా కాలంగా గమనిస్తున్నారు. 2020 నాటికే 60 నుండి 80 అణ్వాయుధాలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లోపల 6 ఇగ్లూ ఆకారపు బంకర్లు ఉన్నాయి. వీటిని చాలా నీట్గా కవర్ చేశారు. ఈ బంకర్ల చుట్టూ ఎల్లప్పుడూ బహుళస్థాయి భద్రత ఉంటుంది. ఈ బంకర్లలో అణ్వాయుధాలను దాచి ఉంచినట్లు అమెరికా అనుమానిస్తోంది. 2020 నాటికే పాకిస్తాన్ వద్ద 60 నుండి 80 అణ్వాయుధాలు ఉండవచ్చని అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గతంలోనే అంచనా వేసింది. ఇప్పుడు ఈ తాజా నివేదిక అమెరికన్ ఏజెన్సీలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇది కూడా చదవండి: లాహోర్ భారత్లో భాగం.. అయినా పాకిస్తాన్కు ఎందుకు అప్పగించారు? -
రష్యాను వణికిస్తున్న ‘ఫ్లూ’ భయం.. ఇప్పటికే అనారోగ్యంతో పుతిన్! బంకర్లోనే
మాస్కో: రష్యాను ‘ఫ్లూ’ భయం వణికిస్తోంది. దేశంలో చాలా ప్రాంతాల్లో ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చాలామంది అంటువ్యాధి బారినపడినట్లు తెలిసింది. అధ్యక్ష భవనంలో అధినేత వ్లాదిమిర్ పుతిన్తో కలిసి పనిచేసే సిబ్బందికి సైతం ఫ్లూ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా పుతిన్ను అధికారులు రష్యా తూర్పు ప్రాంతంలోని ఉరాల్ పర్వతాల వెనుక ఉన్న ఓ బంకర్కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం పుతిన్ అక్కడే ఐసోలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం వేడుకలను ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి బంకర్లోనే జరుపుకుంటారని ఓ మీడియా సంస్థ పేర్కొంది. 70 ఏళ్ల పుతిన్ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యంపై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఏడాది రష్యా పార్లమెంట్ ఎగువ సభ డ్యుమాలో తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రతి ఏటా సంవత్సరం ఆఖరున నిర్వహించే మీడియా సమావేశాన్ని పుతిన్ రద్దు చేసుకున్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు. పుతిన్ ఇలా మీడియా సమావేశాన్ని రద్దు చేసుకోవడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే, ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా వైఫల్యానికి సంబంధించి విలేకరులు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేకే ఆయన వార్షిక మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
అమ్మకానికి బంకర్.. అణుదాడి జరిగినా తప్పించుకోవచ్చు!
అంతర్యుద్ధ కాలానికి చెందిన బంకర్ ఒకటి కారుచౌకగా అమ్మకానికి వచ్చింది. అణుబాంబుల దాడి నుంచి తప్పించుకునే ఉద్దేశంతో కట్టుదిట్టంగా నిర్మించిన ఈ బంకర్ ఇంగ్లండ్లోని లింకన్షైర్కు చెందిన లెగ్బోర్న్ ప్రాంతంలో ఉంది. అంతర్యుద్ధ కాలానికి చెందిన చాలాబంకర్లు ఇటీవలి కాలంలో సెల్ఫోన్ టవర్లుగా రూపాంతరం చెందినా, లింకన్షైర్లోని ఈ బంకర్ మాత్రం యథాతథంగా నిలిచి ఉంది. దీనిని 1959లో నిర్మించారు. లోపల చూస్తే, ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లా ఉంటుంది. ఒకవేళ అణుదాడి జరిగితే, అప్పుడు ముగ్గురు మనుషులు తలదాచుకోవడానికి వీలుగా ఇందులో ఒక ప్రత్యేక సొరంగం కూడా ఉంది. మార్క్ కోలెడ్జ్ అనే వ్యక్తి 2003లో దీనిని 12,500 పౌండ్లకు (రూ.11.65 లక్షలు) ఈ–బే వేలంలో సొంతం చేసుకున్నాడు. ఇప్పుడాయన దీనిని 25,000 పౌండ్లకు (రూ.23.31 లక్షలు) అమ్మకానికి పెట్టాడు. బాడీబ్యాగ్లు, గ్యాస్మాస్క్లు, అణుదాడులు జరిగినా పనిచేయగల ప్రత్యేకమైన రెడ్ టెలిఫోన్ వంటి సౌకర్యాలు ఉన్న ఈ బంకర్ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి! -
దేశ స్వాతంత్ర వేడుకల వేళ... బయటపడ్డ 38 ఏళ్ల నాటి సైనికుడు మృతదేహం
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాం. అజాది కా అమృత మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటూ.... నాటి త్యాగధనులను స్మరించుకుని ఆనంద పడుతున్న వేళ లాన్స్ నాయక్ చంద్రశేఖర్ అనే వీర సైనికుడి మృతదేహం హిమనీనాదం నుంచి బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని హల్ద్వానీలో ఒక కుటుంబం నిరీక్షణకు ఫలితం దక్కి నాటి మేఘదూత ఆపరేషన్ పాల్గొన్న వీర సైనికుడి మృతదేహం లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ 1984 సియోచిన గ్లేసియర్ని ఆక్రమించి పాకిస్తాన్ స్థానాలపై పట్టు సాధించేందుకు మేఘదూత ఆపరేషన్ని చేపట్టింది. అందులో భాగంగా భారత సైన్యం మే 29, 1984న19వ కుమావోన్ రెజిమెంట్ నుంచి ఒక బృందం ఈ ఆపరేషన్ కోసం బయలుదేరింది. అందులో లాన్స్ నాయక్ చంద్రశేఖర్ కూడా ఉన్నాడు. ఐతే ఆ బృందం ఆ రోజు రాత్రి హిమనీనాదంలో చిక్కుకుపోయింది. దీంతో ఒక అధికారి సెకండ్ లెఫ్టినెంట్ పిఎస్ పుండిర్తో సహా 18 మంది భారతీయ ఆర్మీ సైనికులు మరణించారు అని ఒక అధికారి తెలిపారు. మొత్తం 14 మంది మృతదేహాలు లభ్యం కాగా, ఐదుగురు గల్లంతయ్యారు. ఐతే భారత ఆర్మీ గస్తీకి వేసవినెలలో మంచు కరుగుతున్నప్పుడూ తప్పిపోయిన సైనికులను గుర్తించే బాధ్యతను అప్పగిస్తారు. అందులో భాగంగా గస్తీ వెతికే చర్యలు చేపట్టినప్పుడూ ఆగస్టు 13న సియాచిన్లో 16 వేల అడుగుల ఎత్తులో ఒక సైనికుడి అస్థిపంజర అవశేషాలు కనుగొన్నారు. ఆ అవశేషలపై ఉన్న ఆర్మీ నంబర్తో కూడిన డిస్క్ సాయంతో ఆ అవశేషం లాన్స్ నాయక్ చంద్రశేఖర్దిగా గుర్తించారు. చంద్రశేఖర్కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు అతని హయాంలో ఉన్న ఆర్మీ సిబ్బందితో సహా ఇతర అధికారులు, బంధువులు స్నేహితులు హల్ద్వానీకి తరలివచ్చి ఆ వీరుడికి కన్నీటి వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. 1984లో భారత ఆర్మీ చేపట్టిన ఈ మేఘదూత ఆపరేషన్ పాకిస్తాన్పై చేపట్టిన అత్యంత వ్యూహాత్మకమైన ఆపరేషన్గా మిగిలింది. భారతదేశ నియంత్రణలో ఉన్న అత్యంత కీలకమైన సియాచిన్ గ్లేసియర్ తూర్పు కారాకోరం శ్రేణిలో పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్ తోపాటు చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతాలైన షక్స్గామ్ వ్యాలీకి సరిహద్దుగా ఉంటుంది. (చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’) -
రాజపక్స ఉపయోగించిన రహస్య బంకర్ ఇదే కావొచ్చు!
శ్రీలంక రాజధాని కొలంబోలో నిరసనకారులు అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. పైగా రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఆయన నివాసంలోకి చొరబడి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో ఒక రహస్య బంకర్ బయటపడింది. ఈ రహస్య బంకర్ని ఉపయోగించే రాజపక్స పరారైనట్లు తెలుస్తోంది. ఇది భూగర్భ సోరంగంలా ఉంటుంది. లిఫ్ట్ ద్వారా మాత్రమే ఈ రహస్య బంకర్లోకి ప్రవేశించి తప్పించుకోగలరు. ఐతే శనివారం వేలాదిమంది నిరసనకారులు రాజపక్స నివాసంలోకి చొరబడి విలాసాలను ఆస్వాదిస్తూ...ఆయన వంటగదిలోకి ప్రవేశించి.. ఆహారాన్ని తింటూ కొందరూ, మరికొందరూ స్విమ్మింగ్ పూల్,జిమ్లలోకి ప్రవేశించి ఎంజాయ్ చేయడం వంటి పనులు చేశారు. ఈ మేరకు నిరసనకారులు ముట్టడించి హింసాత్మక నిరసనలు తెగబడటం, రాజీనామా చేయాలంటూ పెరిగిన డిమాండ్ల నడుమ రాజపక్స పారిపోవాల్సి వచ్చింది. ఐతే ఇంతవరకు గోటబయ రాజపక్స ఆచూకి తెలియరాలేదు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను పునర్జీవింప చేయడానికి... తన దౌత్యం, రాజీకీయ చతురత, అనుభవంతో ఈ దుస్థితి నుంచి బయటపడేయగలడన్న ఆశతో గత నెలలో రణిల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించాడు రాజపక్స. అయినప్పటికీ శ్రీలంకలో కనీస నిత్వావసర వస్తువుల ధరలు ఆకాశాన్నట్టడంతో.. ప్రజలు కొనుగోలు చేయలని దారుణ స్థితిలో ఉన్నారు. ఇంకోవైపు ఇంధన కొరతతోపాటు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం తదితర కారణాలతో కనీస ఆహారోత్పత్తులను సైతం దిగుమతి చేసుకోలేని దుస్థితిలో ఉంది శ్రీలంక. దీంతో ప్రజల్లో సహనం సన్నగిల్లిపోయి నిరసన జ్వాల కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు "గోట గో హోం" అంటూ నినాదాలతో రాజపక్స కార్యాలయాన్ని, అధికార నివాసాన్ని ముట్టడించారు. దీంతో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రహస్య బంకర్ను ఉపయోగించి పరారైనట్లు సమాచారం. (చదవండి: శ్రీలంక సంక్షోభం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా!) అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
మేమున్న అపార్ట్మెంట్పై దాడి జరిగింది
కీవ్లో ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఇక్కడ బాంబుల మోతమోగుతోంది. భద్రతా సిబ్బంది నన్ను, మరో 40 మంది విద్యార్థులను మా అపార్ట్మెంట్ నుంచి దూరంగా ఓ బంకర్కు తరలించారు. తర్వాత గంటకే మా అపార్ట్ మెంట్ పక్కన ఉన్న మెట్రో స్టేషన్పై మిస్సైల్ దాడి జరిగింది. మా అపార్ట్మెంట్లో రెండంత స్తులు కూడా దెబ్బ తిన్నాయి. బంకర్లో భయం భయంగా ఉంటున్నాం. కరెంటు, నీటి వసతి, ఆహారం సరిగా లేదు. త్వరగా ఇండియాకు తీసుకెళ్లాలి. – గాజుల అభిషేక్, మదనపల్లి, మాక్లూరు మండలం, నిజామాబాద్ -
‘ట్రంప్.. తిరిగి బంకర్లోకి వెళ్లు’
వాషింగ్టన్: సీటెల్ మేయర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై తీవ్ర విమర్శలు చేశారు. తిరిగి బంకర్లోకి వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు. సీహాజ్(క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్)లో జోక్యం చేసుకుంటానంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై స్పందిస్తూ.. సీటెల్ మేయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జార్జ్ ఫ్లాయిడ్ నరహత్యకు నిరసనగా అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. నిరసనకారులు రెచ్చిపోతుండటంతో వైట్ హౌస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. పరిస్థితులు చేయి దాటకముందే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను రహస్య బంకర్లోకి తీసుకెళ్లారు. ఈ సంఘటనను ఉద్దేశిస్తూ.. సీటెల్ మేయర్ ‘ట్రంప్ తిరిగి బంకర్లోకి వెళ్లు’ అంటూ వ్యాఖ్యానించాడు. జార్జ్ ఫ్లాయిడ్ నరహత్య వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఆందోళనకారులు సీటెల్ను ఆక్రమించుకున్నారు. వారిని ట్రంప్ దేశీయ ఉగ్రవాదులు అని వ్యాఖ్యానించారు. నిరసనకారులను వెనక్కి పివలకపోతే సీహాజ్లో జోక్యం చేసుకుంటానంటూ మేయర్ జెన్నీ దుర్కాన్వా, షింగ్టన్ రాష్ట్ర గవర్నర్ జే ఇన్స్లీలను ట్రంప్ హెచ్చరించారు. (బంకర్ బాయ్) Radical Left Governor @JayInslee and the Mayor of Seattle are being taunted and played at a level that our great Country has never seen before. Take back your city NOW. If you don’t do it, I will. This is not a game. These ugly Anarchists must be stopped IMMEDIATELY. MOVE FAST! — Donald J. Trump (@realDonaldTrump) June 11, 2020 -
ఆ సమయంలో బంకర్లో ట్రంప్..
వాషింగ్టన్ : పోలీస్ కస్టడీలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అమెరికా అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. వైట్హౌస్ వద్ద శుక్రవారం రాత్రి నిరసనలు మిన్నంటిన సమయంలో వైట్హౌస్ అడుగున నిర్మించిన బంకర్లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తరలించినట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. బంకర్లో ట్రంప్ దాదాపు గంటపాటు గడిపిన అనంతరం వైట్హౌస్ లోపలికి ఆయనను తీసుకువచ్చినట్టు ఆ కథనం పేర్కొంది. వైట్హౌస్ వద్దకు చొచ్చుకువచ్చేందుకు వందలాది మంది ప్రయత్నించిన క్రమంలో సీక్రెట్ సర్వీస్, యూఎస్ పార్క్ పోలీస్ అధికారులు నిరసనకారులను నిలువరించారు. వైట్హౌస్ వద్ద ఒక్కసారిగా కలకలం రేగడంతో ట్రంప్ బృందం అప్రమత్తమైంది. కాగా ట్రంప్తో పాటు మెలానియా ట్రంప్, బారన్ ట్రంప్లను కూడా బంకర్లోకి అధికారులు తోడ్కొనివెళ్లారా అనేది స్పష్టం కాలేదు. మిన్నెపొలిస్లో పోలీసు కస్టడీలో నల్లజాతీయుడు మరణించడం పట్ల మే 25 నుంచి అమెరికా అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. నిరసనల నేపథ్యంలో దాదాపు 15 రాష్ట్రాల్లో పోలీసులు, నేషనల్ గార్డ్ సభ్యులను అధికారులు రంగంలోకి దింపారు. చదవండి : జీ7లో భారత్ను చేర్చాలి : ట్రంప్ -
రాజ్భవన్ కింద అద్భుతం
-
రాజ్భవన్ కింద అద్భుతం
ముంబయి: ఒకటి కాదు రెండు ఏకంగా 150 మీటర్ల పొడవైన పాతకాలం నాటి బంకర్ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు వెలికి తీశారు. రాజ్ భవన్ పరిసరాల్లో ఓ భారీ బంకర్ ఉందని ఆయనకు కొందరు పూర్వీకులు సమాచారం ఇచ్చిన మేరకు దీనిని వెలుగులోకి తెప్పించారు. ఆయన ఉంటున్న మల్బార్ హిల్స్లోని రాజ్భవన్ కింద దీనిని గుర్తించారు. సాధారణంగా ఉండే బంకర్లకంటే ఇది భిన్నంగా ఉంది. అతి పొడవుగా ఉండి చిన్నచిన్న గదులతో ఉన్న ఈ బంకర్ ఆశ్యర్యం గొలిపేలా ఉంది. దీనిని రెండు వైపులా 20 అడుగుల ఎత్తయిన తలుపులు ఉన్నాయి. దీంతోపాటు దీనికి ప్రత్యేక మురుగనీటి పారుదల వ్యవస్ద లోపలికి వెళుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీనికి తూర్పు వైపు ఉన్న ద్వారాన్ని మూసి పశ్చిమ వైపు ద్వారం తెరిచారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీనిని మూసి దశాబ్దాలు గడుస్తున్నా చెక్కుచెదరకుండా బంకర్ ఉండటం ఆశ్చర్యకరం. గవర్నర్ విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర అధికారులు ఈ బంకర్ ను సందర్శించారు. ప్రత్యేక పురావస్తు అధికారులకు చెప్పి దాని సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తామని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారు. ఈ బంకర్ లో మొత్తం 13గదులు ఉన్నాయి. మొత్తం 5000 చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది. ఇందులో షెల్ స్టోర్, గన్ షెల్, కాట్రిజ్ స్టోర్, షెల్ లిఫ్ట్, పంప్, వర్క్ షాప్ వంటి రూములు ఇందులో ఉన్నాయి. దీనిని చక్కగా సంరక్షిస్తే మంచి పర్యాటక క్షేత్రంగా కూడా అభివృద్ధి చెందడం ఖాయం అని అధికారులు చెబుతున్నారు. -
సింగరేణిలో బంకర్ కూలి కార్మికుడి మృతి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్లోని సింగరేణి గనుల వద్ద బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. శ్రీరాంపూర్కు చెందిన శ్రీకాంత్(26) సీహెచ్పీ ప్రాంతంలోని బంకర్ వద్ద విధులు నిర్వహిస్తుండగా అది కూలటంతో శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే ఉన్న మరో ఏడుగురు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శిథిలాల నుంచి శ్రీకాంత్ మృతదేహాన్ని వెలికి తీశారు. అతని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. (శ్రీరాంపూర్) -
సొరంగం కాదు.. బంకర్లు