-
బేబమ్మ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
కృతి శెట్టి.. తెలుగు ప్రేక్షకుల అభిమాన ఉప్పెనలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆచితూచి సినీ అవకాశాలను అందుకుంటున్నట్టే ఫ్యాషన్ బ్రాండ్స్నూ ఆచితూచే ఎంచుకుంటూ కంఫర్ట్నే తన స్టయిల్గా మార్చుకుంది. ఆమె ఫాలో అవుతున్న బ్రాండ్స్లో ఓ రెండు ఇక్కడ.. మనల్ని మనలా ఇష్టపడటంలోనే అసలైన అందం ఉంటుంది ‘ఉప్పెన’లో ఉన్నట్లు ఇప్పుడు లేను అంటున్నారు. అయినా ఎప్పుడూ ఒకేలా ఉండలేం కదా! కొన్నిసార్లు మేకప్, హెయిర్ స్టైల్ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి. అంతమాత్రాన ప్లాస్టిక్ సర్జరీ అంటారా? నిజానికి మనల్ని మనలా ఇష్టపడటంలోనే అసలైన అందం ఉంటుంది! నితికా గుజ్రాల్.. ఎంతోమంది సెలబ్రిటీలకు ఇష్టమైన బ్రాండ్. ముంబైకి చెందిన నితికా అతి చిన్న వయసులోనే టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్గా ఎదిగింది. అల్లికలు, కుందన్ వర్క్స్తో అందమైన డిజైన్స్ను రూపొందించడంలో ఆమెది ప్రత్యేక ముద్ర. ఈ బ్రాండ్కి విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ధర మాత్రం లక్షల్లోనే. ఆన్లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. నితికా గుజ్రాల్ డిజైనర్ ధర రూ. 58,500/- అకోయ జ్యూలరీ.. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ట్రెండ్కి తగ్గట్టు ఫ్యాషన్ జ్యూలరీని క్రియేట్ చేస్తూ యూత్లో తెగ క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజే ఈ బ్రాండ్ను సెలబ్రిటీలకూ డిజైన్స్ను అందించే స్థాయికి చేర్చింది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆన్లైన్లోనే కొనుగోలు చేసే వీలు ఉంది. ఈ జ్యూలరీ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: ముఖానికి ఫేస్ యోగా! దెబ్బకు మొటిమలు, మచ్చలు మాయం!) -
IAA MOBILITY 2023: ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ షో - ఔరా అనిపిస్తున్న బ్రాండెడ్ కార్లు (ఫోటోలు)
-
మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్
ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్లు యూజర్ల ఏటాను చోరీ చేస్తున్నాయా? అంటే నివేదికలు అవుననే అంటున్నాయి. మోడ్రన్ టాప్ బ్రాండ్స్ కార్లలో డేటా ప్రైవసీ అనేది పీడకలే అంటూ కాలిఫోర్నియాకు చెందిన మొజిల్లా ఫౌండేషన్ తన తాజా పరిశోధనలో వెల్లడించింది. దాదాపు 25 కార్ బ్రాండ్లను సమీక్షించింది. ఆ సందర్బంగా సెక్స్ లైఫ్ నుంచి ఇష్టా ఇష్టాలు, పాలిటిక్స్ గగుర్పాటు కలిగించే ఇతర విషయాలు అన్నీ లీక్ అవుతున్నాయంటూ సంచలన అధ్యయన నివేదికను ప్రకటించింది. (గుడ్ న్యూస్: టీసీఎస్ వేల కోట్ల రూపాయల మెగా డీల్ ) మొజిల్లా ఫౌండేషన్ నిర్వహించిన వినియోగదారు గోప్యతా పరీక్షల్లో అవన్నీ విఫలమయ్యాయని తేలింది. పరిశోధనలో 84శాతం కార్ కంపెనీలు కారు యజమానుల నుండి సేకరించిన డేటాను సమీక్షించాయి, పంచుకుంటాయి లేదా విక్రయించాయి అని వెల్లడించింది. డ్రైవింగ్ డిజిటల్గా మారుతున్న యుగంలో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, విక్రయించడంపై ఆందోళన వ్యక్తం చేసిన మొజిల్లా అసలు తమ పరిశోధనలోని కంపెనీలేవీ గోప్యతపై దాని ప్రమాణాలను పూర్తిగా సంతృప్తి పరచలేదని తెలిపింది. సెక్స్ టాయ్లు ,మానసిక ఆరోగ్య యాప్ల తయారీదారులతో సహా ఇంత పేలవమైన సమీక్ష రాలేదని తెలిపింది. కార్ల తయారీదారులు తమ కార్లను 'కంప్యూటర్ ఆన్ వీల్స్' అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అంతా డొల్ల అని ప్రైపసీ ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్కు ప్రసిద్ధి చెందిన మొజిల్లా రిపోర్ట్ చేసింది. "ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే డోర్బెల్లు, గడియారాలు తమపై గూఢచర్యం చేస్తున్నాయని ఆందోళన నేపథ్యంలో కార్ బ్రాండ్లు కూడా తమ వాహనాలను డేటా-గాబ్లింగ్ మెషీన్లుగా మార్చడం ద్వారా నిశ్శబ్దంగా డేటా వ్యాపారంలోకి ప్రవేశించాయని మొజిల్లా పేర్కొంది. అధ్యయనం ప్రకారం టెస్లా టాప్లో ఉందంటూ మరో బాంబు పేల్చింది.నిస్సాన్ రెండో స్థానంలో నిలిచింది. నిస్సాన్ సేకరించే డేటాలో “లైంగిక కార్యకలాపాలు” ఎక్కువగానూ, అలాగే కియా కంపెనీ ప్రైవసీ సిస్టం ప్రకారం, జాతి, మతపరమైన లేదా తాత్విక విశ్వాసాలు, లైంగిక ధోరణి, లైంగిక జీవితం, రాజకీయ అభిప్రాయాలతోపాటు "ట్రేడ్ యూనియన్ సభ్యత్వం" సమాచారంతో సహా "ప్రత్యేక వర్గాల" డేటాను ప్రాసెస్ చేయవచ్చని పేర్కొంది. (క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!) 84 శాతం బ్రాండ్స్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను సర్వీస్ ప్రొవైడర్లు, డేటా బ్రోకర్లు , ఇతర బహిర్గతం చేయని వ్యాపారాలతో పంచుకున్నట్లు అంగీకరించినట్లు అధ్యయనం తెలిపింది. ఎక్కువమంది, 76 శాతం కస్టమర్ల డేటాను విక్రయించినట్లు చెప్పడం గమనార్హం. సగం కంటే ఎక్కువమంది డేటాను షేర్ చేస్తున్నట్టు చెప్పారు. కనెక్టెడ్ వాహనాలు డ్రైవింగ్ డేటామాత్రమే కాకుండా, వాహనంలోని వినోదం, శాటిలైట్ రేడియో మ్యాప్ లాంటి థర్డ్-పార్టీ ఫంక్షన్లను ట్రాక్ చేస్తున్నాయట. అత్యధిక సంఖ్యలో కార్ బ్రాండ్లు, 92 శాతం, కేవలం ఫ్రాన్స్కు చెందిన రెనాల్ట్, Dacia బ్రాండ్తో వినియోగదారులకు వారి వ్యక్తిగత డేటాపై ఎటువంటి నియంత్రణ లేకుండా అందిస్తోంది. బహుశా యూరోపియన్ యూనియన్ చట్టానికి లోబడి డేటా డిలిట్ రైట్ను వినియోగదారులకు అనుమతించి ఉండొచ్చని వ్యాఖ్యానించింది. కనీస భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్నుటికీ ఫోర్డ్, చేవ్రొలెట్, టయోటా, వోక్స్వ్యాగన్ , BMW వంటి కార్ల బ్రాండ్లు ఏవీ కూడా గత మూడేళ్లుగా 68 శాతం డేటా లీక్లు, హ్యాక్లు లేదా ఉల్లంఘన బారిన పడుతున్నాయని మొజిల్లా ఫిర్యాదు చేసింది. అయితే ఈ స్టడీపై టాప్ కంపెనీలేవీ ఇంకా ఎలాంటి స్పందన ప్రకటించలేదు. (రోజుకు రూ. 64 లక్షలు: ఇన్స్పిరేషనల్ సంజయ్ సక్సెస్ స్టోరీ తెలుసా?) కాగా ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కార్లు, భద్రత, డేటా నియంత్రణ, ఏఐ కి సంబంధించిన అన్ని రివ్యూల్లో ఫెయిల్ అనే విమర్శలను ఎదుర్కొంది. కస్టమర్ల కార్లలోని కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన వీడియోలు,ఫోటోలు ను ఉద్యోగులు పంచుకోవడం దుమారాన్ని రేపింది. అయితే 2021లో, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా చైనా సైనిక మిలిటరీకి ఈ వాహనాలను నిషేధించిన తర్వాత చైనాలో కెమెరాలు నిలిపివేసినట్టు టెస్లా ప్రకటించింది. -
తనిష్క్, రిలయన్స్కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ
ప్రముఖ వ్యాపార సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించ నుంది. ఇప్పటికే పలురంగాల్లో దూసుకుపోతున్న కుమార్ మంగళం బిర్లా నేతృత్వంలోని సంస్థ వేల కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు ఆదిత్యా బిర్లా ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ. 5000 కోట్ల పెట్టుబడితో 'నావల్ జ్యువెల్స్' అనే కొత్త వెంచర్ కింద ఆభరణాల వ్యాపారం ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రత్యేకమైన డిజైన్, అధిక నాణ్యత కలిగిన ఆభరణాల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో కొత్త వెంచర్ ఉంటుందని పేర్కొంది. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) వ్యూహాత్మక పోర్ట్ఫోలియో అని, తద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువ కావడానికి, సంస్థ ఉనికిని విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. ఇప్పటికే పెయింట్స్, B2B ఇ-కామర్స్లో ప్రవేశించడమే కాకుండా, మెటల్ పల్ప్ ఫైబర్, సిమెంట్, కెమికల్స్, టెక్స్టైల్స్, కార్బన్ బ్లాక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్ రిటైల్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో విస్తరించిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఇపుడిక బ్రాండెడ్ జ్యువెలరీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) దీంతో టాటా గ్రూప్నకు చెందిన తనిష్క్, రిలయన్స్ జ్యువెల్స్తో పోటీ పడనుంది ఆదిత్య బిర్లా గ్రూప్. కంపెనీ డేటా ప్రకారం, దేశీయ ఆభరణాల మార్కెట్ 2025 నాటికి సుమారు రూ. 7.43 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత రత్నాభరణాల మార్కెట్ వాటా దేశ జీడీపీలో 7 శాతం. -
బ్రాండెడ్ గుడ్డు గురూ.. ‘ఎగ్గోజ్’తో మరో సంచలనం!
సాక్షి, అమరావతి : బ్రాండింగ్ మానియా ఇప్పుడు కోడిగుడ్లకూ వచ్చి చేరింది. వివిధ రంగుల్లో, వివిధ పరిమాణాల్లో ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి వివిధ బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్నారు. ఆహార పదార్థాల కొనుగోళ్లలో వినియోగదారులు నాణ్యతకు అధిక ప్రాధాన్యతనిస్తుండటంతో వారి అంచనాలకనుగుణంగా గుడ్లను ప్రవేశపెడుతున్నారు. ఎలాంటి రసాయనాలు, యాంటి బయోటిక్స్ వినియోగించని సహజ సిద్ధమైన కోడి గుడ్లు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న గుడ్లు, అధిక ప్రొటీన్లున్న గుడ్లు.. ఇలా రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. సాధారణ గుడ్డు ధరతో పోలిస్తే ఈ బ్రాండెడ్ గుడ్ల ధరలు అధికంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం సాధారణ గుడ్డు ధర బహిరంగ మార్కెట్లో రూ.6 ఉంటే, బ్రాండెడ్ గుడ్డు దాని లక్షణాలను బట్టి ధర రూ.10 నుంచి రూ.25 దాకా ఉంటోంది. ఉదాహరణకు హ్యాపీ హెన్స్ బ్రాండ్తో విక్రయిస్తున్న సంస్థ ఫ్రీ రేంజ్ ఎగ్స్ను ఒక్కోటి రూ.25కు విక్రయిస్తోంది. ఈ గుడ్డు బరువు 100 గ్రాములుండటమే గాక, అధిక ప్రొటీన్లు, విటమిన్లతో ఉంటుందని చెబుతోంది. ‘ఎగ్గోజ్’తో సంచలనం ఖరగ్పూర్ ఐఐటీకి చెందిన అభిషేక్ నగీ 2017లో తొలిసారిగా ఎగ్గోజ్ పేరుతో బ్రాండెడ్ ఎగ్స్ను మార్కెట్లోకి విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఐఐటీ పూర్తి చేశాక ఒక రిటైల్ సంస్థలో ఉద్యోగంలో చేరినప్పటికీ కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనతో ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. కోడిగుడ్లు అధికంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతుండటం, వినియోగం మాత్రం ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండటాన్ని నగీ గమనించాడు. పైగా దక్షిణాది నుంచి ఉత్తరాదికి గుడ్డు రావడానికి ఎనిమిది రోజులకు పైగా సమయం పడుతోంది. ఈలోపు తనలో ఉన్న సహజసిద్ధమైన ప్రొటీన్లు కొన్నింటిని ఆ గుడ్డు కోల్పోతున్న విషయాన్ని గుర్తించారు. గుడ్డు పెట్టిన 24 గంటల్లోగా వినియోగదారుడికి చేర్చేలా ఎగ్గోజ్ బ్రాండ్ను ప్రవేశపెట్టి విజయం సాధించాడు. ఆ తర్వాత అనేక మంది బ్రాండెడ్ ఎగ్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ మార్కెట్లలో ఎగ్గోజ్తో పాటు కెగ్స్, గుడ్ మార్నింగ్, హలో, ఎగ్గీ, హెన్ ఫ్రూట్, ఫ్రెషో, ఫామ్ మేడ్, బీబీ కాంబో, హ్యాపీ హెన్ తదితర బ్రాండెడ్ గుడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కోళ్ల పెంపకం దగ్గర నుంచి గుడ్డు ఎంపిక వరకూ అంతా ప్రత్యేకం. కొన్ని కోళ్లను సహజసిద్ధమైన వాతావరణం అంటే తోటల్లో పెంచితే, మరికొన్నింటిని ఫామ్స్లో పెంచుతారు. వాటికి దాణా, మందులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని కోళ్లకు శాఖాహార దాణాను అందిస్తూ పెంచితే, మరికొన్నింటిని హెర్బల్స్, జీడిపప్పు, బాదంపప్పు వంటి ప్రత్యేక దాణాతో పెంచుతున్నారు. సాధారణంగా కోడిగుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాముల మధ్యలో ఉంటుంది. గుడ్డు పరిమాణం పెరిగే కొద్దీ ధర పెరుగుతుంది. 53–60 గ్రాముల మధ్యలో ఉండే గుడ్లను ప్రీమియం గుడ్లుగా, 60 గ్రాముల దాటితే సూపర్ ప్రీమియంగానూ పరిగణించి ధర నిర్ణయిస్తుంటారు. బ్రాండెడ్ గుడ్డును ఎంపిక చేసేప్పుడు గుడ్డుపై పెంకు నాణ్యత కూడా కీలకం. మచ్చలు లేకుండా పరిశుభ్రంగా ఉండి, మరీ మందంగా కాకుండా పల్చగా ఉండే గుడ్లను ఎంపిక చేస్తున్నారు. వాటిని అందంగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా గుడ్ల ప్యాకేజింగ్ పరిశ్రమ విలువ రూ.25,412.32 కోట్లుగా ఉంటే, అది ఏటా 6 శాతంపైన వృద్ధి చెందడం ద్వారా 2028 నాటికి రూ.37,960.24 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. బ్రాండెడ్ ఎగ్ మార్కెట్లోకి ప్రవేశించాం.. బ్రాండెడ్ ఎగ్స్ మార్కెట్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. హలో బ్రాండ్ పేరుతో మేమూ ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాం. ఇందుకోసం దాణా దగ్గర నుంచి గుడ్ల ఎంపిక వరకు అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. హై ఎండ్ ధరల సెగ్మెంట్లోకి కాకుండా సాధారణ గుడ్డు కంటే రెండు మూడు రూపాయలు అధికంగా ఉండే మార్కెట్పై తొలుత దృష్టిసారిస్తున్నాం. – సురేష్ చిట్టూరి, ఎండీ, శ్రీనివాస హేచరీస్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
క్లుప్తంగా
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement