Bank staff
-
క్రెడిట్ కార్డు బిల్లు కట్టమన్నందుకు..
మదనపల్లె(అన్నమయ్య): క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోవడంతో, బ్యాంక్ సిబ్బంది ఇంటివద్దకు వచ్చి నిలదీయడంతో అవమానంగా భావించి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. వేంపల్లె పంచాయతీ జంగావారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, కాంతమ్మ దంపతుల ఏకై క కుమారుడు శ్రీకాంత్(25) పట్టణంలోని ప్రైవేట్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో సేల్స్బాయ్గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ములకలచెరువు మండలం దేవలచెరువుకు చెందిన అనిల్కు తనపేరుపై ఉన్న క్రెడిట్కార్డు ద్వారా రూ.3లక్షల రుణం తీసిచ్చాడు. అయితే, అతను సకాలంలో రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ సిబ్బంది నుంచి వేధింపులు అధికమయ్యాయి. దీంతో తాను వ్యక్తిగతంగా దాచుకున్న డబ్బులతో పాటు కొంతమేర అప్పుచేసి మూడో వంతు రుణం చెల్లించాడు. ఇంకా రూ.40వేలు చెల్లించాల్సి ఉంది. ఈ నగదు చెల్లింపు కోసం శనివారం బ్యాంక్ సిబ్బంది శ్రీకాంత్ ఇంటివద్దకు వెళ్లి వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేసి నిలదీశారు. దీన్ని అవమానంగా భావించి మనస్తాపంతో ఆదివారం ఉదయం ఇంటివద్దే పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
లోన్ రికవరీ కోసం వచ్చిన సిబ్బంది.. కర్రలతో బెదిరించిన మహిళలు!
మాలూరు(బెంగళూరు): రుణాల వసూళ్లకు వచ్చిన డీసీసీ బ్యాంకు సిబ్బందిని మహిళలు కర్రలతో అడ్డుకుని బెదిరించిన ఘటన తాలూకాలోని రాజేనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. మాస్తి ఫిర్కా దిన్నేరి హారోహళ్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ పత్తిన సహకార సంఘం 2023 ఫిబ్రవరిలో రాజేనహళ్లి గ్రామానికి చెందిన ఏడు సీ్త్రశక్తి సంఘాలకు రూ. 5 లక్షల ప్రకారం మొత్తం రూ. 35 లక్షలు వడ్డీ రహిత రుణాలు ఇచ్చారు. రుణాలు తీసుకున్న మహిళలు ప్రతి నెలా రుణాలు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళా స్వసహాయ సంఘాల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ రుణాలు మాఫీ చేస్తుందనే విశ్వాసంతో మహిళలు ఉన్నారు. దీంతో రుణాల వసూళ్ల కోసం వచ్చిన అధికారులను, సిబ్బందిని ప్రతి గ్రామంలోను మహిళలు అడ్డుకుంటున్నారు. గతంలో మహిళలు స్వయం ప్రేరితంగా రుణాలు చెల్లించే వారు, అయితే గత నెల రోజుల నుంచి మహిళా సంఘాల సభ్యులు ఎవరూ రుణాలు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రుణాల వసూళ్ల కోసం వెళ్లిన దిన్నేరి హారోహళ్లి సహకార సంఘం కార్యదర్శి తిరుమేగౌడ, గుమాస్తా శ్రీనివాస్, అకౌంటెంట్ చిత్రలను మహిళా సంఘాల సభ్యులు కర్రలతో అడ్డుకుని బెదిరించారు. రుణాలు వసూళ్లకు ఎందుకు వస్తారని సిబ్బందిని నిలదీశారు. ఏం చేస్తారో చేసుకోండని అన్నారు. చదవండి: కుక్కలా అరవమని వేధిస్తూ..యువకుల పిచ్చి చేష్టలు.. -
కార్మిక హక్కులను కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా రెండు రోజులపాటు జరిగిన కార్మికుల సమ్మె తెలంగాణలో పాక్షికంగా, ప్రశాంతంగా ముగిసింది. సింగరేణి, జాతీయ బ్యాంకుల సిబ్బంది, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. వామపక్షాలు సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ.. కార్మిక హక్కులను కాపాడాలని, రైతులకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. బ్యాంకులు మూతపడ్డాయి. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా హైదరాబాద్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ దోపిడీదారుల కోసమే ప్రధాని నిరంకుశ విధానాలు అవలంభిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ సంస్థల జోలికొస్తే మసే.. విద్యుత్ సంస్థలు, ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించినట్లు చరిత్రలో లేదని, తమ జోలికొస్తే.. మాడిమసై పోతారని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మంగళవారం వేర్వేరుగా మహాధర్నాలు నిర్వహించారు. టీఎస్పీఈజేఏసీ ఆధ్వర్యంలో మింట్కాంపౌండ్లో, టీఈఈఏ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అలాగే విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైబర్సిటీ ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వేర్వేరుగా నిర్వహించిన ఈ మహాధర్నాల్లో ఆయా అసోసియేషన్ల ప్రతినిధులు పి.రత్నాకర్రావు, పి. సదానందం, సాయిబాబు, అనిల్కుమార్, ఎన్.శివాజీ, రామేశ్వర్శెట్టి, వినోద్, తుల్జా రాంసింగ్, పి.అంజయ్య, పరమేష్, వెంకటేశ్వర్లు, వీరస్వామి, బాలచంద్రుడు, గోవర్థన్, కొండా రెడ్డి, శ్రీనివాస్, నాగరాజు, మురలయ్య, తులసినాగరాణి, వెంకన్నగౌడ్, శ్యామ్మనోహర్, తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: కస్టమర్ను బ్యాంకులోనే ఉంచి తాళం.. ఏం జరిగిందంటే..!
హైదరాబాద్: బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వృద్ధుడు రాత్రంతా బ్యాంకులో ఉండిపోవడమే కాదు.. అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. సదరు కస్టమర్ 85 ఏళ్ల వృద్ధుడు కావడంతో చేసేదేమీ లేకుండా పోయింది. ఉదయం వరకూ అందులోనే ఉండిపోయి నానా ఇబ్బంది పడ్డాడు. చివరకు అన్న పానీయాలు లేక అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఉదయం సిబ్బంది వచ్చి బ్యాంకు తెరిచే వరకూ కూడా ఆ కస్టమర్ను తాళం వేసి వెళ్లిపోయామన్న సంగతి వారికి గుర్తుకురాలేదు. కానీ ఆ వృద్ధుడు బాగా నీరసించి అక్కడే పడిపోయి ఉండటంతో ఆయన్ను.. పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లాకర్ కోసమని 85 ఏళ్ల వృద్ధుడు జూబ్లిహిల్స్లోని యూనియన్ బ్యాంక్కు వచ్చాడు. లాకర్ చెక్ చేసుకునే క్రమంలో బ్యాంకు టై మగిసింది. ఆ వృద్ధుడు అక్కడే ఉండిపోయిన విషయాన్ని బ్యాంకు సిబ్బంది గమనించలేదు. తలుపులు వేసుకుని, బయట లాక్ చేసుకుని వెళ్లిపోయారు. ఫలితంగా ఆ వృద్ధుడు బ్యాంకులో ఉండిపోవడం, తెల్లారి వచ్చేసరికి అపస్మారక స్థితిలో వెళ్లిపోవడం జరిగింది. నిన్న(సోమవారం) బ్యాంకు పని మీద ఏ టైమ్కు వచ్చాడో కానీ బాగా నీరసించి పోయాడు. ఈ ఘటనపై సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు లోపం ఎక్కడ జరిగింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
హిజాబ్ వివాదం: యువతికి చేదు అనుభవం
Bihar Bank Stops Muslim Girl From Withdrawing Money: హిజాబ్ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలో మొదలైన ఈ వివాదం కాస్త ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తోంది. డబ్బులు డ్రా చేసేందుకు హిజాబ్ ధరించి బ్యాంకుకు వచ్చిన ఓ ముస్లిం యువతిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా హిజాబ్ తొలగించాలంటూ ఆమెతో వాదనకు దిగారు. ఈ ఘటన బీహార్లోని బెగుసరాయ్లో జరిగింది. ఓ ముస్లిం యువతి డబ్బులు విత్ డ్రా చేసేందుకు మన్సూర్ చౌక్లోని యూకో(యూసీవో) బ్యాంకు శాఖకు శనివారం వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆమె హిజాబ్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. హిజాబ్ను తీసి డబ్బులు డ్రా చేయాలని వాదనకు దిగారు. దీంతో సదరు యువతి హిజాబ్ తీసివేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనను ఆ యువతి తన మొబైల్లో రికార్డు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆ వీడియోను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా షేర్ చేశారు. ఈ ఘటనపై ఆయన బీహార్ సీఎం నితీశ్కుమార్పై మండిపడ్డారు. माननीय मुख्यमंत्री @NitishKumar जी, कुर्सी की ख़ातिर आप बिहार में यह सब क्या करवा रहे है? माना आपने अपना विचार, नीति, सिद्धांत और अंतरात्मा सब भाजपा के पास गिरवी रख दिया है लेकिन संविधान की जो शपथ ली है कम से कम उसका तो ख़्याल रखिए। इस कुकृत्य के दोषी लोगों को गिरफ़्तार कीजिए। https://t.co/Ryg9FXzOMX — Office of Tejashwi Yadav (@TejashwiOffice) February 21, 2022 -
బుక్ కీపర్ చేతివాటం!
పామర్రు : బ్యాంక్ లావాదేవీల కోసం నియమితులైన బుక్ కీపర్ / బ్యాంక్ కరెస్పాండెంట్ చేతివాటం ప్రదర్శించింది. సుమారు రూ.20 లక్షల వరకు నగదును బ్యాంక్లో జమ చేయకుండా సొంతానికి వాడేసుకుంది. దీంతో డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ప్రాకర్ల గ్రామంలో 12 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వీటిలోని సభ్యుల లావాదేవీలు చూసేందుకు గ్రామానికి చెందిన సోనియా గ్రూపు సభ్యురాలైన గొంతుపులి నిర్మలను బ్యాంక్ వారు కరస్పాండెంట్గా నియమించారు. సంఘాల సభ్యుల రుణాలు రికవరీ కోసం, పొదుపు కోసం ఇచ్చిన నగదును బ్యాంక్లో జమ చేయటం వంటి పనులు ఆమెకు చేయాల్సి ఉంది. ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇస్తున్న డ్వాక్రా రుణాలు, స్త్రీ నిధి రుణాలు పొందిన డ్వాక్రా మహిళలు వీటికి సంబంధించిన రుణాల రికవరీలను బుక్ కీపర్ బ్యాంక్లో జమ చేయాల్సి ఉంటుంది. గ్రామంలో ఉన్న మహిళలు చాలా మంది నిరక్షరాస్యులని గ్రహించిన ఆమె వసూలు చేసిన నగదుని బ్యాంక్లో చెల్లించకుండా వాటిని తన అవసరాలకు వాడుకుంటూ కాలం గడుపుతోంది. బ్యాంక్ పాస్ పుస్తకాలను సైతం సంబంధిత సభ్యులకు ఇవ్వకుండా తాత్సర్యం చేస్తోంది. వాటి కోసం ఎవరైనా అడిగితే ఇకపై మీకు రుణాలు రావంటూ.. బెదిరిస్తూ లక్షలలో సొమ్మును గల్లంతు చేసింది. ఇలా ఆరు నెలలుగా ఒక్కొక్క గ్రూపులో సుమారు రూ.2 లక్షల వరకు మొత్తం సుమారు రూ.20 లక్షల వరకు జమ చేయకుండా ఇబ్బందులకు గురి చేసినట్లు సమాచారం. అడిగితే ఎదురుదాడి.. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన బ్యాంక్ పుస్తకాలు అన్నీ తన వద్దే పెట్టుకుని, ఎవరైనా పుస్తకం అడిగితే మిషన్ పని చేయటం లేదు, మీ డబ్బులను నేను తినేస్తానా.. అంటూ ఎదురు ప్రశ్నించేది. అమాయకులైన స్థానికులు సరేలే మన ఊరు అమ్మాయేగా ఏమౌతుందిలే అని ధీమాగా ఉన్నారు. ఈ విధంగా గ్రామంలోని అన్ని గ్రూపుల సభ్యుల నగదుని గుటకాయస్వాహా చేయటంతో సభ్యులు, స్థానికులు తొలుత సంబంధిత నిడిమోల బ్యాంక్కు వెళ్లి అక్కడి వారిని అడిగారు. తమకేమీ సంబంధం లేదు, మీ గ్రామంలో బ్యాంక్ కరస్పాండెంట్ ఉన్నది ఆమెను అడగండి.. అంటూ సమాధానం చెప్పారు. చేసేది లేక ఐకేపీ ఏపీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీఎం సంబంధిత వ్యక్తికి ఫోన్ చేసి హెచ్చరించారు. నీ మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి.. సరి చేసుకోవాలని చెప్పారు. దీంతో నిర్మల ఈనెల 19, 20 తేదీలలో కొంత నగదుని (సుమారు రూ.4 లక్షలు) బ్యాంక్లో జమ చేసింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు, మహిళలు అందరూ కలిసి బుధవారం పామర్రులోని ఐకేపీ కార్యాలయానికి వచ్చారు. ఏపీఎం లేకపోవడంతో అక్కడకు వచ్చిన సీసీని వివరణ అడిగారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో అందరూ కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న బుక్ కీపర్ అక్కడికి చేరుకుని వారిని బతిమలాడింది. గ్రామ పెద్దల సమక్షంలో మిగిలిన బకాయిలను నెల రోజుల లోపు అందజేస్తానని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చింది. దీంతో మహిళలు శాంతించి వెనుతిరిగారు. -
బ్యాంకులో మోగిన అలారం
తాడేపల్లి రూరల్ (మంగళగిరి) : మంగళగిరిలోని ఎస్బీఐలో ఉన్నట్టుండి సోమవారం రాత్రి అలారం మోగడం ప్రారంభించింది. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురై సీఐ హరికృష్ణ, ఎస్సై వినోద్కుమార్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని పరిశీలించగా ఎటువంటి అనుమానించదగ్గ అంశాలు కనపడలేదు. అలారం అరగంట మోగి ఆగిపోయింది. అయితే బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని పోలీసుల పరిశీలనలో నిర్ధారించారు. బ్యాంకులో మొత్తం 6 కిటికీలు ఉండగా, వాటి తలుపులన్నీ తీసి వెళ్ళినట్లు గుర్తించారు. దీనిపై బ్యాంకు అధికారులు, సిబ్బందితో మాట్లాడేందుకు సీఐ ప్రయత్నించగా ఎవ్వరూ అందుబాటులోకి రాలేదు. చివరకు పోలీసులే ఆ కిటికీల గుండా లోపలకు టార్చిలైట్లు వేసి పరిశీలించారు. పోలీసులు అక్కడే బ్యాంకు సిబ్బంది రాక కోసం ఎదురుచూస్తూ నిరీక్షిస్తున్నారు. -
బ్యాంకులో కలకలం: ఉన్మాది వీరంగం
సాక్షి, నిడమనూరు: బ్యాంకులో రుణం కోసం వచ్చిన వ్యక్తి ఉన్మాదిగా ప్రవర్తించిన ఘటన నల్లగొండ జిల్లాలో కలకలం రేపింది. నిడమనూరు మండలం తుమ్మడంలో ఓ వ్యక్తి లోన్ కోసం మంగళవారం ఆంధ్రా బ్యాంకుకు వచ్చాడు. కొంతసేపటి తర్వాత అతడు ఉన్మాదిలా ప్రవర్తించి బ్యాంకు సిబ్బందిపై దాడికి దిగాడు. బ్యాంకులోని సామాగ్రిని ధ్వంసం చేశాడు. పత్రాలను చిందవందరగా పడేసి వీరంగం సృష్టించాడు. చివరికి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడ్డిన బ్యాంకు సిబ్బందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు దాడి చేశాడనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. -
బ్యాంకు సిబ్బంది దూషించారంటూ..
శాలిగౌరారం : బ్యాంకు సిబ్బంది దూషించారంటూ ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలకేంద్రంలో శుక్రవారం జరిగింది. అంబారిపేటకు చెందిన మొలుగూరి రమేశ్ స్థానికంగా ఉన్న పెట్రోల్బంక్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అంబారిపేటకు చెందిన నక్కల ప్రవీణ్, అడ్లూరుకు చెందిన బోడ దానయ్యలు స్థానిక ఎస్బీఐ నుంచి గత సంవత్సరం ‘ముద్ర’ పథకంలో భాగంగా ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున వ్యక్తిగత రుణాలు పొందారు. ఆ ఇద్దరికి రమేశ్ జామీనుగా ఉన్నాడు. వారు రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో జామీనుగా ఉన్న రమేశ్పై బ్యాంక్ మేనేజర్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో రమేశ్ తన భార్యమీద ఉన్న బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి ప్రవీణ్ పేరున ఉన్న అప్పులో రూ.16 వేలు చెల్లించాడు. అనంతరం దానయ్య కూడా రూ.20వేలు చెల్లించాడు. ప్రవీణ్ అప్పు చెల్లింపు తక్కువగా జరగడంతో 20 రోజుల క్రితం మరోమారు జామీనుగా ఉన్న రమేశ్ వద్దకు వెళ్లిన మేనేజర్.. రమేశ్ సెల్ఫోన్ను తీసుకొచ్చాడు. ఇంతలో ప్రవీణ్ భార్య సభ్యురాలుగా ఉన్న సమభావనా సంఘానికి ఇదే బ్యాంక్నుంచి రుణం మంజూరు కావడంతో ప్రవీణ్ భార్య వాటాకు వచ్చిన రూ.31 వేల మొత్తాన్ని తిరిగి శుక్రవారం చెల్లించాడు. దీంతో నా సెల్ఫోన్ను తిరిగి ఇవ్వాలని జామీనుగా ఉన్న రమేశ్ బ్యాంకు మేనేజర్ను కోరాడు. దానయ్య అప్పుకూడా చెల్లించిన తర్వాతే సెల్ఫోన్ ఇస్తానని చెప్పడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన రమేశ్ అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన మాగి రవికి జరిగిన విషయాన్ని తెలి పాడు. దీంతో ఇద్దరు కలిసి సాయంత్రం బ్యాం కుకు వెళ్లి మేనేజర్తో సెల్ఫోన్ విషయం మాట్లాడుతుండగా బ్యాంకు సిబ్బంది ఒకరు రవి పట్ల దురుసుగా మాట్లాడి దూషించాడు. దీంతో అవమానానికి గురైన మాగి రవి బ్యాంకు ఎదుట ఒంటిపై పెట్రోల్పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనిం చిన సమీప వ్యక్తులు రవిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ మధుసూధన్రెడ్డి బయటకు వచ్చి రవిపై నీళ్లుపోశారు. కొంతమంది రవికి మద్దతుగా నిలవడంతో బ్యాంకుగేటు ఎదుట బైఠాయించారు. ఎస్ఐ అయోధ్య సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వారు ససేమిరా అన్నారు. దీంతో బ్యాంకు మేనేజర్ జరిగిన సంఘటన పట్ల ప్రజల ముందు బహిరంగ క్షమాపణ కోరాడు. అనంతరం ధర్నాను ఉపసంహరించిన బాధితుడు బ్యాంకు సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేనేజర్ మధుసూధన్రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్లు వరుణ్గుప్త, ప్రతాప్లపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
'ఆరు నెలల్లో నేర్చుకోండి.. లేదంటే పీకేస్తాం'
బెంగళూరు: ఆరు నెలల్లో కన్నడం నేర్చుకోకుంటే ఉద్యోగంలో నుంచి తీసి పారేస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులను హెచ్చరించింది. తమ రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో పనిచేసే తమ భాషేతర బ్యాంకు మేనేజర్లనే లక్ష్యంగా చేసుకొని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కర్ణాటక అభివృద్ధి సంస్థ(కేడీఏ) ఒక ఆదేశాన్ని ఇచ్చింది. మున్ముందు బ్యాంకు లావాదేవీలన్నీ కూడా స్థానికుల భాషలకు అనుగుణంగా జరగాలని అలా చేసినప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో వారికి సైతం బ్యాంకుల సేవలు అందుబాటులోకి వెళతాయంటూ అందులో పేర్కొంది. ఇటీవల ఓ కస్టమర్ తన చెక్పై కన్నడ రూపంలో రాశాడని ఆ వ్యక్తిని ఐసీఐసీఐ బ్యాంకు కోర్టుకు ఈడ్చిందని ఈ క్రమంలో ఇకపై బ్యాంకు మేనేజర్లంతా కూడా తప్పకుండా ఆరు నెలల్లో కన్నడం నేర్చుకోవాలని, స్థానిక భాషకు అనుకూలంగానే లావాదేవీలు కొనసాగించాలని అందులో పేర్కొంది. అయితే, కేడీఏకు ఓ బ్యాంకు అధికారిని తొలగించే అధికారం ఉందా లేదా అనే విషయం స్పష్టం కానప్పటికీ దీని ద్వారా మరోసారి భాష పరమైన వివాదం తలెత్తినట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు, ట్విట్టర్లో పలువురు తమకు బ్యాంకు సేవలు కన్నడంలో కావాలంటూ పెద్ద ఉద్యమాన్ని లేవదీస్తున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీగా ఉద్యోగాల కోత
ముంబై : ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి హెచ్డీఎఫ్సీ. ఈ బ్యాంకు వరుసగా రెండో త్రైమాసికంలోనూ భారీగా ఉద్యోగులను తగ్గించుకుంది. వినియోగదారులను చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ అభివద్ధి బాటపట్టడంతో బ్యాంకు బ్రాంచుల విస్తరణ మందగించినట్టు తెలిసింది. ఈ బ్రాంచుల విస్తరణ మందగించడంతో ఈ క్వార్టర్లోనూ భారీగా ఉద్యోగాల కోత పెట్టినట్టు వెల్లడైంది. 2016 డిసెంబర్తో ముగిసిన క్వార్టర్లో 90,421గా ఉన్న బ్యాంకు ఉద్యోగులు, 2017 మార్చితో ముగిసిన క్వార్టర్లో 84,325గా ఉన్నారు. అంటే దాదాపు 6096 మంది ఉద్యోగులను బ్యాంకు బయటికి సాగనంపినట్టు వెల్లడైంది. ఈ తగ్గింపు ఈ క్వార్టర్లోనే అత్యధికమని తెలిసింది. 2016 డిసెంబర్తో ముగిసిన క్వార్టర్లోనూ బ్యాంకు 4581 మంది ఉద్యోగులను తగ్గించింది. అట్రిక్షన్ పేరుతో బయటికి వెళ్లిపోయిన వారిలో కొత్త స్టాఫ్ను భర్తీ చేసుకోవడం లేదని, డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండటంతో తమ సామర్థ్యాలను రీబ్యాలెన్స్ చేసుకుంటున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పరేష్ సుక్తాంకర్ చెప్పారు. అదేవిధంగా ఉద్యోగుల ఖర్చులను కూడా బ్యాంకు తగ్గించుకుంది. ఉద్యోగులను తగ్గించుకున్న విషయాన్ని సుక్తాంకర్ కూడా తెలిపారు. గత కొన్నేళ్లలో కనీసం 300 నుంచి 400 బ్రాంచులను ప్రారంభిస్తే, ఈ ఏడాది కేవలం 195 బ్రాంచులను మాత్రమే ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కొత్త బ్రాంచుల ఏర్పాటు మందగించిందని, ఉద్యోగుల సంఖ్యలోనూ ముందస్తున్న వృద్ధి లేదని, తగ్గిపోయిందని చెప్పారు. అయితే ఉద్యోగులను తగ్గించుకునే ప్రభావం బ్యాంకు వద్దిపై పడదని స్పష్టంచేశారు. -
బ్యాంకు ఉద్యోగుల అక్రమాలు.. రూ.72 కోట్లు
న్యూఢిల్లీ: నల్లధనానికి చెక్ పెట్టేందుకంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన డీమానిటైజేషన్ ప్రక్రియలో బ్యాంకు ఉద్యోగుల అక్రమాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రూ .500, రూ .1,000 నోట్ల రద్దు తర్వాత కొన్ని బ్యాంకుల ఉద్యోగులు చేసిన అక్రమాల విలువ రూ 71.47 కోట్లని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. డీమానిటైజేషన్ పీరియడ్లో (నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు) వీరు నగదు మార్పిడికి అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని తెలిపింది. పెద్దనోట్ల రద్దు కాలంలో రద్దయిన నోట్ల అక్రమ మార్పిడి, అక్రమ లావాదేవీల్లో 14 కేసుల (శాఖలు) ను గుర్తించినట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వర్ లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు మూడు బ్రాంచ్ ల ద్వారా అత్యధికంగా రూ 46.29 కోట్ల లావాదేవీలు జరిగినట్టు చెప్పారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు తెలియజేశారు. ధనలక్ష్మి బ్యాంకుకు చెందిన ఎనిమిది మంది ఉద్యోగులు ఆరు కేసుల్లో నిందితులు. అక్రమంగా మార్పిడి విలువ రూ రూ.22.7 కోట్ల లావాదేవీలు . ప్రభుత్వ రంగ బ్యాంకుల సహా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ లోరూ 1.9 కోట్లు (రెండు కేసులు, నాలుగు సస్పెన్షన్లు) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ 54.90 లక్షలు, బ్యాంక్ (రెండు కేసులు, ఐదు సస్పెన్షన్లు), సిండికేట్ బ్యాంక్ రూ .6 లక్షలు (ఒక కేసు) అనిమంత్రి తెలిపారు. డీమానిజేషన్ సమయంలో అప్రమంత్తంగా వ్యవహరించాల్సిందిగా అన్నిబ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని సభకు వివరించారు. అక్రమాలకు అడ్డుకోవడంతో పాటు బ్యాంకుల అంతర్గత ఆడిట్ విధానాన్ని బలోపేతం చేసుకోవాలని కోరినట్టు చెప్పారు. -
మోదీకి బ్యాంకు ఉద్యోగుల లేఖ
న్యూఢిల్లీ: ప్రసంశలు కాదు పైసలు కావాలి అంటున్నారు బ్యాంకు ఉద్యోగులు. కొత్త సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించిన ప్రధాని నరేంద్ర మోదీ... బ్యాంకు ఉద్యోగుల సేవలను కొనియాడారు. పాత పెద్ద నోట్ల రద్దును చేసిన నేపథ్యంలో తీవ్ర ఒత్తిడులు ఎదురైనా ఉద్యోగులు బాగా పనిచేశారని ప్రశంసించారు. రాష్ట్ర నాయకులు కూడా బ్యాంకు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. అయితే తమ శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఓవర్ టైమ్ డ్యూస్ కూడా తక్షణమే ఇవ్వాలని జాతీయ బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఎన్ఓబీడబ్ల్యూ) డిమాండ్ చేసింది. భారతీయ మజ్దూర్ సంఘ్ కు అనుబంధంగా ఉన్న ఎన్ఓబీడబ్ల్యూ ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసింది. చాలా బ్యాంకులు ఓవర్ టైమ్ డ్యూస్ చెల్లించలేదని లేఖలో పేర్కొన్నారు. ‘బ్యాంకు ఉద్యోగులు బాగా పని చేశారని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. కానీ ఉద్యోగుల సంక్షేమానికి కచ్చితమైన ప్రకటన చేయలేదు. ఈ విషయాన్ని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లామ’ని ఎన్ఓబీడబ్ల్యూ ఉపాధ్యక్షుడు అశ్వనీ రాణా తెలిపారు. ఉద్యోగుల భద్రతకు యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) డిమాండ్ చేసింది. -
ఆ నోట్లు నేరుగా వెళ్లే అవకాశం లేదు
శేఖర్రెడ్డికి 2 వేల నోట్ల చేరికపై బ్యాంకు వర్గాల వివరణ సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని ఏ చెస్ట్ శాఖ నుంచైనా కొత్త 2 వేల నోట్లు టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్రెడ్డికి చేరి ఉండొచ్చని.. విశాఖ ‘స్కేప్’ నుంచి నేరుగా వెళ్లే అవకాశం లేదని బ్యాంక్ వర్గాలు పేర్కొంటున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ.500, వెయ్యి నోట్ల రద్దుకు ముందు రోజు నవంబర్ 7న రిజర్వు బ్యాంక్ నుంచి విశాఖ స్కేప్కు కొత్త రూ.2 వేల నోట్లు వచ్చాయి. ఏపీ జిల్లాలకు ఈ నోట్లనే పంపిణీ చేయాలి. ఈ సొమ్మును ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ సమక్షంలో పంపిణీ చేస్తారు. నవంబర్ 7న ఆర్బీఐ నుంచి వచ్చిన రూ.కొత్త 2 వేల నోట్లను కూడా ఆయన సమక్షంలోనే రాష్ట్రంలోని వివిధ జిల్లాల చెస్ట్ శాఖలకు వ్యాన్లు, లారీల్లో పంపిణీ చేసినట్టు స్టేట్ బ్యాంక్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రాష్ట్రంలోని ఏ చెస్ట్ శాఖ నుంచైనా ఈ సొమ్ము శేఖర్రెడ్డికి చేరి ఉండొచ్చని.. విశాఖ నుంచి నేరుగా వెళ్లే అవకాశం లేదని పేర్కొన్నాయి. మరోవైపు శేఖర్రెడ్డి అక్రమ నగదు నిల్వలపై ఆదాయపు పన్ను అధికారులు ఇప్పటివరకు విశాఖలోని స్కేప్ అధికారులను విచారించలేదని బ్యాంకు వర్గాలు తెలిపాయి. -
పెన్షనర్లు,శాలరీ వారికి రూ. 10వేల వరకు నగదు
-
పెన్షనర్లు,శాలరీ వారికే డబ్బులిస్తున్నాం
-
నల్లకుబేరులకు సహకరిస్తే డిస్మిస్
-
నల్లకుబేరులకు సహకరిస్తే డిస్మిస్
• బ్యాంకు సిబ్బందికి హెచ్చరిక • దేశవ్యాప్తంగా పీఓఎస్ సేవలు • ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య సాక్షి ప్రతినిధి, చెన్నై: రద్దరుున పెద్దనోట్ల స్థానంలో కొత్త నోట్లను పొందేలా నల్లకుబేరులకు సహకరించిన బ్యాంకు సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య హెచ్చరించారు. కోయంబత్తూరులో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. బ్యాంకు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏడాదికి 200 నుంచి 300 మంది క్రమశిక్షణా చర్యలకు గురవుతున్నారని చెప్పారు. నల్లధనాన్ని చట్టవిరుద్ధంగా బ్యాం కుల్లో జమచేసి కొత్త నోట్లుగా మార్చుకునేవారిపైనా, వారికి సహకరించే బ్యాంకు సిబ్బందిపైనా నిఘాపెట్టామని తెలిపారు. పట్టుబడిన వెంటనే సస్పెండ్ చేసి నేరం రుజువైన పక్షంలో డిస్మిస్ చేస్తామని ఆమె హెచ్చరించారు. నోట్లను రద్దరుున ఈనెల 8వ తేదీ నుంచి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ద్వారా ఖాతాదారుల సేవలు సక్రమంగా సాగుతున్నాయని తెలిపారు. తమ బ్యాంకు ఏటీఎంలలో 65 శాతం పూర్తిస్థారుులో పనిచేస్తున్నాయని తెలిపారు. ఖాతాదారులు శ్రమపడకుండా సొమ్మును పొందేందుకు పారుుంట్ ఆఫ్ సేల్ (పీఓఎస్)తో కూడిన వాహనాన్ని జన సంచారం ఎక్కువగా ఉండే కూడళ్లలో పెట్టామని తెలిపారు. ఖాతాదారులు తమ ఏటీఎం, డెబిట్ కార్డులను ఈ వాహనంలోని యంత్రంలో స్వైప్ చేసి రూ.2వేలు పొందవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా 3,600 పీఓఎస్ వాహనాలు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. అంతేగాక విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, మార్కెట్, షాపింగ్ మాల్స్ ప్రాంతాల్లో 841 మొబైల్ ఏటీఎంలు పనిచేస్తున్నట్లు తెలిపారు. రెండు వారాలుగా బ్యాంకు లావాదేవీల్లో కొంత గందరగోళం, విద్య, గృహ రుణాల మంజూరులో కొద్దిపాటి స్తంభన నెలకొని ఉందని అంగీకరించారు. అరుుతే ఇది తాత్కాలికమే, కొద్ది రోజుల్లో పూర్తిగా సర్దుకుంటుందని చెప్పారు. నిజారుుతీగా సంపాదించిన సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసిన వారు భయపడాల్సిన అవసరం లేదని, వీరి సొమ్ముకు వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. -
కరెన్సీ కమీషన్
నల్లధనం అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపడితే, మరో వైపు దొడ్డి దారిన ఆ ధనాన్ని తెలుపుగా మార్చే పనిలో బ్యాంకుల సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. కమీషన్కు ఆశపడ్డ రెండు బ్యాంకుల సిబ్బంది, చివరకు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి. ఇక, ఆదివారం బ్యాంక్లకు సెలవు కావడం, ఏటీఎంలలో నగదు కరువుతో చిల్లర కష్టాలు మరింత జఠిలమయ్యాయి. సాక్షి, చెన్నై: నల్లధనం అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న చర్యలతో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. చివరకు రూ. 2000 నోటు చిక్కినా, చిల్లర కోసం నానా వెతలు. అదే సమయంలో బ్యాంక్ సిబ్బంది అనేక చోట్ల కమీషన్లకు ఆశపడి తమ చేతి వాటం చూపుతూ దొడ్డిదారిన నల్లధనాన్ని తెలుపుగా మార్చేస్తున్నారని ఆరోపణలు వచ్చినా పట్టించుకునే పాలకులు కరువే. సామాన్యులు క్యూలో బారులు తీరుతుంటే, సంపన్నులకు , నల్లధనం దాచి పెట్టుకున్న వాళ్లకు సులభంగానే కొత్త నోట్లు చిక్కుతున్నాయని చెప్పవచ్చు. ముప్పై నుంచి నలభై శాతం మేరకు కమీషన్లతో నల్లధనం తెలుపుగా మారుతున్నదని వస్తున్న ఆరోపణలకు బలం చేకూరే ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బ్యాంకుల్లోని సిబ్బంది పని తీరుపై నిఘా పెట్టేందుకు ఐటీ, విజిలెన్స వర్గాలు రంగంలోకి దిగాయి. ఇక సెలవు దినం రోజున బ్యాంకుల మూతతో, ఏటీఎంలలో నగదు కరువుతో జనానికి పాట్లు తప్పలేదు. జనం చేతిలో చిల్లర్లు లేని దృష్ట్యా, వారంతంలో పర్యాటక కేంద్రాలన్నీ బోసి పోయాయి. కమీషన్ కోసం ఆశ పడి: శుక్రవారం శాస్త్రి నగర్ బ్యాంక్కు చెందిన రూ.25 లక్షలు చోరీకి గురైనట్టు పల్లావరం పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. అదే రోజు అర్ధరాత్రైనా బ్యాంక్ మేనేజర్తో సహా సిబ్బంది పలువురు బ్రాంచ్ కార్యాలయంలో ఉండడాన్ని శాస్త్రి నగర్ గస్తీ పోలీసులు గుర్తించారు. బ్యాంక్ సొమ్ము చోరీ సమాచారంతో శాస్త్రి నగర్ , పల్లావరం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయగా, అసలు బండారం ఏమిటో ఆదివారం వెలుగులోకి వచ్చింది. శాస్త్రి నగర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ బ్రాంచ్లో క్యాషియర్గా పనిచేస్తున్న ఇలంగోవన్ తన మిత్రుడు రాజేష్ వద్ద ఉన్న రూ.25 లక్షలు నల్లధనాన్ని తెలుపుగా మార్చేందుకు పథకం రచించాడు. ముప్పై శాతం కమీషన్ అంటూ అక్కడి మేనేజర్ లోకేశ్వరరావుకు ఆశ చూపించాడు. మరో ప్రైవేటు బ్యాంక్లో ఉన్న ఇద్దరు మిత్రుల సహకారంతో నగదు మార్పిడికి ఇలంగోవన్ చర్యలు తీసుకున్నాడు. రూ.2000 కొత్త నోట్లతో రూ.25 లక్షలను శుక్రవారం బ్యాంక్లో తీసుకున్నాడు. తమకు రావాల్సిన కమీషన్ను పక్కన పెట్టి, మిగిలిన సొమ్మును రాజేష్కు అప్పగించేందుకు నిర్ణయించాడు. జమీన్ పల్లావరంలో ఉన్న రాజేష్ వద్దకు మేనేజర్ లోకేశ్వరరావు, క్యాషియర్ ఇలంగోవన్, ప్రైవేటు బ్యాంక్ సిబ్బంది, కారు డ్రైవర్ బయల్దేరి వెళ్లారు. కొత్త నోట్లను తీసుకున్న రాజేష్ , రూ.25 లక్షలకు గాను వెయి రూపాయల పాత నోట్లను వారికి అప్పగించాడు. ఆ మొత్తంతో తిరుగు పయనంలో ఉండగా మార్గ మధ్యలో దొంగలు పడ్డారు. వాళ్లను చితక్కొట్టి ఆ నగదుతో ఉడాయించారు. నలుపు తెలుపుగా మార్చే క్రమంలో ఈ చోరీ జరిగినట్టు తెలిస్తే, తమ బండారం బయట పడుతుందని అపహరణ నాటకం రచించారు. చివరకు విచారణలో బండారం బయట పడింది. అదే సమయంలో నగదుతో వెళ్తున్న వాళ్లను చితక్కొట్టి లాక్కున్నే పథకం రచించింది కూడా ఇలంగోవన్, అతడి మిత్రుడు రాజేష్గా విచారణలో తేలింది. అయితే, దోచుకున్న సొమ్ముతో రాజేష్ వద్దకు వెళ్లాల్సిన, దొంగలు, తమ పనితనాన్ని ప్రదర్శించి, పలాయనం చిత్తగించారు. అజ్ఞాతంలో ఉన్న రాజేష్, అతడి అనుచరులు(దొం గల) కోసం పోలీసులు వేట మొదలెట్టారు. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్, కారు డ్రైవర్, మరో ఇద్దర్ని తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐటీ అటాక్: నల్లధనం తెలుపుకు బ్యాంక్ సిబ్బంది తమ చేతి వాటం ప్రదర్శిస్తుంటే, ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం దాచుకున్న సొమ్మును సిబ్బంది అకౌంట్లో వేసి ఐటీ చేతికి చిక్కింది. ఓఎంఆర్ రోడ్డులోని ఓ ప్రముఖ విద్యాసంస్థ పరిధిలో అనేక కళాశాలలు, స్కూళ్లు ఉన్నారుు. విద్యార్థుల వద్ద రశీదులు లేకుండా సేకరించి, దాచుకున్న రూ.8 కోట్ల మేరకు నల్లధనాన్ని ఆ యాజమాన్యం నమ్మకంగా ఉన్న వంద మంది సిబ్బంది అకౌంట్లలోకి మార్చినట్టు సమాచారం. ఒకే సారిగా ఆయా అకౌంట్లలోకి నగదు లక్షా, రెండు లక్షలు చొప్పున పడడం ఐటీ వర్గాలు నిఘా వేశారుు. నల్లధనం తెలుపుగాకునే క్రమంలో ఈ తంతు సాగుతున్నట్టు గుర్తించి ఆదివారం ఆ విద్యాసంస్థల మీద దాడులు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఐటీ చేతికి చిక్కిన ఆ యాజమాన్యం కాళ్ల బేరానికి వచ్చి ఆ మొత్తానికి పన్ను చెల్లింపునకు సిద్ధం అని ప్రకటించినట్టు సమాచారం. అయితే, దోచుకున్న సొమ్ముకు పన్నుగా ఏడున్నర కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంటుందని ఐటీ వర్గాల సమాచారం. -
మహిళకు షాక్ ఇచ్చిన బ్యాంక్ సిబ్బంది
-
బ్యాంకు ఉద్యోగులకు చైనాలో వెరైటీ పనిష్మెంట్!
బీజింగ్: ఉద్యోగులు ఎవరైనా బాగా పనిచేయకపోతే.. పైస్థాయి ఉద్యోగులు వారిని మందలించడం సహజంగా జరుగుతోంది. కానీ, చైనాలో మాత్రం ఆశించిన పనితీరు కనబర్చని బ్యాంకు ఉద్యోగులను వరుసక్రమంలో నిలుచోబెట్టి దుడ్డుకర్రతో చితకబాదిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగు చూడటంతో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. సరిగ్గా పనిచేయని ఉద్యోగులను దుడ్డుకర్రతో బాదిన ఉదంతంలో సదరు బ్యాంకు బాస్ తోపాటు పలువురు ఉన్నతాధికారులపై వేటు పడింది. పని విషయంలో వెనుకబడిన ఎనిమిది ఉద్యోగులు -నలుగురు పురుషులు, నలుగురు మహిళలను ఓ వేదిక మీద నిలుచోబెట్టి.. మీరు ఎందుకు మంచి పనితీరు కనబరచలేదని ఓ వ్యక్తి అడిగాడు. ఈ ప్రశ్నకు ఆ ఎనిమిది సమాధానం ఇవ్వగా.. పనితీరు కనబర్చనందుకు తగినశాస్తి అనుభవించేందుకు సిద్ధం కండి అంటూ.. పడవ తెడ్డులాంటి కర్రతో ఆ వ్యక్తి ఎనిమిది మంది వెనుకభాగంలో బాదాడు. ఓ మహిళ ఈ దెబ్బలు తప్పించుకోవడానికి రెండు చేతులు వెనుకకు పెట్టినా.. ఆ చేతులు తీయమని చెప్పిమరీ కొట్టాడు. చాంగ్ ఝీ ఝాంగ్ జె గ్రామీణ వాణిజ్య బ్యాంకు ఉద్యోగులకు ఈ మేరకు ట్రైనింగ్ సేషన్ లో చేదు అనుభవం ఎదురైంది. ఈ వీడియో వెలుగుచూడటంతో చైనా నెటిజన్లు భగ్గుమన్నారు. ఈ పద్ధతి పురాతన కాలంలో బానిస వ్యవస్థను సూచిస్తున్నదని, ఉద్యోగులకు కూడా గౌరవాభిమానులు ఉంటాయని, వారినిలా దండించడం దారుణమని చైనా నెటిజన్లు 'వీబో' (చైనా ట్విట్టర్)లో మండిపడ్డారు. ఈ వీడియోపై ప్రజాగ్రహం నేపథ్యంలో చాంగ్ ఝీ బ్యాంకు చైర్మన్ గా ఉన్న స్థానిక కమ్యూనిస్టు పార్టీ చీఫ్ తోపాటు, పలువురు ఉన్నతాధికారులను చైనా సర్కార్ సస్పెండ్ చేసింది. -
ఎనీ టైం మోసం..
బజార్హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామానికి చెందిన శనిగారపు నర్సయ్య అవసరానికి డబ్బులు తీసుకునేందుకు గత సెప్టెంబర్లో ఇచ్చోడలోని ఓ ఏటీఎం సెంటర్కు వెళ్లాడు. అతని వెంట ఓ ఇద్దరు వ్యక్తులు ఏటీఎంలోకి వెళ్లి మాటల్లో పెట్టారు. అతని వద్ద నుంచి ఏటీఎం కార్డు దొంగిలించారు. అనంతరం అతని ఖాతా నుంచి రూ.25 వేలు కాజేశారు. జిల్లాలోని ఏటీఎం సెంటర్లలో జరుగుతున్న మోసాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా ఎంతో మంది బాధితులు మోసపోతున్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. - ఏటీఎం సెంటర్లలో కనిపించని సెక్యూరిటీ గార్డులు - పనిచేయని సీసీ కెమెరాలు - మోసాలకు పాల్పడుతున్న దుండగులు - పట్టించుకోని బ్యాంక్ సిబ్బంది ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో ఏటీఎం సెంట ర్ల నిర్వహణ అత్యంత దారుణంగా తయారైంది. ఎక్కడా సెక్యురిటీ గార్డులు ఉండ డం లేదు. వాటి నిర్వహణను గాలికొదిలేశారు. ఇదే అదునుగా భావించి మోసకారు లు రెచ్చిపోతున్నారు. మాయమాటలతోఅమాయకులను బుట్టలో వేసుకుని ఏటీఎం కార్డులను మా ర్చేసి.. వేల రూపాయలు దండుకుంటున్నారు. ఇలా ఆర్థిక నేరాలు రోజురోజకు శృతి మించుతున్నా బ్యాంకు యాజమాన్యాలు మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో బ్యాంకులు పోటాపోటీగా ఏటీఎం సెంటర్లు ఏర్పాటు చేస్తున్నా.. రక్షణ చర్యలు మాత్రం విస్మరిస్తున్నాయి. నిత్యం లక్షలాది రూపాయలు డ్రా చేసే ఈ కేంద్రాల వద్ద కనీసం సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయకపోవడంతో వినియోగదారులు భయూందోళనకు గురవుతున్నారు. జిల్లాలో మొత్తం 200లకుపైగా ఏటీఎం కేంద్రాలున్నాయి. వీటి నుంచి వినియోగదారులు కోటి రూపాయలకు పైగా ప్రతిరోజూ నగదు డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. భద్రత గాలికి.. ఏటీఎం సెంటర్ల వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత సంబంధిత బ్యాంకులపైనే ఉంది. జిల్లాలోని చాలా ఏటీఎంల వద్ద భద్రత గాలిలో దీపంలా ఉంది. చాలా కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులు కనిపించడం లేదు. పైగా ఏటీఎం కేంద్రాల లోపల సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. దీనికి కారణం చాలా వరకు బ్యాంకులు ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో నియమించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ వద్ద, ముఖ్యమైన పాయింట్ల వద్ద మాత్రమే సెక్యూరిటీ గార్డును నియమించుకుంటున్నాయి. ఇతర పాయింట్ల వద్ద నియమించడం లేదు. ముఖ్యంగా పట్టణ, మండల కేంద్రాల్లో ఉండే ఏటీఎంల వద్ద భద్రత ఉండడం లేదు. ఏటీఎం సెంటర్లకు ఆటోమెటిక్గా మూసుకునే గ్లాస్ డోర్ ఉండాలి. జిల్లాలో ఇలాంటి ఎక్కడా కనిపించవు. ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. దీంతో దుండగులు నేరుగా లోపలికి ప్రవేశించి వినియోగదారులు డబ్బులు డ్రా చేసే సమయంలో మాయమాటలు చెప్పడంతోపాటు వారి ఏటీఎం కార్డులను దొంగిలిస్తున్నారు. ఎలాగోలా పిన్కోడ్ తెలుసుకుని పెద్ద ఎత్తున నగదు డ్రా చేసి మోసం చేస్తున్నారు. పోలీసుస్టేషన్లో కేసు పెట్టినా.. మళ్లీ ఆ డబ్బులు తిరిగి వస్తాయన్న గ్యారంటీ లేదు. ఇలా కొంత మంది మోసపోయిన వారు పోలీసులను కూడా ఆశ్రయించడం లేదని తెలుస్తోంది. నగదు లేకున్నా.. ఓపెన్గానే.. జిల్లాలో ఏటీఎం సెంటర్ల భద్రత ఒక ఎత్తయితే.. వాటి నిర్వహణ వినియోగదారులకు మరింత చికాకు కనిపిస్తున్నాయి. చాలా వరకు ఏటీఎం సెంటర్లు ఎప్పుడు చూసినా సాంకేతిక కారణాలతో పనిచేయడం లేదని,ఏటీఎంలో నో మనీఅంటూ బోర్డులు దర్శనమిస్తాయి. ఏటీఎంలలో అవసరం మేరకు డ బ్బులు నిల్వ ఉంచడం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఈ పరిస్థితి నెలలో మొదటి వారం మరింత కష్టంగా ఉంటోంది. ఈ వారంలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు తీసుకునేందుకు ఏటీఎంల బాట పడుతారు. ఆ సమయంలో డబ్బులు లేవని బోర్డులు దర్శనమివ్వడంతో నిరాశగా ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. భద్రత ఏర్పాటు చేసుకోవాలి.. - ఎల్.రఘు, వన్టౌన్ సీఐ ఏటీఎం సెంటర్లలో బ్యాంక్లు కచ్చితంగా భద్రత ఏర్పాటు చేసుకోవాలి. ఇటీవల ఆదిలాబాద్లోని ఓ బ్యాంక్ ఏటీఎం సెంటర్ అద్దంను గుర్తు తెలియని దుండుగులు పగులగొట్టిన సంఘటన జరిగింది. గతంలో బ్యాంక్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని, భద్రతకు పాటించాల్సిన చర్యలపై సూచించాం. అరుునా పట్టించుకోవడం లేదు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే బ్యాంక్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతి ఏటీఎంలో సెక్యురిటీ గార్డు, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. -
చోర్ ... సిబ్బంది షేర్?
ఫైనాన్స్ కంపెనీలో భారీ చోరీ 15లక్షల సొత్తు అపహరణ షట్టర్ పగులగొట్టి.. అసలైనతాళపు చెవితో లాకర్లు తెరిచిన వైనం ఇంటి దొంగలపైనే అనుమానం ముగ్గురు బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు మౌలాలి/గౌతంనగర్: ముఖానికి ముసుగు.. చేతికి గ్లౌజ్లు.. సీసీ పుటేజీలకు దొర క్కుండా జాగ్రత్తలు.. జాగిలాలు పసిగట్టకుండా ఉండేలా కారం పొడి చల్లి మాల్కాజిగిరిలోని ‘ఫెడ్బ్యాంక్’ (ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ)లో *15 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. బ్యాంక్లో లాక ర్ను ఒరిజనల్ తాళంతో తీయడాన్ని బట్టి ఇది ఇంటి దొంగల పనిగాపోలీసులు భావిస్తున్నారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని గీతానగర్లో బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చే ఫైనాన్స్ సంస్థ ‘ఫెడ్బ్యాంక్’ ఉంది. అక్కడి సిబ్బంది పనులు ముగించుకుని సోమవారం సాయంత్రం ఏడు గంటలకు బ్యాంకుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం బ్యాంకు వద్దకు వాచ్మన్, అపార్టుమెంట్ వాసులు వచ్చా రు. షట్టర్ పగులగొట్టి ఉండటాన్ని గుర్తించా రు. వారు వెంటనే పోలీసులకు, సంస్థ ఉద్యోగులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు, ఉద్యోగులు, ఫెడరల్ బ్యాంకు అధికారులు, డాగ్స్క్వాడ్, క్లూస్ టీం చేరుకున్నాయి. డీసీపీ రమా రాజేశ్వరి దోపిడీ తీరును నిశితంగా పరిశీలించారు. లోపలికి ప్రవేశించిన అగంతకులు ఆభరణాలు దాచి ఉంచిన లాకర్లను మాత్రం అసలైన తాళపు చెవితో తెరిచినట్టు గుర్తించారు. ఇంటి దొంగల పనే... ఫెడ్బ్యాంకు చోరీలో ఇంటి దొంగల పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు లాకర్లను పగులగొట్టే ప్రయత్నం చేయకుండా, తాళం చెవులతోనే తెరిచి చోరీకి పాల్పడడంతో ఇందులో సిబ్బంది పాత్ర ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆధారం దొరకకుండా ఉండేందుకు దుండగులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖానికి ముసుగు ధరించి, చేతులకు గ్లౌజ్లు వేసుకుని చోరీకి పాల్పడినట్టు సీసీటీవీ పుటేజీలో గుర్తించారు. పోలీసులు, జాగిలాలు గుర్తించకుండా ఉండేందుకు, ఆనవాళ్లు లేకుండా చేసేందుకు లాకర్లవద్ద కారంపొడి చల్లడం గమనార్హం. చోరీకి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముగ్గురు బ్యాంకు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అవసరాల కోసం తనఖా పెట్టిన బంగారు నగలు చోరీకి గురికావడంపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఖాతాదారులు ఆందోళన చెందనవసరం లేదని పెడ్ ఫైనాన్స్ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు బ్యాంకు అధికార ప్రతినిధి ఎన్.కుమార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
బ్యాంకు దోపిడీ కేసులో ఇంటిదొంగల పాత్ర
మల్కాజ్గిరి సెంట్రల్ బ్యాంకు దోపిడీ కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చింది. ఈ దోపిడీలో బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తాళం చెవులతోనే లాకర్లను ఓపెన్ చేసినట్లు గుర్తించారు. గతంలో బ్యాంకులో పనిచేసిన సిబ్బంది.. లేదా ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ల హస్తం ఇందులో ఉండొచ్చని భావిస్తున్నారు. బంగారు నగలు తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చే బ్యాంకులో తెల్లవారుజామున చోరీ జరిగింది. తాళాలతో బ్యాంకు షట్టర్ తెరచిన గుర్తుతెలియని వ్యక్తి.. కిలో బంగారం, లక్షా 25 వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా చూస్తే.. తాళాలు తీసుకుని దర్జాగా లోపలికి వెళ్లినట్లు తేలింది. సీసీ కెమెరా ఫుటేజ్లో చోరీ చేసిన వ్యక్తి ఆచూకీ తెలుస్తోంది. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకు దోపిడీ గురించి తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు దగ్గరకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఫీజు కట్టాలన్నా కనికరించలేదు..
రైతు బీమా సొమ్ము ఫ్రీజ్ చేసిన ఆంధ్రా బ్యాంకు సిబ్బంది కదిరి: ‘సార్.. మా వాడికి కాలేజీలో ఫీజు కట్టాలి. దయచేసి మా ఖాతాలో జమ అయిన జీవిత బీమా మొత్తాన్ని ఇవ్వండి’ అంటూ ఆ రైతు దంపతులు ఎంతగా వేడుకున్నా బ్యాంకు సిబ్బంది కనికరించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన కొండ్రే వెంకటరమణమ్మ, సూర్యచంద్రారెడ్డి దంపతుల కుమారుడు సూర్యప్రకాష్రెడ్డి హైదరాబాద్లో ఎంటెక్ చదువుతున్నాడు. ఫీజు చెల్లించేందుకు డబ్బు పంపాలని కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. జీవిత బీమా సంస్థలో సూర్యచంద్రారెడ్డి పేరున పొదుపు చేసిన మొత్తాన్ని కుమారుడికి పంపాలని వారు నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత జీవిత బీమా సంస్థ వారు కదిరి పట్టణంలోని ఆంధ్రా బ్యాంకులో ఉన్న సూర్యచంద్రారెడ్డి ఖాతాలో రూ. 9,535 జమ చేశారు. ఆ మొత్తాన్ని డ్రా చేసేందుకు సోమవారం దంపతులిద్దరూ బ్యాంకుకు వెళ్లారు. అయితే.. ‘మా బ్యాంకులో సూర్యచంద్రారెడ్డిపై పంట రుణం తీసుకున్నారు. అసలు, వడ్డీ కలిపి రూ. 70 వేలు చెల్లించాలి. ప్రస్తుతం ప్రీమియం, వడ్డీ మొత్తం చెల్లించి రుణం రెగ్యులరైజేషన్ చేసుకొంటేనే బీమా డబ్బు ఇస్తాం’ అంటూ మేనేజర్ తెగేసి చెప్పారు. ‘కొడుక్కి ఫీజు కట్టాలి సార్.. అయినా రుణాలు మాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి చెప్పారు కదా’ అంటే, మాఫీ చేసినప్పుడు తీసుకెళ్దురులే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో కొడుకు ఫీజు కోసం డబ్బు ఎక్కడి నుంచి తేవాలని వారు విలపిస్తున్నారు. -
బ్యాంకు సిబ్బంది మళ్లీ సమ్మె సైరన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ రెండు రోజుల సమ్మెకు యూనియన్లు పిలుపునిచ్చాయి. తమ డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా జనవరి 20 నుంచి 48 గంటల సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. అప్పటికీ దిగిరాకపోతే ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిరవధిక సమ్మెకూ వెనుకాడమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంస్కరణల నిలిపేత, తక్షణం వేతన సవరణ సిఫార్సుల అమలుకు డిమాండ్ చేస్తూ ఈ నెల 18న బ్యాంకు యూనియన్లు ఒక రోజు సమ్మె చేయడం తెలిసిందే. తదుపరి కార్యాచరణకు సోమవారం బ్యాంకు యూనియన్లు హైదరాబాద్లో సమావేశమయ్యాయి. సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన పది లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నట్లు రాంబాబు తెలిపారు.