ఫైనాన్స్ కంపెనీలో భారీ చోరీ
15లక్షల సొత్తు అపహరణ
షట్టర్ పగులగొట్టి..
అసలైనతాళపు చెవితో లాకర్లు తెరిచిన వైనం
ఇంటి దొంగలపైనే అనుమానం
ముగ్గురు బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు
మౌలాలి/గౌతంనగర్: ముఖానికి ముసుగు.. చేతికి గ్లౌజ్లు.. సీసీ పుటేజీలకు దొర క్కుండా జాగ్రత్తలు.. జాగిలాలు పసిగట్టకుండా ఉండేలా కారం పొడి చల్లి మాల్కాజిగిరిలోని ‘ఫెడ్బ్యాంక్’ (ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ)లో *15 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. బ్యాంక్లో లాక ర్ను ఒరిజనల్ తాళంతో తీయడాన్ని బట్టి ఇది ఇంటి దొంగల పనిగాపోలీసులు భావిస్తున్నారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని గీతానగర్లో బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చే ఫైనాన్స్ సంస్థ ‘ఫెడ్బ్యాంక్’ ఉంది. అక్కడి సిబ్బంది పనులు ముగించుకుని సోమవారం సాయంత్రం ఏడు గంటలకు బ్యాంకుకు తాళాలు వేసి వెళ్లిపోయారు.
మంగళవారం ఉదయం బ్యాంకు వద్దకు వాచ్మన్, అపార్టుమెంట్ వాసులు వచ్చా రు. షట్టర్ పగులగొట్టి ఉండటాన్ని గుర్తించా రు. వారు వెంటనే పోలీసులకు, సంస్థ ఉద్యోగులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు, ఉద్యోగులు, ఫెడరల్ బ్యాంకు అధికారులు, డాగ్స్క్వాడ్, క్లూస్ టీం చేరుకున్నాయి. డీసీపీ రమా రాజేశ్వరి దోపిడీ తీరును నిశితంగా పరిశీలించారు. లోపలికి ప్రవేశించిన అగంతకులు ఆభరణాలు దాచి ఉంచిన లాకర్లను మాత్రం అసలైన తాళపు చెవితో తెరిచినట్టు గుర్తించారు.
ఇంటి దొంగల పనే...
ఫెడ్బ్యాంకు చోరీలో ఇంటి దొంగల పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు లాకర్లను పగులగొట్టే ప్రయత్నం చేయకుండా, తాళం చెవులతోనే తెరిచి చోరీకి పాల్పడడంతో ఇందులో సిబ్బంది పాత్ర ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆధారం దొరకకుండా ఉండేందుకు దుండగులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖానికి ముసుగు ధరించి, చేతులకు గ్లౌజ్లు వేసుకుని చోరీకి పాల్పడినట్టు సీసీటీవీ పుటేజీలో గుర్తించారు. పోలీసులు, జాగిలాలు గుర్తించకుండా ఉండేందుకు, ఆనవాళ్లు లేకుండా చేసేందుకు లాకర్లవద్ద కారంపొడి చల్లడం గమనార్హం.
చోరీకి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముగ్గురు బ్యాంకు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అవసరాల కోసం తనఖా పెట్టిన బంగారు నగలు చోరీకి గురికావడంపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఖాతాదారులు ఆందోళన చెందనవసరం లేదని పెడ్ ఫైనాన్స్ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు బ్యాంకు అధికార ప్రతినిధి ఎన్.కుమార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
చోర్ ... సిబ్బంది షేర్?
Published Wed, Dec 17 2014 12:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement