breaking news
Aizawl
-
హారన్ మోగించరు.. గీత దాటరు
ఆ ప్రాంతం పేరు జొకోసంగ్.. నగరంలోని అతి ప్రధాన రోడ్డు.. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అధికంగా ఉండటంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒకవైపు వెళ్లే ట్రాఫిక్ అధికంగా ఉంది.. ఆ వైపు వాహనాలు నిలిచి పెద్ద వరస ఏర్పడింది.. మరోవైపు మాత్రం రోడ్డు ఖాళీగా ఉంది.. కానీ రోడ్డు మధ్యలో డివైడర్ లేకున్నా.. ఒక్క వాహనం కూడా గీత దాటలేదు. ఆ నగర పర్యటనకు వచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల బృందం ఈ దృశ్యాన్ని చూసి అశ్చర్యపోయింది. ప్రజల్లో ఆ పరిణతికి అభినందనలు అంటూ నగర మేయర్కు లేఖ రాసింది. ఆ సిటీని చూసి నేర్చుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు సచిత్ర లేఖ పంపింది. ఆ నగరమే ఈశాన్య రాష్ట్రమైన మిజోరం రాజధానిఐజోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐజోల్ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు.. కానీ, కూడళ్లలో వాహనాలు అదుపు తప్పవు. రాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు లేనప్పటికీ వాహనాలు నియంత్రణ కోల్పోవు. రోడ్డు మీద వందల సంఖ్యలో వాహనాలు ముందుకు సాగుతున్నా.. ఎక్కడా హారన్లు వినపడవు, వాహనాలు ఒకదాని వెనక ఒకటి వరస కట్టి వెళ్తాయే తప్ప ఓవర్టేక్ చేయవు.. డ్రైవర్లు పరస్పరం అరుచుకోవటం, తిట్టుకోవటం మచ్చుకు కూడా కనిపించవు.. పాదచారులు ఫుట్పాత్ల మీదుగా మాత్రమే నడుస్తారు, అర్ధరాత్రి వేళ రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు కూడా రోడ్లమీదుగా నడవరు. ఇవన్నీ నమ్మశక్యం కాని నిజాలు. ఐజోల్ నగరంలో ఏ మూలకెళ్లినా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. ప్రకృతి ఒడిలో కొలువై.. కొండలు, లోయలు, దట్టమైన అడవులు, నదులు, వాగులు వంకలు.. స్వచ్ఛమైన ప్రకృతిలో కొలువైన ఆ నగరంలో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. దాదాపు 2.20 లక్షల వాహనాలున్నప్పటికీ హారన్ల మోతలు లేకపోవటంతో శబ్ద కాలుష్యం ఉండదు. ఇది స్థానికుల క్రమశిక్షణ ఫలితం. అందుకే ఐజోల్ నగరాన్ని ‘ది సైలెంట్ సిటీ ఆఫ్ ఇండియా’అంటారు. ఇక్కడి ప్రజల్లో స్వీయ క్రమశిక్షణ పుట్టుకతో వస్తుందని అంటున్నారు. 4.21 లక్షల జనాభా ఉన్న నగరంలో నేరాలు అతి తక్కువ. మద్య నిషేధం కట్టుదిట్టంగా అమలవుతుండటంతో ప్రశాంతత రాజ్యమేలుతోంది. ప్రభుత్వ నిబంధనలు తు.చ.తప్పకుండా పాటిస్తున్న ప్రజలు, ఎలాంటి ఉల్లంఘనలకు ఆసక్తి చూపరు. దీంతో ఆ నగరంలో ప్రజల క్రమశిక్షణపై అధ్యయనానికి దేశంలోని చాలా నగరాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇంతకాలం విమానయానంతోనే.. ఐజోల్కు వెళ్లాలంటే ఇంతకాలం విమానయానమే అవకాశంగా ఉంది. అది ఖర్చుతో కూడుకున్నది కావటంతో చాలామంది అక్కడికి వెళ్లలేకపోయారు. ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలతో శనివారం నుంచి రైల్వే అనుసంధానం అందుబాటులోకి రావడంతో అధ్యయనాల కోసం నగరానికి వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొండలతో కూడుకున్న ప్రాంతం కావటంతో విశాలమైన రోడ్ల నిర్మాణానికి వీలులేదు. కొండ అంచుల్లో వెనకవైపు లోయల్లోకి పిల్లర్లు ఏర్పాటు చేసి వాటి ఆధారంగా ఇళ్లను నిర్మిస్తుంటారు. ఉన్న కాస్త స్థలంలో 30 అడుగుల వెడల్పు రోడ్లు మాత్రమే ఉంటాయి. దీంతో ప్రజలు ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా క్రమశిక్షణతో రోడ్లను వాడుకుంటున్నారు. రోడ్లపై డివైడర్లు ఉండవు, కేవలం ట్రాఫిక్ లైన్స్మాత్రమే గీసి ఉంటాయి. అయినా.. ఓ వైపు ఉన్న వాహనం ఎట్టి పరిస్థితిలో గీత దాటి మరోవైపు వెళ్లదు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు మాన్యువల్గా మాత్రమే ట్రాఫిక్ నియంత్రిస్తుంటారు. వారు చేయి ఎత్తగానే ఠక్కున వాహనాలు నిలిచిపోతాయి. ముందు వాహనాలు మందగమనంతో సాగినా వెనక వాహనదారులు పొరపాటున కూడా హారన్ మోగించరు. సారీ చెప్పి ఓవర్టేకింగ్..» ఎవరైనా అత్యవసరంగా ముందుకు సాగాల్సి ఉంటే, వాహనాలను ఓవర్టేక్ చేసి పక్క వాహనదారుకు సారీ చెప్పి మరీ వెళ్లటం అక్కడి ప్రత్యేకత. రాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు లేని సమయంలో కూడా కూడళ్లలో వాహనదారులు నియంత్రణ కోల్పోరు. » ఘాట్ రోడ్లు కావటంతో అన్నీ మలుపులు తిరిగిన రోడ్లే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా హారన్ల మోత వినిపించదు. మరీ షార్ప్ కర్వ్ ఉండి, భారీ వాహనాలు వచ్చే రోడ్డయితే స్వల్పంగా ఒకసారి హారన్ మోగిస్తారు.» తక్కువ వెడల్పు రోడ్లే అయినా, అన్ని చోట్లా ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు. పాదచారులు కచి్చతంగా ఫుట్పాత్పైనే నడుస్తారు. అర్ధరాత్రి వేళ రోడ్లు ఖాళీగా ఉన్నా.. ఫుట్పాత్ల గుండానే ముందుకు సాగుతారు.» టాక్సీలకు రోడ్ల మీదే పార్కింగ్ కల్పించారు. వాటికి 20 శాతం స్థలం ఉంటుంది. అవి వరసగా ఆగి ఉన్నా.. పక్కనుంచి మిగతా వాహనాలు ప్రశాంతంగా ముందుకు సాగిపోతుంటాయి. » ఫుట్పాత్ల వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు, పార్కింగ్, హారన్లు మోగించకపోవటం, అక్రమ నిర్మాణాలు రాకుండా నియంత్రించటం.. తదితర అంశాలపై పాఠశాలల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించటం అక్కడి ప్రభుత్వాలు నిరంతరం కొనసాగిస్తున్నాయి. -
ఐజ్వాల్కు చారిత్రక దినం: ప్రధాని మోదీ
ఢిల్లీ: మిజోరాం లోని ఐజ్వాల్ లో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐజ్వాల్ కు నేడు చారిత్రక దినం అని, రైల్వే మ్యాప్లో మిజోరాంలోని ఐజ్వాల్ కు స్థానం దొరికిందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు భారత గ్రోత్ ఇంజన్లు అని మోదీ అభివర్ణించారు. ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక కారిడార్ లో మిజోరం కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశానిదేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా, ప్రధాని మోదీ శనివారం ఉదయం ఐజ్వాల్ చేరుకున్నారు. అయితే భారీ వర్షం కారణంగా లెంగ్పుయ్ విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా ఐజ్వాల్లోని లమ్మువల్ గ్రౌండ్కు చేరుకోలేకపోయారు. తొలుత ప్రధాని మోదీ సైరంగ్-ఆనంద్ విహార్ (ఢిల్లీ) రాజధాని ఎక్స్ప్రెస్ (వారానికి ఒకసారి), కోల్కతా-సైరాంగ్-కోల్కతా ఎక్స్ప్రెస్ (వారానికి ఒకసారి), గౌహతి-సైరాంగ్-గువహతి ఎక్స్ప్రెస్ (రోజువారీ) మూడు రైళ్లకు ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమం అయినా, జాతి నిర్మాణం అయినా, మిజోరాం ప్రజలు ఎల్లప్పుడూ సహకరించడంలో ముందున్నారన్నారు. త్యాగం సేవ, ధైర్యం, కరుణ ఈ విలువలు మిజో సమాజానికి కేంద్రంగా నిలిచివున్నయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ రోజు, మిజోరం భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇది దేశానికి.. ముఖ్యంగా మిజోరం ప్రజలకు ఒక చారిత్రాత్మక రోజు. నేటి నుండి, ఐజ్వాల్ భారతదేశ రైల్వే పటంలో ఉంటుంది. కొన్నేళ్ల క్రితం, ఐజ్వాల్ రైల్వే లైన్కు పునాది వేసే అవకాశం తనకు లభించిందని ఈ రోజు దానిని దేశ ప్రజలకు గర్వంగా అంకితం చేస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మా ఇంజనీర్ల నైపుణ్యాలు, మా కార్మికుల స్ఫూర్తి దీనిని సాధ్యం చేశాయని ప్రధాని వారిని కొనియాడారు. ఈ కొత్త రైలు నెట్వర్క్ ప్రారంభమైన తర్వాత, మిజోరాంలోని రైతులు, వ్యాపారులు దేశవ్యాప్తంగా మరిన్ని మార్కెట్లను చేరుకోగలవని, విద్య ఆరోగ్య సంరక్షణ కోసం మరిన్ని ఎంపికలను పొందగలరన్నారు. ఈ నూతన రైల్వే లైను పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాలలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు. A landmark day for Mizoram as it joins India's railway map! Key infrastructure projects are also being initiated. Speaking at a programme in Aizawl. https://t.co/MxM6c2WZHZ— Narendra Modi (@narendramodi) September 13, 2025 -
కొండలను చీలుస్తూ.. లోయలను దాటుతూ..
ఐజోల్ నుంచి సాక్షి ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి: ఎత్తయిన కొండలు, ఒకటి కాదు రెండు కాదు వందలు.. ఆ వెంటనే అగాధాలను తలపించే లోయలు... కొండలను చీలుస్తూ పరుగులెత్తే నదులు.. ఇలాంటి ప్రాంతాల్లో నడకదారి నిర్మాణం కూడా కష్టమే. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరం భౌగోళిక పరిస్థితి. ఆ రాష్ట్ర రాజధాని నగరమైన ఐజోల్లో భారీ భవనాలు కూడా చాలినంత స్థలం లేక కొండ అంచుల్లో కొంతమేర అగాధంలోకి వేలాడుతున్నట్టు పిల్లర్లపై నిర్మించి ఉంటాయి. నడకదారి నిర్మాణం కూడా కనాకష్టంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 52 కి.మీ.మేర రైల్వే లైన్ నిర్మితమైంది. ఆ రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించటమే ఓ సాహసం. అలాంటిది 11 ఏళ్ల కఠోర శ్రమతో ఇంజినీర్లు అద్భుతాన్ని చేసి చూపారు. ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా ఇప్పుడది రికార్డుల్లోకెక్కింది. దాన్నిశనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రైలు కారిడార్ నిడివి 51.38 కి.మీ. కానీ, దీని నిర్మాణానికి అయిన వ్యయం రూ.8,071కోట్లు. అంటే కి.మీ.కు రూ.157 కోట్లు అన్నమాట. సాధారణంగా రైల్వే లైన్ల నిర్మాణంలో కి.మీ.కు అయ్యే ఖర్చు రూ.13 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటుంది. కానీ, ఇక్కడ వ్యయం అంతకంటే పది రెట్లు ఎక్కువగా ఉండటం ఓ రికార్డు. వంతెనలు, సొరంగాలు... ఈ కారిడార్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించాల్సి రావటమే భారీ వ్యయానికి కారణం. ఒకదానిని ఆనుకుని ఒకటిగా ఈ ప్రాంతంలో భారీ కొండలుంటాయి. ఆ కొండలను తొలిస్తే తప్ప రైలు కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండలను తొలుస్తూ సొరంగాలు నిర్మించారు. రెండు కొండల మధ్య అగాధంలా లోయలున్నందున, సొరంగాలకు సమాంతరంగా వంతెనలు నిర్మించి దానిమీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. సొరంగాలలో మూడో దాని నిడివి 1.9 కి.మీ. కావటం విశేషం. అలా మొత్తం సొరంగాల నిడివి 15.88 కి.మీ.గా ఉంది.అంటే మొత్తం రైలు కారిడార్లో 31 శాతం నిడివి సొరంగాలతోనే ఉందన్నమాట. ఇక 153 వంతెనల్లో 55 వంతెనలు అతి భారీవి. వాటిల్లో 97వ నంబర్ వంతెన పొడవు 742 మీటర్లు కాగా, దానికి నిర్మించిన స్తంభాల ఎత్తు 114 మీటర్లు. మరో 88 వంతెనలు కాస్త చిన్నవి. 10 ఆర్యూబీలు, ఆర్ఓబీలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం వంతెనల నిడివి కలిపితే 11.76 కి.మీ. మొత్తం కారిడార్ నిడివిలో వీటి వాటా 23 శాతం. అంటే 54 శాతం రైల్వే లైను వంతెనలు, సొరంగాలతోనే ఉంటుందన్నమాట. ఐజోల్కు భాగ్యం ⇒ దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు గాను సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు. ఆరు రాష్ట్రాల్లో పాక్షికంగా ఉన్నప్పటికీ, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఇంతకాలం తర్వాత మిజోరం రాజధాని ఐజోల్కు ఆ భాగ్యం దక్కబోతోంది. మిగతా మూడు రాష్ట్రాల రాజధానులను రైల్వేతో జోడించే కసరత్తు జరుగుతోంది. ⇒ ఐజోల్కు 20 కి.మీ. దూరంలో ఉన్న సాయిరంగ్ స్టేషన్ నుంచి ఇక నాలుగు రైళ్లు నడవనున్నాయి. ఇందులో రాజధాని ఎక్స్ప్రెస్ వారానికి ఒక రోజు ఢిల్లీకి, కోల్కతాకు వారంలో మూడు రోజులు నడిచే మరో ఎక్స్ప్రెస్, అస్సాం రాజధాని గువాహటికి నిత్యం ఓ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానున్నాయి. సాయిరంగ్ స్టేషన్ నుంచి మయన్మార్ దేశ సరిహద్దు 223 కి.మీ. దూరంలో ఉంటుంది. ⇒ ప్రకృతి రమణీయతకు నెలవైన ఆ ప్రాంతానికి రైలు కనెక్టివిటీతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరగనుంది. పరిశ్రమలు కూడా రానున్నాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన సరుకుల రవాణా కూడా అతి కష్టంగా ఉన్నందున, ఆ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు అధికం. ఇప్పుడు రైలు మార్గాన సరుకు రవాణా సులభతరం కానున్నందున ధరలు దిగివచ్చి సామాన్యులకు ఊరట కలిగే అవకాశం ఉంది. -
ఇంజనీరింగ్ అద్బుతం రైలు వెళ్లలేని చోటుకు రైలొచ్చింది
-
కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి
ఐజ్వాల్: మిజోరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ రాతి క్వారీ కుప్పకూలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఐజ్వాల్ జిల్లాలో జరిగిన క్యారీ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరికొంత మంది క్యారీలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.#Mizoram: 2 killed, many feared dead after stone quarry collapses in #AizawlTwo individuals were killed after a stone quarry collapsed in Aizawl’s Melthum and Hlimen border on May 28 around 6 am after #CycloneRemal wreaked havoc across Mizoram, as per latest reports.… pic.twitter.com/rCr7cExMGX— India Today NE (@IndiaTodayNE) May 28, 2024క్యారీలో చిక్కుకున్నవారిని రెస్య్కూ చేసి బయటకు తీసుకురావటానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భారీ వర్షం, కొండచరియలు విరిగిపడే ప్రాంతం సెర్చ్ ఆపరేషన్కు ప్రతికూలంగా మారిందని వెల్లడించారు.10 Dead, Several Feared Trapped As Stone Quarry Collapses In Mizoram https://t.co/8B5FGdvLz6— Priyanka Krishnadas (@pri3107das) May 28, 2024 మరోవైపు భారీ వర్షం కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులుకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. అదే విధంగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో హైవేలు, కీలక రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. హుంతూర్ వద్ద జాతీయ రహదారి 6పై కొండచరియలు విరిగిపడటంతో ఐజ్వాల్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఆదివారం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో రెమాల్ తుపాన్ బిభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. -
మిజోరం జెయింట్ కిల్లర్..ఎవరంటే..!
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూమెంట్(జెడ్పీఎమ్) పార్టీ ఘన విజయం సాధించింది. 27 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో జెడ్పీఎమ్ పార్టీ తరపున ఐజ్వాల్ ఈస్ట్-1 నియోజకవర్గం నుంచి గెలిచిన లాల్తన్సంగా వార్తల్లో నిలిచారు. మూడుసార్లు మిజోరం ముఖ్యమంత్రిగా చేసిన జోరంతంగాను ఓడించి 2 వేల ఓట్ల మెజారిటీతో లాల్ గెలిచారు. ఈ సందర్భంగా లాల్తన్సంగా మాట్లాడుతూ ‘మిజోనేషనల్ ఫ్రంట్(ఎమ్ఎన్ఎఫ్), కాంగ్రెస్ పార్టీలది కేవలం అధికారదాహం. పార్టీ నాకు ఐజ్వాల్ ఈస్ట్-1 టికెట్ ఇచ్చినపుడు నేను సర్వే చేసుకున్నాను. నియోజకవర్గంలో జోరంతంగా బలం అంతగా లేదని నాకు అప్పుడే తెలిసింది. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా జోరంతంగా నాయకత్వంపై ప్రజలు అంత సంతృప్తిగా లేరు’అని లాల్ తెలిపారు. ‘కాంగ్రెస్, ఎమ్ఎన్ఎఫ్ పార్టీలు కేవలం డబ్బుపైనే ఆధారపడి రాజకీయాలు చేస్తాయి.నిజంగా డబ్బు ప్రభావమే ఉంటే జోరంపై నేను గెలిచేవాడిని కాదు’అని లాల్ చెప్పారు. సోమవారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మిజోరంలో జెడ్పీఎమ్ పార్టీ క్లీన్స్వీప్ చేసింది. మిజోరం అసెంబ్లీలో మొత్తం 40 సీట్లుండగా జెడ్పీఎమ్ 27 సీట్లు గెలిచింది. ఇవీ చూడండి..మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ -
మిజోరంలో 77 శాతానికి పైగా పోలింగ్
ఐజ్వాల్: అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), విపక్ష జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం), కాంగ్రెస్ మధ్య తీవ్రపోటీకి వేదికగా నిలిచిన మిజోరం శాసనసభ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 40 స్థానాలకూ ఒకే దఫాలో పోలింగ్ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు అందిన సమాచారం మేరకు 77.39 శాతం పోలింగ్ నమోదైందని అదనపు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్.లియాంజెలా చెప్పారు. సవరించిన తుది ఫలితాలు బుధవారం వచ్చేసరికి పోలింగ్ శాతం 80 శాతాన్ని తాకొచ్చు. 18 మంది మహిళలు సహా మొత్తంగా 174 మంది అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 8.57 లక్షల ఓటర్లు ఉన్నారు. సెర్చిప్ జిల్లాలో అత్యధికంగా 84.49 శాతం, ఐజ్వాల్ జిల్లాలో అత్యల్పంగా 73.09 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు 7,200 భద్రతా సిబ్బందిని నియోగించారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్కేంద్రాలను ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ఓటేయబోతే మొరాయించింది ఐజ్వాల్లోని ఒక ఈవీఎం ఏకంగా ముఖ్యమంత్రినే రెండోసారి పోలింగ్కేంద్రానికి రప్పించింది. మొదటిసారి మొరాయించడమే ఇందుకు కారణం. ర్యామ్హ్యూన్ వెంగ్లాయ్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు ఉదయాన్ని ముఖ్యమంత్రి జోరామ్థంగా విచ్చేశారు. అప్పుడే ఈవీఎం మొరాయించింది. చేసేదేం లేక ఇంటికి వెనుతిరిగారు. మళ్లీ 9.40 గంటలకు వచ్చి ఓటేశారు. ‘ ఈసారి కనీసం 25 చోట్ల గెలుస్తాం’ అని సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లాల్సావ్తా ఐజ్వాల్ వెస్ట్–3 నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 96 ఏళ్ల అంధుడు పూ జదావ్లా పోస్టల్ బ్యాలెట్ను కాదని స్వయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. పోలింగ్ నేపథ్యంలో మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసేశారు. రాకపోకలను ఆపేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఏకంగా 81.61 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. డిసెంబర్ మూడో తేదీన ఓట్లలెక్కింపు ఉంటుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 చోట్ల గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఉపఎన్నికల్లో మరో రెండు చోట్ల గెలిచింది. విపక్ష జెడ్పీఎం ఎనిమిది చోట్ల గెలిచింది. బీజేపీ కేవలం ఒక్క స్థానంలో, కాంగ్రెస్ ఐదు చోట్ల విజయబావుటా ఎగరేశాయి. ‘ఈసారి పట్టణప్రాంతాల్లో జెడ్పీఎం, గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎన్ఎఫ్ ఎక్కువ సీట్లు గెలవొచ్చు’ అన్న విశ్లేషణలు వినిపించాయి. -
‘మిజోరం’ ప్రమాదం.. 22కు చేరిన మృతులు
ఐజ్వాల్: మిజోరంలోని ఐజ్వాల్లో బుధవారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం సాయంత్రం వరకు మొత్తం 22 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. జాడ తెలియకుండా పోయిన మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. అతడు ప్రాణాలతో ఉండే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. క్షతగాత్రులైన ముగ్గురిలో ఇద్దరిని ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. బాధితులైన మొత్తం 26 మందీ పశి్చమ బెంగాల్లోని మాల్డా జిల్లాకు చెందిన వారే. -
బ్రిడ్జి కింద నలిగిన బతుకులు
కోల్కతా/ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో బుధవారం ఘోరం జరిగింది. ఐజ్వాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 100 మీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. నిర్మాణ పనుల్లో ఉన్న కారి్మకుల్లో కనీసం 18 మంది ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇంకా కనీసం ఐదుగురి జాడ తెలియాల్సి ఉంది. మృతుల్లో అత్యధికులు పశి్చమ బెంగాల్కు చెందిన వారే. ప్రమాద ప్రాంతం సైరంగ్ ఐజ్వాల్కు 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. కురింగ్ నది మీద నిర్మిస్తున్న బ్రిడ్జి పైకి చేర్చే క్రమంలో గాంట్రీ కుప్పకూలడమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 16 మృతదేహాలను వెలికితీశారు. సహాయ, తరలింపు తదితర చర్యల్లో మిజోరం అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాల్సిందిగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. మృతుల కుటుంబాల్లోని అర్హులకు రైల్వే శాఖ పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. Under construction railway over bridge at Sairang, near Aizawl collapsed today; atleast 17 workers died: Rescue under progress. Deeply saddened and affected by this tragedy. I extend my deepest condolences to all the bereaved families and wishing a speedy recovery to the… pic.twitter.com/IbmjtHSPT7 — Zoramthanga (@ZoramthangaCM) August 23, 2023 ఇది కూడా చదవండి: Live Updates: చందమామను ముద్దాడే క్షణం కోసం.. చరిత్రకు అడుగు దూరంలో చంద్రయాన్–3 -
షాకింగ్.. సబ్బు పెట్టెల్లో హెరాయిన్.. రూ.12 కోట్ల డ్రగ్స్ సీజ్..
ఐజ్వాల్: మిజోరాంలో డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. పోలీసులు, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఐజ్వాల్లో రెండు చోట్ల మత్తుపదార్థాలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం నలుగురు డ్రగ్ పెడ్లర్స్ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక చోట 98,000 డ్రగ్స్ మాత్రలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.9.8 కోట్లు ఉంటుందని తెలిపారు. మరో ఘటనలో శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. 40 సబ్బుపెట్టెల్లో హెరాయిన్ను గుర్తించారు అధికారులు. దీని విలువ రూ.2.5కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. వీడియో వైరల్.. -
చనిపోలేదు! బిగ్గెస్ట్ ఫ్యామిలీమ్యాన్ బతికే ఉన్నారు!
ఐజ్వాల్: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి అధిపతిగా రికార్డులకెక్కిన జియాన్ఘాకా మరణించి 36 గంటలు దాటుతున్నా, ఆయన కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఆయన ఇంకా జీవించేఉన్నారని వారు చెబుతున్నారు. 39 మంది భార్యలు, 90 మందికి పైగా సంతానం, 33 మంది మనవళ్లు, మనవరాళ్లున్న 76 ఏళ్ల జియాన్ స్థానిక లాల్పా కోహ్రాన్ ధర్ తెగకు అధిపతి. బీపీ, సుగర్తో బాధపడుతున్న ఆయన ఆదివారం మరణించినట్లు స్థానిక ట్రినిటీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఆయన శరీరం ఇంకా వెచ్చగానే ఉందని, నాడి కొట్టుకుంటూనే ఉందని చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తెచ్చాక ఆయన నాడి తిరిగి కొట్టుకోవడం ఆరంభించిందని తెగ కార్యదర్శి జతిన్ ఖుమా చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులే కాకుండా స్థానికులు సైతం ఈ పరిస్థితుల్లో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధంగా లేరన్నారు. ఆయన పూర్తిగా మరణించారని తెగ పెద్దలు భావించేవరకు జియాన్ను పూడ్చిపెట్టేదిలేదన్నారు. 70 ఏళ్ల క్రితం ఈ తెగను జియాన్ పూర్వీకులు స్థాపించారు. వీరంతా కుటుంబపోషణకు వడ్రంగి పని చేస్తుంటారు. ప్రస్తుతం దాదాపు 433 కుటుంబాలకు చెందిన 2500 మందికి పైగా తెగలో ఉన్నారు. చదవండి: 38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు -
38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు
ఐజ్వాల్: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద జియోన చన (78) ఇకలేరు. అతడికి 38 మంది భార్యలు.. 89 మంది మగ పిల్లలు.. 14 మంది కుమార్తెలు.. 33 మంది మనవరాళ్లు.. ఒక మనవడు ఉన్నారు. వీరి కుటుంబంలో మొత్తం 176 మంది సభ్యులు ఉన్నారు. కాగా జియోన మరణంపై మిజోరాం ముఖ్యమంత్రి జోరాంతంగ స్పందించారు. ఆయన కుటుంబం ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద అయిన మిజోరాం వాసి మిస్టర్ జియోన్కు బరువైన హృదయంతో వీడ్కోలు పలుకుతున్నాను. ఆయనకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు ఉన్నారు. ఆయన గ్రామం బక్తంగ్ త్లంగ్నాంతో పాటు మిజోరాంకు కూడా అనేక మంది పర్యాటకులు రావడానికి ఆయన కుటుంబం ఒక కారణం’’ అని సీఎం జోరాంతంగ ట్వీట్ చేశారు. చదవండి: భట్టి: ప్రజల అవసరాల కోసం ఆస్తులు... అమ్మకానికి కాదు -
ఆస్పత్రిలో ఫ్లోర్ తుడిచిన మంత్రి.. ‘నేనేం ఎక్కువ కాదు’
ఐజ్వాల్: కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తోంది. పేద, ధనిక తేడాలేకుండా అందరూ ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, మందుల కోసం సోషల్ మీడియాలో వినతులు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల వేళల్లో కనిపించే రాజకీయ నాయకులు ఈ కష్టకాలంలో కంటికి కనిపించడం లేదు. కానీ, ఇందుకు భిన్నంగా మిజోరం విద్యుత్ శాఖ మంత్రి ఆర్ లాల్జిర్లియానా అధికార దర్పం పక్కపెట్టి ఆస్పత్రిలో నేలను శుభ్రం చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మంత్రి ఆర్ లాల్జిర్లియానాను చూసి రాజకీయ నాయకులు కళ్లు తెరవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. " నేను ఆసుపత్రిలో నేలను శుభ్రంచేసి వైద్యులు, నర్సులను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. ఈ పని చేసి నేనొక ఉదాహరణగా నిలవాలి, అది ఇతరులకు అవగాహన కల్పించాలన్నదే నా ఆలోచన. మేము ఆస్పత్రిలో బాగానే ఉన్నాం. వైద్యులు, నర్సులు బాగా చూసుకుంటున్నారు." అని మంత్రి ఆర్ లాల్జిర్లియానా మీడియాతో అన్నారు. అంతేకాకుండా తానున్న గది అపరిశుభ్రంగా ఉండటంతో స్వీపర్కి ఫోన్ చేయగా, అటువైపు నుంచి స్పందన రాలేదని, దీంతో తానే శుభ్రం చేసినట్లు వివరించారు. "నాకు ఇలాంటి పనులు కొత్తేం కాదు. అవసరం అనుకున్నప్పుడు నేను ఇలాంటి పనులు చేస్తుంటాను. నేను మంత్రి పదవిలో ఉన్నప్పటికీ.. ఇతరుల కంటే ఎక్కువని అనుకోవట్లేదు" అని ఆయన చెప్పారు. మంత్రితో పాటు ఆయన భార్య, కుమారుడు కూడా అదే ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్నారు. గత సంవత్సరం మిజోరంలోని మంత్రులు వీఐపీ సంస్కృతిని పక్కన పెట్టి ఇంటి పనులు చేయడం, ప్రజా రవాణా, మోటారు బైక్లో ప్రయాణించారు. వీరు వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం.. క్రిస్మస్ వంటి పండుగ సీజన్లో వంట మనుషులుగా పనిచేయడం ద్వారా సామాన్యులుగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. (చదవండి: వైరల్: బొమ్మతో చిరుతనే ఆటపట్టించిన చిన్నారి!) -
వింత ఆచారం : షాపులకు ఓనర్లు ఉండరు
ఐజ్వాల్ : సాధారణంగా కిరాణషాపు నుంచి మొదలుకొని ఏ షాపుకైనా సరే యజమానులు కచ్చితంగా ఉంటారు. వారి ఆధ్వర్యంలోనే షాపు మొత్తం నడుస్తుంటుంది. కాని మిజోరాం రాజధాని ఐజ్వాల్ దగ్గరలో ఉన్న కొన్ని షాపులు మాత్రం యజమానులు లేకుండానే నడుస్తున్నాయి. అక్కడ నివసించే స్థానికులు ఒక ప్రత్యేక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.' న్ఘా లౌ డావర్ సంస్కృతి'గా పిలవబడే సంప్రదాయం ప్రకారం అక్కడ ఉండే దుకాణాలన్ని యజమానులు లేకుండానే నడుస్తుంటాయి.(ధార్వాడ పేడాపై కరోనా నీడ) ఇదంతా ఎందుకంటే చేస్తున్నారంటే.. ఈ ప్రాంతంలో నిజాయితీలో కూడిన మనుషులు నివసిస్తారట. ఎవరు ఎవరిని మోసం చేయరట. వారికి నచ్చినవి కొనుక్కొని ఆ షాపులోనే ఏర్పాటు చేసిన మనీ డిపాజిట్ బాక్సులో డబ్బులు వేసి వెళ్లిపోతారట. ముఖ్యంగా ఇక్కడి షాపులన్ని నమ్మకం పైనే పనిచేస్తాయట. ఇంత ఆధునిక కాలంలో కూడా ఇలాంటి సంప్రదాయాలు పాటించే మనుషులు ఉన్నారా అని ఆశ్చర్యమనిపిస్తే వెంటనే మిజోరాం వచ్చేయండి అంటున్నారు మై హోమ్ ఇండియా ఎన్జీవో సంస్థ. ఎందుకంటే ట్విటర్లో ఈ విషయాన్ని ఆ ఎన్జీవో సంస్థనే షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ' ఒక భారతీయునిగా గర్వపడుతున్నా'.. ' ఐ లవ్ దిస్ పీపుల్ వెరీ మచ్'..' ఇదంతా నమ్మకంపైనై ఆధారపడి ఉంటుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
దొంగ నుంచి బంగారం దొంగిలించిన ఆర్మీ కల్నల్
ఐజ్వాల్: ఓ స్మగ్లర్ నుంచి బంగారం స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించని ఓ సీనియర్ ఆర్మీ అధికారి అసోం రైఫిల్స్ కు చెందిన మరో ఎనిమిదిమంది పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లింగ్ అవుతున్న బంగారాన్ని పట్టుకొని తిరిగి దాన్ని పోలీసులకు అప్పగించకపోవడంతో వారిని ఉదయాన్నే అదుపులోకి తీసుకున్నారు. ఆ బంగారం విలువ దాదాపు రూ.14.5కోట్లు ఉంటుందని అంచనా. ఐజ్వాల్లో 2014 డిసెంబర్ నెలలో మయన్మార్ నుంచి బంగారాన్ని దొంగరవాణా చేస్తున్న సీ లాల్నున్ ఫెలా అనే వ్యక్తి వాహనాన్ని కల్నల్ జాసిత్ సింగ్, మరో ఎనిమిది మంది కలసి అడ్డుకున్నారు. వీరిలో ఒకరకు జూనియర్ కమిషనర్ రేంజ్ అధికారి కూడా ఉన్నాడు. వారు తొలుత కారును ఆపేశారు. తమ వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తూనే సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో వారికి మొత్తం రూ.14.5కోట్ల విలువ చేసే 52 బంగారు కడ్డీలు లభించాయి. అనంతరం వారి కార్లలో వాటిని పెట్టుకొని అతడిని బెదిరించి వెళ్లిపోయారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అసలు తమకు ఎవరూ బంగారం అప్పగించలేదని చెప్పిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని ఆర్మీ యూనిట్ పై అనుమానం వచ్చి గత నెల(ఏప్రిల్ 21) కేసు ఫైల్ చేసి కల్నల్ సింగ్ ను దర్యాప్తునకు సహకరించాలని కోరారు. కానీ, ముందస్తుగా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునేందుకు వెళ్లడంతో పోలీసులు అరెస్టు చేశారు. -
మొబైల్ కోసం అక్కాబావలను చంపేశాడు
ఐజ్వాల్: మొబైల్ ఫోన్పై మోజు ఆ యువకుడిని పిచ్చివాడిని చేసింది. తాను ఏం చేస్తున్నానో అనే ఆలోచన కూడా లేకుండా చేసింది. ఫలితంగా అతడు తీవ్ర నేరానికి పాల్పడ్డాడు. సొంత అక్కాబావను హతమార్చాడు. అనంతరం ఇంట్లో నుంచి 36 వేలు ఎత్తుకెళ్లి చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఈ నెల 7న జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతానికి జువైనల్ కోర్టు అతడు నేరం చేసినట్లు నిర్దారించి జైలుకు తరలించింది. పోలీసుల వివరాల ప్రకారం, సవతి సోదరి, అతడి బావకు ఈ మధ్యనే ప్రభుత్వ సాయంగా ఓ 66 వేల రూపాయాలు వచ్చాయి. అందులో ఓ ముప్పై వేలతో కొంత భూమి కొనుక్కోని మిగితావి ఇంట్లో పెట్టారు. దీంతో వాటిపై కన్నేసిన యువకుడు ఆ డబ్బుతో కొత్త ఫోన్ కొనుక్కోవాలని ఆలోచించి, వారిని అడిగితే ఇవ్వరని భావించి ఊర్లో చుట్టుపక్కల జంతువులను వేటాడటానికి ఉపయోగించే సింగ్ బ్యారెల్ తుపాకీని తీసుకొని ముందుగా బావను హతమార్చాడు. ఆ వెంటనే సోదరిని అదే తుపాకీతో దారుణంగా కొట్టాడు. అనంతరం గొడ్డలితో తీవ్రంగా గాయపరిచాడు. చివరికి ఆమె చనిపోగానే ఇంట్లో ఉన్న 36 వేలు తీసుకొని ఏం తెలియనట్లు సొంతింటికి వెళ్లాడు. అలా వెళ్లిన మరుసటి రోజే పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం చెప్పాడు. -
భర్త ఎదుటే భార్యపై గ్యాంగ్ రేప్
ఐజాల్: అత్యాచారాల సంసృతి ఈశాన్య రాష్ట్రాలకు పాకుతోంది. మిజోరంలో వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఎదుటే వారీ ఘాతుకానికి పాల్పడ్డారు. రొపాయబవాక్ ప్రాంతంలో ఆదివారం ఈ దారుణోదంతం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్తను చెట్టుకు కట్టేసి, అతడి ఎదుటే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. చావల్హ్మున్ ప్రాంతానికి చెందిన జార్జొలియనా(19), పీసీ లాల్హూట్లుయాంగ(20) ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
మిజోరంలో కాంగ్రెస్కు ఆధిక్యం
ఐజ్వాల్: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి మిజోరంలో ఊరట లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు దక్కించునే దిశగా సాగుతోంది. మిజోరంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజాగా అందించిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 22 సీట్లు గెల్చుకుంది. మరో 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరాలాండ్ డెమొక్రటిక్ అలయన్స్లతో కూడిన మిజోరం ప్రజాస్వామిక కూటమి ఒక సీటు దక్కించుకుంది. మరో రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి లాల్ తన్హాల్వా తన సొంత నియోజకవర్గం సెర్చీఫ్లో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఎంఎన్ఎఫ్ అభ్యర్థి సి లాల్ రామ్ జావాపై 734 ఓట్ల తేడాతో గెలుపొందారు. తన్హాల్వాకు 5719, లాల్ రామ్ జావాకు 4985 ఓట్లు వచ్చాయి. -
గ్రామీణ పేదలకు కొత్త గృహనిర్మాణ పథకం: ప్రధాని
ఐజ్వాల్: గ్రామీణ పేదల గృహనిర్మాణం కోసం కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెల్లడించారు. ఇక్కడ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మిజోరంపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో గృహనిర్మాణ అవసరం చాలా ఎక్కువగా ఉందనే విషయం తనకు అర్థమైందని, త్వరలో ప్రారంభమయ్యే పథకంతో వారి అవసరాలు తీరతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా యువతను కోరారు. క్రీడలకు భవిష్యత్లో బంగారు భవిష్యత్ ఉందని, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని తెలిపారు. కంప్యూటర్ విద్యను సమర్థంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మౌలిక వసతుల అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే 210 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంట్ను పూర్తి చేస్తామని చెప్పారు. మయన్మార్ సిట్వే పోర్ట్ను అనుసంధానిస్తూ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఏ దశాబ్దకాలంలో లేనంతగా యూపీఏ హయాంలో ఆర్థికాభివృద్ధి జరిగిందని చెప్పారు. పేదరికం మూడొంతులు తగ్గిందని తెలిపారు.