ఈ షాపులకు ఓనర్లు ఉండరంట..

Mizoram Has Shops Without Shopkeepers To Teach Humanity Became Viral - Sakshi

ఐజ్వాల్‌ : సాధారణంగా కిరాణషాపు నుంచి మొదలుకొని ఏ షాపుకైనా సరే యజమానులు కచ్చితంగా ఉంటారు. వారి ఆధ్వర్యంలోనే షాపు మొత్తం నడుస్తుంటుంది. కాని మిజోరాం రాజధాని ఐజ్వాల్‌ దగ్గరలో ఉన్న కొన్ని షాపులు మాత్రం యజమానులు లేకుండానే నడుస్తున్నాయి.​ అక్కడ నివసించే స్థానికులు ఒక ప్రత్యేక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.' న్ఘా లౌ డావర్‌ సంస్కృతి'గా పిలవబడే సంప్రదాయం ప్రకారం అక్కడ ఉండే దుకాణాలన్ని యజమానులు లేకుండానే నడుస్తుంటాయి.(ధార్వాడ పేడాపై కరోనా నీడ)


ఇదంతా ఎందుకంటే చేస్తున్నారంటే.. ఈ ప్రాంతంలో నిజాయితీలో కూడిన మనుషులు నివసిస్తారట. ఎవరు ఎవరిని మోసం చేయరట. వారికి నచ్చినవి కొనుక్కొని ఆ షాపులోనే ఏర్పాటు చేసిన మనీ డిపాజిట్‌ బాక్సులో డబ్బులు వేసి వెళ్లిపోతారట. ముఖ్యంగా ఇక్కడి షాపులన్ని నమ్మకం పైనే పనిచేస్తాయట. ఇంత ఆధుని​క కాలంలో కూడా ఇలాంటి సంప్రదాయాలు పాటించే మనుషులు ఉన్నారా అని ఆశ్చర్యమనిపిస్తే వెంటనే మిజోరాం వచ్చేయండి అంటున్నారు మై హోమ్‌ ఇండియా ఎన్‌జీవో సంస్థ. ఎందుకంటే ట్విటర్‌లో ఈ విషయాన్ని ఆ ఎన్‌జీవో సంస్థనే షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ' ఒక భారతీయునిగా గర్వపడుతున్నా'.. ' ఐ లవ్‌ దిస్‌ పీపుల్‌ వెరీ మచ్‌'..' ఇదంతా నమ్మకంపైనై ఆధారపడి ఉంటుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top