acquisition
-
టెక్ మహీంద్రా చేతికి కెనడా ఐటీ కంపెనీ
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా కెనడా కంపెనీ అల్లూరి టెక్నాలజీస్ ఇంక్(అవాంట్)ను కొనుగోలు చేయనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా తొలుత 85% వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 2.8 కోట్ల కెనడియన్ డాలర్లు(రూ. 171 కోట్లు) వెచి్చంచనుంది. మూడేళ్ల తదుపరి మిగిలిన 15% వాటాను ముందుగా నిర్ణయించిన ధర ప్రకారం కొనుగోలు చేయనున్నట్లు టెక్ మహీంద్రా పేర్కొంది.అవాంట్తో.. సొంత అనుబంధ కంపెనీ టెక్ మహీంద్రా కన్సల్టింగ్ గ్రూప్(టీఎంసీజీ) వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. తాజా కొనుగోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) విభాగంలో మరింత బలపడే వీలున్నట్లు తెలియజేసింది. 2029 జూన్ 30కల్లా మిగిలిన 15% వాటా సైతం దక్కించుకోనున్నట్లు వెల్లడించింది.ఈ కొనుగోలు ద్వారా ఉత్తర అమెరికా మార్కెట్లో టెక్ మహీంద్రా తన ఉనికిని మరింత సుస్థిరం చేసుకోనుంది. ముఖ్యంగా అల్లూరి టెక్నాలజీస్కు ఉన్న డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ నైపుణ్యం, టెక్ మహీంద్రా గ్లోబల్ నెట్వర్క్కు తోడవ్వడం వల్ల క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగాల్లో కొత్త ప్రాజెక్టులను చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. -
సన్ ఫార్మా మెగా డీల్..!
న్యూఢిల్లీ: దేశీ ఔషధ రంగ దిగ్గజం సన్ ఫార్మా మరో భారీ డీల్కి తెరతీసింది. అమెరికాకు చెందిన ఆర్గానాన్ అండ్ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం సంస్థ విలువను 11.75 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 1.10 లక్షల కోట్లు) లెక్క కట్టారు. ఒక్కో షేరుకు 14 డాలర్ల చొప్పున చెల్లించి ఆర్గానాన్ను సన్ ఫార్మా కొనుగోలు చేయనుంది. ఇది పూర్తిగా నగదు రూపంలో ఉంటుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి 2027 తొలినాళ్లలో ఒప్పందం పూర్తవుతుందని అంచనా. దీనికి కావాల్సిన మొత్తాన్ని 2–2.5 బిలియన్ డాలర్లను అంతర్గతంగాను, మిగతా 9.25–9.75 బిలియన్ డాలర్లను రుణం రూపంలో సన్ ఫార్మా సమకూర్చుకోనుంది. కాస్త ఆనందం.. కాస్త ఉత్కంఠ.. ఇరు కంపెనీల కలయికతో మరింత శక్తివంతమైన సంస్థ ఏర్పడుతుందని సన్ ఫార్మా చైర్మన్ దిలీప్ సంఘ్వీ తెలిపారు. ‘ఈ డీల్ విషయంలో కాస్త ఆనందంగాను, ఉత్తేజంగాను, కాస్త ఉత్కంఠగాను ఉంది. ఇది చాలా భారీ ఒప్పందం కావడం, పెద్ద మొత్తంలో రుణం తీసుకోవాల్సి రానుండటమే ఇందుకు కారణం. మేము రుణానికే తప్ప రిస్కుకు వ్యతిరేకం కాదు. అయితే, ఇప్పుడు తీసుకుబోయే రుణం భారీగానే ఉన్నప్పటికీ ఉమ్మడి సంస్థ ఎబిటాకు 2.3 రెట్లు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే ఆదాయాలను బట్టి దీన్ని త్వరలోనే తగ్గించుకోగలమనే ధీమా ఉంది. గతంలో ర్యాన్బాక్సీ డీల్ని ఇది గుర్తు తెస్తోంది. అప్పట్లో మాది చిన్న కంపెనీ అయినప్పటికీ చాలా పెద్ద సంస్థను కొన్నాం. ఇప్పుడు అర్గానాన్ దాదాపు సన్ ఫార్మా స్థాయిదే అయినప్పటికీ సుమారు 25 శాతం తక్కువ వేల్యుయేషన్కే లభిస్తోంది‘ అని ఆయన పేర్కొన్నారు. ‘వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలన్నింటినీ పరిశీలించిన మీదట నగదు రూపంలో ఉండే ఈ లావాదేవీ మా వాటాదారులకు గణనీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని బోర్డు నిర్ణయించింది. అంతర్జాతీయంగా మా వ్యాపారాలు, ఉద్యోగులు, పేషెంట్లకు సన్ ఫార్మా దన్నుగా ఉంటుందని ఆశిస్తున్నాం‘ అని ఆర్గానాన్ ఎగ్జిక్యూటివ్ చెయిర్ క్యారీ కాక్స్ తెలిపారు. ఆర్గానాన్ కథ ఇదీ... 2021లో దిగ్గజ సంస్థ మెర్క్ నుంచి విడగొట్టడం ద్వారా ఏర్పాటైన గ్లోబల్ హెల్త్కేర్ కంపెనీ ఆర్గానాన్. మెర్క్ని అమెరికా, కెనడా వెలుపల ఎంఎస్డీగా వ్యవహరిస్తారు. ఆర్గానాన్కి యూరోపియన్ యూనియన్, వర్ధమాన మార్కెట్లలో ఆరు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాల్లో గ్లోబల్ లీడరుగా కార్యకలాపాలు సాగిస్తోంది. మహిళల హెల్త్, జనరల్ మెడిసిన్స్ విభాగాల్లో బయోసిమిలర్స్ సహా 70కి పైగా ఉత్పత్తులు ఉన్నాయి. 140 దేశాల్లో విక్రయిస్తోంది. అమెరికా, యూరప్, చైన్, కెనడా, బ్రెజిల్ మొదలైనవి భారీ మార్కెట్లుగా ఉన్నాయి. 2025 డిసెంబర్ 31తో ముగిసిన సంవత్సరంలో కంపెనీ 6.2 బిలియన్ డాలర్ల ఆదాయం, 1.9 బిలియన్ డాలర్ల ఎబిటాను (సవరించిన) ఆర్జించింది. 8.6 బిలియన్ డాలర్ల రుణభారం, 574 మిలియన్ డాలర్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఇటీవలే ఒక ఉత్పత్తి విక్రయానికి గాను ముందస్తుగా 440 మిలియన్ డాలర్లు అందుకుంది. డీల్స్ కింగ్.. సన్ .. సన్ ఫార్మా గతంలో కూడా పలు భారీ స్థాయి కొనుగోళ్లు చేసింది. 2014లో ర్యాన్బాక్సీని 4 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. అలాగే 2007లో ఇజ్రాయెల్కి చెందిన టారో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ని 454 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దేశీ దిగ్గజాల భారీ షాపింగ్.. అంతర్జాతీయంగా మన కంపెనీల భారీ కొనుగోళ్ల ఒప్పందాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. 2007లో కోరస్ను టాటా స్టీల్ 12 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. తర్వాత 2010లో కువైట్ దిగ్గజం జెయిన్ టెలికంనకు చెందిన ఆఫ్రికా వ్యాపారాన్ని భారతి ఎయిర్టెల్ 10.7 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. సన్ ఫార్మాకు ప్రయోజనాలు.. → 12.4 బిలియన్ డాలర్ల ఉమ్మడి ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్ 25 ఫార్మా కంపెనీల్లో ఒకటిగా సంస్థ నిలుస్తుంది. → గ్లోబల్గా మహిళల ఆరోగ్య సంరక్షణ ఔషధాలకు సంబంధించి టాప్ 3 కంపెనీల్లో ఒకటిగా చోటు దక్కుతుంది. → బయోసిమిలర్స్ మార్కెట్లో 7వ పెద్ద సంస్థగా ఉంటుంది. → 150 దేశాలు, 18 భారీ మార్కెట్లలో కార్యకలాపాలు. ఒక్కో మార్కెట్ నుంచి 100 మిలియన్ డాలర్ల కు పైగా ఆదాయం లభిస్తుంది.షేరు 7 శాతం అప్.. సోమవారం బీఎస్ఈలో సన్ ఫార్మా షేరు 7 శాతం ఎగిసింది. రూ. 1,733.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ. 27,307 కోట్లు పెరిగి రూ. 4,15,987 కోట్లకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరుగా నిల్చింది. అమెజాన్ నౌ 100 నగరాల్లోకి విస్తరణలిస్టులో హైదరాబాద్, వైజాగ్ న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ అమెజాన్ నౌ క్విక్ కామర్స్ సరీ్వసులను దేశవ్యాప్తంగా 100 నగరాల్లోకి విస్తరించనుంది. హైదరాబాద్, వైజాగ్తో పాటు పుణే, చెన్నై, కోల్కతా, జైపూర్, లక్నో తదితర నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూ రు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లో (నేషన ల్ క్యాపిటల్ రీజియన్) అమెజాన్ నౌ సేవ లు లభిస్తున్నాయి. అమెజాన్ ఇండి యా ఇటీవల ప్రకటించిన రూ. 2,800 కోట్ల పెట్టుబడుల ప్రణాళికల్లో ఈ విస్తరణ భాగంగా ఉండనుంది. 1,000కి పైగా మైక్రో–ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు తమ క్విక్ కామర్స్ కార్యకలాపాలకు దన్నుగా ఉంటాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఎవ్రీడే ఎజెన్షియల్స్) హర్‡్ష గోయెల్ తెలిపారు. క్విక్ కామర్స్ విస్తరణతో 16,000 మందికి పైగా రైతులు తమ టెక్నాలజీ, నెట్వర్క్ని ఉపయోగించుకుని, ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు. -
దివాలా తీసిన జేఏఎల్ కొనుగోలు.. అదానీకే ‘జై’!
న్యూఢిల్లీ: దివాలా తీసిన తమ సంస్థ జేఏఎల్ కొనుగోలుకి సంబంధించి అదానీ గ్రూప్ వైపై జేపీ గ్రూప్ వ్యవస్థాపకుడు జైప్రకాశ్ గౌర్ మొగ్గు చూపారు. గౌతమ్ అదానీ సారథ్యంలో గ్రూప్ పురోగమించగలదని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. రుణదాతల కమిటీ (సీవోసీ), దివాలా పరిష్కార నిపుణుడు పారదర్శకంగా బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు గౌర్ పేర్కొన్నారు.ఇందులో పాల్గొన్నందుకు అదానీ గ్రూప్, వేదాంత గ్రూప్నకు ధన్యవాదాలు తెలిపారు. అదానీ గ్రూప్ను సీవోసీ ఎంపిక చేయడాన్ని తాను గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. బిడ్డింగ్లో తాము గెల్చినట్లు రాతపూర్వకంగా ధృవీకరించిన తర్వాత, దానికి భిన్నంగా అదానీ గ్రూప్ను విజేతగా ప్రకటించారంటూ పోటీ సంస్థ వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్ ఆరోపించిన నేపథ్యంలో గౌర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.రూ. 57,185 కోట్ల రుణాలు బాకీ పడటంతో 2024 జూన్లో జేఏఎల్పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. రూ. 14,535 కోట్ల అదానీ గ్రూప్ బిడ్కు గతేడాది నవంబర్లో సీవోసీ ఆమోదించగా, మార్చి 17న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (అలహాబాద్ బెంచ్) కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, రూ. 17,926 కోట్లకు బిడ్ చేసిన వేదాంత, దీన్ని సవాలు చేస్తూ అపీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ప్రస్తుతం దీనిపై ఎన్సీఎల్ఏటీ విచారణ చేపట్టినప్పటికీ, ఎన్సీఎల్టీ నిర్ణయంపై మధ్యంతర స్టే విధించడానికి నిరాకరించింది. -
విదేశీ చేతుల్లోకి ఆర్బీఎల్ బ్యాంక్
న్యూఢిల్లీ: దేశీ ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్ను దుబాయ్ దిగ్గజం ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ సొంతం చేసుకోనుంది. ఆర్బీఎల్లో 74 శాతం వాటా కొనుగోలు ప్రతిపాదనకు తాజాగా ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆర్బీఎల్ విదేశీ బ్యాంకుగా అవతరించనుంది.ఏప్రిల్ 1 నుంచి ఏడాదిలోగా ఎమిరేట్స్ ఎన్బీడీ వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుంది. యూఏఈలో రెండో పెద్ద బ్యాంకుగా నిలుస్తున్న ఎమిరేట్స్ ఎన్బీడీ 2025 అక్టోబర్లో ఆర్బీఎల్ బ్యాంక్లో 60 శాతం వాటా కొనుగోలుకి ఆసక్తిని ప్రకటించింది. ఇందుకు రూ. 26,853 కోట్లు వెచ్చించనుంది.కాగా.. ఆర్బీఐ అనుమతి కారణంగా మెజారిటీ వాటా కొనుగోలు చేయడంతోపాటు.. ఆర్బీఎల్ చెల్లించిన మూలధనంలో ఎమిరేట్స్ ఎన్బీడీ కనీసం 51 శాతం వాటాను కొనసాగించవలసి ఉంటుంది. తద్వారా విదేశీ బ్యాంక్ అనుబంధ సంస్థగా ఆర్బీఎల్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఏడాదిలోగా ఆర్బీఎల్ బ్రాంచీలను ఎమిరేట్స్ ఎన్బీడీలో విలీనం చేయవలసి ఉంటుంది. -
ఇన్ఫోసిస్ యూఎస్ షాపింగ్!
న్యూఢిల్లీ: టెక్నాలజీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ కొనుగోళ్లకు తెరతీసింది. ఆరోగ్యపరిరక్షణ సంబంధ డిజిటల్ సమాచార కంపెనీ ఆప్టిమమ్ హెల్త్కేర్ ఐటీతోపాటు ఇన్సూరెన్స్ కన్సల్టింగ్ టెక్నాలజీ సంస్థ స్ట్రాటస్ను సొంతం చేసుకోనుంది. ఇందుకు ఉమ్మడిగా రూ. 5,260 కోట్లు వెచ్చించనుంది. ఆప్టిమమ్ హెల్త్కేర్ను ముందస్తు, ఆర్జన సంబంధ చెల్లింపులతోకలిపి 46.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనుంది. అయితే మేనేజ్మెంట్ ప్రోత్సాహకాలు, బోనస్లను మినహాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కొనుగోలు పూర్తికాగలదని అంచనా. ఇందుకు ఫ్లోరిడా(యూఎస్) కంపెనీ ఆప్టిమమ్ హెల్త్కేర్ ఐటీతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. క్లాస్ హెల్త్కేర్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, కన్సల్టింగ్ సేవల కంపెనీ ఆప్టిమమ్ భారీస్థాయి ట్రాన్స్ఫార్మేషన్లో క్లయింట్లకు సేవలు అందించడంలో గుర్తింపు పొందినట్లు పేర్కొంది. వెరసి కంపెనీ హెల్త్కేర్ వృద్ధి వ్యూహాలకు మద్దతు లభించనున్నట్లు తెలియజేసింది. తద్వారా కంపెనీ టోపజ్ ఏఐ, కోబాల్ట్ క్లౌడ్, క్లౌడ్ ఇంజినీరింగ్ ఇన్ఫ్రా సర్వీసులను ఆప్టిమమ్ హెల్త్కేర్ ద్వారా ఆరోగ్యపరిరక్షణ సేవలందించే కంపెనీలు వినియోగించుకునేందుకు వీలుంటుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వివరించారు. స్ట్రాటస్ డీల్ ప్రాపరీ్ట, క్యాజువాలిటీ(పీఅండ్సీ) ఇన్సూరెన్స్ పరిశ్రమలో టెక్నాలజీ సొల్యూషన్లు అందిస్తున్న యూఎస్ కంపెనీ స్ట్రాటస్ కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్ తెలియజేసింది. ఇందుకు ముందస్తు, ఆర్జన సంబంధ చెల్లింపులతోకలిపి 9.5 కోట్ల డాలర్ల నగదు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అయితే మేనేజ్మెంట్ ప్రోత్సాహకాలు, బోనస్లనుమినహాయించింది. దీంతో బీమా రంగంలో లీడర్షిప్ను మరింత పటిష్టపరచుకోనున్నట్లు తెలియజేసింది. గ్లోబల్ పీఅండ్సీ ఇన్సూరెన్స్ క్లయింట్లకు మరింత విస్తారంగా ఏఐ ఆధారిత డిజిటల్, డేటా ట్రాన్స్ఫార్మేషన్ సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది. పరిశ్రమ సంబంధ లోతైన పరిజ్ఞానం కలిగి 450 మంది నిపుణుల బృందాన్ని స్ట్రాటస్ కలిగి ఉన్నట్లు పేర్కొంది. కన్సల్టింగ్ నైపుణ్యాలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సామర్థ్యాలు కలిగి ఉన్న టీమ్ను సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. భారత్సహా.. యూఎస్, కెనడాలలో గ్లోబల్ డెలివరీ కార్యకలాపాలు విస్తరించిన స్ట్రాటస్ ఎండ్టుఎండ్ గైడ్వైర్ ఇన్సూరెన్స్సూట్ సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు వివరించింది. వీటిలో పాలసీసెంటర్, క్లెయిమ్సెంటర్, బిల్లింగ్సెంటర్, అప్గ్రేడ్స్, అప్లికేషన్ మేనేజ్డ్ సర్వీసులు తదితరాలున్నట్లు పేర్కొంది. -
రిలయన్స్ చేతికి సదరన్ హెల్త్ ఫుడ్స్
న్యూఢిల్లీ: అనుబంధ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్(ఆర్సీపీఎల్) తాజాగా తమిళనాడు కంపెనీ సదరన్ హెల్త్ ఫుడ్స్ను సొంతం చేసుకుంటున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. అయితే డీల్ విలువను తెలియజేయలేదు.తాజా కొనుగోలు ద్వారా తృణ ధాన్యాల(మిల్లెట్స్) ఆధారిత ఫుడ్ విభాగంలో రిలయన్స్ కన్జూమర్ విస్తరించనుంది. రెండు దశాబ్దాలుగా ఆరోగ్యకర ఆహార విభాగంలో మన్నా బ్రాండ్తో సదరన్ హెల్త్ ఫుడ్స్ విభిన్న ప్రొడక్టులను విక్రయిస్తోంది. ఆర్సీపీఎల్ ఇటీవలే ఆ్రస్టేలియా సంస్థ గుడ్నెస్ గ్రూప్ గ్లోబల్ పీటీవైను సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. తద్వారా బెటర్ ఫర్ యు బ్రాండ్ పానీయాల బిజినెస్ను సొంతం చేసుకున్న విషయం విదితమే. -
సింగపూర్ ఐటీ కంపెనీని కొంటున్న హెచ్సీఎల్ టెక్
దేశీ ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్ తాజాగా సింగపూర్కి చెందిన ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ సంస్థ ఫినర్జిక్ సొల్యూషన్స్ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం 19 మిలియన్ సింగపూర్ డాలర్లను (సుమారు రూ. 136 కోట్లు) వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఆర్థిక సేవల విభాగంలో, ముఖ్యంగా కోర్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ సేవలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని హెచ్సీఎల్ టెక్ తెలిపింది.ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఒప్పందం పూర్తి కాగలదని వివరించింది. 2019లో ప్రారంభమైన ఫినర్జిక్కి భారత్, సింగపూర్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్లో కార్యకలాపాలు ఉన్నాయి. 2024లో కంపెనీ 12.6 మిలియన్ సింగపూర్ డాలర్ల ఆదాయం ఆర్జించింది.హెచ్సీఎల్ టెక్ ఫినర్జిక్ సొల్యూషన్స్ను కొనుగోలు చేయడం వ్యూహాత్మకంగా కీలకమైన నిర్ణయంగా భావిస్తున్నారు. కోర్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగాల్లో డిజిటల్ పరిష్కారాలపై డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఫినర్జిక్ వద్ద ఉన్న డొమైన్ నైపుణ్యం, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం హెచ్సీఎల్ టెక్కు ఉపయోగపడనుంది. ముఖ్యంగా యూరప్, సింగపూర్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని మరింత బలపర్చుకునే అవకాశం ఈ డీల్ ద్వారా లభించనుంది.ఈ కొనుగోలుతో హెచ్సీఎల్ టెక్ తన బ్యాంకింగ్ క్లయింట్లకు మరింత సమగ్ర సేవలను అందించగలదు. ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు కొత్త సేవలను అందించే క్రాస్-సెల్లింగ్ అవకాశాలు పెరగడంతో పాటు, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ఆదాయ వృద్ధికి ఇది దోహదపడనుంది. ఐటీ సేవల కంపెనీలు డొమైన్ ఆధారిత సంస్థలను కొనుగోలు చేసి విలువ పెంచుకునే ధోరణిలో భాగంగానే ఈ డీల్ను మార్కెట్ వర్గాలు చూస్తున్నాయి. -
అమెరికన్ ఏఐ కంపెనీని కొనేస్తున్న కోఫోర్జ్
అమెరికన్ కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఎన్కోరాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దిగ్గజం కోఫోర్జ్ వెల్లడించింది. 100% వాటాల కోసం 2.35 బిలియన్ డాలర్లని (సుమారు రూ.21,133 కోట్లు) తెలిపింది. పూర్తి స్టాక్స్ లావాదేవీ రూపంలో ఈ డీల్ ఉంటుందని వివరించింది. ఎన్కోరా ప్రస్తుత షేర్హోల్డర్లకు 1.89 బిలియన్ డాలర్ల ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయనున్నట్లు కోఫోర్జ్ పేర్కొంది.ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు అడ్వెంట్ ఇంటర్నేషనల్, వార్బర్గ్ పింకస్ మొదలైనవి ఎన్కోరాలో వాటాదార్లుగా ఉన్నాయి. తమ ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని కోఫోర్జ్ సీఈవో సుధీర్ సింగ్ చెప్పారు. ఎన్కోరా కలయికతో 2.5 బిలియన్ డాలర్ల టెక్ సేవల దిగ్గజం ఆవిర్భవిస్తుందని కోఫోర్జ్ పేర్కొంది.2027 ఆర్థిక సంవత్సరంలో ఏఐ ఆధారిత ఇంజనీరింగ్, డేటా, క్లౌడ్ సర్వీసుల విభాగం ఆదాయమే ఏకంగా 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని తెలిపింది. ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ వ్యాపారం 1.25 బిలియన్ డాలర్లపైగా, క్లౌడ్ సేవలు 500 మిలియన్ డాలర్లు, డేటా ఇంజనీరింగ్ 250 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని కోఫోర్జ్ పేర్కొంది. -
Income Tax: అక్విజిషన్ డేటు V/S రిజిస్ట్రేషన్ డేటు
ఎన్నో స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో ఇదొక సమస్య. ఈ విషయంలో ఎన్నో వివాదాస్పదమైన చర్చలు, సంభాషణలు జరిగాయి. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీ. చట్టరీత్యా చెయ్యాలి. అలా చేసిన తర్వాతే కొనుక్కునే వారికి హక్కు ఏర్పడుతుంది. అందుకని రిజిస్ట్రేషన్ డేటునే ప్రాతిపదికగా తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ తేదీ నాడే హక్కు సంక్రమిస్తుంది. హోల్డింగ్ పీరియడ్.. అంటే ఆ సదరు ఆస్తి ఎన్నాళ్ల నుంచి ఆ వ్యక్తి వద్ద ఉంది అనేది. కొన్న తేదీ అలాగే అమ్మిన తేదీ .. ఈ రెండూ కూడా ఒప్పందం/అగ్రిమెంట్/డీడ్ ప్రకారం రిజిస్ట్రేషన్ తేదీలే. ఈ మధ్య వ్యవధిని హోల్డింగ్ పీరియడ్ అంటారు. ఇక కొనుగోలు తేదీ నుంచి అమ్మకపు తేదీల మధ్య వ్యవధి .. దీన్ని నిర్ణయించడానికి రిజిస్ట్రేషన్ తేదీనే ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ హోల్డింగ్ పీరియడ్.. స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో 2 సంవత్సరాలు దాటితే దీర్ఘకాలికం. రెండు సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే స్వల్పకాలికం అంటారు. దీర్ఘకాలికం అయితే ఒక రకమైన పన్ను రేటు ఉంటుంది. (రెసిడెంటుకి 20 శాతం, నాన్ రెసిడెంటుకి 12.5 శాతం) స్వల్పకాలికం అయితే, ఇతర ఆదాయాలతో కలిసి శ్లాబుల ప్రకారం రేట్లు విధిస్తారు. హోల్డింగ్ పీరియడ్ కాకుండా కాస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ లెక్కించడానికి అక్విజిషన్ డేటును ప్రాతిపదికగా తీసుకుంటారు.ఈ మేరకు ఎన్నో ట్రిబ్యునల్స్, కోర్టులు కూడా రూలింగ్ ఇచ్చాయి. వీటి సారాంశం ఏమిటంటే .. కొన్న వ్యక్తి మొత్తం ప్రతిఫలం చెల్లించి, ఆ ఆస్తిని తీసుకుని అనుభవిస్తున్నారు. అనుభవించడం అంటే తాను ఆ ఇంట్లో ఉండటం గానీ లేదా అద్దెకి ఇచ్చి.. ఆ అద్దెని ఇన్కం ట్యాక్స్ లెక్కల్లో చూపించినట్లయితే గానీ అని అర్థం. అయితే, ఏదో ఒక కారణం వల్ల రిజిస్ట్రేషన్ జరగలేదు. రిజిస్ట్రేషన్ పెండింగ్లో పడింది. అలాంటప్పుడు అలాట్మెంట్నే పరిగనలోకి తీసుకుంటారు. సుప్రీం కోర్టు: సీఐటీ వర్సెస్ ఘన్శ్యామ్ 2009 రాజస్తాన్ హైకోర్టు: సీఐటీ వర్సెస్ రుక్మిణీ దేవి 2010.పైన చెప్పిన కేసుల్లో ఈ విషయాన్ని నిర్ధారించారు. వీటి సారాంశం ఏమిటంటే ఏ తేదీన అయితే స్వాధీనపర్చుకున్నారో, అంటే డేట్ ఆఫ్ అక్విజిషన్, ఆ తేదీనే రిజి్రస్టేషన్ తేదీగా పరిగణిస్తారు. కాబట్టి డేట్ ఆఫ్ అక్విజిషన్ ముఖ్యం. ఇక అలాట్మెంట్ డేట్ వేరు. ముఖ్యంగా సొసైటీల్లో, డెవలప్మెంట్ అథారిటీపరంగా ఎన్నెన్నో సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఫలితంగా అలాట్మెంట్ జరుగుతుంది.. అక్విజిషన్ కూడా జరుగుతుంది.. కానీ న్యాయపరమైన చిక్కులు, కోర్టు లిటిగేషన్స్ వల్ల చట్టపరంగా జరగాల్సిన రిజిస్ట్రేషన్ సంవత్సరాల తరబడి వాయిదా అవుతుంది. బేరసారాలు జరిగి, అగ్రిమెంటు ప్రకారం ప్రతిఫలం ఇచ్చి అక్వైర్ (acquire) చేసుకున్నా, రిజి్రస్టేషన్ ప్రక్రియ ఆగిపోతుంది. పెండింగ్ పడిపోతుంది. ఇదొక సాంకేతిక సమస్య తప్ప న్యాయపరమైనది లేదా హక్కులపరమైన సమస్య కాదు.అందుకని హోల్డింగ్ పీరియడ్కి, కాస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్కి డేట్ ఆఫ్ అక్విజిషన్నే ప్రాతిపదికగా తీసుకుంటారు. క్రయవిక్రయాలు చేసే ముందు, లింక్ డాక్యుమెంట్లు, దస్తావేజులను క్షుణ్నంగా చదవాలి. అప్పుడే ముందడుగు వేయాలి. మరొక జాగ్రత్త. సేల్ డీడ్లో మార్కెట్ విలువను ప్రస్తావిస్తారు. ప్రతిఫలం కన్నా మార్కెట్ విలువ ఎక్కువ ఉంటే, మార్కెట్ విలువనే అమ్మకపు విలువగా తీసుకుంటారు. తగిన జాగ్రత్త వహించండి. -
ఇండస్ఇండ్–ఇన్వెస్కో సంయుక్త ఫండ్స్ వ్యాపారం
హిందుజా గ్రూప్నకు చెందిన ఇండస్ ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ మ్యూచువల్ ఫండ్స్లోకీ అడుగుపెట్టింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోటర్ అయిన ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్, అమెరికాకు చెందిన ఇన్వెస్కో సంయుక్తంగా అసెట్ మేనేజ్మెంట్ జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించాయి. ఇన్వెస్కోకు చెందిన ఇన్వెస్కో అసెట్ మేనేజ్మెంట్ ఇండియాలో ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) 60 శాతం వాటా కొనుగోలు చేసింది. మిగిలిన 40 శాతం వాటాను ఇన్వెస్కో కలిగి ఉంటుంది.2025 సెప్టెంబర్ చివరికి ఇన్వెస్కో అసెట్ మేనేజ్మెంట్ ఇండియా రూ.1,48,358 కోట్ల నిర్వహణ ఆస్తులతో (ఏయూఎం) 16వ అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ సంస్థగా ఉంది. ఇరు సంస్థలు తమదైన బలాబలాలతో అసెట్ మేనేజ్మెంట్ వ్యాపార వృద్ధికి కృషి చేయనున్నట్టు ప్రకటించాయి. ఇన్వెస్కోకు అంతర్జాతీయంగా పెట్టుబడుల నిర్వహణలో ఉన్న అపార అనుభవం, ఇండస్ ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్కు భారత్లో ఉన్న బ్యాంక్, బీమా సంస్థల పంపిణీ బలాలతో అసెట్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని మరింత మంది ఇన్వెస్టర్లకు చేరువ చేయగలమని ఇవి భావిస్తున్నాయి. సౌరభ్ నానావతి ఆధ్వర్యంలోని ప్రస్తుత మేనేజ్మెంట్ ఇక ముందూ కొనసాగుతుందని ఈ సంస్థలు ప్రకటించాయి. ఆర్థిక సేవల దిగ్గజంగా అవతరిస్తాం..అసెట్ మేనేజ్మెంట్ను కూడా చేర్చుకోవడం ద్వారా 2030 నాటికి ఆర్థిక సేవల దిగ్గజంగా అవతరించేందుకు వీలు కలుగుతుందని ఐఐహెచ్ఎల్ చైర్మన్ అశోక్ హిందుజా పేర్కొన్నారు. ‘‘భారత్లో ఆదాయాలు పెరుగుతున్నాయి. జనాభా పరమైన అనుకూలతలు ఉన్నాయి. అద్భుతమైన పెట్టుబడుల అవకాశాలు పలకరిస్తున్నాయి. కనుక ఇదొక చక్కని అనుకూల తరుణం’’అని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా? -
ఆర్బీఎల్ బ్యాంక్పై ఎమిరేట్స్ ఎన్బీడీ కన్ను
ప్రైవేట్ రంగ ఆర్బీఎల్ బ్యాంకులో మెజారిటీ వాటాలను దక్కించుకోవడంపై ఎమిరేట్స్ ఎన్బీడీ దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొద్ది నెలలుగా దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయని, 51 శాతం వాటాను కొనుగోలు చేయడంపై ఎమిరేట్స్ ఎన్బీడీ ఆసక్తిగా ఉందని వివరించాయి. అయితే, ఇంకా డీల్ నిబంధనలేమీ ఖరారు కాలేదని, ఈ చర్చలు ఫలవంతమవుతాయా లేదా అనేది చెప్పలేమని పేర్కొన్నాయి.ప్రమోటర్లెవరూ లేకపోవడంతో ఆర్బీఎల్లో 100 శాతం వాటాలు పబ్లిక్ షేర్హోల్డర్ల వద్దే ఉన్నాయి. 1963లో నేషనల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్గా ప్రారంభమైన ఎమిరేట్స్ ఎన్బీడీ ప్రస్తుతం భారత్లో చెన్నై, గురుగ్రామ్, ముంబై శాఖల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. 17,786.79 లక్షల కోట్లుగా ఉంది. దీని బట్టి చూస్తే 51 శాతం వాటాల విలువ సుమారు రూ. 9,071 కోట్లుగా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్డ్రా! -
చేతులు మారిన కంపెనీలు.. వందల కోట్ల డీల్స్
మెడికల్ పరికరాల తయారీ కంపెనీ పాలీ మెడిక్యూర్ ఇటాలియన్ కంపెనీ సిటీఫ్ గ్రూప్ను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 3.1 కోట్ల యూరోల(రూ. 324 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువలో సిటీఫ్లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. తద్వారా సిటీఫ్ ఎస్ఆర్ఎల్సహా.. యూఎస్ఏ, మెక్సికోలలోని అనుబంధ సంస్థలను సైతం చేజిక్కించుకోనున్నట్లు పేర్కొంది.వెరసి మెడిస్ట్రీమ్ ఎస్ఏ(గ్రూప్)లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వివరించింది. సిటీఫ్ ప్రధానంగా ఆర్థోపెడిక్ సంబంధిత పరికరాల తయారీలో ప్రత్యేకతను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. 25 దేశాలలో ప్రొడక్టులను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఆర్థోపెడిక్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది.బజాజ్ ఎలక్ట్రికల్స్ చేతికి మర్ఫీ రిచర్డ్స్హోమ్ అప్లయెన్సెస్ తయారీ దిగ్గజం బజాజ్ ఎలక్ట్రికల్స్.. భారత్ సహా పొరుగు దేశాలలో మర్ఫీ రిచర్డ్స్ బ్రాండ్ మేథో సంపత్తి(ఐపీ) హక్కులను సొంతం చేసుకోనుంది. ఐర్లాండ్ కంపెనీ గ్లెన్ డింప్లెక్స్ గ్రూప్ సంస్థ గ్లెన్ ఎలక్ట్రిక్ నుంచి ఐపీ హక్కులను కొనుగోలు చేయనున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ తాజాగా పేర్కొంది.ఇందుకు రూ. 146 కోట్లు వెచ్చించేందుకు కంపెనీ బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. దీంతో భారత్తోపాటు.. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులలో మార్ఫీ రిచర్డ్స్ బ్రాండ్ హక్కులను పొందనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఇంతక్రితం 2022 మార్చిలో మర్ఫీ రిచర్డ్స్తో ట్రేడ్మార్క్ ఒప్పందాన్ని మరో 15ఏళ్లకు పొడిగించింది. 2022 జూలై1 నుంచి అమల్లోకి వచ్చేలా ఒప్పందం కుదిరింది. -
జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చేతికి పవర్ ప్లాంట్
పూర్తి అనుబంధ సంస్థ జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ 150 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంటును కొనుగోలు చేయనున్నట్లు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా టిడోంగ్ పవర్ జనరేషన్లో 100 శాతం వాటా కొనుగోలుకి స్టాట్క్రాఫ్ట్ ఐహెచ్ హోల్డింగ్స్ ఏఎస్తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది.సుమారు రూ. 1,728 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. హిమాచల్ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలోగల టిడాండ్ వేలీలో 150 మెగావాట్ల సామర్థ్యంతో టిడోంగ్ పవర్ జల విద్యుత్ ప్లాంటును నిర్మిస్తున్నట్లు తెలియజేసింది. 2026 అక్టోబర్లో ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభమయ్యే వీలున్నట్లు అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్తో 22 ఏళ్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. మే నెల నుంచి అక్టోబర్వరకూ 75 మెగావాట్లను కిలోవాట్కు రూ. 5.57 టారిఫ్లో ఒప్పందం కుదిరినట్లు తెలియజేసింది. మిగిలిన 75 మెగావాట్లను మర్చంట్ మార్కెట్లో విక్రయించనున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: సహకార బ్యాంకుల్లోనూ ఆధార్ చెల్లింపుల సేవలు -
ఇండియా హోమ్ లోన్లో వాటా కొనుగోలు
ఇండియా హోమ్లోన్ లిమిటెడ్లో 24.5% వాటా(34.99 లక్షలకుపైగా షేర్లు) దక్కించుకున్నట్లు స్కైబ్రిడ్జ్ వెంచర్స్ ఎల్ఎల్పీ తెలిపింది. అయితే, ఎంతకు కొనుగోలు చేసేందనే వివరాలు వెల్లడించలేదు. శుక్రవారం బీఎస్ఈలో ఇండియన్ హోమ్ లోన్ షేరు ముగింపు (రూ.42.46)తో లెక్కిస్తే డీల్ విలువ రూ.14.85 కోట్లుగా ఉంటుందని అంచనా.‘‘ఈ వాటా కొనుగోలుతో భారత్లో అందుబాటు ధరల గృహాలు, రిటైల్ ఫైనాన్స్ రంగాల్లో దీర్ఘకాల వృద్ధి అవకాశాలు ఆశిస్తున్నాము. సేవలు విస్తరణకు ఒక బలమైన ఫ్లాట్ఫామ్ను ఏర్పాటు చేసుకున్నాము. సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది’’ అని స్కైబ్రిడ్జ్ వెంచర్స్ తెలిపింది.కాగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా హోమ్ ఫైనాన్స్ రూ.13.60 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.12 కోట్లతో పోలిస్తే 13.14% అధికంగా ఉంది. -
సెంచురీ పల్ప్పై సీసీఐకి ఐటీసీ దరఖాస్తు
డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ తాజాగా ఆదిత్య బిర్లా రియల్టీ(ఏబీఆర్ఈఎల్) నుంచి పల్ప్, పేపర్ బిజినెస్ కొనుగోలుకి కాంపిటీషన్ కమిషన్ను ఆశ్రయించింది. తద్వారా రూ.3,498 కోట్ల విలువైన ఈ డీల్పై అనుమతిని కోరింది. 1984లో ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో ఏబీఆర్ఈఎల్ నెలకొల్పిన సెంచురీ పల్ప్ అండ్ పేపర్ బిజినెస్ను ఐటీసీ సొంతం చేసుకోనుంది. ప్రస్తుతం వార్షికంగా 4.8 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో దేశీ పేపర్ పరిశ్రమలో సుప్రసిద్ధ కంపెనీగా సెంచురీ పల్ప్ అవతరించింది. అయితే ప్రతిపాదిత కొనుగోలు కారణంగా పోటీకి సంబంధించి ఎలాంటి ఆందోళనలు తలెత్తబోవని ఐటీసీ పేర్కొంది.ఇదీ చదవండి: మీరు ఆస్తిపరులా? లేదా ధనవంతులా?దేశీ పేపర్ మార్కెట్లలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో తాజా డీల్ ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోదని సీసీఐకు వివరించింది. కాగా.. పల్ప్, పేపర్ బిజినెస్ను స్లంప్ సేల్ ప్రాతిపదికన ఐటీసీకి విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు ఈ ఏడాది మార్చిలో ఏబీఆర్ఈఎల్ తెలియజేసింది. ఇందుకు నగదు రూపేణా ఐటీసీ రూ. 3,498 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు వెల్లడించింది. తద్వారా తమకు కీలకమైన రియల్టీ విభాగంపై దృష్టిసారించనున్నట్లు పేర్కొంది. 2020–24 మధ్యకాలంలో రూ, 4,000 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించిన పేపర్ బోర్డ్స్, ప్యాకేజింగ్ విభాగం ఇకపైనా ఇదే రీతిలో కొనసాగనున్నట్లు ఐటీసీ ఇటీవల అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
అదానీ–జేపీ డీల్కు సీసీఐ సై
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాష్ అసోసియేట్స్(జేపీ) కొనుగోలుకి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా అదానీ గ్రూప్ను అనుమతించింది. దీంతో ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న జేపీని సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్ వేసిన బిడ్ గెలుపొందే వీలుంది. తద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ లేదా అదానీ గ్రూప్లోని ఏ ఇతర సంస్థ అయినా జేపీలో 100 శాతం వాటా కొనుగోలుకి అనుమతించింది. వెరసి అదానీ గ్రూప్ సంస్థలు జేపీని సొంతం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐబీసీ చట్ట నిబంధనలమేరకు ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం దివాలా పరిష్కార ప్రణాళిక దాఖలుకు సీసీఐ అనుమతి తప్పనిసరి. కాగా.. జేపీ దివాలా పరిష్కార ప్రణాళికను ప్రస్తుతం రుణదాతల కమిటీ(సీవోసీ) సమీక్షిస్తోంది. సీసీఐ అనుమతి తదుపరి మాత్రమే దివాలా పరిష్కార ప్రణాళికను సీవోసీ సమీక్షించి అంగీకరిస్తుంది. కాగా.. జేపీ కొనుగోలుకి అదానీ గ్రూప్తోపాటు.. దాల్మియా భారత్ ప్రతిపాదనను సైతం తాజాగా సీసీఐ అనుమతించింది. వేదాంతా గ్రూప్, జిందాల్ పవర్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ తదితర సంస్థలు సైతం జేపీ కొనుగోలుకి వీలుగా సీసీఐను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2024 జూన్3న జేపీపై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు ఎన్సీఎల్టీ అలహాబాద్ బెంచ్ ఆదేశించింది. రుణ చెల్లింపుల్లో వైఫల్యం ఇందుకు కారణంకాగా.. రుణదాతలకు రూ. 57,185 కోట్లు బకాయిపడటం గమనార్హం! -
రూ.3 లక్షల కోట్లు ఇస్తా.. గూగుల్కే ఆఫర్ ఇచ్చిన ఇండియన్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్కే ఆఫర్ ఇచ్చాడో భారతీయ యువకుడు. రాయిటర్స్ కథనం ప్రకారం.. పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ, భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas) గూగుల్ క్రోమ్ కొనుగోలు చేయడానికి 34.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,02,152 కోట్లు) నగదు బిడ్ చేశారు. దాదాపు 17 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థకు కేవలం మూడేళ్ల ఏఐ స్టార్టప్ ఆఫర్ ఇవ్వడం విశేషం.ఎన్విడియా, సాఫ్ట్ బ్యాంక్ సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు సమీకరించిన పెర్ప్లెక్సిటీ ఏఐ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లుగా ( సుమారు రూ.1,57,800 కోట్లు) ఉంది. అంటే దాని విలువ కంటే దాదాపు రెట్టింపు ధరను గూగుల్ క్రోమ్ కొనుగోలుకు ఆఫర్ చేసింది. ఈ డీల్ కు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చేందుకు పలు ఫండ్లు ముందుకొచ్చాయని చెబుతోన్న పెర్ప్లెక్సిటీ ఏఐ.. పేర్లను మాత్రం వెల్లడించలేదు.ఆన్లైన్ సెర్చ్ మార్కెట్ గుత్తాధిపత్యాన్నిఆక్షేపిస్తూ కోర్టు తీర్పు నేపథ్యంలో గూగుల్పై ఇప్పటికే రెగ్యులేటరీ ఒత్తిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో క్రోమ్ను వదులుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అయితే కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతాం కానీ బ్రౌజర్ ను విక్రయించే ఉద్దేశం మాత్రం లేదని గూగుల్ తెలిపింది. ఈ పరిణామాలు జరుగుతుండగానే పెర్ప్లెక్సిటీ ఏఐ నుంచి కొనుగోలు ప్రతిపాదన రావడం గమనార్హం.ఎవరీ అరవింద్ శ్రీనివాస్?చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్. గతంలో గూగుల్లోనే పనిచేసిన శ్రీనివాస్ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్విన్స్కీలతో కలిసి 2022లో పెర్ప్లెక్సిటీ ఏఐ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ రియల్ టైమ్లో సమాధానాలను అందించే తన సంభాషణాత్మక ఏఐ సెర్చ్ ఇంజిన్తో శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ కంపెనీ ఇటీవల తన సొంత ఏఐ ఆధారిత బ్రౌజర్ కామెట్ ను కూడా ప్రారంభించింది. క్రోమ్ ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులను చేరుకోవచ్చని యోచిస్తోంది.👉 చదవండి: ఐఐటీ హైదరాబాద్లో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సుల ఘనత -
పూర్తిగా మహీంద్రా చేతుల్లోకి ఎస్ఎంఎల్ ఇసుజు
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) ఎస్ఎంఎల్ ఇసుజు లిమిటెడ్లో 58.96 శాతం నియంత్రణ వాటాను జపాన్కు చెందిన సుమిటోమో కార్పొరేషన్, ఇసుజు మోటార్స్ నుండి రూ .555 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలో భాగంగా పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి అదనంగా 26 శాతం వాటాను పొందేందుకు ఎం అండ్ ఎం తప్పనిసరి ఓపెన్ ఆఫర్ ను ప్రారంభించనుంది.కొనుగోలు అనంతరం రెగ్యులేటరీ అనుమతులకు లోబడి కంపెనీ పేరును 'ఎస్ ఎంఎల్ మహీంద్రా లిమిటెడ్ 'గా మార్చనున్నారు. అలాగే ఎస్ఎంఎల్ బోర్డును పునర్వ్యవస్థీకరించారు. మహీంద్రా గ్రూప్ లో ఏరోస్పేస్ & డిఫెన్స్, ట్రక్కులు, బస్సులు & సీఈ ప్రెసిడెంట్గా ఉన్న వినోద్ సహాయ్ ఎస్ఎంఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులయ్యారు. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవోగా డాక్టర్ వెంకట్ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.ఈ వ్యూహాత్మక కొనుగోలుతో 3.5 టన్నులకుపైబడిన వాణిజ్య వాహన విభాగంలో మహీంద్రా సంస్థ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. ఈ విభాగంలో ప్రస్తుతం కంపెనీ 3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. 1983లో ఏర్పాటైన ఎస్ఎంఎల్ సంస్థ ట్రక్కులు, బస్సుల విభాగంలో దేశవ్యాప్తంగా బలమైన బ్రాండ్గా ప్రసిద్ధి చెందింది. -
టాటా మోటార్స్ రూ.10,000 కోట్ల సమీకరణ!
న్యూఢిల్లీ: ఇటలీ కంపెనీ ఇవెకో గ్రూప్ కొనుగోలు కోసం తీసుకుంటున్న స్వల్పకాలిక రుణాన్ని (బ్రిడ్జ్ ఫైనాన్సింగ్) తీర్చివేసేయడంపై టాటా మోటార్స్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 1 బిలియన్ యూరోలను (సుమారు రూ. 10,000 కోట్లు) ఈక్విటీగా, మిగతా మొత్తాన్ని దీర్ఘకాలిక రుణాలుగా సమకూర్చుకునే యత్నాల్లో ఉన్నట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్వో పీబీ బాలాజీ తెలిపారు. ఇవెకో డీల్ ముగిసిన 12–18 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చన్నారు. 3.8 బిలియన్ యూరోలతో (సుమారు రూ. 38,240 కోట్లు) వాణిజ్య వాహనాల కంపెనీ ఇవెకో గ్రూప్ను టాటా మోటార్స్ కొనుగోలు చేయనుంది. ఇందుకు మోర్గాన్ స్టాన్లీ, ఎంయూఎఫ్జీ తదితర సంస్థలు బ్రిడ్జ్ ఫైనాన్సింగ్ చేస్తున్నాయి.నాలుగో స్థానానికి...: ఇన్వెస్టర్లతో సమావేశం సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఇవెకో కూడా కలిస్తే 6 టన్నుల ట్రక్కుల కేటగిరీలో టాటా మోటార్స్ గ్రూప్ మొత్తం అమ్మకాలు వార్షికంగా 2.3 లక్షల యూనిట్ల పైచిలుకు ఉంటుంది. తద్వారా దాదాపు వోల్వో గ్రూప్తో సమానంగా నాలుగో స్థానంలో ఉంటుంది. కొనుగోలుకు ముందు ఏటా 1.8 లక్షల యూనిట్లతో టాటా మోటార్స్ గ్రూప్ ఆరో స్థానంలో, 50,000 యూనిట్లతో ఇవెకో 17వ స్థానంలో ఉన్నాయి. తొలి మూడు స్థానాల్లో దైమ్లర్ గ్రూప్ (3.5 లక్షల యూనిట్లు), సీఎన్హెచ్టీసీ గ్రూప్ (2.5 లక్షలు), ట్రాటన్ గ్రూప్ (2.4 లక్షల యూనిట్లు) ఉన్నాయి. 2024 డిసెంబర్ నాటికి ఇవెకో సంస్థకు అంతర్జాతీయంగా 32,000 మంది ఉద్యోగులు ఉన్నారు. -
అమెరికన్ సంస్థల్లో హైదరాబాద్ కంపెనీ విలీనం
హైదరాబాదీ ఏజెంటిక్ ఏఐ సంస్థ కోవాసెంట్ టెక్నాలజీస్ తాజాగా అమెరికాకు చెందిన కోనాఏఐ, డీక్యూబ్ డేటా సైన్సెస్లో విలీనమైంది. ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో ఏజెంటిక్ ఏఐ వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ఈ వ్యూహాత్మక విలీనం దోహదపడగలదని కోవాసెంట్ టెక్నాలజీస్ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.ఇదీ చదవండి: బడ్జెట్ ధరలో మోటో 5జీ ఫోన్ఏఐ ఆధారిత సర్వీసెస్ యాజ్ సాఫ్ట్వేర్ విభాగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. ఇకపై కోవాసెంట్కి అనిల్ కోనా సీవోవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వ్యవహరిస్తారు. కోనాఏఐ, డీక్యూబ్ వ్యవస్థాపకుడు అయిన అనిల్కి ఫోరెన్సిక్ అనలిటిక్స్.. సైబర్ సెక్యూరిటీలో అపార అనుభవం ఉంది. -
క్యాప్జెమిని చేతికి డబ్ల్యూఎన్ఎస్
సొంత అవసరాల కోసం దేశీయంగా మూడు దశాబ్దాల క్రితం బ్రిటిష్ ఎయిర్వేస్ నెలకొల్పిన డబ్ల్యూఎన్ఎస్ చివరికి ఫ్రెంచ్ దిగ్గజం క్యాప్జెమిని చేతికి చిక్కింది. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్(బీపీఎం) సంస్థ డబ్ల్యూఎన్ఎస్ను 330 కోట్ల డాలర్ల(సుమారు రూ. 28,250 కోట్లు) నగదు చెల్లింపు ద్వారా క్యాప్జెమిని సొంతం చేసుకోనుంది. బీపీఎం రంగంలో భారీ డీల్కు తెరతీస్తూ టెక్నాలజీ సేవల గ్లోబల్ దిగ్గజం క్యాప్జెమిని.. డబ్ల్యూఎన్ఎస్ను కొనుగోలు చేస్తోంది. ఒక్కో షేరుకీ 76.5 డాలర్లు చొప్పున ఆఫర్ చేసింది. ఇది గురువారం ముగింపు(ఎన్వైఎస్ఈ) ధరతో పోలిస్తే 17 శాతం అధికంకాగా.. నెల రోజుల సగటు ధరతో చూస్తే 27 శాతం ప్రీమియం చెల్లిస్తోంది. ఇందుకు నగదు రూపేణా మొత్తం 3.3 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. వెరసి బీపీఎం విభాగంలో అతిపెద్ద డీల్స్లో ఒకటిగా ఇది నిలవనుంది. తాజా డీల్కు రెండు సంస్థల బోర్డులు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు క్యాప్జెమిని వెల్లడించింది. రెండు కంపెనీలూ భారత్లో పటిష్ట కార్యకలాపాలు విస్తరించాయి. సంయుక్తంగా 2,00,000 మంది సిబ్బందిని కలిగి ఉన్నాయి. తాజా కొనుగోలుతో తమ క్లయింట్లకు బిజినెస్, టెక్నాలజీ ట్రాన్స్ఫార్మేషన్ కార్యకలాపాలను క్యాప్జెమిని.. మరింత సమర్థవంతంగా సమకూర్చగలుగుతుంది. సంప్రదాయ బిజినెస్ ప్రాసెస్ సర్వీసుల నుంచి ఆధునిక ఏఐ ఆధారిత మేథో కార్యకలాపాలను క్యాప్జెమిని అందించగలుగుతుంది.ఇదీ చదవండి: రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు.. సండే కూడా ఆఫీస్డబ్ల్యూఎన్ఎస్ నేపథ్యమిదీ...1999లో బ్రిటిష్ ఎయిర్వేస్ ముంబైలో సొంత అవసరాల కోసం డబ్ల్యూఎన్ఎస్ను నెలకొలి్పంది. పుణేలో డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేసింది. 2002లో వార్బర్గ్ పింకస్ 40 కోట్ల డాలర్లకు మెజారిటీ వాటా కొనుగోలు చేసి కంపెనీ పేరును డబ్ల్యూఎన్ఎస్గా మార్చింది. 2006లో ఎన్వైఎస్ఈలో లిస్ట్ చేసింది. 2013లో వార్బర్గ్ పింకస్ 19.2 కోట్ల డాలర్లకు డబ్ల్యూఎన్ఎస్ను విక్రయించింది. కంపెనీ ప్రధానంగా బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్తోపాటు.. డేటా అనలిటిక్స్ సర్వీసులు అందిస్తోంది. 2025లో 1.27 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. -
చేతులు మారుతున్న కంపెనీలు.. రూ.వందల కోట్ల డీల్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ తాజాగా శ్రేష్ఠ నేచురల్ బయోప్రొడక్ట్స్లో 100 శాతం వాటా సొంతం చేసుకోనుంది. 24మంత్ర ఆర్గానిక్ బ్రాండు కంపెనీతో వాటా కొనుగోలు ఒప్పందాన్ని(ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఐటీసీ వెల్లడించింది. ఇందుకు నగదు రూపేణా దాదాపు రూ. 473 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది.24మంత్ర బ్రాండుతో 100 రకాలకుపైగా ఫుడ్ ప్రొడక్టులను శ్రేష్ఠ విక్రయిస్తోంది. తద్వారా వేగవంత వృద్ధిలోనున్న ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్టుల విభాగంలో ఐటీసీ మరింత విస్తరించనుంది. కాగా.. మరోపక్క సహచర సంస్థ మదర్ స్పార్‡్ష బేబీ కేర్లో మిగిలిన 73.5 శాతం వాటా సైతం చేజిక్కించుకోనున్నట్లు పేర్కొంది. 2022లో ఈ డీ2సీ కంపెనీలో 26.5 శాతం వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కేఫిన్టెక్ చేతికి ఎసెంట్ ఫండ్ సర్వీసెస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెస్టర్ సొల్యూషన్స్ సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీస్ (KFin Technologies) తాజాగా ఎసెంట్ ఫండ్ సర్వీసెస్లో (Ascent Fund Services) 51 శాతం వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 34.7 మిలియన్ డాలర్లు. వచ్చే అయిదేళ్లలో ఎసెంట్లో కేఫిన్టెక్ 100 శాతానికి వాటాలు పెంచుకోనుంది. ఇందుకోసం మిగతా 49 శాతం వాటాలను 2028, 2029, 2030లో ఏడాదికి 16.33 శాతం చొప్పున దక్కించుకోనుంది.సింగపూర్ హెడ్క్వార్టర్స్గా కార్యకలాపాలు సాగిస్తున్న ఎసెంట్ అంతర్జాతీయంగా 260 పైచిలుకు గ్లోబల్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజర్లకు ఫండ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసులు అందిస్తోంది. అత్యంత వేగంగా ఎదుగుతున్న అంతర్జాతీయ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కేఫిన్టెక్ విస్తరించేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని సంస్థ ఎండీ శ్రీకాంత్ నాదెళ్ల తెలిపారు. ఇరు సంస్థలు సమిష్టిగా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుని, పరిశ్రమలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతాయని ఎసెంట్ సహ–వ్యవస్థాపకుడు కౌషల్ మండలియా తెలిపారు.


