వందేళ్లకుపైగా చరిత్ర.. లక్షల తీర్పులు
1919లో మూసీ ఒడ్డున వెలసిన తెలంగాణ హైకోర్టు
మూడు ప్రభుత్వాలకు న్యాయాలయంగా సేవలు
ముఖ్యాంశాలు... నిజాం కాలంలో మొదటి ప్రధాన న్యాయమూర్తి: నిజామత్ జంగ్
స్వాతంత్య్రానికి పూర్వం జడ్జీల నియామకం చేసింది: నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైకోర్టుకు తొలి సీజే: జస్టిస్ కోకా సుబ్బారావు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర హైకోర్టు తొలి సీజే: జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్గుప్తా
పూర్తిస్థాయిలో తెలంగాణ హైకోర్టు రూపకల్పన (ఏపీ హైకోర్టు తరలిన) తర్వాత తొలి సీజే: జస్టిస్ టీబీ రాధాకృష్ణన్
2019లో నిర్మాణం వందేళ్లు పూర్తి చేసుకుంది
1948 నుంచి 1950 వరకు ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ కూడా పనిచేసింది.
ఉర్దూ అధికారిక భాష కావడంతో ఇక్కడ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.
ప్రధాన భవనంలో 32 కోర్టు హాళ్లు, 38 చాంబర్లు ఉంటాయి.
జడ్జీల సంఖ్య పెరిగిందిలా... ప్రస్తుత హైకోర్టు భవనం
ప్రారంభించే నాటికి ఉన్న న్యాయమూర్తుల సంఖ్య-6
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య -12
1970లో న్యాయమూర్తుల సంఖ్య-32
1987లో న్యాయమూర్తుల సంఖ్య-36
2014లో న్యాయమూర్తుల సంఖ్య-61
విభజన సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య-24
2021లో న్యాయమూర్తుల సంఖ్య- 42


