గత కొన్నిరోజులు ఒడిశాలోని కోరాపుట్ లో జరుగుతున్న మహేశ్ బాబు-రాజమౌళి (SS Rajamouli) సినిమాకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయింది.
ఈ క్రమంలో పలువురు అధికారులు, అభిమానులు టీమ్ ని కలవగా ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు రాజమౌళి థ్యాంక్యూ నోట్ కూడా రిలీజ్ చేశాడు
ఒడిశాలోని కోరాపుట్ కొండలపై మహేశ్-పృథ్వీరాజ్-ప్రియాంక చోప్రా(Priyanka Chopra) తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
ఈ మేరకు కోరాపుట్ హాస్పిటాలిటీకి రాజమౌళి ధన్యవాదాలు చెప్పాడు.
సెట్ లో మహేశ్, ప్రియాంక, రాజమౌళితో పలువురు దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి


