

కానీ తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ మాత్రం పాత్రకు ప్రాధాన్యత ఉంటే చాలు.. అది ఏదైనా సరే చేసేస్తానని రంగంలోకి దూకుతుంది.

అలా ఆమె హాలీవుడ్ చిత్రం మంకీ మ్యాన్లో కాల్ గర్ల్ (వేశ్య) పాత్ర పోషించింది.

దీని గురించి శోభిత మాట్లాడుతూ.. వాళ్లు ఎంతో అందమైనవారు.

అలాంటివారి పాత్రలో నటించడం గౌరవంగా భావిస్తున్నాను.

ఏదైనా స్ఫూర్తిని నింపే..

లేదా నా రోల్ వల్ల కథకు విలువ వస్తుందంటే ఆయా పాత్రలు చేయడానికి నేనెప్పుడూ ముందుంటాను అని చెప్పుకొచ్చింది.

మంకీ మ్యాన్ మూవీ ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. కానీ ఇండియాలో మాత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు.














