ప్రేమ.. ఓ ప్రేమ.. వచ్చావా ప్రేమా.. అనుకుంటూనే అయ్యో రామా.. ఈ ఎవర్గ్రీన్ పాటలో కనిపించిందీ ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మే!
తెలుగులో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ కేవలం ఇక్కడ ఒకే ఒక్క సినిమాలో కనిపించింది.
అదే 'మనసులో మాట'. ఇదే ఆమెకు టాలీవుడ్లో తొలి, చివరి సినిమా.
పర్దేశ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఆమె తొలి సినిమాకే ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఇందులో షారూఖ్ సరసన నటించింది.
సంజయ్ దత్, సన్నీడియోల్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం వంటి అగ్ర హీరోలతో నటించింది.
మొదట్లో హీరోయిన్గా తర్వాత సహాయక నటిగా అలరించింది.
2016లో వచ్చిన డార్క్ చాకొలెట్ అనే చిత్రంలో చివరిసారిగా కనిపించింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తోంది.
ప్రస్తుతం సిగ్నేచర్, ఎమర్జెన్సీ సినిమాలు చేస్తోంది.
2006లో ఆర్కిటెక్ట్ బాబీ ముఖర్జీని పెళ్లి చేసుకుంది.
వీరికి ఒక పాప జన్మించింది. కానీ వైవాహిక జీవితం సజావుగా సాగకపోవడంతో 2013లో విడాకులిచ్చేసింది.
2022లో రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఆత్మస్థైర్యంతో క్యాన్సర్ను జయించింది.


