
సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారనేది చెప్పడం కష్టం.

ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి పరిస్థితినే అని చెప్పొచ్చు. ఆమెనే హంస నందిని.

ఈమె పుట్టినరోజు నేడు (డిసెంబరు 8). ఈ సందర్భంగా కొన్ని విశేషాలు.

పుణెలో పుట్టి పెరిగిన ఈమె అసలు పేరు పూనమ్ బర్టేక్. నటి అయిన తర్వాత పేరు మార్చుకుంది.

2004లో 'ఒక్కటవుదాం' అనే తెలుగు సినిమాతో హంస నందిని నటిగా మారింది.

2018లో 'పంతం' మూవీలో చివరగా నటించింది. అంటే దాదాపు 14 ఏళ్లు ఇండస్ట్రీలో ఉంది.

మధ్యలో ప్రభాస్ 'మిర్చి'లో ఐటమ్ సాంగ్ చేసి, ఊహించని స్టార్డమ్ సొంతం చేసుకుంది.

ఆ తర్వాత వరసగా తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి మంచి పేరు తెచ్చుకుంది.

అయితే 2021లో తనకు రొమ్ము క్యాన్సర్ వచ్చినట్లు ప్రకటించింది. అప్పటి నుంచి సినిమాలకు దూరమైంది.

ప్రస్తుతం చాలావరకు క్యాన్సర్ నుంచి హంస నందిని కోలుకుంది. కానీ సినిమాలైతే చేయట్లేదు.










