
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు

ఆలయ సమీపంలో ఆరుబయట ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణవేదికపై సీతారాముల కల్యాణాన్ని రాజేష్ భట్టర్ బృందం వైభవంగా జరిపించింది

అంతకుముందు ఎదుర్కోలు కార్యక్రమాన్ని అర్చకులు, భక్తులు వేడుకగా నిర్వహించారు. శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి శోభాయాత్రగా కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు

ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు టీటీడీ పక్షాన సీతమ్మకు సువర్ణ కిరీటం, రామయ్యకు సువర్ణ యజ్ఞోపవీతాలు, పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు















