
ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నుంచి శాకంబరీదేవి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి

మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఈ ఏడాది రోజుకు 60 నుంచి 70 వేల మంది భక్తులు విచ్చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేశారు

అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు

అమ్మవారి ఆలయంతో పాటు పరిసరాలను ఆకుకూరలు, కాయగూరల దండలతో అలంకరిస్తున్నారు

అమ్మవారికి, ఆలయ అలంకరణకు ఉపయోగించే కూరగాయలకు గురువారం ఈవో కె.ఎస్.రామరావు పూజా కార్యక్రమాలను నిర్వహించారు

















