సిటీ స్పెషల్: పత్థర్ కా గోష్.. రాతిపైన వండటమే దీని ప్రత్యేకత. అందుకే దీనికాపేరు వచ్చింది. ఒక్కసారి రుచి చూస్తే చాలు... మళ్లీమళ్లీ కావాలంటారు. మటన్తో చేసిన వెరైటీల్లో అత్యంత రుచిగా ఉంటుందని ఈ వంటకాన్ని తిన్నవారెవరైనా చెబుతారు. అరుదైన ఈ హైదరాబాదీ కబాబ్ ఇప్పుడు అంతర్థానమవుతోంది.
లేత మాంసాన్ని మాత్రమే ఈ వంటకానికి వినియోగిస్తారు. సన్నగా, వెడల్పుగా కోసిన మాంసం ముక్కలను మసాలా మిశ్రమంలో ఆరు గంటల పాటు నానబెట్టాలి. మిశ్రమం తయారీలో దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, మిరపపొడి, నిమ్మకాయ వాడతారు. రాతిని శుభ్రం చేసేందుకు దానిపైన ఉప్పువేస్తారు. నిప్పు వేడికి ఉప్పు నలుపు రంగు కాగానే శుభ్రమైన బట్టతో తుడుస్తారు. నేరుగా రాతిపైన ముక్కలు వేస్తారు. 15-20 నిమిషాల్లో చక్కగా ఫ్రై అవుతాయి. నూనె వాడే అవసరమే లేదు. కానీ కొన్ని హోటళ్లలో రుచి కోసం ఆలివ్ నూనె, నెయ్యి కూడా వినియోగిస్తున్నారు. ఫ్రై అయినప్పటికీ ముక్కలు మృదువుగా ఉంటాయి.
కొత్తదనం కోసం పత్థర్ కా గోష్ రోల్స్ కూడా చేస్తుంటామని టోలిచౌకిలో ఉన్న 4 సీజన్స రెస్టారెంట్ సీనియర్ చెఫ్ సుబల్ పాల్ చెబుతున్నారు. వంటకాన్ని రుచి చూసినవారెవరైనా మళ్లీ కావాలంటారని చెప్పారు. మిక్స్డ్ గ్రిల్ ప్లాటర్లో పత్థర్ కా గోష్ను చేర్చాలని ఎక్కువ మంది కస్టమర్లు డిమాండ్ చేస్తారని మేనేజర్ రవీందర్ సింగ్ అంటారు. హైదరాబాద్తోపాటు లక్నో, పంజాబ్లో సైతం ఈ వంటకం దొరుకుతోందని చెప్పారాయన. మాంసం మృదువుగా ఉంటుంది కాబట్టి పెద్ద వయస్కులు ఇష్టంగా తింటారని చెప్పారు. తమ రెస్టారెంట్లో రోజుకు ఎంతకాదన్నా 40 దాకా ప్లాటర్లు, పత్థర్ కా గోష్ 50 ప్లేట్లు అమ్ముడవుతాయని వివరించారు. దివంగత వైఎస్ఆర్కు కూడా తమ రెస్టారెంట్ నుంచి ఈ వంటకాన్ని సరఫరా చేశామన్నారు. రాజకీయ నాయకులు, సినీ తారలు ఎందరో పత్థర్ కా గోష్ను అమితంగా ఇష్టపడతారని వివరించారు. మలేసియా, దుబాయ్, ఒమన్, పాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతిథులు ఈ అరుదైన వంటకాన్ని ఆస్వాదిస్తున్నారు.
- మహేందర్
పత్థర్ కా గో్ష్
Published Thu, Jul 10 2014 4:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement