అంతరించిపోతున్న దేశీ రాగి(తైదలు) వంగడాలను ప్రత్యేక శ్రద్ధతో సాగు చేస్తున్నారు కర్ణాటక రైతు సోమశేఖర. అనాదిగా మన రైతులు సాగు చేస్తున్న చిరుధాన్యపు పంట రాగి. దిగుబడి తక్కువగా ఉండటంతో రైతులు వీటి సాగుకు స్వస్తిపలికి ఆహార, వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. అప్పులతో ఆత్మహత్యల పాలైన వారూ ఉన్నారు. కానీ దేశవాళీ రాగి వంగడాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తే రైతు జీవితానికి కనీస భద్రత ఉంటుందంటున్నారు సోమశేఖర. వరుస కరువులను తట్టుకొని, వేసవిలో కూడా మంచి దిగుబడినిచ్చే రకాలున్నాయని ఆయన అనుభవపూర్వకంగా చెబుతున్నారు.
కర్ణాటకలోని మాండ్యా జిల్లా శివల్లి గ్రామానికి చెందిన సోమశేఖర అనే రైతు అనేక దేశీ రాగి రకాలను సాగు చేస్తూ, వాటిని సంరక్షిస్తున్నారు. ఒకప్పుడు మాండ్యా ప్రాంతంలోనూ రైతులు దేశీ రాగి రకాలను విరివిగా సాగు చేసేవారు. నీటి పారుదల సౌకర్యం వచ్చాక ఏటా చెరకు, రెండు పంటలు వరిని సాగు చేస్తున్నారు. గడచిన రెండేళ్లుగా కరవు ఉండటంతో 275 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రెండో పంటగా రబీలో మాత్రం రాగులు సాగు చేస్తున్నారు. అయితే సంకరజాతి రకాల వల్ల దేశీ రాగి వంగడాల మనుగడ ప్రశ్నార్థకమయింది.
ఈ పరిస్థితుల్లో రైతుల నేతృత్వంలో నడిచే ‘సహజ సమృద్ధ’ అనే సంస్థ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని రైతుల నుంచి 40 కు పైగా దేశీ రాగి రకాలను సేకరించింది. ఈ సంస్థ ద్వారా దేశీ వంగడాల ప్రాముఖ్యతను తెలుసుకున్న సోమశేఖర వాటి పరిరక్షణకు నడుం బిగించారు. ఎడాగు రాగి, శరావతి రాగి, రాగల్లి శివల్లి రాగి, బోండా రాగి, కెంపు రాగి, బిలిగడ్డ రాగి, బెన్నెముద్దె రాగి, మరియు హసిరి కడ్డి రాగి వంటి 30 రకాల దేశవాళి రాగి రకాలను ఆయన సాగు చేస్తున్నారు. వీటిలో కొన్ని స్వల్పకాలిక రకాలు, మరికొన్ని పశుగ్రాసం కోసం సాగు చేసే రకాలు. ఇలా ప్రతి దేశీ రాగి రకానికి తమవైన లక్షణాలు, ఉపయోగాలు ఉన్నాయి.
సోమశేఖర తొలుత నర్సరీ బెడ్లపై నారు పోస్తాడు. 25 రోజుల తరువాత మొక్కలను పొలంలో నాటుకుంటాడు. పశువుల ఎరువు మాత్రమే వాడతాడు. మొక్కలు నాటుకున్నప్పుడు, నెల రోజుల దశలో, పశువుల ఎరువు వేసినప్పుడు, పూతకొచ్చినప్పుడు... ఇలా పంటకాలం మొత్తంలోనూ నాలుగు సార్లు మాత్రమే నీటి తడులు ఇస్తాడు. అయినా మంచి దిగుబడులు వస్తున్నాయని సోమశేఖర తెలిపారు.
దేశీ రాగి రకాలను సాగు చేస్తే దిగుబడి తక్కువ వస్తుందని కొంతమంది రైతులు భావిస్తున్నారని, ఇది అపోహ మాత్రమే అంటారాయన. ‘జగలూరు రాగి’ రకాన్ని కరువు కాలంలోనూ, వేసవిలోనూ సాగుచేసి తాను మంచి దిగుబడులు పొందుతున్నానని.. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడినిచ్చే దేశీ రాగి రకాలున్నాయని ఆయన చెప్పారు. సోమశేఖర స్ఫూర్తితో ఇప్పుడు ఇరుగు పొరుగు రైతులు దేశీ రాగి వంగడాలను సాగు చేస్తున్నారు.
‘అయ్యన రాగి అనే దేశీ రకం గురించి మా నాయన చెపుతుంటే వినటం తప్పించి మేం ఎన్నడూ చూసింది లేదు. కానీ అలాంటి అంతరించిపోతున్న రకాలను సాగు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని సోమశేఖర భార్య మణి సంతోషంగా చెపుతున్నారు. ఒక్కో రైతు ఒక్క దేశీ రాగి రకాన్ని సాగు చే సినా దేశీ రాగి రకాలను పది కాలాలు పదిలంగా కాపాడుకోవచ్చని సోమశేఖర సాటి రైతులకు సూచిస్తున్నారు.
సేంద్రియ సాగుకు అనువైనది ‘జగలూరు రాగి’
కర్ణాటక – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని చిత్రదుర్గ జిల్లాలోని చిన్న పట్టణం జగలూరు. ఈ ప్రాంతంలో చిరకాలం నుంచి సాగులో ఉంది కాబట్టి ‘జగలూరు రాగి’ రకంగా ప్రసిద్ధి పొందింది. పెద్ద కంకులు, ఎక్కువ పిలకలు, ఎత్తుగా పెరగడం, సాగు నీటి సదుపాయం ఉన్నా, వర్షాధారంగానైనా అధిక దిగుబడినివ్వడం దీని ప్రత్యేకత. జగలూరు రాగుల రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. తినడానికి బాగుంటుంది. వినియోగదారులు ఇష్టపడుతుండటంతో మార్కెట్లోనూ మంచి గిరాకీ ఉంది. సేంద్రియ పద్ధతుల్లో పండిస్తే 15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. దీని సాగు కాలం 4 నెలలు. సేంద్రియ సేద్యానికి ఇది బాగా అనువైన వంగడమని బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని సేంద్రియ వ్యవసాయ సంస్థ రైతులకు సిఫారసు చేసిందని బెంగళూరుకు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సహజ సమృద్ధ డైరెక్టర్ కృష్ణప్రసాద్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.
(దేశీ రాగి, చిరుధాన్యాల విత్తనాలు కావలసిన రైతులు మైసూరులోని సహజ సీడ్స్ సంస్థను 099640 31758, 95351 49520 నంబర్లలో లే దా ఈ–మెయిల్ sahajaseeds@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.)
దేశీ రాగులుంటే దిగులుండదు!
Published Tue, Jul 11 2017 12:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement