కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారం | Woman gang-raped by four men in moving car | Sakshi
Sakshi News home page

కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారం

Feb 20 2014 12:43 PM | Updated on Sep 2 2017 3:55 AM

కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారం

కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారం

దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు నిరోధించేందుకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేస్తోంది.

దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు నిరోధించేందుకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేస్తోంది. అయిన మహిళలపై దాడులు దేశంలో నిత్యకృత్యమై పోయాయి. విడాకుల కేసులో భాగంగా కోర్టుకు వెళ్లి ఇంటికి తిరుగు ముఖంపట్టిన ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన ఉత్తరప్రదేశ్లో మీరట్ జిల్లాలో గత రాత్రి చోటు చేసుకుంది. విడాకులు కేసులో లాయర్తో మాట్లాడేందుకు ఓ మహిళ బుధవారం ఉదయం ఘజియాబాద్ కోర్టు వెళ్లింది.

 

అక్కడి లాయర్తో కేసు విషయం సంప్రదించి అనంతరం స్వగ్రామానికి బయలుదేరింది. ఆ క్రమంలో ఓ వ్యక్తి తాను నీకు సమీప బంధువు అవుతానని చెప్పాడంతో ఆ యువతి అతని మాటలు గుడ్డిగా నమ్మింది. తనకు ఉద్యోగం కావాలని సదరు వ్యక్తిని అభ్యర్థించింది. దాంతో తన ఇంటికి వెళ్లి అక్కడ అన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి కారులో ఎక్కించారు.

 

అనంతరం ఆ యువతిపై బంధువు అని చెప్పిన వ్యక్తితోపాటు అప్పటికే ఆ కారులో ఉన్న ముగ్గురు యువకులు కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువతని గోవిందపురం ప్రాంతంలో పడేసి కారుతో సహా పరారైయ్యారు. దాంతో ఆ యువతి స్థానిక పోలీసులుకు జరిగిన ఘటనను వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్యాచారానికి గురైన యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement