తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ప్రధాని మన్మోహన్ భరోసా
దీక్ష వద్దంటే మహిళా మంత్రులపై దాడి చేయించారని సీఎంపై టీ నేతల ఫిర్యాదు
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుంది. తెలంగాణపై మేమిచ్చిన హామీని నెరవేరుస్తాం. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు’.. ఇది బుధవారం ఢిల్లీలో తనను కలిసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఇచ్చిన భరోసా. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి వైఖరిపై వారు ప్రధానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణపై అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం అసెంబ్లీలో తీర్మానం చేశారని, సమైక్యాంధ్ర అంటూ ఢిల్లీలో దీక్ష చేశారని వారు ప్రధానికి వివరించారు. ఇకనైనా వెంటనే ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దీక్షకు దిగొద్దని మంత్రివర్గ సహచరులే కోరితే పోలీసులతో వారిపై దాడి చేయించారని ఆరోపించారు. మహిళా మంత్రులనైనా చూడకుండా వారిపై అమానవీయంగా ప్రవర్తించారని తెలిపారు. ప్రధానిని కలిసిన వారిలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, డి.శ్రీధర్బాబు, పొన్నాల లక్ష్మయ్య, ప్రసాద్కుమార్, గీతారెడ్డి, డీకే అరుణ, ఉత్తమ్కుమార్ రెడ్డి, బస్వరాజు సారయ్య, చీఫ్ విప్, ఎంపీలు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎస్.రాజయ్య, సురేశ్ షేట్కార్, అంజన్కుమార్ యాదవ్ ఉన్నారు.
అనుమానాలొద్దు.. ‘టీ’ ఖాయం!: మన్మోహన్
Published Thu, Feb 6 2014 1:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement