మహిళలు లేరని ఐక్యరాజ్య సమితిలో గొడవ | UN official criticises lack of women at peace tables | Sakshi
Sakshi News home page

మహిళలు లేరని ఐక్యరాజ్య సమితిలో గొడవ

Oct 14 2015 9:01 AM | Updated on Sep 3 2017 10:57 AM

ఐక్యరాజ్య సమితి మహిళల ఉన్నత విభాగంలో విమర్శల గొడవలు మొదలయ్యాయి.

న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి మహిళల ఉన్నత విభాగంలో  విమర్శల గొడవలు మొదలయ్యాయి. దాదాపు పదిహేనేళ్ల తర్వాత తొలిసారి అంతర్జాతీయ శాంతి గురించి ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టే బృహత్తర కార్యక్రమానికి ఆ విభాగం నుంచి కనీస సంఖ్యలో కూడా మహిళలు పాలుపంచుకోవడంపట్ల ఐక్యరాజ్యసమితి ఇతర ఉన్నత విభాగ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మహిళా విభాగాన్ని తీవ్రంగా విమర్శించారు.

ప్రపంచశాంతి నిర్మాణంలో భాగంగా ఒక తీర్మానం తీసుకురావాలని అందులో మహిళలకు కూడా భాగస్వామ్యం కల్పించడంతోపాటు, ఆ తీర్మానంలో మహిళలకు సంబంధించి పలు అంశాలు చేర్చినా వాటిని పట్టించుకోకుండా వారు హాజరుకాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని కలిగించిందని అన్నారు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ తీర్మానం విషయంలో మంగళవారం ప్రత్యేక భేటీ నిర్వహించామని, ఈ సమావేశానికి తక్కువ సంఖ్యలో హాజరయ్యారని, కొన్ని దేశాలకు ప్రాతినిథ్యం వహించే మహిళలు పాల్గొనకపోవడం కొంత విస్మయాన్ని కలిగించిందని భద్రతా మండలి సభ్యురాలు హుమిజిల్ లాంబో యంగ్కుఖా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement