నెల రోజులు 24 రైళ్లు బంద్‌ | Two dozen trains in UP cancelled for a month | Sakshi
Sakshi News home page

నెల రోజులు 24 రైళ్లు బంద్‌

Nov 11 2016 8:10 PM | Updated on Aug 25 2018 6:06 PM

నెల రోజులు 24 రైళ్లు బంద్‌ - Sakshi

నెల రోజులు 24 రైళ్లు బంద్‌

ఉత్తరప్రదేశ్‌ గుండా వెళ్లే 24కు పైగా రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేశారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌ గుండా వెళ్లే 24కు పైగా రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేశారు. యూపీలో ఉన్నావో నుంచి కాన్పూర్‌ను కలిపే రైల్వే బ్రిడ్జికి మరమ్మత్తులు చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాన్పూర్‌-లక్నో రైలు సెక్షన్‌ మధ్య నడిచే రైళ్లపై కూడా దీని ప్రభావం పడనుంది.

లక్నో-న్యూఢిల్లీ గోమ్ని ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం నుంచి 27 రోజుల పాటు రద్దు చేశారు. గోరఖ్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై-లక్నో ఎక్స్‌ప్రెస్‌, ఆగ్రా ఇంటర్‌సిటీ తదితర ముఖ్యమైన రైళ్లు డిసెంబర్‌ మొదటి వారం వరకు నడవవని రైల్వే అధికారులు చెప్పారు. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement