చర్చ.. సాయంత్రమా, మధ్యాహ్నమా? | Telangana debate in Lok Sabha today evening | Sakshi
Sakshi News home page

చర్చ.. సాయంత్రమా, మధ్యాహ్నమా?

Feb 18 2014 11:23 AM | Updated on Aug 18 2018 4:13 PM

చర్చ.. సాయంత్రమా, మధ్యాహ్నమా? - Sakshi

చర్చ.. సాయంత్రమా, మధ్యాహ్నమా?

తెలంగాణ బిల్లుపై ఈరోజు లోక్సభలో చర్చ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై ఈరోజు లోక్సభలో చర్చ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా జీవోఎం సభ్యులు ఈ సాయంత్రం 4 గంటలకు ప్రధానితో సమావేశం కానున్నారు. ప్రధానితో భేటీ తర్వాతే లోక్సభలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది.

మరోవైపు మధ్యాహ్నం 2:30 గంటలకు విభజన బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లుపై చర్చ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న సందిగ్దం నెలకొంది. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అనూహ్యంగా వ్యవహరించిన కాంగ్రెస్... బిల్లుపై చర్చ విషయంలోనూ అదే తీరుగా ముందుకెళుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు పార్లమెంట్లో సీమాంధ్ర సభ్యుల నిరసన కొనసాగుతోంది. ఈ ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్దాయి. సమైక్య నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. సీమాంధ్ర కేంద్ర మంత్రులు లోక్సభ వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. రాజ్యసభలోనూ సమైక్య నిరసనలు హోరెత్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement