టెన్త్‌ విద్యార్థులతో టీచర్‌ నీచమైన పని! | students give foot massage to Govt school teacher | Sakshi
Sakshi News home page

టెన్త్‌ విద్యార్థులతో టీచర్‌ నీచమైన పని!

Aug 30 2016 3:49 PM | Updated on Oct 5 2018 8:51 PM

విద్యార్థులకు ఇంగ్లిష్‌ పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు తానే దారితప్పాడు.

రాయ్‌పూర్‌: విద్యార్థులకు ఇంగ్లిష్‌ పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు తానే దారితప్పాడు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యార్థులను స్టాఫ్‌రూమ్‌కు పిలింపించుకొని.. వారితో ఒళ్లు పట్టించుకున్నాడు. బొక్కబోర్ల పడుకున్న అయ్యవారికి ఓ విద్యార్థి నడుముపై భాగంలో మసామ్‌  చేస్తే.. మరో ఇద్దరు విద్యార్థులు చెరోకాలిని పట్టుకొని నొక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిపోయింది.  

ఛత్తీస్‌గఢ్‌ జశ్‌పూర్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. తుమ్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనూప్‌ మింజ్‌ ఇంగ్లిష్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కానీ ఆయన తాజాగా విద్యార్థులను స్టాప్‌రూమ్‌కు పిలింపించుకొని ఒళ్లు పట్టించుకున్నాడు. ముగ్గురు విద్యార్థులు సేవకులుగా ఆయన ఒళ్లు పడుతుండగా వీడియో కెమెరా కంటికి చిక్కింది. ఈ వీడియో ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించింది. సోషల్‌ మీడియాలో దావానలంలా పాకింది. దీంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాధికారికి సదరు ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని విద్యాధికారి హామీ ఇచ్చారు. ఈ చర్యకు పాల్పడిన ఇంగ్లిష్‌ టీచర్‌ అనూప్‌ మాత్రం 'నేను జ్వరంతో ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నా. నేనేమీ విద్యార్థులను ఒళ్లు పట్టమని బలవంతపెట్టలేవు. వారే ఉద్దేశపూరితంగా అలాచేశారు' అని చెప్పుకొచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement