ఒంటరితనంతో విద్యార్థి ఆత్మహత్య | student commits suicide due to loneliness | Sakshi
Sakshi News home page

ఒంటరితనంతో విద్యార్థి ఆత్మహత్య

Jan 19 2016 1:48 PM | Updated on Nov 9 2018 4:36 PM

తండ్రి, తాత రెండేళ్ల వ్యవధిలో మృతి చెందడంతో ఒంటరితనంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

కోనరావుపేట: తండ్రి, తాత రెండేళ్ల వ్యవధిలో మృతి చెందడంతో ఒంటరితనంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మంగళ్లపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బడవేని భాస్కర్ (22) డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
 
రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి రాజిరెడ్డి మృతి చెందాడు. దీంతో తాత మల్లయ్యతో కలసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, ఎనిమిది నెలల క్రితం తాత కూడా మృతి చెందడంతో భాస్కర్‌ ఒంటరిగా ఉంటున్నాడు. సోదరుడు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భాస్కర్ ఇంటికి దగ్గర్లో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement