రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో టాయిలెట్లను నిర్మించిన రాష్ట్ర విద్యాశాఖ వాటి నిర్వహణకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరేందుకు సిద్ధమైంది.
కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో టాయిలెట్లను నిర్మించిన రాష్ట్ర విద్యాశాఖ వాటి నిర్వహణకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. స్వచ్ఛ విద్యాలయ, స్వచ్ఛ భారత్కోశ్లో భాగంగా రాష్ట్రంలోని టాయిలె ట్లులేని పాఠశాలల్లో వాటి నిర్మాణాలను చేపట్టింది. స్వచ్ఛ విద్యాలయ కింద 14,526 పాఠశాలల్లో, స్వచ్ఛ భారత్కోశ్ కింద 783 టాయిలెట్లను నిర్మించింది. వాటిల్లో 14,526 టాయిలెట్లకు కేంద్రం 65 శాతం నిధులు, రాష్ట్రం 35 శాతం నిధులు వెచ్చిస్తోంది.
స్వచ్ఛ భారత్కోశ్ కింద నిర్మించిన 783 టాయిలెట్లకు 100 శాతం నిధులను కేంద్రం ఇస్తామని ప్రకటించింది. ఇటీవల కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ టాయిలెట్ల నిర్వహణ నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని పేర్కొనడంతో విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది.