న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశ కేంద్ర బ్యాంక్ ఆర్ బీఐ పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ ప్రతీప్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఆయన రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నగదు పరిస్థితి గురించి ప్రజలకు అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. దేశంలో తీవ్రమైన నగదు కొరత ఉందన్నారు. డీమానిటైజేషన్ మొత్తం ప్రక్రియలో ఆర్ బీఐ పారదర్శకంగా వుండాలని వ్యాఖ్యానించారు. అయితే ఏదైనా సమస్య ఉంటే నిష్పాక్షికంగా ప్రకటించడానికి బదులు వాస్తవాలను దాచి పెడుతూ పారిపోతోందని విమర్శించారు.
నల్లధనాన్ని అరికట్టడానికి దేశం తీసుకున్న నోట్ల రద్దు సరైంది కాదని ప్రతీప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియతో నకిలీ నగదును కొంత మేరకు అరికట్టే అవకాశం ఉంది తప్ప నల్లధనాన్ని నిరోధించడం సాధ్యం కాదన్నారు. అంతేకాదు పెద్ద నోట్ల రద్దు సంక్షోభంతో నగదు పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి కనీసం మరో మూడు నెలల పడుతుందన్నారు. దేశంలో ద్రవ్య వినియోగం తీవ్రంగా దెబ్బతినడంతో ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై శాశ్వతంగా ఉంటుందని చౌదరి తెలిపారు.
సరిపడినంత నగదు ఉందని ఆర్ బీపై హామీ ఇస్తోంది కదా అని ప్రశ్నించినపుడు అది అంతా అబద్ధమని కొట్టి పారేశారు. నిజంగా తగినంత సొమ్ము ఉంటే, దేశంలోని 2 లక్షల ఏటీఎంలలో ఒక్కో దానిలో కోటి రూపాయలు ఎందుకు అందుబాటులోకి తేవడం లేదనీ , ప్రతి ఖాతాదారుడు రూ .5,000 లేదా రూ 10,000 డ్రా చేసుకోమని ఎందుకు చెప్పలేకపోతోందని ఆయన ప్రశ్నించారు. అలాగే ఇటీవల నగదు విత్ డ్రా పరిమితిని రోజుకు రూ.4500 పెంచినా ఒకటి రెండు ఏటీఎంలు అలా పనిచేయడపోవడమే ఇందుకు తార్కాణమని తెలిపారు.
జరుగుతున్న పరిణామాల్లో ఆర్ బీఐ నిశ్శబ్ద ప్రేక్షకుడులా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. నిజానికి, ఆర్బిఐ మంటల్ని ఆర్చే ఫైర్ మ్యాన్ లా వ్యవహరించాలి. నీళ్ళు చల్లి మంటల్ని అదుపు చేయాలి. కానీ దీనికి విరుద్ధంగా ఆర్ బీఐ పారిపోతోందంటూ ఘాటుగా విమర్శించారు.
ప్రతీ దేశం పాత కరెన్సీని రద్దు చేసింది. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుందని వ్యాఖ్యానించారు. చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని రద్దు చేయడం సరైన నిర్ణయం కాదనీ, ఇది నకిలీ కరెన్సీని అడ్డుకోవడానికి పాక్షికంగా ఉపయోగపడుతుంది తప్ప నల్లధనాన్ని నిరోధించలేదని చెప్పారు. ఏ దేశమూ ఇలా చేయలేదని పేర్కొన్నారు. నోట్ల రద్దు పర్యవసానాల్ని అంచనా వేయడంలో, తగిన చర్యల్ని తీసుకోవడం కేంద్రం విఫలమైందని అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.
ఒక్కో ఏటీఎంలో రూ.కోటి ఎందుకు పెట్టరు?
Published Mon, Jan 16 2017 2:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement