
వారికి కొత్త ఇళ్లు ఇవ్వనున్న రజనీకాంత్
శ్రీలంకలోని జప్నాలో తమిళ నిర్వాసితుల కోసం నిర్మించిన 150 కొత్త ఇళ్లను సూపర్ స్టార్ రజనీకాంత్ లబ్ధిదారులకు అందజేయనున్నారు.
లైకా గ్రూప్ చైర్మన్ సుభాష్ కరన్ అల్లిరాజా తల్లి పేరిట ఏర్పాటుచేసిన జ్ఞానం ఫౌండేషన్ రూ. 22 కోట్ల ఖర్చుతో ఏడాదిన్నర కాలంలో ఈ ఇళ్లను నిర్మించిందని లైకా ప్రొడక్షన్ తన ప్రకటనలో పేర్కొంది. 2009లో అంతర్యుద్ధం అనంతరం శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలల పునఃనిర్మాణం కోసం జ్ఞానం ఫౌండేషన్ కృషి చేస్తున్నది. తమిళ నిర్వాసితుల కోసం ఇళ్లు నిర్మించి ఇస్తున్నది.