పోలీసు అయి ఉండి.. మహిళలకు భద్రత కల్పించాల్సింది పోయి, మహిళా సిబ్బందికే అసభ్య ఎస్ఎంఎస్లు పంపినట్లు ఒడిషాలోని ఓ సీనియర్ పోలీసు అధికారిపై ఫిర్యాదులు వచ్చాయి.
పోలీసు అయి ఉండి.. మహిళలకు భద్రత కల్పించాల్సింది పోయి, మహిళా సిబ్బందికే అసభ్య ఎస్ఎంఎస్లు పంపినట్లు ఒడిషాలోని ఓ సీనియర్ పోలీసు అధికారిపై ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి ఫిర్యాదులను విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక సెల్ ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నృసింఘ చరణ్ స్వైన్ తెలిపారు. పని ప్రదేశాలలోమహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద కేంద్రపర జిల్లాలో విచారణ జరుగుతున్న మొట్టమొదటి కేసు ఇదే.
ఈ చట్టం గత సంవత్సరమే అమలులోకి రాగా, ఇప్పటివరకు ఈ జిల్లాలో ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదు. మహిళా సిబ్బంది ఫిర్యాదుతో, ఓ మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక సెల్ విచారణ ప్రారంభించింది. విచారణ పూర్తయ్యి, నివేదిక వెలువడిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. నిందితుడు, బాధితురాలు.. ఇద్దరూ కేంద్రపర పోలీసు స్టేషన్లోనే పని చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.