పెట్రోల్‌ బంకుల్లో ఎల్‌ఈడీలు, సీలింగ్‌ ఫ్యాన్లు | Petrol pumps to sell LED bulbs, tubelights, ceiling fans soon | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకుల్లో ఎల్‌ఈడీలు, సీలింగ్‌ ఫ్యాన్లు

May 19 2017 9:41 AM | Updated on Sep 3 2019 9:06 PM

దేశంలోని పెట్రోల్‌ బంకుల్లో ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు, సీలింగ్‌ ఫ్యాన్లను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.

న్యూఢిల్లీ: దేశంలోని పెట్రోల్‌ బంకుల్లో త్వరలో విద్యుత్‌ను అదా చేసే ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు, సీలింగ్‌ ఫ్యాన్లను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఎల్‌ఈడీ బల్బును రూ.65కు, ట్యూబ్‌లైట్‌ను రూ.230, సీలింగ్‌ ఫ్యాన్‌ను రూ.1,150కు ప్రజలకు అందించనున్నారు.

ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌.. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎంసీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఆ తర్వాత నెలరోజుల్లో అమ్మకాలు మొదలైతాయి. ఓఎంసీకి దేశవ్యాప్తంగా 53 వేల పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. అయితే వీటన్నిటిలోనూ ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు, సీలింగ్‌ ఫ్యాన్లను విక్రయిస్తారా, లేదా అనేది స్పష్టం కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement