పార్లమెంట్ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య మంగళవారం ప్రారంభమయ్యాయి.
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య మంగళవారం ప్రారంభమయ్యాయి. లలిత్ మోదీ, వ్యాపం కుంభకోణాలపై ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై లోక్సభలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. లలిత్ మోదీ వ్యవహారంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.. వాయిదా తీర్మానాలను తిరస్కరించాయి. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. విపక్షాల ఆందోళన మధ్యే పార్లమెంట్ కొనసాగుతోంది.