ఎవరెస్ట్‌పై స్వచ్ఛభారత్ | Modi's Swachh Bharat set to scale Everest ... | Sakshi
Sakshi News home page

ఎవరెస్ట్‌పై స్వచ్ఛభారత్

Apr 12 2015 2:11 AM | Updated on Sep 3 2017 12:10 AM

ఎవరెస్ట్‌పై స్వచ్ఛభారత్

ఎవరెస్ట్‌పై స్వచ్ఛభారత్

హిమాలయాల్లోకెల్లా అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ప్రతి పర్వతారోహకుడి స్వప్నం.

న్యూఢిల్లీ: హిమాలయాల్లోకెల్లా అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ప్రతి పర్వతారోహకుడి స్వప్నం. దశాబ్దాలుగా ఈ శిఖరాన్ని ఎంతోమంది అధిరోహించారు. ఈ క్రమంలో వీరు తీసుకెళ్లిన ప్లాస్టిక్ కవర్లు, నీళ్ల సీసాలు, ఇతరత్రా చెత్త ఈ మంచు శిఖరంపై పేరుకుపోతూ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్‌ను స్ఫూర్తిగా తీసుకున్న భారత సైనికులు ఇప్పుడీ చెత్తను కిందకుతెచ్చే కార్యక్రమం చేపట్టారు.

8,848 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరంపైకి మేజర్ రణ్‌బీర్‌సింగ్ సారథ్యంలోని బృందం శనివారం నేపాల్‌వైపు నుంచి బయలుదేరింది. ఎవరెస్ట్ పర్వత సానువుల్లో పేరుకుపోయిన నాలుగు వేల కిలోల చెత్తను పోగేసి... కిందకు తేనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement